Cricket
IPL 2022 CSK vs KKR: ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టిన కోల్‌కతా, ధోనీ పోరాడినా కూడా చెన్నైకి దక్కని విజయం, దుమ్మురేపిన కోల్‌కతా బౌలర్లు
Naresh. VNSముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 15వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై (CSK) 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 132 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్.. 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోల్ కతా బ్యాటర్లలో ఓపెనర్ రహానె 44(Rahane) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
IPL 2022: ఐపీఎల్ తొలి పోరు నేడే, వాఖండే స్టేడియంలో రాత్రి 7. 30 నుంచి తలపడనున్న చెన్నై, కోలకతా, మూడు వేదికలు.. పది జట్లు, 65 రోజులు.. 74 మ్యాచ్‌లతో ఈ ఏడాది ఐపీఎల్
Hazarath Reddyక్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. కరోనా కారణంగా గత రెండేండ్లుగా సగం మ్యాచ్ (IPL 2022) యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ ఈ సారి సొంత ప్రేక్షకుల మధ్య జరుగనుంది.
IPL 2022: ధోనీ అభిమానులకు షాక్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుండి వైదొలిగిన ఎంఎస్ ధోనీ, కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా
Hazarath ReddyIPL 2022కి ముందు MS ధోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. రవీంద్ర జడేజా ఈ సీజన్ నుండి జట్టుకు కొత్త నాయకుడిగా ప్రకటించబడ్డాడు. "ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వాన్ని మరొకరికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు.
ICC Women’s World Cup 2022: సెమీస్ ఆశలు సజీవం, 110 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌‌ను చిత్తు చేసిన భారత్ మహిళా జట్టు
Hazarath Reddyఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు దుమ్మురేపింది. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Womens World Cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి పాలైన భారత్
Hazarath Reddyప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు చుక్కెదురైంది. వెస్టిండీస్‌పై ఘన విజయంతో జోరు మీద కనిపించిన మిథాలీరాజ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా.. ఇంగ్లండ్‌ ముందు కుదేలైంది. బ్యాటర్లు ఘోరంగా విఫలమైన పోరులో భారత్‌ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
David Warner: డేవిడ్ వార్నర్‌ వీడియోపై భార్య కాండీస్‌ సెటైర్, ఇలాంటి పనులు మన ఇంటిలో కూడా చేయవచ్చు కదా అని ట్వీట్, వైరల్ అవుతున్న వార్నర్ వీడియో
Hazarath Reddyవార్నర్‌ వీడియోపై అతని భార్య కాండీస్‌ స్పందించింది. '' ఇలాంటి పనిని మన ఇంటి పరిసరాల్లో కాస్త ఎక్కువగా చేస్తావని ఆశిస్తున్నా'' అంటూ ఫన్నీగా ట్వీట్‌ చేశారు.
IPL 2022: ఆర్సీబీకి కొత్త కెప్టెన్, దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు
Hazarath Reddyరాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు బెంగళూరులో నిర్వహించిన "ఆర్సీబీ ఆన్‌బాక్స్‌" ఈవెంట్‌లోఈ విషయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ వెల్లడించింది.
IPL vs PSL: రూ. 16 కోట్లకు మీ పాకిస్తాన్‌లో ఏ ఆటగాడినైనా కొంటారా, రమీజ్ రాజా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా
Hazarath Reddyఐపీఎల్ కు దీటుగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను తీర్చిదిద్దుతామని, వచ్చే ఏడాది నుంచి తాము సైతం ఆటగాళ్ల వేలం నిర్వహించాలని అనుకుంటున్నట్టు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా (Ramiz Raja) చేసిన ప్రకటనపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) స్పందించాడు.
Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్, ఫిట్‌ నెస్‌ టెస్టులో పృథ్వీ షా విఫలం, కనీస స్కోరును అందుకోలేక చేతులెత్తేసిన షా, అయినా ఫర్వాలేదంటున్న టీం
Naresh. VNSఐపీఎల్‌కుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ తగిలింది. ఆ టీంలో కీలక ఆటగాడిగా ఉన్న పృధ్వీ షా ఫిట్ నెస్ టెస్టులో విఫలమయ్యాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ క్యాంపులో ఐపీఎల్‌ ఆటగాళ్లకు నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్ష వివరాలను ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరీక్షల్లో గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్య పాస్‌ కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక ఆటగాడు పృథ్వీ షా విఫలమయ్యాడు.
Ravichandran Ashwin: రవి చంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు
Hazarath Reddyటీమిండియా స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్‌లో వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్లు పడగొట్టడంతో అశ్విన్‌ ఈ ఘనతను సాధించాడు.
India vs Sri Lanka 2nd Test: కపిల్‌దేవ్ సరసన పంత్, పింక్ బాల్ టెస్ట్‌ లో అద్భుతం చేసిన రిషబ్, శ్రీలంకకు ముచ్చెముటలు పట్టిస్తున్న టీమిండియా, రెండోరోజు ఫర్మామెన్స్ ఇరగదీసిన బ్యాట్స్ మెన్
Naresh. VNSబెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 303/9 దగ్గర డిక్లేర్ చేసింది. శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ఇవాళ ఆట ఆరంభంలోనే శ్రీలంకను తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే పరిమితం చేసిన రోహిత్ సేన… ఆపై రెండో ఇన్నింగ్స్ ను ఉత్సాహంగా ఆరంభించింది. రిషబ్ పంత్ దూకుడుగా ఆడాడు
RCB's New Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా? కోహ్లీ స్థానంలో కెప్టెన్ గా డుప్లిసెస్, సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ కు దక్కిన కెప్టెన్సీ పగ్గాలు
Naresh. VNSఆర్సీబీ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేడయంతో అతడి స్థానంలో ఎవరూ ఆర్సీబీ కెప్టెన్‌గా వస్తారనేది సస్పెన్స్ నడిచింది. కోహ్లీ తర్వాత కెప్టెన్ రేసులో కొందరి పేర్లు వినిపించాయి. అయినప్పటికీ ఆర్జీబీ ప్రాంఛైజీ రివీల్ చేయలేదు. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరదించుతూ కోహ్లీ స్థానంలో ఆర్సీబీ కెప్టెన్ ఎవరు అనేది ఆ జట్టు ఫ్రాంచైజీ ప్రకటించింది.
Warne's Body Arrives in Melbourne: ఆస్ట్రేలియాకు చేరుకున్న షేన్‌వార్న్‌ మృతదేహం, ఈనెల 30న మెల్‌బోర్న్‌ స్టేడియంలో వార్న్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక నివాళి కార్యక్రమం
Hazarath Reddyఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ మృతదేహం ఆస్ట్రేలియా చేరింది. గుండెపోటుతో గత శుక్రవారం థాయ్‌లాండ్‌లో వార్న్‌ (52) మరణించిన సంగతి తెలిసిందే. బ్యాంకాక్‌ నుంచి వార్న్‌ మృతదేహంతో గురువారం ఉదయం బయలుదేరిన ప్రైవేట్‌ విమానం రాత్రి 8.30కి మెల్‌బోర్న్‌ చేరుకుంది
ICC Women’s World Cup 2022: న్యూజిలాండ్‌ చేతిలో చిత్తయిన భారత్, ప్రపంచ కప్ మెగాటోర్నీలో ఐదో స్థానానికి పడిపోయిన భారత మహిళా క్రికెట్ జట్టు
Hazarath Reddyమహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఘనంగా బోణీ కొట్టిన భారత జట్టుకు.. రెండో మ్యాచ్‌లో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో (ICC Women’s World Cup 2022) మిథాలీ బృందం 62 పరుగుల తేడాతో (India Surrender to New Zealand by 62 Runs) న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలైంది.
Sreesanth: అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం
Hazarath Reddyటీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా శ్రీశాంత్ స్పందిస్తూ... యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు క్రికెట్ కు ముగింపు పలుకుతున్నానని చెప్పాడు.
Sreesanth Announces Retirement : రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్, రానున్న తరాల కోసమే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ మెంట్, భావోద్వేగానికి లోనైన శ్రీశాంత్
Naresh. VNSమిండియా వెటరన్ పేస్ బౌలర్ శ్రీశాంత్ (Sreesanth) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. నెక్స్ట్ జనరేషన్ కోసం కెరీర్ ను (Retirement) ముగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. అన్ని రకాల పోటీల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటన చేశాడు. తర్వాతి తరం క్రికెటర్ల కోసం తాను ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ ను (Indian Domestic Cricket) ముగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Joe Root: ఎలా బౌల్ట్ అయ్యాను..షాక్ తిన్న జో రూట్, బాల్ వేగాన్ని అంచ‌నా వేయ‌కుండా బ్యాట్‌ను పైకి లేపిన ఇంగ్లండ్ ఆటగాడు, వికెట్లను ముద్దాడిన బంతి
Hazarath Reddyవెస్టిండీస్‌-ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు మ్యాచు జ‌రుగుతోంది. ఈ మ్యాచులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్ ఊహించ‌ని రీతిలో ఔట‌య్యాడు. బాల్ వేగాన్ని అంచ‌నా వేయ‌కుండా బ్యాట్‌ను ఆయ‌న‌ పైకి లేపగా, ఆ బాల్ బ్యాట్ కింది నుంచి వెళ్లి వికెట్ల‌కు త‌గిలింది.
BCCI Announces IPL 2022 Schedule: మార్చి 26 నుంచి క్రికెట్ ప్రేమికుల పండగ IPL 2022 సీజన్ ప్రారంభం, పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...
Krishnaఐపీఎల్ 2022 టోర్నీ పూర్తి షెడ్యూల్ ను ప్రకటించింది బీసీసీఐ పాలకమండలి. దాని ప్రకారం మార్చి 26వ తేదీన ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ సీజన్ 15లో ఫస్ట్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ - రన్నరప్ కోల్ కలతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది.
ICC Women’s World Cup India vs Pakistan: మహిళా క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం, 107 పరుగుల తేడాతో భారత్ విజయం
Krishnaప్రపంచ కప్ వన్డే మహిళల క్రికెట్ లో భారత జట్టు పాకిస్థాన్ పై (India Vs Pakistan)అఖండ విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది.
India vs Sri Lanka,1st Test, Day 3: జడేజా మాయాజాలం, భారీ ఆధిక్యంలో భారత్, ఫస్ట్ ఇన్నింగ్స్ లో శ్రీలంక 174 పరుగులకు ఆలౌట్, 400 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
Naresh. VNSరవీంద్ర జడేజా (Ravindra Jadeja ) అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చి శ్రీలంక నడ్డి విరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిశాంక 61 (Nishanka) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ నిశాంక (26), అసలంక (1) ఆటను ఆరంభించారు. వీరిద్దరూ జాగ్రత్త పడుతూ ఆడారు.