రాజకీయాలు

TSRTC Strike Updates: రోజుకో మలుపు తిరుగుతున్న ఆర్టీసీ సమ్మె, ఉద్యోగాలు తీసే అధికారం ఎవరికీ లేదన్న ఆర్టీసీ జేఏసీ, మంత్రి హరీష్ రావుకు సమ్మె సెగ, నేడు ఆర్టీసీ..రేపు సింగరేణి అంటున్న భట్టీ విక్రమార్క, నేలరాలిన మరో కార్మిక కిరణం

Hazarath Reddy

తెలంగాణ(Telangana)లో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె (TSRTC Strike) ఆదివారం నాటికి 30వ రోజుకు చేరుకుంది. కాగా, సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (K. Chandrashekar Rao) చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (telangana-rtc-jac) తీవ్రంగా మండిపడింది. తొలుత కార్మికుల డిమాండ్లపై చర్చించి దీనికి సంబంధించిన ఆర్థిక వనరులను ఎలా సమకూరుస్తారో చెప్పాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు.

Mamata Banerjee Phone Tapping: న్యా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, కేంద్రంపై దీదీ సంచలన ఆరోపణలు, రెండు, మూడు రాష్ట్రాలు కలిసి ఈ పనిచేశాయి, ఓ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది

Hazarath Reddy

కేంద్రంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని, గుర్తు తెలియని వ్యక్తుల నుండి తనకు వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్నారు.

Sanjay Raut Interesting Comments: 170 మంది మావైపే ఉన్నారు, త్వరలో 175కి చేరుకుంటాం, బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది?,ఆపరేషన్ లోటస్ ఇక్కడ కుదరదన్న శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అక్కడ ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎవరూ మెట్టు దిగడం లేదు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ దాని మిత్రపక్షం శివసేన మధ్య సయోధ్య కుదరడం లేదు. సీఎం పీఠం కోసం రెండు పార్టీలు పట్టిన పట్టు విడవడం లేదు. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నాప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న చిక్కుముడి వీడలేదు.

PM Modi Speech On Terrorism: ఉగ్రవాద మూలాలను ఏరిపారేశాం, ఆర్టికల్ 370 రద్దు ప్రకంపనలు ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తాయి, అసాధ్యమైన లక్ష్యాలను సుసాధ్యం చేసుకుంటూ వెళుతున్నాం, బ్యాంకాక్‌లో ప్రధాని మోడీ స్పీచ్ హైలెట్స్

Hazarath Reddy

కాశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా ఉగ్రవాదం, వేర్పాటువాదాలను తమ ప్రభుత్వం అణచివేసిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం వేళ్లూనుకునేందుకు గల కారణాన్ని గుర్తించి, తొలగించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Telangana Cabinet Meet: ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ డెడ్‌లైన్, 5 లోపు విధుల్లో చేరకుంటే ఉద్యోగం ఉండదు, మీ సమ్మెకు భయపడే ప్రసక్తే లేదన్న సీఎం, మీ బెదిరింపులకు భయపడమంటున్న ఆర్టీసీ జేఏసీ

Hazarath Reddy

టీఎస్‌ఆర్టీసీ ( TSRTC) సమ్మెపై సస్పెన్స్ ఇంకా అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణా సీఎం కేసీఆర్ (TS CM KCR) ఉద్యోగులకు వార్నింగ్‌తో కూడిన డెడ్‌లైన్ ఇచ్చారు. మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. యూనియన్ల మాయలో పడి బతుకులు ఆగం చేసుకోవద్దు. మీ కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నెల ఐదో తేదీ మంగళవారం రాత్రి 12 గంటల్లోగా విధుల్లో చేరండి.. కుటుంబాలను కాపాడుకోండి. ఉద్యోగాలకు రక్షణ ఉంటుంది అని తెలిపారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విధుల్లో చేరకుంటే మధ్యప్రదేశ్‌ తరహాలో తెలంగాణ ఆర్టీసీ రహిత రాష్ట్రమవుతుందని స్పష్టంచేశారు.

Janasena Chalo Vishakhapatnam: ఇసుక కొరతకు నిరసనగా జనసేన లాంగ్ మార్చ్,సేనకు బై చెప్పిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మద్దతు తెలిపిన టీడీపీ, హ్యాండిచ్చిన సీపీఐ, సీపీఎం, బీజేపీ, కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాధ్

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘాలకు సంఘీభావంగా జనసేన నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ (Janasena Long March) కు సర్వం సిద్ధం అయింది. ఉక్కునగరం విశాఖ వేదిక( Visakhapatnam) గా ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల పరిష్కారానికి జనసేనాని ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమం చేపట్టారు.

Sawasdee PM Modi: బ్యాంకాక్‌లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం, మూడు రోజుల పాటు టూర్, సవస్దీ పీఎం మోడీలో ప్రధాని ప్రసంగం, థాయ్‌లాండ్‌కు ఇది నా మొదటి అధికారిక పర్యటన అంటూ ప్రారంభం

Hazarath Reddy

భారత్-థాయ్‌లాండ్ (Thailand) మధ్య చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగప్వామ్యం చర్యలు ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రధాని మోడీ బ్యాంకాక్ చేరుకున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ప్రధాని మోడీ థాయ్‌లాండ్ టూర్ కొనసాగనుంది.

RTC JAC To Meet Amit Shah: ఆర్టీసీ సమ్మెలో మరో కీలక మలుపు, అమిత్ షాను కలవనున్న ఆ‍ర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి , భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆ‍ర్టీసీ జేఏసీ, ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష

Hazarath Reddy

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 29వ రోజుకు చేరింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుకూల సంకేతాలు రావడం లేదు. హైకోర్టులో సమ్మెపై వాదోపవాదాలు నడుస్తున్నాయి. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామని తెలంగాణా సీఎం కేసీఆర్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆర్టీసీ జేఏసీ భవిష్యత్తు కార్యచరణను ప్రకటించింది.

Advertisement

Jakkanna Reaction on Varma Tweet: కెకెఆర్‌ఆర్‌లోకి రాజమౌళిని లాగిన రాంగోపాల్ వర్మ, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటున్న జక్కన్న, నవ్వులు పూయిస్తున్న కెఎ పాల్ పాట

Hazarath Reddy

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్, వివాదాలకు మారు పేరుగా నిలిచిన రాంగోపాల్ వర్మ ఈ మధ్య కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో సంచలనంగా మారిన సంగతి అందిరకీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన విడుదల చేసిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ వివాదాలకు మరింతగా ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే వివాదంలోకి సినీ ప్రముఖులను లాగిన వర్మ తాజాగా రాజమౌళిని కూడా ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేశాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని కేఏ పాల్‌ సాంగ్‌ను రిలీజ్ చేసిన వర్మ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

MAHA Govt Suspence: మహాలో మరో కీలక మలుపు, ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి, రాష్ట్రపతి పాలన అంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్న శివసేన

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఫలితాలు ప్రకటించి వారం దాటినా అక్కడ గవర్నమెంట్ ఎవరు ఏర్పాటు చేస్తారనే దానిపై ఇంకా కొలిక్కి రాలేదు. బిజెపి దాని మిత్రపక్షం శివసేన మధ్య చర్చలు ఓ పట్టాన తేలకపోవడంతో అధికార ఏర్పాటుకు కాంగ్రెస్ ఎన్సీపీ సరికొత్త ఎత్తుగడకి తెరలేపిందని తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్‌ 8న ముగిసిపోనుంది.

Karakatta Illegal Issues: కరకట్ట అక్రమ నిర్మాణదారులకు మరోసారి నోటీసులు, విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు, విచారణ ఆరువారాలకు వాయిదా

Hazarath Reddy

కష్ణానది ఒడ్డున వెలసిన అక్రమ నిర్మాణాల విషయంలో వివరణ ఇవ్వాలని ఆ నిర్మాణాల యజమానులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలనీ ఆదేశించింది.

Pakistan Biggest Issues: కాశ్మీర్ సమస్య కానే కాదు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే పాకిస్తాన్‌ను పట్టి పీడిస్తున్నాయి, పాక్ ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన, గల్లప్‌ అండ్‌ గిలానీ ఇంటర్నేషనల్‌ అధ్యయనపు నిజాలు

Hazarath Reddy

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్థాన్‌లో కశ్మీర్‌ సమస్య కంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. పాకిస్తాన్‌ ప్రజలను పట్టి పీడిస్తోంది ద్రవ్యోల్బణమే తప్ప కశ్మీర్‌ సమస్య కాదని గల్లప్‌ ఇంటర్నేషనల్‌ నిర్వహించిన తాజా అధ్యయనం తేల్చి చెప్పింది.

Advertisement

Polavaram Project Mission @2021: పోలవరం పనులు తిరిగి ప్రారంభం, భూమి పూజ చేసిన మేఘా సంస్థ ప్రతినిధులు, 2021 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న ఏపీ సీఎం జగన్, తగ్గిన గోదావరి నీటి మట్టం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రారంభించింది. శుక్రవారం స్పిల్ వే వెనుక భాగంలో సంస్థ ప్రతినిధులు భూమి పూజ చేశారు. గోదావరి నీటిలో పసుపు, కుంకుమ చల్లి పూజలు జరిపారు.

Jharkhand Assembly Elections 2019: అక్కడ కూడా బీజేపీకి షాక్ తప్పదా? నవంబర్ 30 నుంచి ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు, ఐదు దశల్లో జరగనున్న పోలింగ్, హర్యానా-మహారాష్ట్ర సీన్ ఝార్ఖండ్ లోనూ రిపీట్ అవుతుందని పార్టీల అంచనా

Vikas Manda

ఇటీవల వెలువడిన మహరాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి, రెండు చోట్ల ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజారిటీని సాధించలేకపోయింది. వీటి ఫలితం ఝార్ఖండ్ లోనూ ప్రభావం చూపిస్తుందని...

Telangana RTC Strike: కార్మికులు చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదు, ఎంపీని అని చూడకుండా పోలీసులు మెడపట్టి తొసేశారు, డ్రైవర్ బాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత, హైకోర్టులో కేసు మరోసారి వాయిదా

Vikas Manda

హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో, ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పూర్తి నివేదికను సమర్పించారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించామని నివేదికలో పేర్కొన్నారు. ఈసారి కూడా నివేదిక అస్పష్టంగా ఉందని హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది....

AP Incarnation Day Ceremony: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు, రాష్ట్ర విభజన తరువాత తొలిసారి, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలం, ఆయనకు ఘనంగా నివాళి అర్పించిన పలువురు నేతలు

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ సందర్భంగా ఏపీ అంతటా ఈ వేడుకలు జరుపుతున్నారు. కాగా విభజన తర్వాత నవ్యాంధ్ర అవతరణ దినోత్సవాన్ని తొలిసారి అధికారింగా నిర్వహిస్తున్నారు. నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Advertisement

Farmer Asks 'Make Me MAHA CM': నన్ను‘మహా’ సీఎం చేయమంటున్న రైతు, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి రైతు శ్రీకాంత్ విష్ణు గడాలే లేఖ, బీజేపీ-శివసేన మధ్య కుదరని పొత్తుకు నిరసనగా నిర్ణయం

Hazarath Reddy

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించినా వారి మధ్య సయోధ్య కుదరడం లేదు. అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన పట్టుబడుతోంది. అయితే బీజెపీ మాత్రం అయిదేళ్లు మేమే సీఎంగా ఉంటాం. మీకు 16 మంత్రి పదవులిస్తాం అని చెబుతోంది. దీంతో ఇప్పట్లో సీఎం పీఠముడి అక్కడ వీడేలా లేదు. ఈ నేపథ్యంలో ఓ రైతు నన్ను సీఎంగా చేయమంటూ ముందుకొచ్చాడు.

YS Jagan VS CBI Verdict: జగన్ అక్రమాస్తుల కేసులో మరో మలుపు, వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనన్న సీబీఐ కోర్టు, హైకోర్టులో అప్పీల్ చేయనున్న జగన్, తీర్పును స్వాగతించిన టీడీపీ

Hazarath Reddy

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురయ్యింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపి ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Twitter Bans Political Campaigns: రాజకీయ ప్రచారాలను బ్యాన్ చేస్తున్న ట్విట్టర్, ఇకపై ఎటువంటి యాడ్స్ కనపడవు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని నిర్ణయం, వెల్లడించిన ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీ

Hazarath Reddy

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ట్విట్టర్ రాజకీయ పార్టీలకు ఝలక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

'MAHA' Suspense: కొనసాగుతున్న ‘మహా’ సస్పెన్స్, పట్టు విడవని శివసేన, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ భేటీ, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాట్లపై ఊహాగానాలు

Hazarath Reddy

మహారాష్ట్రలో అధికార ఏర్పాటుపై ఇంకా ఎటువంటి స్పష్టత రావడం లేదు. సస్పెన్స్‌ అలాగే కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం రోజులు దాటుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అధికారాన్ని సమంగా పంచుకునే తమ డిమాండ్‌ విషయంలో వెనక్కు తగ్గబోమని శివసేన మరోసారి స్పష్టం చేసింది.

Advertisement
Advertisement