Politics

Lalu Prasad Yadav: లాలూని వదలని ఐఆర్సీటీసీ కుంభకోణం.. లాలూ ప్రసాద్, ఆయన భార్యకు ఢిల్లీ హైకోర్టు సమన్లు

Rudra

రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఐఆర్సీటీసీ కుంభకోణం ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను వదలడం లేదు. ఇదే కేసులో తాజాగా ఆయనకు, ఆయన భార్య రబ్రీదేవికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.

PM Modi Speech in Belagavi: మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ ఘోరంగా అవమానించడం చాలా బాధేసింది, రిమోట్ కంట్రోల్ ఎవరిదో ప్రపంచానికి తెలుసని కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్

Hazarath Reddy

కర్నాటక: మల్లికార్జున్ ఖర్గే ప్రజలకు సాధ్యమైన రీతిలో సేవలందించారు...అత్యంత సీనియర్ నేత, కాంగ్రెస్ అధ్యక్షుడిని వారు ఎలా అగౌరవపరిచారో చూసి నేను నిరుత్సాహపడ్డాను.. రిమోట్ కంట్రోల్ ఎవరిదో ప్రపంచానికి తెలుసని బెలగావిలో ప్రధాని మోదీ అన్నారు.

PM Modi Speech in Belagavi: మర్‌జా మోదీ, మర్‌జా మోదీ అంటూ కాంగ్రెస్ కలవరిస్తోంది, కాని దేశం మాత్రం మోడీ తేరా కమల్ ఖిలేగా అంటోంది, బెలగావిలో ప్రధాని నరేంద్ర మోడీ

Hazarath Reddy

కర్నాటక: మోదీ బతికి ఉన్నంత వరకు తమ ఉద్దేశాలు మనుగడ సాగించవని కాంగ్రెస్‌ భావిస్తోందని, అందుకే వారంతా ‘మర్‌జా మోదీ, మర్‌జా మోదీ..’ అంటున్నారని, కొందరు ‘మోదీ తేరీ కబడ్‌ ఖుడేగీ’ అని అంటున్నారని, కానీ దేశం మాత్రం మోడీ తేరా కమల్ ఖిలేగా కలవరిస్తోందని బెలగావిలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కూడా త్వరలో అరెస్ట్, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత వివేక్, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు ఇచ్చిందని ఆరోపణలు

Hazarath Reddy

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ & తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కే కవిత కూడా త్వరలో అరెస్ట్ కానున్నారు. పంజాబ్, గుజరాత్ ఎన్నికల సమయంలో ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు ఇచ్చిందని తెలంగాణ బీజేపీ నాయకుడు జీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Exit Poll Results 2023: మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్‌ విడుదల, త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీదే విజయం, మేఘాలయాలో ఎన్‌పీపీదే అధికారం..

kanha

మేఘాలయ, నాగాలాండ్‌లో సోమవారం (ఫిబ్రవరి 27) ఓటింగ్ ముగియడంతో మూడు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి ముగిసింది. అంతకుముందు త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరిగింది. మూడు రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్‌ జరిగింది. ఇప్పుడు అందరూ మార్చి 2న వచ్చే ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు, మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ చూడండి.

Land for Job Scam: ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కాం, లాలూ ప్రసాద్ యాదవ్,రబ్రీ దేవితో సహా 14 మందికి సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు

Hazarath Reddy

ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించి యూనియన్ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి & మరో 14 మందిపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు మార్చి 15వ తేదీకి వారికి సమన్లు జారీ చేసింది.

Delhi liquor Case: వీడియో ఇదిగో.. అవెన్యూ కోర్టుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అయిదు రోజుల రిమాండ్‌ను కోరిన సీబీఐ, ఎక్సైజ్ పాలసీ కేసులో నిన్న అరెస్ట్

Hazarath Reddy

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చింది. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆయనను నిన్న అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు 5 రోజుల రిమాండ్‌ను కోరుతూ, “చాలా ప్రణాళికాబద్ధంగా, రహస్యంగా కుట్ర పన్నారు” అని సీబీఐ పేర్కొంది

AP Capital Hearing Row: విశాఖపట్నమా అమరావతా, మార్చి 28న తేలిపోనున్న ఏపీ రాజధాని అంశం, ఆ రోజు విచారణ జరుపుతామని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ఏపీలో మూడు రాజధానుల అంశం కాక రేపుతోంది. విశాఖ రాజధానిగా ఉంటుందని వచ్చే నెల నాటికి అక్కడకు షిఫ్ట్ అవుతున్నామని సీఎం జగన్ పరోక్షంగా హింట్స్ ఇచ్చిన సంగతి విదితమే. ఇక ఏపీ హైకోర్టు గతంలో అమరావతే రాష్ట్ర రాజధాని తీర్పు వెలువరించిన సంగతి విదితమే

Advertisement

Shivamogga Airport Inauguration: శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని మోదీ, ప్యాసింజర్ టెర్మినల్‌లో ప్రతి గంటకు 300 మంది ప్రయాణికులు ప్రయాణం

Hazarath Reddy

కర్ణాటకతో పాటు ఇతర పొరుగు ప్రాంతాలకు కనెక్టివిటీ, యాక్సెసిబిలిటీని పెంచడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. కొత్త విమానాశ్రయాన్ని దాదాపు రూ. 450 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్యాసింజర్ టెర్మినల్‌లో ప్రతి గంటకు 300 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

AAP vs BJP: ఎంసీడీలో ముదిరిన కొట్లాట, జై మోదీ..జై కేజ్రీవాల్‌ అంటూ కొట్టుకున్న ఆప్‌, బీజేపీ కార్పోరేటర్లు, జుట్లు జట్లు పట్టి కొట్టుకున్న మహిళా కౌన్సిలర్లు

Hazarath Reddy

ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌(ఎంసీడీ)లోని స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో ఆప్‌, బీజేపీ కార్పోరేటర్ల మధ్య మూడు రోజుల నుంచి Delhi Civic Centreలో కొట్లాట కొనసాగుతూనే ఉంది. ఎంసీడీ ఎన్నికల పోలింగ్‌ పూర్తయినప్పటి నుంచి రెండు పార్టీల మధ్య గొడవలు (AAP and BJP Councillors jostle) మొదలయ్యాయి

AAP vs BJP Fight: బీజేపీ గూండాలు సిగ్గు లేకుండా మహిళలపై దాడి చేశారు, మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన ఆప్ కౌన్సిలర్ అశోక్ కుమార్, ఢిల్లీ సివిక్ సెంటర్‌లో ఆప్, బిజెపి కౌన్సిలర్‌ల మధ్య ఘర్షణ

Hazarath Reddy

ఢిల్లీ సివిక్ సెంటర్‌లో ఆప్, బిజెపి కౌన్సిలర్‌ల మధ్య శుక్రవారం ఘర్షణ జరగడంతో ఒక కౌన్సిలర్ కుప్పకూలిపోయాడు.AAP, BJP కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు తోపులాటలు, మానవహారాలు, దెబ్బల వర్షం కురిపించడంతో ఢిల్లీ సివిక్ సెంటర్‌లో మరోసారి రచ్చ మొదలైంది.

AAP vs BJP Fight: ఆమ్ ఆద్మీ-బీజేపీ నేతల తుక్కు తుక్కు ఫైటింగ్, కుప్పకూలిన కౌన్సిలర్, మూడో రోజు కూడా సభలో గందరగోళం

Hazarath Reddy

ఢిల్లీ సివిక్ సెంటర్‌లో ఆప్, బిజెపి కౌన్సిలర్‌ల మధ్య శుక్రవారం ఘర్షణ జరగడంతో ఒక కౌన్సిలర్ కుప్పకూలిపోయాడు.AAP, BJP కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు తోపులాటలు, మానవహారాలు, దెబ్బల వర్షం కురిపించడంతో ఢిల్లీ సివిక్ సెంటర్‌లో మరోసారి రచ్చ మొదలైంది.సభలో మూడో రోజు కూడా గందరగోళం చోటు చేసుకుంది.

Advertisement

Lokesh Yuvagalam Padayatra: జూనియర్ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలి, పాదయాత్రలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు, 2014లోనే తాను పవన్ కల్యాణ్‌లో మంచి మనసును చూశానని వెల్లడి

Hazarath Reddy

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు.

Abdul Nazeer Sworn: ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం,హాజరయిన సీఎం జగన్, మంత్రులు, న్యాయమూర్తులు

Hazarath Reddy

ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో హై టీ కార్యక్రమం నిర్వహించారు.

Kanna Lakshmi Narayana: ఏపీలో జగన్ రాక్షస పాలన పోవాలి, అమరావతే రాజధాని కావాలి, ఈ రెండు కారణాలతోనే టీడీపీలో చేరానని తెలిపిన కన్నా లక్ష్మీ నారాయణ

Hazarath Reddy

ఏపీ మాజీ మంత్రి,మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshmi Narayana) ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తన వెంట భారీ సంఖ్యలో నేతలను, కార్యకర్తలను కూడా ఆయన టీడీపీలోకి తీసుకువచ్చారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కన్నా ప్రసంగించారు.

Kanna Joins TDP: వీడియో ఇదిగో..టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీ నారాయణ, జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి

Hazarath Reddy

ఏపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తన వెంట భారీ సంఖ్యలో నేతలను, కార్యకర్తలను కూడా ఆయన టీడీపీలోకి తీసుకువచ్చారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

Advertisement

YCP MLAs Press Meet in Eluru: ప్రతి ఎన్నికలకూ కొత్త ముసుగుతో చంద్రబాబు, మండిపడిన ఏలూరు జిల్లా వైసీసీ ఎమ్మెల్యేలు, మూడున్నరేళ్లలో జగన్ ఏం చేశారో తెలుసుకోవాలని హితవు

Hazarath Reddy

చంద్రబాబు ప్ర‌తి ఎన్నిక‌ల‌కు కొత్త ముసుగుతో వ‌స్తారని, ఈసారి చంద్రబాబును ప్ర‌జ‌లే తిప్పి కొట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఏలూరులో గురువారం మీడియాతో మాట్లాడిన వారు చంద్రబాబు తన హయాంలో ఏలూరును అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం, ఈడీ అధికారుల ముందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌, మద్యం కుంభకోణం కేసులో విచారణ

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్ కుమార్‌కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. ఆయన ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు.మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల మేరకు పీఏను అధికారులు ప్రశ్నిస్తున్నారు

Andhra Pradesh: కొత్త గవర్నర్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం జగన్, ఫిబ్రవరి 24వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌‌

Hazarath Reddy

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పోలీసు గౌరవవందనం స్వీకరించారు. ఫిబ్రవరి 24వ తేదీన ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతలు స్వీకరిస్తారు

Sajjala on Chandrababu: కందుకూరు సందుల్లో నీవల్ల మనుషులు పోయారు, అందుకే ప్రభుత్వం జోవో నంబర్‌-1 తెచ్చింది, చంద్రబాబు, ఫేక్ న్యూస్‌పై మండిపడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

ఈనాడు తప్పుడు వార్తలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్‌ అయ్యారు. ఎల్లో మీడియా టెర్రరిస్టులు తయారు చేసే వార్తలు ఆర్డీఎక్స్‌ కంటే ప్రమాదం అంటూ కామెంట్స్‌ చేశారు.

Advertisement
Advertisement