Sports
Cristiano Ronaldo: మళ్లీ తండ్రి కాబోతున్న క్రిస్టియానో రొనాల్డో, ఈ సారి ట్విన్స్‌కి జన్మనివ్వనున్న గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్
Hazarath Reddyపోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మళ్లీ తండ్రి కాబోతున్నాడు, గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్ గర్భవతి అయింది. ఈ సారి ట్విన్స్ కు ఆమె జన్మినవ్వనుంది. ఈ విషయాన్ని మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ ఓ ప్రకటనలో తెలిపారు.
T20 World Cup 2021: టి20 ప్రపంచ కప్ సాధించేది ఇండియానే, అభిమాని ప్రశ్నకు అదిరిపోయే రిప్లయి ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్, అక్టోబర్ 31 న న్యూజీలాండ్‌తో తలపడనున్న భారత్
Hazarath Reddyటి20 ప్రపంచకప్‌ 2021 వేట మొదలై అప్పుడే 10 రోజులు దాటిపోయింది. ఈ పది రోజుల్లోమొత్తం 19 మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటివరకు నాలుగు జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. వాటిలో పపువా న్యూ గినియా, ఒమన్‌, నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌ ఉన్నాయి.
T20 World Cup 2021: వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లండ్, 8 వికెట్ల తేడాతో బంగ్లా చిత్తు, సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడిన జేసన్ రాయ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు
Hazarath Reddyటీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (T20 World Cup 2021) ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు బంపర్ విక్టరీ నమోదు చేసింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాను (England Register Consecutive Wins) మట్టికరిపించింది.
T20 World Cup 2021: టీ-20 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్‌పై నమీబియా ఘనవిజయం, 4 వికెట్ల తేడాతో గెలుపొందిన నమీబియా
V. Nareshటీ-20 వరల్డ్‌ కప్(T-20 World Cup)లో సంచలన విజయాన్ని నమోదు చేసింది నమీబియా. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై నమీబియా విజయం సాధించింది. స్కాట్లాండ్ నిర్దేశించిన 109 ప‌రుగుల‌ స్వల్ప ల‌క్ష్యాన్ని 5 బంతులు మిగిలి ఉండ‌గానే చేధించింది.
T20 World Cup 2021: భారత్ సెమీస్‌కు చేరాలంటే దారి ఇదే, అక్టోబర్ 31 న్యూజిలాండ్‌‌తో చావో రేవో తేల్చుకోనున్న కోహ్లీ సేన, గెలిచిన జట్టుకు సెమీ ఫైనల్ బెర్తు దాదాపు ఖాయమైనట్లే..
Hazarath Reddyఈనెల 31న జరిగే మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌పై (India vs New Zealand) తప్పక గెలవాలి. అప్పుడు భారత్‌ 8, పాక్‌ 10 పాయింట్లతో సెమీస్ కు చేరుతాయి. కివీస్‌ 6 పాయింట్లతో ఇంటికి వెళ్తుంది. ఒకవేళ భారత జట్టు కివీస్‌ చేతిలో ఓడితే.. పాక్‌ 10, కివీస్‌ 8 పాయింట్లతో సెమీస్ కు చేరుతాయి.
T20 World Cup 2021: పాకిస్తాన్ సెమీస్‌ బెర్త్ దాదాపు ఖాయం, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం, కివీస్ బ్యాట్స్‌మన్లను ముప్పతిప్పలు పెట్టిన హారిస్‌ రవూఫ్‌
Hazarath Reddyదాయాది దేశం పాకిస్తాన్ టి20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. షార్జాలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో (T20 World Cup 2021) బాబర్‌ ఆజమ్‌ బృందం ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఇక సెమిస్ కు చాలా దగ్గరగా వెళ్లింది.
T20 Worldcup 2021: South Africa Vs West Indies మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం, ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన విండీస్
KrishnaT20 Worldcup 2021లో వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచు ఎలాంటి మెరుపులు లేకుండా సాదాసీదాగా ముగిసింది. ఉత్కంఠ భరితంగా జరగాల్సిన టీ 20 సిరీస్ పోరులో ఇప్పటి వరకూ సరైన వేడి అందుకోలేదు. తాజాగా నేడు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
IND vs PAK Stat Highlights: టీ20 ప్రపంచకప్‌ను ఓటమితో ఆరంభించిన కోహ్లీ‌సేన, వికెట్ పడకుండానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకున్న పాక్, ప్రపంచకప్‌ చరిత్రలో దాయాది దేశానికి భారత్‌పై 10 వికెట్ల తేడాతో తొలి విజయం
Hazarath Reddyటీ20 ప్రపంచక్‌పను టీమిండియా ఓటమితో ఆరంభించింది. తొలి పోరు పాకిస్థాన్‌తో కావడంతో (IND vs PAK Stat Highlights) ఈ మ్యాచ్‌కు ఎక్కడలేని క్రేజ్‌ ఏర్పడింది. ఆ అంచనాలను కోహ్లీ సేన ఏమాత్రం అందుకోలేకపోయింది. అటు ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఎదురైన ఐదు ఓటములకు పాక్‌ పది వికెట్ల తేడాతో గెలిచి (Pakistan Register First Win Over India At Twenty-20 WC) ప్రతీకారం తీర్చుకుంది.
Tamil Nadu: దర్శకుడు శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు, రోహిత్‌తో పాటు మరో 5 మందిని అరెస్ట్ చేసిన పుదుచ్చేరి పోలీసులు
Hazarath Reddyప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ అల్లుడు, క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌పై లైంగిక వేధింపుల కేసు (Director Shankar's son-in-law booked under POCSO) నమోదైంది. అత‌నితోపాటు మ‌రో ఐదుగురిని మంగ‌ళ‌వారం పుదుచ్చెరిలో అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల అమ్మాయిని (sexually harassing 16-year-old girl) లైంగికంగా వేధించార‌న్న ఆరోప‌ణ‌లు వీళ్ల‌పై ఉన్నాయి.
ICC T20 World Cup 2021: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో విజయంతో ప్రస్థానం ప్రారంభించిన ఐర్లాండ్, నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపు
Hazarath Reddyఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ విజయంతో ప్రస్థానం ప్రారంభించింది. ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. 107 పరుగుల విజయలక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ఛేదించింది.
T20 World Cup 2021: ఉగ్రవాదుల కాల్పుల్లో మనోళ్లు చస్తుంటే వారితో మ్యాచ్‌లా, భారత్, పాక్ మధ్య టీ 20 మ్యాచ్‌పై మరోసారి ఆలోచన చేయాలని కోరిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌
Hazarath Reddyదేశ సరిహద్దులో ఉద్రిక్తతలు రేగుతున్న నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య ఈ నెల 24న దుబాయ్‌లో జరుగనున్న టీ20 వరల్డ్‌ కప్ మ్యాచ్‌పై (India-Pak T20 World Cup Match) పునరాలోచించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ కోరారు.
Yuvraj Singh Arrested: యజువేంద్ర చహల్‌ కులంపై అనుచిత వ్యాఖ్యలు, యువరాజ్‌ సింగ్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు, వెంటనే బెయిల్‌పై విడుదల
Hazarath Reddyటీమిండియా క్రికెటర్‌ యజువేంద్ర చహల్‌ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను హర్యానా పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. అనంతరం కొద్దిసేపటికే యువీని బెయిల్‌పై విడుదల చేశారు.
Scotland Beat Bangladesh by 6 Runs: బంగ్లాకు భారీ షాక్, టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన స్కాట్లాండ్‌
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో బంగ్లాదేశ్‌కు షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ సంచలన విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందింది.
T20 World Cup 2021: టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో 10 వికెట్ల తేడాతో ఒమన్‌ ఘన విజయం, మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియా ఓటమి
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలోని ఆరంభ మ్యాచ్‌లో ఒమన్‌ విజయం సాధించింది. మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అకిబ్‌ ఇలియాస్‌ (50), జితేందర్‌ సింగ్‌(73) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు.
Team India New Jersey: భారత్ జట్టుకు కొత్త జెర్సీలు, టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు న్యూ జెర్సీలతో ఆడనున్న టీం ఇండియా, ఈ నెల 17న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం
Hazarath Reddyటీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీలు వచ్చాయి. బ్లూ కలర్ లోనే కొత్త డిజైన్ తో జెర్సీలను రూపొందించారు. అభిమానుల ఆకాంక్షలకు ప్రతిరూపాలు పేరిట ఈ జెర్సీలను రూపొందించినట్టు బీసీసీఐ పేర్కొంది. వీటిని బిలియన్ చీర్స్ జెర్సీలుగా బోర్డు అభివర్ణించింది.
IPL 2021: చెత్త వ్యాఖ్యలు చేయకండి..మేము మనుషులమే, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శలపై కౌంటర్ విసిరిన రాయల్‌ చాలెంజర్స్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌
Hazarath Reddyకొంతమంది సోషల్‌ మీడియా వేదికగా చెత్తగా వాగుతున్నారు. మేమూ మనుషులమే. ప్రతిరోజు మా అత్యుత్తమ స్థాయి కనబరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. అసభ్యంగా ప్రవర్తించే బదులు కొంచెం డీసెంట్‌గా ఉండేందుకు ప్రయత్నించండి’’ అంటూ రాయల్‌ చాలెంజర్స్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సీరియస్‌ అయ్యాడు
IPL 2021: ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లీ, డివిలియర్స్, చివరి వరకు ఆర్సీబీలోనే ఉంటానని స్పష్టం చేసిన విరాట్, కెప్టెన్‌గా ఇదే చివరి సీజన్‌ అని ఇప్పటికే ప్రకటన
Hazarath Reddyఐపిఎల్ 2021 ఎలిమినేటర్‌లో కెసిఆర్‌పై ఆర్‌సిబి ఓటమి తరువాత విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ కన్నీళ్లు (Virat Kohli, AB de Villiers In Tears) పెట్టుకున్నారు. ఈ ఓటమి అంటే, తొలి ఐపిఎల్ టైటిల్ కోసం వారి అన్వేషణ కొనసాగుతున్నందున ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా కోహ్లీ తన చివరి ఆట ఆడాడు.
RCB vs KKR Highlights: కోహ్లీ సేనను ఇంటికి సాగనంపిన నరైన్, బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో కోల్‌కతా ఘన విజయం, ఫైనల్ బెర్తు కోసం ఢిల్లీతో తలపడనున్న మోర్గాన్‌ సేన
Hazarath Reddyఐపీఎల్‌ తాజా సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కథ ముగిసింది. విరాట్‌ కోహ్లీ చివరి కెప్టెన్సీలోనూ ఈ జట్టు రాత మారలేదు. ఆరంభ మ్యాచ్‌ల్లో చూపిన జోరును అత్యంత కీలకమైన మ్యాచ్‌లో (RCB vs KKR Highlights) పునరావృతం చేయలేకపోయింది.
ICC T20 World Cup 2021 Prize Money: టీ20 వరల్డ్‌కప్ 2021 విన్నర్‌కు రూ.12.02 కోట్లు, ర‌న్న‌ర‌ప్‌కు రూ.6 కోట్లు, లీగ్ మ్యాచ్ గెలిచే టీమ్‌కు రూ.30 లక్షలు, ప్రైజ్‌మ‌నీని ప్రకటించిన ఐసీసీ
Hazarath Reddyయూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్( T20 World Cup) విజేత‌, ర‌న్న‌ర‌ప్ టీమ్స్‌కు ఇచ్చే ప్రైజ్‌మ‌నీని (ICC T20 World Cup 2021 Prize Money)ఆదివారం ప్ర‌క‌టించింది ఐసీసీ.
Ramiz Raja: ప్రధాని మోదీ తలుచుకుంటే పాక్ క్రికెట్ బోర్డు ఉండదు, బీసీసీఐ, ఐసీసీ నుంచి నిధులు ఆపేస్తే పీసీబీ కుప్పకూలుతుంది, సంచలన వ్యాఖ్యలు చేసిన రమీజ్ రాజా
Hazarath Reddyపాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ మాజీ క్రికెటర్ పీసీబీ నిధుల (Pakistan Cricket Board Funds) గురించి మాట్లాడుతూ.. ఇండియా, ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీసీఐ తమ దేశ క్రికెట్ బోర్డుపై గట్టి పట్టు సాధిస్తున్నాయని అన్నాడు.