Politics

Top Newsmakers of 2024: కర్ణాటక సెక్స్ టేపుల కుంభకోణం నుంచి అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వెడ్డింగ్ దాకా, 2024లో ప్రముఖంగా వార్తలో నిలిచిన జాబితా ఇదే..

Hazarath Reddy

2024లో, అనేక మంది ఉన్నత స్థాయి వ్యక్తులు వారి చర్యలు, విజయాలు, వివాదాల కోసం భారతదేశం అంతటా ముఖ్యమైన వార్తల్లో చేరారు.వీరంతా దేశం దృష్టిని ఆకర్షించారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు ప్రధాన వార్తా కథనాలకు కేంద్రంగా ఉన్నారు

Year Ender 2024: ఈ ఏడాది మనల్ని వీడిన ప్రముఖ రాజకీయ నాయకులు వీరే, అత్యంత దిగ్భ్రాంతికరమైన వార్తల్లో ఒకటిగా నిలిచిన బాబా సిద్ధిఖ్ హత్య

Hazarath Reddy

ప్రతి సంవత్సరంలాగే, 2024వ సంవత్సరం కూడా చాలా మంది గొప్ప రాజకీయ నాయకులు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వివిధ పార్టీలలోని అనేక మంది అనుభవజ్ఞులైన నాయకులు మరణించారు. మహారాష్ట్ర నుండి నాలుగుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబా సిద్ధిఖ్ హత్య అత్యంత దిగ్భ్రాంతికరమైన వాటిలో ఒకటి.

One Nation, One Election: జమిలి ఎన్నికలు అంటే ఏమిటి ? ఇంతకుముందు ఇండియాలో ఎప్పుడైనా జరిగాయా, ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

ఒకే దేశం-ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఈ ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్రం ఏం చేయాల్సి ఉంటుందనే దానిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Jamili Elections: జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం, త్వరలో పార్లమెంట్ ముందుకు రానున్న బిల్లు, అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు

Arun Charagonda

జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం తెలిపింది. కేబినెట్ అమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకురానుంది.ఈ బిల్లు అమోదంలోకి వస్తే తొలి దశలో పార్లమెంటు,

Advertisement

Grandhi Srinivas Resigns: వైసీపీని వీడిన మరో కీలక నేత, పార్టీతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

Hazarath Reddy

వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన ఘటన మరువక ముందే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.

Opposition MPs Protest: జార్జ్ సోర‌స్, అదానీ అంశాల‌తో పార్లమెంటులో గందరగోళం, పార్లమెంట్ ఆవరణలో అదానీ ఇష్యూపై ప్రతిపక్ష ఎంపీల నిరసన

Hazarath Reddy

లోక్‌స‌భ‌(Loksabha)లో నేడు కూడా గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. స‌భ ప్రారంభ‌మైన క్ష‌ణం నుంచి అధికార‌, విప‌క్ష ఎంపీలు ఆందోళ‌న చేప‌ట్టారు. అదానీ అంశంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు వాయిదా వేశారు.

Jagan Slams Chandrababu Govt: బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంది, మరి ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన వైఎస్ జగన్

Hazarath Reddy

కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని, దీనికి మూలాలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మొదలయ్యాయని కూటమి నేతలు ఆరోపణలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రేషన్‌ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు

Kakani vs Somireddy: నేను, విజయసాయి రెడ్డి వస్తాం, నీవు చెప్పేవి నిజాలే అయితే కాణిపాకంలో ప్రమాణం చేసే దమ్ముందా, సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన కాకాణి గోవర్థన్ రెడ్డి

Hazarath Reddy

వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Advertisement

Delhi Assembly Election 2025: ఢిల్లీ ఎన్నికలను ఒంటరిగానే తేల్చుకుంటాం, ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు, ఇండియా కూటమితో కలిసేది లేదని స్పష్టం

Hazarath Reddy

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు అయిన ఆప్‌, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరిదశకు వచ్చినట్లు, అవి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

India Alliance: ఈవీఎంల ట్యాంపరింగ్, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి, ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ఆరోపణ

Arun Charagonda

EVMల ట్యాంపరింగ్, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది INDIA కూటమి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో NDA రిగ్గింగ్‌కు పాల్పడిందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాల్ని తారుమారు చేశారని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది ఇండియా కూటమి.

Mudragada Padmanabha Reddy: వీడియో ఇదిగో, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటా, ముద్రగడ పద్మనాభ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే నడుస్తానని తెలిపారు. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ బలోపేతం చేసి మళ్లీ జగన్ ని సీఎం గా చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

No-Confidence Motion Against Jagdeep Dhankhar: రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపాటు

Hazarath Reddy

పార్లమెంటులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ చైర్మన్ జగ్‌‌దీప్ ధన్‌ఖడ్‌పై కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ధన్‌ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ మొత్తం 71 మంది ఎంపీల సంతకాలతో నోటీసు ఇచ్చినట్టు కూటమి వర్గాలు తెలిపాయి.

Advertisement

YS Jagan: జగన్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా, ఆ రెండు పత్రికలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు, ఇకపై ఎటువంటి కథనాలు ప్రచురించరాదని న్యాయస్థానం ఆదేశాలు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించిన తప్పుడు, దురుద్దేశపూ­ర్వక కథనాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు

Supreme Court On 'Freebies': ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తారు ? ఉచిత రేషన్ ఇవ్వడంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 81 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్లు కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది.

SM Krishna Passes Away: ఎస్ఎం కృష్ణ క‌న్నుమూత‌.. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న క‌ర్ణాట‌క మాజీ సీఎం

Rudra

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (92) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బెంగ‌ళూరులోని తన స్వగృహంలో మంగ‌ళ‌వారం వేకువజామున 2:45 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.

Telangana Talli Statue Inauguration: వీడియో ఇదిగో, 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సచివాలయం ప్రాంగణంలో శాస్త్రోక్తంగా విగ్రహావిష్కరణ మహోత్సవం

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదులో నేటి సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వేదమంత్రాల సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Advertisement

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సభలో వెల్లడించారు

Anitha vs Vijaysai Reddy: వచ్చే ఎన్నికల్లో మీకు ఆ 11 సీట్లు కూడా రావు, విజయసాయి రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఏపీ హోం మంత్రి అనిత

Hazarath Reddy

చేసిన తప్పులు బయటపడుతున్నాయనే భయంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. స్థాయి, వయసు మరిచిపోయి చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Rajya Sabha By-Election 2024: ఏపీ నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య, త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కమలదళం

Hazarath Reddy

ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజ్యసభ (Rajya Sabha) ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, హర్యాణా, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ పార్టీ సోమవారం ప్రకటించింది.

Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 20 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన ఆమ్ ఆద్మీ, జంగ్‌పురా స్థానం నుండి బరిలో దిగనున్న మనీష్ సిసోడియా

Hazarath Reddy

రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం 20 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది, జంగ్‌పురా స్థానం నుండి పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాను బరిలోకి దింపింది. ఇటీవలే ఆప్‌లో చేరిన విద్యావేత్త అవధ్ ఓజా ప్రస్తుత అసెంబ్లీలో సిసోడియాకు చెందిన పట్‌పర్‌గంజ్ స్థానం నుంచి బరిలోకి దిగారు

Advertisement
Advertisement