Politics

Telangana Elections 2024: తెలంగాణలో RR ట్యాక్స్ వెయ్యి కోట్లు దాటేసింది, వేములవాడలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని మోదీ, బండి సంజయ్‌ విజయం ముందే నిర్ణయమైందని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణలో మార్పు తీసుకొస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. అవినీతిలో గత ప్రభుత్వాన్నే అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ విజయం ముందే నిర్ణయమైందన్నారు.

2024 భారతదేశం ఎన్నికలు: ముగిసిన మూడో దశ ఎన్నికల పోలింగ్, దేశ వ్యాప్తంగా 61 శాతానికి పైగా ఓటింగ్ నమోదు, అత్యధిక ఓటింగ్ శాతంతో అస్సాం ముందంజ

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో సహా 11 రాష్ట్రాల్లో మంగళవారం లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో వేడి ఉష్ణోగ్రతల మధ్య పోలింగ్ జరిగింది. మే 7వ తేదీన జరిగిన పోలింగ్ 93 లోక్‌సభ స్థానాలను కవర్ చేసింది,

Lok Sabha Elections 2024: హర్యానాలో బీజేపీకి షాకిచ్చిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన, సంక్షోభంలో కాషాయం పార్టీ

Hazarath Reddy

లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ హర్యానాలో కాషాయం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

Andhra Pradesh Elections 2024: తుప్పు పట్టిన సైకిల్ కథ చెప్పిన సీఎం జగన్, చంద్రబాబుపై కోరుకొండలో మరోసారి విరుచుకుపడిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఎన్నికల ముందు రకరకాల వాగ్ధానాలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడంతో 2019లో రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె, పట్టణ ప్రజలు అంతా కలిసి సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారని విమర్శించారు.

Advertisement

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు, మే 14 వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు, ప్రజ్వల్‌ రేవణ్ణ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

Hazarath Reddy

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో మంగళవారం కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు.

Delhi Excise Policy Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం, అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్, వచ్చే వారం మళ్లీ విచారణ చేపట్టే అవకాశం

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన తన అరెస్టును సవాలు చేస్తూ గతంలోనే సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిగింది.

Delhi Excise Policy Scam: ఎక్సైజ్ పాలసీ కేసు, మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మే 15 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు

Hazarath Reddy

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని మే 15 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో నిందితులపై అభియోగాల రూపకల్పనకు సంబంధించి తదుపరి వాదనలకు మే 15వ తేదీని కోర్టు నిర్ణయించింది.

Delhi Excise Policy Scam: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్, జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు

Hazarath Reddy

ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 20 వరకు పొడిగించింది. న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీ కేసులో ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్న విష‌యం తెలిసిందే

Advertisement

Pawan Kalyan Touches PM Modi's Feet: వీడియో ఇదిగో, ప్రధాని కాళ్ల మీద పడిన పవన్ కళ్యాణ్, నాకు అలాంటివి ఇష్టం ఉండవని స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మోదీ

Hazarath Reddy

రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేదికపై వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్యనేతలు, టీడీపీ నేత నారా లోకేష్‌ శాలువా కప్పి స్వాగతం పలకగా ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి సాదర స్వాగతం పలికారు.

PM Modi Breaks Down in Tears: తల్లిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోదీ, తొలిసారిగా తన తల్లి కాళ్లు తాకకుండా నామినేషన్ దాఖలు చేసానంటూ భావోద్వేగం

Hazarath Reddy

టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తన దివంగత తల్లి హీరాబెన్ గురించి గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ ర్యాలీలలో తన దృఢమైన వైఖరికి పేరుగాంచిన ప్రధాని మోడీ, ఈ ఇంటర్వ్యూలో తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు.

PM Modi Kisses Child: పసిపాపను ఎత్తుకుని ముద్దాడుతూ ఆడించిన ప్రధాని మోదీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్, ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపు

Hazarath Reddy

ఈ క్ర‌మంలో ముందు కంటిచూపులేని ఓ యువ‌తి ద‌గ్గ‌రికి వెళ్లి మాట్లాడారు. ఆమె ప్ర‌ధానిని ద‌గ్గ‌ర‌కు తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఎస్‌పీజీ గార్డ్ అడ్టుకున్నారు. దీంతో ప్ర‌ధాని అత‌డిని వారించారు. అనంత‌రం మోదీ ఓ చిన్నారిని ఎత్తుకుని కొద్దిసేపు ఆడించి, ముద్దాడారు.

Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ గెలవాలంటూ హీరో నాని ట్వీట్, సినీ కుటుంబంలో ఒకడిగా జనసేనాధినేతకు మద్ధతు పలుకుతున్నట్లు ట్వీట్

Hazarath Reddy

జనసేనాని పవన్ కల్యాణ్ కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినీ కుటుంబంలో ఒకడిగా పవన్ కల్యాణ్ కు మద్దతు పలుకుతున్నట్లు వివరించారు.

Advertisement

2024 భారతదేశం ఎన్నికలు: 93 స్థానాల్లో కొనసాగుతున్న మూడో దశ లోక్‌ సభ పోలింగ్.. అహ్మదాబాద్ లో ఓటేసిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా

Rudra

2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేడు (మంగళవారం) మూడో దశ పోలింగ్ మొదలైంది. 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ షురూ అయ్యింది.

Andhra Pradesh Election 2024: పిఠాపురంలో నీ సీటుకే దిక్కులేదు, నా కూతురుకు సీటు ఇస్తావా, పవన్ కళ్యాణ్‌పై మండిపడిన ముద్రగడ పద్మానాభం

Hazarath Reddy

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సీరియస్‌ అయ్యారు వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్‌ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు అని హితవు పలికారు. అలాగే, పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని చురకలంటించారు.

PM Modi AP Tour: ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారు! రాజ‌మండ్రి స‌భ‌లో ప్ర‌ధాని మోదీ ధ్వజం, మే 13 త‌ర్వాత నూత‌న శకం ప్రారంభం కాబోతోందని వెల్లడి

VNS

మే 13న ఏపీలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ (Modi) అన్నారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే విజయం సాధించబోతోందన్న ప్రధాని మోదీ.. ఏపీలోనూ ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. రాజమండ్రిలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ”ఎన్నికల ఫలితాలు ముందే కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అంగీకరించింది.

Shankha Brata Bagchi: ఏపీ ఇన్‌ఛార్జి డీజీపీగా శంఖబ్రత బాగ్చి, ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం

Hazarath Reddy

ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి స్థానంలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఏపీ నూతన డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు

Advertisement

Lok Sabha Election 2024: జార్ఖండ్ మంత్రి పీఏ ఇంట్లో రూ. 25 కోట్ల లెక్క చూపని నగదు, రాంచీలో 10 ప్రాంతాల్లో ఏకాలంలో వరుస దాడులు నిర్వహించిన ఈడీ

Hazarath Reddy

జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో (Jharkhand Rural Development) కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది.

MLC Kavitha Liqour Case: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై ఇవాళ తీర్పు.. ఈడీ, సీబిఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించిన కవిత

sajaya

ఢిల్లీ: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై ఇవాళ తీర్పు.. ఈడీ, సీబిఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించిన కవిత.. రెండు కేసుల్లోనూ ముగిసిన వాదనలు.. ఇవాళ కవిత బెయిలుపై తీర్పు వెలువరించనున్న రౌస్ ఎవిన్యూ కోర్టు

2024 భారతదేశం ఎన్నికలు: తెలంగాణలో హీటెక్కిన లోక్ సభ ఎన్నికల సమరం.. నేడు మూడు సభల్లో పాల్గొననున్న హోంమంత్రి అమిత్ షా.. రెండు చోట్ల ప్రసంగించనున్న రాహుల్ గాంధీ.. జగిత్యాలలో గులాబీ దళాధిపతి కేసీఆర్ బస్సు యాత్ర

Rudra

తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని తమదైన శైలిలో ముందుకు తీసుకుపోతున్నాయి.

Delhi Liquor Policy Case: ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ పరిశీలిస్తాం, ఈడీకి తెలిపిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ మే7కి వాయిదా

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం (మే 3) లోక్‌సభ ఎన్నికల ప్రయోజనాల కోసం మధ్యంతర బెయిల్ ప్రశ్నను పరిశీలించవచ్చని పేర్కొంది.

Advertisement
Advertisement