Cricket

Best XI of T20 World Cup 2021: భారత్‌లో బెస్ట్ క్రికెట్ ఆటగాడు లేడా, టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ టీంలో ఇండియా ప్లేయర్లకు దక్కని చోటు, బాబర్‌ అజాం కెప్టెన్‌గా 11 మందిని ఎంపిక చేసిన సెలక్షన్ ప్యానెల్‌

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2021లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా తొలిసారిగా టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐసీసీ 11 మంది ఆటగాళ్లతో కూడిన టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను (Best XI of T20 World Cup 2021) ప్రకటించింది.

T20 WC 2021 Final: షూలో బీర్ పోసుకుని తాగిన ఆస్ట్రేలియా క్రికెటర్లు, వీడియో వైరల్, దీని వెనుక పెద్ద కథే ఉంది మరి, అదేంటో ఓ సారి చూద్దామా

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌ను తొలిసారి అందుకొన్న ఆస్ట్రేలియా టీం సంబరాలు చేసుకున్నారు. విజయోత్సవాల్లో భాగంగా తమ బూట్లను విడిచి వాటిల్లో డ్రింక్స్‌ పోసుకోని (Australian Cricketers drink from shoe) తాగారు. తద్వారా ఆస్ట్రేలియాకు చెందిన పాత ఆచారాన్ని క్రికెట్‌ అభిమానులకు పరిచయం చేశారు. దీన్నే వారు షూయి అని పిలుస్తారు.

T20 WC 2021 Final AUS vs NZ: T20 విశ్వవిజేతగా ఆస్ట్రేలియా, ఫైనల్‌లో కివీస్ చిత్తు, బ్రేకుల్లేని బుల్‌డోజర్‌లా రెచ్చిపోయిన వార్నర్, మార్ష్..

Krishna

ప్రపంచానికి కొత్త టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ లభించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్‌ను గెలుచుకుంది. ఈ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి ప్రపంచకప్.

T20 World Cup: పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్‌కు చికిత్స అందించిన భారతీయ డాక్టర్, సెమీఫైనల్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రిజ్వాన్..

Krishna

రిజ్వాన్ తీవ్రమైన చాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఐసీయూలో చికిత్స పొంది, మళ్లీ బ్యాటు పట్టుకొని మైదానంలో దిగడమే కాదు ఆస్ట్రేలియాపై అర్థశతకం బాది తన సత్తా చాటాడు. అయితే రిజ్వాన్ ఇంత త్వరగా కోలుకోవడం వెనుక ఓ భారత వైద్యుడి సాయం ఉందని తేలింది.

Advertisement

T20 World Cup 2021: మా ఓటమికి కారణం అతనొక్కడే కాదు, అయితే ఆ క్యాచ్‌ వదిలేయడమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది, డ్రెస్సింగ్ రూంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం

Hazarath Reddy

పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో (T20 World Cup 2021) పాక్ ఫీల్డర్ హసన్ అలీ వదిలేసిన క్యాచ్ తో మ్యాచ్ స్వరూపమే మారిపోయిన సంగతి విదితమే. అప్పటిదాకా పాక్ వాకిట్లోనే ఉన్న విజయం కాస్తా.. ఆ వదిలేసిన క్యాచ్ తో ఆస్ట్రేలియా గుమ్మం తొక్కింది.

David Warner Six Video: పాక్ కొంప ముంచింది ఇదే.. డేవిడ్ వార్న‌ర్ గమ్మత్తైన సిక్స్ వీడియో, హ‌ఫీజ్ వేసిన డెడ్ బాల్‌ని ఊచకోత కోసిన ఆస్ట్రేలియా ఆటగాడు

Hazarath Reddy

ఇన్నింగ్స్‌లో 8వ ఓవ‌ర్ వేసిన హ‌ఫీజ్ త‌న తొలి బంతిని వార్న‌ర్‌కు బౌల్ చేశాడు. అయితే ఆ బంతి కాస్త పిచ్‌పై రెండు సార్లు బౌన్స్ అయ్యింది. భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వ‌చ్చిన వార్న‌ర్‌.. రెండు సార్లు బౌన్స్ అయిన ఆ బంతిని భారీ షాట్‌తో సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఆ బాల్‌ను అంపైర్ నోబాల్‌గా ప్ర‌క‌టించారు. దీంతో పాకిస్థాన్‌కు మ‌రింత క‌ష్టాలు ఎదుర‌య్యాయి. వార్నర్ ఆ తరువాత నుంచి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

Mohammad Rizwan: రెండు రోజుల కిందట ఐసీయూలో రిజ్వాన్, అయినా ఆస్ట్రేలియాపై 67 పరుగులు కొట్టాడు, అతని డెడికేష‌న్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్న క్రికెట్ అభిమానులు

Hazarath Reddy

మ్యాచ్ కి రెండ్రోజుల ముందు రిజ్వాన్ .. ఛాతీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కార‌ణంగా ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యాడు. రెండు రాత్రులు ఐసీయూలోనే (After Spending Two Nights in ICU) ఉన్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు కోలుకున్నాడు. అతని (Pakistan's Mohammad Rizwan) ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడటంతో మ్యాచ్‌కు దూరంగా ఉండమని సూచించినప్పటికీ రిజ్వాన్ తాను ఈ కీలక మ్యాచ్‌లో ఆడి తీరతాన‌ని ప‌ట్టుబట్టాడ‌ట‌.

T20 World Cup 2021: టీ-20 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా, దుమ్మురేపిన వేడ్, స్టోయినిస్, ఫైనల్‌లో న్యూజిల్యాండ్‌తో అమీతుమీకి రెడీ

Naresh. VNS

టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు షాక్ ఇస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది ఆస్ట్రేలియా. పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆస్ట్రేలియా ఒక దశలో 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్నట్లు కనిపించింది.

Advertisement

IND vs NZ Test Series: న్యూజిలాండ్ టూర్‌లో టెస్టు టీం కెప్టెన్‌గా అజింక్యా రహానే, కోహ్లీని పక్కన పెట్టేసిన బీసీసీఐ,

Krishna

న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టును త్వరలో ప్రకటించనుంది. తొలి టెస్టులో భారత జట్టుకు అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

T20 World Cup 2021: వాళ్లు కొట్టినట్లు మేము సిక్సులు కొట్టలేకపోయాం, అందుకే ఈ ఓటమి, న్యూజిలాండ్‌ జట్టు మా కన్నా నిలకడగా, ఉత్తమంగా ఆడిందని తెలిపిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్

Hazarath Reddy

ఈ ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్.."ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే మాకు తెలుసు ప్రత్యర్ధి జట్టు అన్ని విధాలుగా పటిష్టంగా ఉందని.. ఈ మ్యాచ్‌లో పూర్తి క్రెడిట్ న్యూజిలాండ్‌ జట్టుకే ఇవ్వాలి.ఎందుకంటే వాళ్లు మా జట్టుకన్నా బాగా ఆడారు. కివీస్‌ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు.

T20 World Cup: సెమీస్‌కు ముందే పాకిస్తాన్‌కు భారీ షాక్, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్న షోయబ్ మాలిక్, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, ఇద్దరికీ విశ్రాంతి అవసరమని సూచించిన వైద్యులు

Hazarath Reddy

ఫ్లూ కారణంగా షోయబ్ మాలిక్, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (Pakistan Players Mohammad Rizwan, Shoaib Malik) ఇద్దరూ నిన్న జరిగిన ప్రాక్టీస్ కు దూరమయ్యారు. వారికి నిర్వహించిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ అని తేలింది. అయినప్పటికీ ఇద్దరికీ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

T20 World Cup: టీ-20 వరల్డ్ కప్‌ ఫైనల్స్‌కు న్యూజిల్యాండ్, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై సూపర్ విక్టరీ, కివీస్‌ను ఆదుకున్న మిచెల్‌, నీషమ్‌

Naresh. VNS

టీ-20 వరల్డ్ కప్‌ సెమీస్‌లో సూపర్‌ విక్టరీ కొట్టింది కివీస్. ఆరంభంతో తడబడ్డ న్యూజిల్యాండ్ బ్యాట్స్‌మెన్ అనూహ్యంగా పుంజుకొని ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. మిచెల్‌, నీషమ్ విరుచుకుపడంతో ఇంగ్లండ్ పెట్టిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలిగింది.

Advertisement

Mumbai: మీ కూతురుపై అత్యాచారం చేస్తామంటూ ప్రముఖ క్రికెటర్‌కు బెదిరింపులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు, హైదరాబాద్‌కు చెందిన రామ్‌నగేష్‌ ఈ బెదిరింపులకు పాల్పడ్డాడని గుర్తించిన సైబర్‌ క్రైమ్‌

Hazarath Reddy

ప్రముఖ భారత క్రికెటర్ పై బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అనంతరం.. టీమిండియా ప్లేయర్ ని టార్గెట్‌ చేస్తూ.. ఆయన కూతురుపై అత్యాచారం పేరుతో సోషల్‌ మీడియాలో కొందరు దుండగులు అసభ్యకర పోస్టులు చేశారు.

Kohli Emotional Message: విరాట్ కోహ్లీ ఎమోషనల్ మెసెజ్, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన పరుగుల వీరుడు, పుంజుకుని మరింత బలంగా మళ్లీ మీ ముందుకు వస్తామంటూ ట్వీట్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్‌లోనే నిష్క్రమించండం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. నమీబియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత జట్టు విజయంతో టోర్నీని ముగించింది. మ్యాచ్ అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో టోర్నీ ఫొటోలను పోస్టు చేసిన కోహ్లీ అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని (Kohli Emotional Message) ఇచ్చాడు.

IND vs NZ Series: భారత్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్, న్యూజిలాండ్‌ సిరీస్‌‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రోహిత్‌ శర్మ, నవంబర్‌ 17 నుంచి ప్రారంభమయ్యే సీరిస్‌లో ఆడే టీమిండియా ఆటగాళ్ల లిస్ట్ ఇదే..

Hazarath Reddy

టీ20 ప్రపంచక కప్ రేసు నుంచి ఇండియా వెనుదిరిగిన తర్వాత నవంబర్‌ 17 నుంచి న్యూజిలాండ్‌ సిరీస్‌తో ( IND vs NZ Series) బిజీ కానుంది. కివీస్‌తో మొదట మూడు టి20లు ఆడనున్న టీమిండియా తర్వాత రెండు టెస్టులు ఆడనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ బుధవారం టి20, టెస్టు జట్టును ప్రకటించింది

T20 World Cup: నమీబియాపై విజయంతో ఇంటి బాట పట్టిన టీమిండియా, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ, విజయంతో ముగిసిన కోహ్లీ శకం..

Swechha

టీ20 ప్రపంచకప్-2021 నుంచి భారత జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. సోమవారం జరిగిన సూపర్-12 దశలో తమ చివరి మ్యాచ్‌లో నమీబియా (IND vs NAM)ని 9 వికెట్ల తేడాతో ఓడించింది.

Advertisement

Kapil Dev: మన ఆటగాళ్లకు దేశం కంటే డబ్బే ముఖ్యం, అందుకే టీ20 ప్రపంచకప్ ఓటమి, తీవ్ర వ్యాఖ్యలు చేసిన కపిల్ దేవ్, ఐపీఎల్ ప్రాంచైజీల కోసం భారత క్రికెట్‌ను పణంగా పెట్టవద్దని కోరిన మాజీ కెప్టెన్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్ లో సెమీస్ చేరకుండానే టీమిండియా అవమానకరమైన రీతిలో ఇంటిముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై (Former India captain Kapil Dev slams players) క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

T20 World Cup 2021: ఆప్గనిస్తాన్ మీదనే భారత్ సెమీస్ ఆశలు, ఆదివారం న్యూజిల్యాండ్- ఆప్గనిస్తాన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్

Naresh. VNS

టీ20 ప్రపంచకప్లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఇప్పుడు భారత్ సెమీస్ వెళ్తుందా? లేదా? అన్నది ఆప్గన్ టీమ్పై ఆధారపడి ఉంది. న్యూజిల్యాండ్తో జరిగే మ్యాచ్లో ఆప్గనిస్తాన్ గెలిస్తే టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.

T20 World Cup 2021: ఇండియా సెమీస్ ఆశలు గల్లంతే, 53 పరుగుల భారీ తేడాతో నమీబియాను చిత్తు చేసిన న్యూజిల్యాండ్, సెమీస్ ఆశలను మరింత పెంచుకున్న కివీస్

Hazarath Reddy

పసికూన నమీబియాపై న్యూజిల్యాండ్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించి భారీ విషయాన్ని నమోదు చేసింది. 164 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నమీబియా(Namibia) 53 పరుగుల భారీ తేడాతో చిత్తు అయింది.

T20 World Cup 2021: న్యూజిలాండ్ ఆ ఛాన్స్ ఇస్తుందా, భారత్ సెమీస్ చేరాలంటే అదొక్కటే దారి, టీమిండియాకు మిణుకు మిణుకు మంటున్న చివరి అవకాశాలు ఏంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

టి20 ప్రపంచకప్‌ 2021లో (T20 World Cup 2021) టీమిండియా అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించడంతో సెమీఫైనల్ అవకాశాలు ఎక్కడో మిణుకు మిణుకు (All possible scenarios) మంటున్నాయి. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మంచి విజయాన్ని అందుకోవడం ద్వారా టీమిండియా నెట్‌ రన్‌రేట్‌ను మైనస్‌ నుంచి ప్లస్‌కు వచ్చింది.

Advertisement
Advertisement