Sports

IND vs SL 1st T20I 2022: తొలి టీ20లో దుమ్మురేపిన భారత్, 62 ప‌రుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం, చ‌రిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ, అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో ( IND vs SL 1st T20I 2022) భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన‌ 200 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన లంకేయులు ఏమాత్రం ప్ర‌తిఘ‌టించ‌కుండానే చేతులెత్తేశారు

IPL 2022: మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం, మార్చి 29న ఫైనల్ మ్యాచ్, అధికారికంగా ప్రకటించిన ఐపీఎల్ ఛైర్మెన్ బ్రజేష్ పటేల్

Hazarath Reddy

ఐపీఎల్ 2022 సమరానికి అంతా రెడీ అయింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 29 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మెన్ బ్రజేష్ పటేల్ తెలిపారు.

KL Rahul Donates Rs 31 Lakh: కెఎల్ రాహుల్ గొప్ప మనసు, యువ క్రీడాకారుడిని రక్షించుకునేందుకు రూ. 31 లక్షల విరాళం

Hazarath Reddy

వరద్ గురించి తెలిసిన వెంటనే రాహుల్ బృందం ప్రచారానికి సంబంధించిన సంస్థతో సంప్రదింపులు జరిపింది. వెంటనే రాహుల్ 31 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం బాలుడు ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో హెమటాలజిస్టుల సంరక్షణలో ఉన్నాడు. బాలుడు అరుదైన రక్త రుగ్మత అయిన అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతున్నాడు.

R Praggnanandhaa: ప్రపంచ నంబర్ వన్‌కు షాకిచ్చిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానానంద, ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో ఘన విజయం

Hazarath Reddy

ఆన్‌లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ R ప్రజ్ఞానానంద ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాకిచ్చాడు. కార్ల్‌సెన్ యొక్క మూడు వరుస విజయాల రికార్డును ఆపేశాడు. ప్రగ్నానంద 39 ఎత్తుగడలతో నల్ల పావులతో గెలిచాడు.

Advertisement

India vs West Indies: టీమిండియా హ్యట్రిక్ విన్, దుమ్మురేపిన సూర్యకుమార్-వెంకటేష్ అయ్యర్, విండీష్‌ తో టీ-20 వైట్ వాష్ చేసిన రోహిత్ సేన, చివరి మ్యాచ్‌ లో అద్భుతం చేసిన బౌలర్లు

Naresh. VNS

వెస్టిండిస్‌తో (West Indies) లాస్ట్ టీ-20లో కూడా టీమిండియా దుమ్మురేపింది. వరుసగా మూడో మ్యాచ్ లో కూడా విండీస్ ను చిత్తు చేసింది. 17 పరుగుల తేడాతో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలర్లు అద్భుతం చేశారు. మిడిలార్డర్ బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలర్లు అద్భుతం చేశారు.

Rohit Sharma is New Test Captain: టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ, ఇక అన్ని ఫార్మాట్లకు అతనే సారథి, శ్రీలంకతో సిరీస్ కు టీమ్ ప్రకటించిన బీసీసీఐ, బుమ్రాకు బంపర్ ఆఫర్, టెస్ట్ టీమ్ నుంచి రహానే, పూజారా ఔట్

Naresh. VNS

టీమిండియా టెస్ట్ కెప్టెన్‌ గా (Test captain) రోహిత్ శర్మ (Rohit Sharma) ఫిక్సయ్యాడు. ఇప్పటివరకు వన్డే, టీ-20 కెప్టెన్ గా కొనసాగిన రోహిత్ ను శ్రీలంక సిరీస్ కోసం (Sri Lanka series) టెస్ట్ కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

IPL 2022: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌, పదవికి రాజీనామా చేసిన అసిస్టెంట్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌, కథనాన్ని వెలువరించిన ది ఆస్ట్రేలియన్‌ పత్రిక

Hazarath Reddy

ఐపీఎల్‌-2022 సీజన్‌ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ తన పదవికి రాజీనామా (Simon Katich quits Sunrisers Hyderabad) చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Ravi Bishnoi: భారత్‌కు మరో అద్భుత స్పిన్నర్ దొరికాడు, దుమ్మురేపుతున్న రవి బిష్ణోయ్‌, 24 బంతులు వేస్తే 17 బాల్స్ డాట్‌ బాల్స్‌, 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్న యువబౌలర్

Hazarath Reddy

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో భోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌ ద్వారా లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. టి20 క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా అతను నిలిచాడు. బిష్ణోయ్‌ అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే సూపర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Advertisement

Ind vs WI, 1st T20I 2022: టీమిండియా జోరు, రోహిత్‌ శర్మ దూకుడుతో వెస్టీండీస్ చిత్తు, తొలి టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం

Hazarath Reddy

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో భారత జట్టు దూకుడు ప్రదర్శిస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన.. కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లోనూ జయకేతనం ఎగురవేసింది.

Glenn Maxwell Tamil Wedding Card: తమిళ అమ్మాయితో ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ పెళ్లి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్

Hazarath Reddy

ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ భారతీయ తమిళ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు! కస్తూరి శంకర్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ వార్తను ధృవీకరించారు. విని రామన్‌తో మ్యాక్స్‌వెల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు రాసి ఉన్న ఆహ్వాన కార్డు చిత్రాన్ని కూడా అతను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

IPL 2022 Auction:ఐపీఎల్‌ 2022 జట్ల వివరాలివే! ఏ టీం లో ఎవరున్నారు? ఎంతకు కొన్నారో తెలుసా? 10 ఫ్రాంచైజీలు ఖర్చు చేసింది ఎంతో తెలుసా?

Naresh. VNS

ఐపీఎల్‌-2022 మెగా వేలం (IPL 2022 auction) విజయవంతంగా ముగిసింది. ఈ మెగా వేలంలో మొత్తం 204 మంది ఆట‌గాళ్లు అమ్ముడుపోయారు. ఫ్రాంచైజీలు (franchises) రూ.550 కోట్లు పైగా ఖర్చు చేశాయి. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా ఇషాన్ కిష‌న్ (Ishan kishan) రికార్డు సృష్టించాడు. రూ. 15.25 కోట్ల‌కు కిష‌న్‌ను ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) కొనుగోలు చేసింది.

IPL 2022 Auction: జాక్ పాట్ కొట్టేసిన శ్రీలంక క్రికెట‌ర్ వ‌నిందు హ‌స‌రంగ, రూ. 10.75 కోట్ల‌కు సొంతం చేసుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు

Hazarath Reddy

ఐపీఎల్ 2022 వేలంలో శ్రీలంక క్రికెట‌ర్ వ‌నిందు హ‌స‌రంగ జాక్ పాట్ కొట్టేశాడు. ఆల్‌రౌండ‌ర్ హ‌స‌రంగ‌ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు జ‌ట్టు సొంతం చేసుకున్న‌ది. అత‌న్నిరూ. 10.75 కోట్ల‌కు ఆ టీమ్ ఖ‌రీదు చేసింది. కోటి రూపాయ‌ల క‌నీస ధ‌ర‌తో హ‌స‌రంగ బిడ్డింగ్ జ‌రిగింది.

Advertisement

IPL 2022 Auction: ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇషాన్‌ కిషన్‌, రూ. 15.25 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపాడు. అత్యధికంగా 15. 25 కోట్ల రూపాయలు పలికాడు. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై ఇండియన్స్‌ వేలంలో పోటీ పడి మరీ దక్కించుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢీకొట్టి ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది.

IPL 2022 Auction: నికోలస్ పూరన్‌ను రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసిన హైదరాబాద్, కెకెఆర్ కూడా పోటీ పడినప్పటికీ సన్ రైజర్స్ సొంతం

Hazarath Reddy

నికోలస్ పూరన్‌ను హైదరాబాద్ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఆటగాడి కోసం కెకెఆర్ కూడా పోటీ పడినప్పటికీ సన్ రైజర్స్ సొంతం చేసుకుంది.

IPL 2022 Auction: రూ. 4.6 కోట్లకు అమ్మడుబోయిన మనీష్‌ పాండే, వేలంలో కొనుగోలు చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌, రూ. 6.75 కోట్లకు క్వింటన్‌ డికాక్‌ కొనుగోలు

Hazarath Reddy

ఐపీఎల్ వేలం 2022 ప్రారంభమైంది. మనీష్‌ పాండేను లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 4.6 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. కోటిగా ఉంది. గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన క్వింటన్‌ డికాక్‌ కనీస ధర రూ. 2 కోట్లు. కాగా లక్నో సూపర్‌జెయింట్స్‌ రూ. 6.75 కోట్లకు డికాక్‌కు కొనుగోలు చేసింది.

IPL 2022 Auction: వెస్టిండీస్‌ హిట్టర్‌ షిమ్రోన్‌ హెట్‌మైర్‌కు వేలంలో మంచి ధర, రూ. 8.25 కోట్లకు దక్కించుకున్న రాజస్తాన్‌ రాయల్స్‌

Hazarath Reddy

ఐపీఎల్ వేలం 2022 ప్రారంభమైంది. వెస్టిండీస్‌ హిట్టర్‌ షిమ్రోన్‌ హెట్‌మైర్‌కు వేలంలో మంచి ధరే దక్కింది. అతని కనీస ధర రూ. 1.50 కోట్లు కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ పోటీపడ్డాయి. చివరకు రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 8.25 కోట్లకు హెట్‌మైర్‌ను దక్కించుకుంది.

Advertisement

IPL 2022 Mega Auction: సరోజినీ నగర్ మార్కెట్లో ఢిల్లీ కేపిటల్స్ బార్ గెయిన్, డేవిడ్ వార్నర్‌ విలువపై సంచలన ట్వీట్ సంధించిన మాజీ క్రికెటర్ వసీం జాఫర్

Hazarath Reddy

శనివారం బెంగళూరులో జరుగుతున్న IPL 2022 మెగా పబ్లిక్ సేల్‌లో డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. DC అనుచరులు సోషల్ మీడియాలో వార్నర్ రాకను స్వాగతిస్తుండగా, మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

IPL 2022 Mega Auction: వేలంలో డేవిడ్‌ వార్నర్‌‌కి ఘోర అవమానం, భారీ ధరకు పోతాడని భావిస్తే.. రూ. 6.25 కోట్లకు ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు

Hazarath Reddy

భారీ ధరకు అమ్ముడుపోతాడని భావించిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు(Delhi Capitals Squad for IPL 2022) అమ్ముడుపోయాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. అయితే వార్నర్‌ ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోతాడని ఎవరు ఊహించలేదు

IPL 2022 Auction: జేసన్‌ రాయ్‌ను రూ. 2 కోట్లకు దక్కించుకున్న గుజరాత్‌ టైటాన్స్‌, రూ. 2 కోట్లకు సీఎస్‌కే కు అమ్ముడుపోయిన టీమిండియా సీనియర్‌ ఆటగాడు రాబిన్‌ ఊతప్ప

Hazarath Reddy

ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో ఇంగ్లండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 2 కోట్ల కనీస ధరకు దక్కించుకుంది. ఇక టీమిండియా సీనియర్‌ ఆటగాడు రాబిన్‌ ఊతప్పను కనీస ధర రూ. 2 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది.

Hugh Edmeades Health Update: వేలంలో షాక్.. కళ్లు తిరిగిపడిపోయిన ఆక్షనీర్‌ ఎడ్మెడేస్, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన బీసీసీఐ, మధ్యాహ్నం మూడున్నర గంటలకు వేలం ప్రారంభం

Hazarath Reddy

ఐపీఎల్ వేలం జరుగుతుండగా వేలం నిర్వహించే అధికారి Hugh Edmeades కళ్లు తిరిగి కిందపడిపోయిన సంగతి విదితమే. ప్రస్తుతానికి అతనికి ఏమి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని బిడ్డింగ్ రూ. 3.30కు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.

Advertisement
Advertisement