రాజకీయాలు

KTR On Farmers Problem: కాంగ్రెస్ చేసిన కమాల్ ఇదే,ఆగమైతున్న తెలంగాణ రైతు, సంక్షోభంలో సాగు? ఆసక్తికర ట్వీట్ చేసిన కేటీఆర్

Arun Charagonda

కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం తగ్గిందని ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం ఇది అన్నారు.

KTR On Amara Raja Battery: తెలంగాణ నుండి తరలిపోతున్న పరిశ్రమలు, కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టమని కామెంట్

Arun Charagonda

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు గల్లా జయదేవ్‌కు చెందిన అమర రాజా కంపెనీ ముందుకొచ్చింది. అయితే తాజాగా అమరరాజా సంస్థ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించటంపై స్పందించడం కేటీఆర్ ఇది చాలా బాధాకరమన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దు అని, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్‌కు నష్టం రాకుండా రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ ఎఫెక్ట్..మిగితా రాజకీయ నాయకులకు కనువిప్పే, ఎందుకో తెలుసా?

Arun Charagonda

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి తాము మాట్లాడిన మాటలే తమ మెడకే చుట్టుకుంటాయి. ఇది సరిగ్గా దువ్వాడ శ్రీనివాస్‌ ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన దువ్వాడ తీవ్ర విమర్శలు చేశారు. హిందు సంప్రదాయం, మూడు పెళ్లిళ్లు అంటూ పవన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

Manish Sisodia: రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటకు వస్తారు, జైలు నుంచి విడుదలైన తర్వాత మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏదైనా నియంతృత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, నియంతృత్వ చట్టాలను రూపొందించి ప్రతిపక్ష నాయకులను కటకటాల వెనక్కి నెట్టివేస్తే, ఈ దేశ రాజ్యాంగం బాధితులకు రక్షణ కల్పిస్తుంది" అని ఆయన నొక్కి చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణలో అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా విముక్తి లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

'Indebted To Babasaheb': నా శరీరంలోని ప్రతి అంగుళం బాబాసాహెబ్‌కు రుణపడి ఉంటా, జైలు నుంచి విడుదలైన తర్వాత భావోద్వేగానికి గురైన మనీష్ సిసోడియా

Hazarath Reddy

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియా బెయిల్‌పై విడుదలైన తర్వాత తీహార్ జైలు వెలుపల పెద్ద ఎత్తున పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆగస్టు 9న సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది

Manish Sisodia Released From Tihar Jail: 17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన మనీష్ సిసోడియా, ఘన స్వాగతం పలికిన ఆప్ కార్యకర్తలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

17 నెలల కటకటాల తర్వాత ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. అంతకుముందు రోజు సుప్రీంకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం వల్ల సత్వర న్యాయం పొందే హక్కు అతనికి లేకుండా చేశారని పేర్కొంది.

Manish Sisodia Walks Out of Tihar Jail: 17 నెలల తర్వాత బయటకు, తీహార్ జైలు నుండి విడుదలైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా

Hazarath Reddy

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో తిహాడ్‌ జైలు నుంచి ఈ సాయంత్రం బయటకు వచ్చారు.

Parliament Adjourned Sine Die: పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా, 12 బిల్లులు ప్రవేశపెట్టిన మోదీ సర్కారు, నాలుగు బిల్లులు మాత్రమే పాస్

Hazarath Reddy

పార్లమెంటు , లోక్‌సభ మరియు రాజ్యసభ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12న ముగియాల్సి ఉండగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెషన్‌లో ఆర్థిక బిల్లును ఆమోదించారు.

Advertisement

Jagan on Nara Lokesh 'Red Book': ఏపీలో లా అండ్ ఆర్డర్ బతకాలంటే చంద్రబాబు, నారా లోకేష్‌లను హత్య కేసుల్లో ముద్దాయిలుగా చేర్చాలి, జగన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ నాశనం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను ముద్దాయిలుగా చేర్చాలన్నారు. కేవలం ఆధిపత్యం కోసమే దాడులకు తెగబడుతున్నారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. కావాలనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఇదెక్కడి పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagan Slams TDP-led Alliance Ruling: టీడీపీ ఎమ్మెల్యేలే చంపండని చెబుతున్నారు, ఇదేం పాలన అంటూ మండిపడిన వైఎస్ జగన్, హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ

Hazarath Reddy

Jagan on Subbarayudu Murder Case: ప్రతి ఊరిలో ఇద్దరు వైసీపీ నాయకులను చంపాలని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే చెబుతున్నాడు, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రతి ఊరిలో ఇద్దరు వైయస్ఆర్ సీపీ నాయకులను చంపండి అని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీటింగ్ లు పెట్టి మరీ చెబుతున్నాడని మండిపడ్డారు.

Jagan on AP Law and Order: పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తున్నారు, రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండని కోరిన వైఎస్ జగన్, వీడియో ఇదిగో

Hazarath Reddy

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.మారణహోమం సృష్టించే పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తున్నారంటే.. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండని ప్రజలను కోరారు.

Advertisement

Jagan on Subbarayudu Murder Case: ఎస్ఐ సమక్షంలోనే సుబ్బారాయుడిని హత్య చేశారు, రాజకీయ కుట్ర లేకపోతే హత్య జరిగిన తర్వాత అడిషనల్‌ ఫోర్స్ ఎందుకు రాలేదని ప్రశ్నించిన వైఎస్ జగన్

Hazarath Reddy

వైఎస్‌ జగన్‌ నంద్యాలలో సీతారామపురంలో టీడీపీ గూండాల దాడితో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పీఠంపై ఉన్న జగన్ పేరును తొలగించిన అధికారులు, పేరు తొలగించినంత మాత్రాన చరిత్రను చెరిపేయలేరని వైసీపీ నేతలు మండిపాటు

Hazarath Reddy

విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్‌ పేరును అర్ధరాత్రి లైట్లు ఆపేసి తొలగించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసుల సమక్షంలోనే నగరపాలక సిబ్బంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన‌ జగన్ పేరు తొలగించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

Alla Nani Quits YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా వెళుతున్నానని వెల్లడి

Hazarath Reddy

వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Caught On Camera: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందే మహిళను దారుణంగా కొట్టిన బీజేపీ నేత

Vikas M

బుల్దానా జిల్లాలోని మల్కాపూర్ వద్ద శివ టైడే అనే బీజేపీ నేత ఒక రౌడీతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే మహిళ మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. బుల్దానాలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, స్థానిక బిజెపి నాయకుడు అతన్ని అడ్డుకోవడానికి పోలీసులు జోక్యం చేసుకునే వరకు నగర పోలీసు స్టేషన్‌లో ఒక మహిళను కొట్టారు

Advertisement

Pendem Dorababu Resigns YSRCP: వైసీపీకి షాకిచ్చిన ఇద్దరు నేతలు, పిఠాపురంలో పెండెం దొరబాబు రాజీనామా, అనంతపురంలో పైలా నర్సింహయ్య గుడ్ బై

Hazarath Reddy

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇక అనంతపురం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య తన పదవికి రాజీనామా చేశారు.

Jagan Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నవంబర్‌ 11కు వాయిదా, రఘురామపై సుప్రీంకోర్టు సీరియస్‌, సీబీఐపై అసహనం

Hazarath Reddy

మాజీ సీఎం వైఎస్ జగన్‌ (YS Jagan) అక్రమాస్తుల కేసు విచారణ నవంబర్‌ 11కు వాయిదా (Adjourn) పడింది. జగన్‌ అక్రమాస్తుల ( Illegal assets ) కేసులపై గతంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjeev Khanna ) నేతృత్వంలో విచారణ జరిగింది.

YS Jagan's Security Row: దేవాన్స్‌కు ఆరుమంది సెక్యూరిటీని పెట్టారు, మరి జగన్‌కు భద్రత వద్దని ఎందుకంటున్నారు ? ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని మండిపడిన అంబటి రాంబాబు

Hazarath Reddy

హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటి ముందు ఇప్పటికీ ప్రవేశం లేదని ఆయన గుర్తుచేశారు. కానీ వైఎస్‌ జగన్‌ ఇంటి ముందు రోడ్డును తెరిచి జనాలను పంపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మనుమడు దేవాన్ష్‌కు కూడా ఆరుగురు సెక్యూరిటీని ఎలా పెట్టారని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Telangana Politics: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై కోర్టులో దావా వేస్తామని వెల్లడి

Hazarath Reddy

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రించారు. ఈ మేర‌కు కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement