Politics

ED Eyes On Liger Funding: లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు ఉన్నాయని కాంగ్రెస్ నేత ఫిర్యాదు.. ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్, చార్మి.. జనగణమన సినిమా పెట్టుబడులపైనా ఆరా.. పూరీ, చార్మిలను వేర్వేరుగా పది గంటలకు పైగా విచారించిన అధికారులు

Sriyansh S

‘లైగర్’ సినిమా పెట్టుబడులకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్‌ నిన్న ఈడీ విచారణకు హాజరయ్యారు. అవసరమైన పత్రాలతో బషీరాబాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న వీరిద్దరినీ వేర్వేరుగా 10 గంటలకుపైగా విచారించారు.

Andhra Pradesh: ప్రజాధనం వృథాపై విచారణ చేపట్టాల్సిందే, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్‌ కుంభకోణాలపై (Amaravati Land Scam and Fibernet) సిట్‌ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై (AP Govt Petition) విచారణ నేటితో పూర్తైంది. ఇరుపక్షాల వాదనలు ముగియగా.. సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ (Supreme court Judgment reserved) చేసింది

Telangana: పార్టీ మార్పుపై ఈటెల రాజేందర్ క్లారిటీ, నేను టీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు, టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తెలిపిన హుజురాబాద్ ఎమ్మెల్యే

Hazarath Reddy

ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తాను తిరిగి టీఆర్ఎస్ లో (TRS) చేరుతున్నానని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారం అంతా పుకారే అని ఆయన (MLA Etela Rajender) కొట్టి పారేశారు. ఇదంతా పచ్చి అబద్ధం అన్నారు. ఇది సీఎం కేసీఆర్ చేయిస్తున్న ప్రచారం అని విమర్శించారు.

Andhra Pradesh Assembly Elections 2024: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు, జగన్ ముందు పవన్ కళ్యాణ్ నిలబడగలడా, కర్నూలులో ఏపీ ముఖ్యమంత్రిపై మండిపడిన చంద్రబాబు

Hazarath Reddy

ఈ సభలో తనకు ఇవే చివరి ఎన్నికలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే అని.. లేకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలని (Andhra Pradesh Assembly Elections 2024) స్పష్టం చేశారు

Advertisement

G20 Summit 2022: భారత్ చేతికి జీ20 దేశాల పగ్గాలు, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి స్వీకరించిన ప్రధాని మోదీ, వచ్చే ఏడాది భారత్‌లోనే జీ20 శిఖరాగ్ర సదస్సు

Hazarath Reddy

జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు భారత్ కు చేతిలోకి వచ్చాయి.ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు రెండో రోజు సమావేశాల్లో భాగంగా జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు.

Andhra Pradesh: 175కు 175 సీట్లు సాధించేలా అడుగులు వేయండి, విశాఖ నార్త్‌ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో విశాఖ నార్త్‌ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. కార్యకర్తల సమస్యలను సీఎం జగన్‌ అడిగి తెలుసుకున్నారు.

TS Early Elections Row: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవు, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం టీఆర్‌ఎస్‌ (TRS) విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలపై (TS Early Elections Row) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్లారిటీ ఇచ్చారు.

Medical Colleges Inauguration: నేడు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు.. వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న కేసీఆర్

Sriyansh S

తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు నేడు ప్రారంభం కానున్నాయి. జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీలను నిర్మించిన సంగతి తెలిసిందే.

Advertisement

Telangana: గొర్రెల పంపిణీ డబ్బులు ఎక్కడ కేసీఆర్, మునుగోడులో ధర్నాకు దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు

Hazarath Reddy

గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన (Komatireddy Rajagopal Reddy) రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Delhi: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, బీఎస్‌-4 డీజిల్‌, బీఎస్‌-3 పెట్రోల్ వాహ‌నాల‌పై నిషేధం ఎత్తివేత, ఏక్యూఐ నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలిపిన అధికారులు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్య‌త కొద్దిగా మెరుగ‌వ‌డంతో బీఎస్‌-4 డీజిల్‌, బీఎస్‌-3 పెట్రోల్ వాహ‌నాల‌పై (BS-3 Petrol, BS-4 Diesel Vehicles) నిషేధాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం సోమ‌వారం ఉద‌యం నుంచి (Anti-Air Pollution Curbs End) ఎత్తివేసింది.

AAP Councillor Protest: టికెట్ ఇవ్వలేదని టెలిఫోన్ టవర్ ఎక్కి.. ఆపై ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన ‘ఆప్’ నేత.. తన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు

Sriyansh S

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత ఒకరు టెలిఫోన్ టవర్ హల్‌చల్ చేశారు. ఆపై అక్కడి నుంచే ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

CM Jagan Speech in Visakha: మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మరో అజెండా లేదు,ఉండదు..ఉండబోదు విశాఖలో సీఎం జగన్, ఏపీని అన్ని విధాల ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి

Hazarath Reddy

విశాఖలో ప్రధాని మోదీ సభ ముగిసింది. విశాఖ సభకు.. అశేషంగా తరలివచ్చిన జనవాహిని ఉద్దేశించి.. ఏపీ సీఎం జగన్‌ పలువురు ప్రముఖులను స్మరించుకున్నారు. ఉత్తరాంధ్ర గడ్డపై నడయాడిన మహాకవుల మాటలను గుర్తు చేశారు. వారి సాహిత్యాన్ని పలికి వినిపించారు.

Advertisement

Pawan Met PM Modi : ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రధానిని కలవడం ఇదే ప్రథమం అన్న పవన్.. ప్రధాని మోదీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడి.. ప్రెస్ మీట్ పూర్తి వీడియో ఇదిగో..

Sriyansh S

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత వీరిరువురు సమావేశమయ్యారు. వాస్తవానికి ప్రధానిని మొదట బీజేపీ కోర్ కమిటీ సభ్యులు కలవాల్సి ఉంది. ఆ తర్వాతే పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే ప్రధాని పర్యటన గంటన్నర ఆలస్యం కావడంతో, మోదీని మొదట పవన్ కల్యాణ్ కలిశారు.

Himachal Polling: హిమాచల్ ప్రదేశ్‌లో ప్రారంభమైన పోలింగ్.. రాష్ట్రంలోని 68 స్థానాల్లో పోటీపడుతున్న 412 మంది అభ్యర్థులు.. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్న 55 లక్షల మంది ఓటర్లు.. అధికారం కోసం ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్, ఆప్.. సంప్రదాయానికి ఓటర్లు ఫుల్‌స్టాప్ పెడతారంటున్న బీజేపీ

Sriyansh S

హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ ప్రారంభమైంది. గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి రెండోసారి అధికారం ఇవ్వలేదు. ఈసారి ఓటర్లు ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి తమకు రెండోసారి అధికారం కట్టబెడతారని బీజేపీ ఆశలు పెట్టుకోగా, ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఆశలు పెట్టుకుంది.

Elections 2022: ఈసీ సంచలన నిర్ణయం, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లలో ఎగ్జిట్‌పోల్‌ అంచనాలపై ప్రచురణ నిషేధం, రేపటి నుంచి మొదలు కానున్న ఎన్నికల వేడి

Hazarath Reddy

భారత ఎన్నికల సంఘం(Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లలో ఎగ్జిట్‌పోల్‌ అంచనాల ప్రసారం,(Exit Poll Projections) ప్రచురణను నిరోధించేలా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటిఫికేషన్‌ జారీ చేసింది.హిమాచల్‌లో నవంబర్ 12వతేదీన, గుజరాత్‌లో డిసెంబర్ 1, 8 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.

Telangana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, హాజరైన టీఆర్ఎస్ నేతలు

Hazarath Reddy

ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి... గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు.

Advertisement

Gujarat Assembly Polls: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నుంచి రవీంద్ర జడేజా భార్య రివబ జడేజా పోటీ, ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన భార్యాభర్తలు

Hazarath Reddy

త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీజీపీ నుంచి ప్రముఖ భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తోంది.

Andhra Pradesh: నారా లోకేష్ పర్యటన వేళ ఇప్పటం గ్రామంలో ఫ్లెక్సీల కలకలం, మీ చిల్లర రాజకీయాలు ఆపండి, మా ఇళ్లేమీ కూల్చలేదంటూ ఇళ్లపై బ్యానర్లు

Hazarath Reddy

మాకెవరి సానుభూతి అవసరం లేదు. మా ఇళ్లేమీ కూల్చలేదు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు, అనవసర పర్యటనలు మానుకుంటే మంచిదని ఇప్పటం వాసులు కుండ బద్దలు కొట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే.

Patra Chawl Land Scam Case: మూడున్నర నెలల తర్వాత సంజయ్‌ రౌత్‌కు బెయిల్, భూ కుంభకోణం కేసులో​ అరెస్ట్‌ అయిన శివసేన ఎంపీ

Hazarath Reddy

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు బెయిల్ మంజూరైంది. పీఎంఎల్‌ఏ కోర్టు సంజయ్‌ రౌత్‌కు బెయిల్‌ ఇచ్చింది. కాగా, సంజయ్‌ రౌత్‌.. భూ కుంభకోణం కేసులో​ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్‌ రౌత్‌ 100 రోజుల పాటు జైలు జీవితం గడిపారు.

Andhra Pradesh: అల్లుడు ఆత్మహత్య, వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, విషాదంలో బాధ్యతలను పర్యవేక్షించలేనని సీఎం జగన్‌కు లేఖ

Hazarath Reddy

జగన్ కు రాసిన లేఖలో తన రాజీనామాకు గల కారణాలను రామచంద్రారెడ్డి వివరించారు. రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కూతురు భర్త ఆత్మహత్యతో రామచంద్రారెడ్డి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.

Advertisement
Advertisement