రాజకీయాలు
Anitha vs Vijaysai Reddy: వచ్చే ఎన్నికల్లో మీకు ఆ 11 సీట్లు కూడా రావు, విజయసాయి రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఏపీ హోం మంత్రి అనిత
Hazarath Reddyచేసిన తప్పులు బయటపడుతున్నాయనే భయంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. స్థాయి, వయసు మరిచిపోయి చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Rajya Sabha By-Election 2024: ఏపీ నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య, త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కమలదళం
Hazarath Reddyఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజ్యసభ (Rajya Sabha) ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, హర్యాణా, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ పార్టీ సోమవారం ప్రకటించింది.
Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 20 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన ఆమ్ ఆద్మీ, జంగ్పురా స్థానం నుండి బరిలో దిగనున్న మనీష్ సిసోడియా
Hazarath Reddyరాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం 20 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది, జంగ్పురా స్థానం నుండి పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాను బరిలోకి దింపింది. ఇటీవలే ఆప్లో చేరిన విద్యావేత్త అవధ్ ఓజా ప్రస్తుత అసెంబ్లీలో సిసోడియాకు చెందిన పట్పర్గంజ్ స్థానం నుంచి బరిలోకి దిగారు
Komati Reddy Venkata Reddy: TRS పార్టీని BRSగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలకు వాళ్లకు బంధం తెగిపోయింది, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
Hazarath ReddyTRS పార్టీని BRSగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలకు వాళ్లకు బంధం తెగిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదని స్పష్టం చేశారు. ఆనాడేమో మీరు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు తల్లి అని కేసీఆర్ సోనియమ్మ కాళ్ళు మొక్కాడు.
Chennamaneni Ramesh: చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడే, తేల్చి చెప్పిన తెలంగాణ హైకోర్టు, విధించిన రూ.30లక్షల జరిమానా నెలలోపు చెల్లించాలని స్పష్టం
Hazarath Reddyవేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (Chennamaneni Ramesh)కు తెలంగాణ హైకోర్టు (TS High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వం కేసులో దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
Telangana Assembly Session 2024: ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు, అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ తల్లిని ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరిస్తున్నాం.
BRS MLAs Arrest: రాహుల్ గాంధీ ఆదాని టీషర్ట్ ధరించి పార్లమెంట్ కు వెళ్లాడు, మేము ధరించి అసెంబ్లీకి వస్తే తప్పేంటి ? అరెస్టులపై మండిపడిన బీఆర్ఎస్ నేతలు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శాసనసభ్యులు సోమవారం ఉదయం నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది . సెషన్ ప్రారంభానికి నిమిషాల ముందు ఈ నిరసన చెలరేగింది.
Tension at Assembly Gate: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. కారణం ఇదే..! (వీడియో)
Rudraతెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు దగ్గర అడ్డుకున్నారు.
TG Assembly Session Today: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 5 బిల్లులు, 2 నివేదికలు ప్రవేశపెట్టే అవకాశం.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ఇవాళే..!
Rudraతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశాలు మొదలు కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి.
Farmers protest: రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన హర్యానా పోలీసులు, శంభు సరిహద్దు వద్ద కాంక్రీట్ దిమ్మలు, ఇనుప బారికేడ్లు ఏర్పాటు..వీడియో ఇదిగో
Arun Charagondaపంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ ను మరోసారి అడ్డుకున్నారు పోలీసులు. రైతుల పై టియర్ గ్యాస్ ప్రయోగించారు హర్యానా పోలీసులు. 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ళేందుకు అభ్యంతరం లేదు..ఢిల్లీ వెళ్లే రైతులు కాకుండా గ్రూపుగా ఎక్కువమంది ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి అడ్డుకున్నాం అని పోలీసులు తెలిపారు. శంభు సరిహద్దు వద్ద కాంక్రీట్ దిమ్మలు,ఇనుప బారిగేట్లు ఏర్పాటు చేశారు. అంబాల జిల్లాలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించారు.
RJD leader Tejashwi Yadav: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్జేడీ తేజస్వి యాదవ్, సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం అని తెలిపిన ఆర్జేడీ నేత
Arun Charagondaపశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. మమతా చేసిన ప్రకటనపై కూటమిలో అంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు తేజస్వి. కూటమికి ఎవరూ నాయకత్వం వహిస్తారనేది అంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని... కూటమిలోని సీనియర్ నాయకులు ఎవరైనా నాయకత్వం వహిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
KCR BRSLP Meeting: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ఎల్పీ భేటీ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై చర్చ
Rudraతెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ భేటీ జరుగనుంది.
PM Modi: ప్రధాని మోదీ హత్యకు కుట్ర ..ముంబై పోలీసులకు బెదిరింపు మెస్సేజ్..నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Arun Charagondaప్రధాని మోదీని హతమారుస్తానని ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. వాట్సాప్ మెసేజ్తో అప్రమత్తమై విచారణ చేపట్టారు పోలీసులు. బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి రాజస్థాన్ వాసికి మతి భ్రమించినట్లుగా గుర్తించగా భారత న్యాయసంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Ponnam Meets KCR: నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎందుకంటే??
Rudraతెలంగాణలో నేడు రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలవనున్నారు.
Telangana: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్లకు వచ్చి ఎవరైనా హడావుడి చేస్తే బొక్కలో వేయండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఫ్రెండ్లీ పోలీస్ ప్రజల కోసమేనని నేరగాళ్లకు కాదని అన్నారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందేనని తెలిపారు. అత్యధికంగా కష్టపడేది పోలీసులే.. విమర్శలు ఎదుర్కొనేది పోలీసులే అని సీఎం అన్నారు. ప్రజా పాలనలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుందని రాజకీయ ఒత్తిళ్లు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Telangana Thalli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదిగో, ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్లో విగ్రహావిష్కరణ కార్యక్రమం
Hazarath Reddyఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి రూపం, చేతిలో మొక్కజొన్న, వరి కంకులు, మెడలో 3 ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టిన ఈ కొత్త విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు.
Ambati Rambabu Slams Nara Lokesh: ఫేక్ పోస్టులు పెట్టినవారిపై కేసులు పెట్టినా ఇంత వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు, కూటమి ప్రభుత్వంపై మండిపడిన అంబటి రాంబాబు
Hazarath Reddyటీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలపై మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో సోషల్మీడియాలో వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Rajya Sabha: రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట కలకలం, ఘటనపై స్పందించిన అభిషేక్ సింఘ్వీ, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జరుగుతున్న వేళ ఎగువ సభ (Rajya Sabha)లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi) సీటు వద్ద నోట్ల కట్ట లభ్యమైనట్లు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ (Jagdeep Dhankhar) వెల్లడించారు.
Opposition MPs Protest: పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన, అదానీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ లతో విచారణ జరిపించాలని డిమాండ్
Arun Charagondaపార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన కొనసాగుతోంది. మోదీ అదానీ భాయ్ భాయ్ అంటూ మాస్కులు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలు. అదానీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ లతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Kakinada Shares Case: చంద్రబాబుకు ఈ కేవీ రావు ఒక చెంచా, అలాంటి వాడిపై మేము బెదిరింపులకు దిగడమేంటి ? మీడియా వేదికగా మండిపడిన విజయసాయి రెడ్డి
Hazarath Reddyకాకినాడ పోర్టు అంశంలో టీడీపీ నేతలు తన పేరును కూడా తీసుకువస్తుండడం, తనకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా వేదికగా మండిపడ్డారు.