Politics

CPI Narayana on CM Jagan: జగన్‌కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికి పైగా సలహాదారులు, జగన్, మోదీ ఇద్దరిది రహస్య బంధమంటూ మండిపడిన సీపీఐ నారాయణ

Hazarath Reddy

దేశాన్ని రక్షించండి.. మోదీని ఓడించండి’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. అలాగే ఏపీలో ‘మోదీ, జగన్ హటావో’ అంటూ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు

Andhra Pradesh Politics: జగన్ తప్పుకుంటే రైతులకు న్యాయం ఎలా చేయాలో చంద్రబాబు చేసి చూపిస్తారు, తక్షణమే సీఎం కుర్చీనుంచి జగన్ దిగిపోవాలని కన్నా డిమాండ్

Hazarath Reddy

అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడం జగన్ కు చేతగాకపోతే, తక్షణమే సీఎం కుర్చీనుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. జగన్ తన పదవి నుంచి తప్పుకుంటే, అన్నదాతలకు ఎలా న్యాయం చేయాలో టీడీపీ చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు.

Talasani on Revanth Reddy: వీడియో ఇదిగో, ఆ పొట్టోడిని పిసికితే ప్రాణం పోతుంది, రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Hazarath Reddy

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ఇప్పటికీ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

IPL 2023, Kolkata Knight Riders vs Punjab Kings: ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్‌ జోరుతో పంజాబ్ పై కోల్‌కతా విజయం, చివరి బంతికి ఫోర్ కొట్టి కేకేఆర్‌కు విజయాన్ని అందించిన రింకూ

kanha

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రింకూ సింగ్ చివరి బంతికి ఫోర్ కొట్టి కేకేఆర్‌కు విజయాన్ని అందించాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

Advertisement

Karnataka Polls 2023: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో కింగ్ మేకర్‌ కోసం జేడీఎస్, ఈ సారి కర్ణాటకలో గెలిచేది ఎవరు, నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారం

Hazarath Reddy

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా ప్రచారం సాగించారు.

‘The Kerala Story’ Ban: ది కేరళ స్టోరీ సినిమాని బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్, కోర్టు గడప తొక్కనున్న నిర్మాతలు

Hazarath Reddy

ది కేరళ స్టోరీ ( the kerala story) మూవీని ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం సోమ‌వారం నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌తల ప‌ర్య‌వేక్ష‌ణ‌, విద్వేష నేరాలు, హింస ప్ర‌జ్వ‌రిల్ల‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించారు. మే 5న కేర‌ళ స్టోరీ విడుద‌ల‌యింది.త‌మిళ‌నాడులోనూ ఈ మూవీ స్క్రీనింగ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిలిపివేసింది. దీనిపై నిర్మాతలు కోర్టుకు వెళ్లనున్నారు

Karnataka Election 2023: సోనియా గాంధీ కర్ణాటక సార్వభౌమత్వం వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు

Hazarath Reddy

సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సార్వ‌భౌమ‌త్వం అన్న ప‌దాన్ని వాడ‌డం ప‌ట్ల బీజేపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ నేప‌థ్యంలో ఈసీకి ఓ లేఖ రాసింది.

Karnataka Assembly Elections Survey: కర్ణాటకలో కాంగ్రెస్ కు తిరుగులేని విజయం.. లోక్ పోల్ సర్వే.. కాంగ్రెస్ కు 129 నుంచి 134 స్థానాలు వస్తాయని అంచనా

Rudra

దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజుతో ప్రచార పర్వం ముగుస్తోంది. ఈ నెల 10న పోలింగ్ జరగబోతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజం సాధిస్తుందని లోక్ పోల్ సర్వే తేల్చి చెప్పింది.

Advertisement

Sharad Pawar Takes U-Turn: యూటర్న్ తీసుకున్న శరద్ పవార్, రాజీనామాను ఉపసంహరించుకున్న ఎన్‌సిపి అధినేత, NCP చీఫ్‌గా కొనసాగుతానని ప్రకటన

Hazarath Reddy

శరద్ పవార్ శుక్రవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకున్నారు, తద్వారా ఎన్‌సిపిలో మూడు రోజుల రాజకీయ నాటకానికి తెరపడింది. మే 5న ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో ఆయన తన రాజీనామ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి విదితమే.

Bajrang Dal Row: కర్ణాటక భజరంగ్‌దళ్‌ ప్రకంపనలు తెలంగాణకు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన బీజేపీ, గాంధీభవన్‌ ఎదుట హనుమాన్‌ చాలీసా చదివిన భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

Hazarath Reddy

తాము అధికారంలోకి వస్తే భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పెట్టడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన చేపట్టింది. దీనిలో భాగంగా నిజామాబాద్‌ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది.

Karnataka Polls 2023: కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు కోసం ఉగ్రవాదానికి లొంగిపోయింది, కర్ణాటక ఎన్నికల వేళ బళ్లారిలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు కోసం ఉగ్రవాదానికి లొంగిపోయిందని నేను ఆశ్చర్యపోతున్నాను. అలాంటి పార్టీ ఎప్పుడైనా కర్ణాటకను కాపాడగలదా? భయానక వాతావరణంలో ఇక్కడి పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు, వ్యవసాయం, వ్యవసాయం, అద్భుతమైన సంస్కృతి నాశనమవుతాయి: కర్ణాటకలోని బళ్లారిలో ప్రధాని నరేంద్ర మోదీ

Plea in SC on 68 Promotion of Judges: రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన గుజరాత్ జడ్జితో సహా 68 మందికి పదోన్నతి, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

Hazarath Reddy

క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన గుజరాత్ జడ్జితో సహా 68 మంది జడ్జీలకు పదోన్నతి కల్పించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసును మే 8న కోర్టు విచారించనుంది.

Advertisement

Sharad Pawar Resignation Row: శరద్ పవార్ రాజీనామా వెనక్కి తీసుకుంటారా, క్లిష్ట సమయంలో రాజీనామా వెనక్కి తీసుకుని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరిన ఎన్సీపీ కోర్ కమిటీ

Hazarath Reddy

ఎన్సీపీ కోర్ కమిటీ ఈరోజు ఒక ప్రతిపాదనను ఆమోదించింది, శరద్ పవార్ తన అధ్యక్ష పదవిని కొనసాగించాలని, రాజీనామా వెనక్కి తీసుకోవాలని పార్టీ అధినేత శరద్ పవార్‌ను అభ్యర్థించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) పార్టీ చీఫ్ శరద్ పవార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత శుక్రవారం (మే 5) కోర్ కమిటీ సమావేశం జరిగింది.

Division of AP Bhavan: ఏపీ భవన్ విభజన, ఆంధ్రప్రదేశ్‌కు 12.09 ఎకరాలు, తెలంగాణకు 7.64 ఎకరాలు, తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చిన కేంద్రం

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఈ మేరకు ఏప్రిల్‌ 26న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం దీనికి సంబంధించిన వివరాలను గురువారం విడుదల చేసింది.

Karnataka Elections 2023: కర్ణాటకలో బీజేపీని గెలిపించండి, కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం, చిక్ బళ్లాపూర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కె.సుధాకర్‌ను తరపున ఎన్నికల ప్రచారంలో..

Hazarath Reddy

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్ని రకాల ప్రచార అస్త్రాలు బరిలో దించుతున్నాయి. తాజాగా, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కూడా కన్నడ నాట బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇవాళ చిక్ బళ్లాపూర్ లో బ్రహ్మానందం సందడి చేశారు.

CM Jagan in Action: జీవో నంబర్-1 అమలుపై సీఎం జగన్ కీలక ప్రకటన, రోడ్లపై మీటింగ్‌ల వలన మనుషులు చనిపోయే పరిస్థితులు రాకుండా సమర్ధవంతంగా దాన్ని అమలు చేయాలని డీజీపీకి ఆదేశాలు

Hazarath Reddy

హోంశాఖ సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్-1ని సమర్ధవంతంగా అమలు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. రోడ్లపై మీటింగ్‌ల వలన మనుషులు చనిపోయే పరిస్థితులు ఉండకూడదన్నారు.

Advertisement

BRS Central Office Inauguration: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవనం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేశ రాజధానిలో ప్రారంభించారు. గురువారం ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తానికి (1గం.05ని.) ఆఫీస్‌ రిబ్బన్‌ను కట్‌ చేశారు.

Manipur Unrest: గిరిజనులు వర్సెస్‌ గిరిజనేతరులు, హింసాత్మకంగా మారిన మణిపూర్, రంగంలోకి దిగిన ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్‌

Hazarath Reddy

గిరిజనులు వర్సెస్‌ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడికి పోతోంది. నిరసనకారులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టడంతో ఈ ఘర్షణలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆర్మీ, అస్సాం రైఫిల్ బలగాలను రంగంలోకి దింపింది.

Amaravati Land Scam: అమరావతి కుంభకోణంలో ఎవ్వర్నీ వదిలిపెట్టం, అవినీతి మొత్తం బయటకు తీసి అందర్నీ అరెస్టు చేస్తాం, సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Hazarath Reddy

రాజధాని అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. కచ్చితంగా అరెస్టులు కూడా జరుగుతాయని అన్నారు. సిట్‌ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు.

PM Modi Helicopter Gets Stuck in Mud: బురదలో కూరుకునిపోయిన ప్రధాని ఎస్కార్ట్ హెలికాఫ్టర్, ఓ జేసీబీ,100 మంది మనుషుల సాయంతో బయటకు

Hazarath Reddy

కర్నాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూరు వద్ద ఓ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. హోసళ్లి క్యాంపు సమీపంలోని ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటుచేశారు. కానీ ఆ పొలం ఇంకా చిత్తడిగానే ఉండడంతో, ల్యాండైన హెలికాప్టర్ మళ్లీ గాల్లోకి లేవలేకపోయింది.

Advertisement
Advertisement