యాత్ర

Annavaram Temple New Rule: అన్నవరం వెళ్లే భక్తులకు గమనిక, గుడి దగ్గర రూం ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు నో ఛాన్స్

Hazarath Reddy

అన్నవరం దేవస్థానంలో కొత్త నిబంధన.. అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం లేదు. అన్నవరంలో వసతిగదిని తీసుకునే సమయంలో భక్తుడి ఆధార్ నంబరును సిబ్బంది నమోదు చేస్తారు.

Vishnu Sahasranamam: స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణం చేయకూడదని అంటారు ఎందుకు..? పార్వతీ దేవి స్త్రోత్తం ఇచ్చామి బదులు పతితం ఇచ్చామి అని పలికిందా..

Hazarath Reddy

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక ప్రార్థనలలో ఒకటి. సహస్ర అనగా వెయ్యి . అంటే ఈ స్తోత్రంలో వెయ్యి నామాలు ఉంటాయి . ఇది శ్రీమహావిష్ణువు యొక్క వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము.

Bear in Tirumala: వీడియో ఇదిగో, తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి, అర్థ రాత్రి 1 గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద ప్రత్యక్షం

Hazarath Reddy

తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి ప్రత్యక్షం. అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద కనిపించిన ఎలుగు బంటి. అయితే ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Tirumala: అధికమాసం ఎఫెక్ట్, తిరుమలలో ఈసారి ఒకేసారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి

Hazarath Reddy

తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈసారి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్ఠత ఉందని ఈవో ధర్మారెడ్డి అన్నారు.

Advertisement

Indrakiladri Ghat Road Closed: భారీ వర్షాలకు విజయవాడ దుర్గ గుడి వద్ద విరిగిపడిన కొండ చరియలు, ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు మూసివేత

Hazarath Reddy

విజయవాడ ( Vijayawada ) లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై కొండరాళ్లు ( Landslides) బుధవారం జారి ఘాట్‌రోడ్‌ మీద పడ్డాయి . ముందు జాగ్రత్త చర్యగా ఇంద్రకీలాద్రి ఘట్‌రోడ్డును అధికారులు మూసివేశారు.

Srivari Pushkarini to be Closed: శ్రీవారి భక్తులకు అలర్ట్, నెలరోజుల పాటు తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత, భారీ వర్షాలకు తగ్గిన భక్తుల రద్దీ

Hazarath Reddy

తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్కరిణిని నెలరోజుల పాటు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. పుష్కరిణీలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని తెలిపారు.

Mata Vaishno Devi Yatra: వైష్ణో దేవి మాత ఆలయాన్ని ముంచెత్తిన వరద, కొండచరియలు విరిగిపడే ప్రమాదంతో దర్శనానికి బ్రేక్

Hazarath Reddy

TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, అక్టోబర్‌ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు నేడు విడుదల, ఈనెల 20వ తేదీ వరకు బుకింగ్‌‌కు అవకాశం

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది. అక్టోబర్‌ కోటా టికెట్లను విడుదల చేయనుంది. అక్టోబర్ మాసానికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఈనెల 20వ తేదీ వరకు అవకాశం కల్పించనుంది

Advertisement

Kedarnath Temple: కేదార్‌నాథ్ ఆలయంలో ఇకపై మొబైల్ ఫోన్లు నిషేధం, సంచలన నిర్ణయం తీసుకున్న కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ

Hazarath Reddy

యూట్యూబర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో తన ప్రేమను ప్రపోజ్ చేసిన ఘటన వైరల్ అయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆలయంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఉపక్రమించింది శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ.ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

Lal Darwaza Bonalu: సందడిగా లాల్ దర్వాజ బోనాలు.. సింహవాహిని చెంత శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు.. వీడియోతో

Rudra

శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, డప్పుల వాద్యాలు, నృత్యాలు, ఘటాల ఊరేగింపుతో ఆదివారం హైదరాబాద్‌ పాతబస్తీ బోనమెత్తనుంది. సింహవాహిని ఆలయంలో బోనాల సందడి కొనసాగుతున్నది.

Himachal Floods: వీడియో ఇదిగో, ఆలయంపై నుండి పోటెత్తిన భారీ వరద, తట్టుకుని నిలబడిన సిర్మౌర్‌లోని దేవాలయం

Hazarath Reddy

ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.

TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, రేపు శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ, కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహణ సందర్భంగా నిర్ణయం

Hazarath Reddy

తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara swamy) ఆలయంలో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న శ్రీవారి బ్రేక్ దర్శనాలను (Break Darshan) టీటీడీ (TTD) రద్దు చేసింది. నేడు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని తెలిపింది.

Advertisement

Ujjaini Mahakali Bonalu: అంగరంగ వైభవంగా ప్రారంభమైన లష్కర్‌ బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబం.. వీడియో ఇదిగో

Rudra

ఆషాడమాసంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న సికింద్రాబాద్‌ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి బోనాలు (Ujjaini Mahakali Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Uttarakhand Cloudburst Video: వీడియో ఇదిగో, ఉత్తరాఖండ్‌లో మోకాళ్ల లోతు బురదలో కూరుకుపోయిన యాత్రికులు, విరుచుకుపడిన భారీ వరదలు

Hazarath Reddy

ఉత్తరాఖండ్ క్లౌడ్‌బర్స్ట్ వీడియో: దేవభూమి ఉత్తరాఖండ్​లో వరద బీభత్సం కొనసాగుతోంది. విపరీతమైన వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగి పడటం వల్ల జనజీవనం అస్థవ్యస్తమయ్యింది.తాజాగా ఉత్తరాఖండ్‌లోని ధార్చుల చాల్ గ్రామం నుండి ఈరోజు తెల్లవారుజామున క్లౌడ్‌బర్స్ట్ విరుచుకుపడ్డాయి. వీడియో ఇదిగో..

Amarnath Yatra 2023: తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు, అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.యాత్ర నిలిపివేయబడింది.

Amarnath Yatra: వీడియో ఇదిగో, అమర్‌నాథ్ గుహ మందిరంలో తెల్లవారుజామున హారతి కార్యక్రమం నిర్వహించిన పూజారులు

Hazarath Reddy

జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీ అమర్‌నాథ్ గుహ మందిరంలో ఈరోజు తెల్లవారుజామున హారతి నిర్వహించారు. వీడియో ఇదిగో..

Advertisement

Amarnath Yatra: అమర్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్న 67,566 మంది యాత్రికులు, ఆగస్టు 31తో ముగియనున్న అమర్‌నాథ్ యాత్ర

Hazarath Reddy

జూలై 1న యాత్ర ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 67,566 మంది యాత్రికులు అమర్‌నాథ్ గుహ క్షేత్రాన్ని సందర్శించినట్లు అధికారిక ప్రకటన బుధవారం తెలిపింది. బుధవారం 18,354 మంది యాత్రికులు బాల్టాల్ బేస్ క్యాంప్, నున్వాన్ బేస్ క్యాంప్ నుండి అమర్‌నాథ్ గుహ పుణ్యక్షేత్రానికి బయలుదేరారు

Bhagavad Gita: వీడియో ఇదిగో, అమెరికాలో భ‌గ‌వ‌ద్గీత పారాయాణం చేసిన ప‌ది వేల మంది చిన్నారులు, ఎంతో భ‌క్తితో గీతా స్లోకాల‌ను ఆలపించిన పెద్దలు

Hazarath Reddy

అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో సుమారు ప‌ది వేల మంది భ‌గ‌వ‌ద్గీత పారాయాణం చేశారు. గురుపౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ ఈవెంట్‌ను ఆర్గ‌నైజ్ చేశారు. వేల సంఖ్య‌లో చిన్నారులు గీతా స్లోకాల‌ను వ‌ల్లించారు. చిన్నారుల‌తో పాటు పెద్ద‌లు కూడా ఎంతో భ‌క్తితో గీతా స్లోకాల‌ను ఆల‌పించారు.

Tirumala Update: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. సర్వదర్శనానికి 24 గంటల సమయం.. పూర్తిగా నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల శ్రీవారు స్వయంగా కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వారాంతం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నుంచి ఇక్కడ భారీ రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

TTD UPI Payments: శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ ఆలయాలలో యూపీఐ చెల్లింపులకు ఏర్పాట్లు.. టీటీడీ స్థానిక ఆలయాలతో పాటు ఉపఆలయాల్లో కూడా..

Rudra

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక ఆలయాలతో పాటు ఉప ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు.

Advertisement
Advertisement