Cricket

Team India's T20I Schedule: టీ20 ప్రపంచ కప్ 2026 వరకు టీమిండియా T20I షెడ్యూల్ ఇదిగో, మొత్తం 37 మ్యాచ్‌లు ఆడనున్న భారత్

Vikas M

బార్బడోస్‌లో జరిగిన 2024 ఎడిషన్‌లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించినందుకు భారతదేశం ప్రస్తుత T20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలిచింది.ఈ విజయం తర్వాత, విరాట్ కోహ్లీ , రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ వంటి వారు కూడా T20I ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు,

'BCCI Should Save Gaekwad': బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న టీమిండియా మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, బీసీసీఐ కాపాడాలంటూ భారత మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ విజ్ఞప్తి

Vikas M

భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ లండన్ ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారని.. ఆర్థిక సాయం కోసం చూస్తున్నారని భారత మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ తెలిపారు.ఈ మేరకు ఆయన బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.

ICC T20 World Cup 2024 Team: విరాట్ కోహ్లీ లేకుండా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టు ప్రకటన, భారత్ నుంచి ఆరుగురు ప్లేయర్లకు చోటు

Vikas M

ఐసీసీ తమ టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించింది. ఇందులో ఆరుగురు టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐసీసీ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.ఇక ఫైనల్‌ మ్యాచ్‌ హీరో విరాట్‌ కోహ్లికి చోటు దక్కలేదు.

Team India Return Updates: బెరిల్ హరికేన్ దెబ్బకు బార్బడోస్‌లో చిక్కుకున్న భారత జట్టు, క్యూలో నిలబడి పేపర్ ప్లేట్‌లలో భోజనం చేసిన టీమిండియా ప్లేయర్లు

Hazarath Reddy

బెరిల్ హరికేన్ ద్వీపాన్ని తాకడంతో ప్రస్తుతం బార్బడోస్‌లో చిక్కుకున్న భారత జట్టుకు సంబంధించి బీసీసీఐ తాజా అప్‌డేట్ ఇచ్చింది . తమ చారిత్రాత్మక T20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత భారతదేశానికి బయలుదేరినట్లు ప్రకటించిన టీమ్ ఇండియా, హరికేన్ కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది

Advertisement

Team India New Head Coach: శ్రీలంక సీరీస్ తోనే టీమిండియా కొత్త కోచ్ నియామకం.. బీసీసీఐ చీఫ్ జై షా వెల్లడి

Rudra

టీమిండియా కొత్త కోచ్ నియామకం రానున్న శ్రీలంక సీరీస్ లో జరుగనున్నట్టు బీసీసీఐ చీఫ్ జై షా తెలిపారు. రాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టు భావిస్తున్నారు.

Rohit Sharma Retires: టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్ర‌క‌టించిన రోహిత్ శ‌ర్మ‌, వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదంటూ భావోద్వేగం

Vikas M

విరాట్ కోహ్లి బాట‌లోనే భార‌త కెప్టెన్,స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యనంత‌రం రోహిత్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్‌ పేర్కొన్నాడు.టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ విజేత‌గా నిల‌వ‌డం చాలా సంతోషం ఉంది.

Prize Money of Rs 125 Crores for Team India: టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన బీసీసీఐ, టీ20 ప్రపంచకప్‌ 2024 గెలిచినందుకు నజరానా ఇస్తున్నట్లు తెలిపిన జై షా

Vikas M

టీ20 ప్రపంచకప్‌ 2024 గెలిచిన భారత క్రికెట్‌ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. పొట్టి ఫార్మాట్‌లో జగజ్జేతగా నిలిచిన టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. టోర్నీ ఆధ్యాంతం టీమిండియా అసాధారణ ప్రతిభ, దృడ సంకల్పం మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిందని షా ట్వీట్‌ చేశాడు.

Ravindra Jadeja Retires: టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, మిగతా ఫార్మాట్లలో కొనసాగుతానని ప్రకటన

Vikas M

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్‌, భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. జడ్డూ మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్‌) కొనసాగుతానని స్పష్టం చేశాడు.

Advertisement

Suryakumar Yadav Catch Video: తొలిసారి ప్రపంచకప్ ముద్దాడలన్న సఫారీల కలను దూరం చేసింది ఇదే, ఆ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ పట్టి ఉండకపోతే, డేవిడ్ మిల్లర్ చేతిలో..

Vikas M

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఫైన‌ల్లో సూర్య‌కుమార్ పట్టిన క్యాచ్ సఫారీలను ప్రపంచకప్ కు దూరం చేసింది. టీమిండియాను టీ20 వ‌ర‌ల్డ్ ఛాంఫియ‌న్స్‌గా నిలిపింది. క్యాచ్ వివరాల్లోకి వెళితే ద‌క్షిణాఫ్రికా విజ‌యానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి.హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ వేయడానికి రెడీ అయ్యాడు.

Suryakumar Yadav: టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌గానే సూర్య‌కుమార్ ఏం చేశాడంటే! భార్య‌తో క‌లిసి ట్రోఫీతో బెడ్ పై ప‌డుకొని ఫోటో పోస్ట్ చేసిన సూర్యకుమార్ యాద‌వ్

VNS

టీమ్​ఇండియా (Team India) విజేతగా నిలిచిన అనంత‌రం సూర్య కుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని త‌న బెడ్‌పై హ‌గ్ చేసుకొని ప‌డుకున్నాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Rahul Dravid: అప్పుడు కెప్టెన్ గా సాధించ‌లేనిది...ఇప్పుడు కోచ్ గా సాధించాడు! టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యంపై రాహుల్ ద్ర‌విడ్ తొలి రియాక్ష‌న్ ఇది

VNS

మ‌రోసారి టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను (T-20 World Cup) సొంతం చేసుకుంది. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును ఓడించి విశ్వ విజేత‌గా నిలిచింది. 17 ఏళ్ల త‌రువాత టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడంతో ఆట‌గాళ్లు, అభిమానులు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముగియ‌డంతో ప్ర‌ధాన కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ (Rahul Dravid) ప‌ద‌వి కాలం ముగిసింది.

Rohit Sharma Kisses Hardik Pandya: భారత్ జగజ్జేతగా నిలిచిన శుభవేళ.. భావోద్వేగ దృశ్యాలు.. హార్దిక్ పాండ్యాను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ.. వీడియో ఇదిగో

Rudra

దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్‌ ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.

Advertisement

Virat Kohli Announces Retirement From T20 Cricket: టీ 20 ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ..భారత్ టీ20 ప్రపంచ విజేతగా నిలవగానే కోహ్లీ సంచలన నిర్ణయం..

sajaya

భారత్‌కు తాను ఆడే చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అని విరాట్ కోహ్లీ టీ 20 ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. అయితే T20 అంతర్జాతీయ కెరీర్‌ను వరల్డ్ కప్ ఛాంపియన్‌ గా ముగించడం విశేషం.

T20 World Cup Final, IND vs SA: టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్...బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం...

sajaya

దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్‌ను రెండవసారి గెలుచుకుంది. 2007 తొలిసారి టీమిండియా ధోనీ కెప్టెన్సీలో టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు 2024లో రెండో సారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుంది.

India vs South Africa: దక్షిణాఫ్రికాపై కొత్త చరిత్రను లిఖించిన టీమిండియా ఉమెన్స్, ఒకే రోజు 509 పరుగుల చేసి భారీ రికార్డు, అదరగొట్టిన భారత ఉమెన్ బ్యాటర్లు

Vikas M

భారత్ ఉమెన్స్- దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ కొత్త చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి ఏకంగా 525 పరుగుల భారీ స్కోరు చేసింది.

Rohit Sharma Gets Emotional: భారత్ ఫైనల్ చేరగానే ఏడ్చేసిన రోహిత్ శర్మ, భుజం త‌ట్టి ఓదార్చిన విరాట్ కోహ్లీ

Hazarath Reddy

టీమిండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ చేరిన ఆనందంలో సార‌ధి రోహిత్ శ‌ర్మ భావోద్వేగానికి గురయ్యాడు. డగౌట్‌లో కూర్చొని క‌న్నీళ్లు పెట్టుకున్న అత‌డిని కోహ్లీ భుజం త‌ట్టి ఉత్సాహ‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నించాడు.

Advertisement

ICC T20 World Cup 2024: 10 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌లోకి అడుగుపెట్టిన భారత్, ఇంగ్లండ్‌పై 2022 సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

Hazarath Reddy

మరోసారి ఐసీసీ టైటిల్‌ను ముద్దాడేందుకు టీమిండియా కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 2022 టోర్నీలో సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ నాడు ఓడించిన ఇంగ్లండ్‌పై గెలిచి భారత్ గ్రాండ్‌గా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో అడుగుపెట్టింది. దీంతో 10 ఏళ్ల తర్వాత భారత్ టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరినట్టయింది.

India vs England Semi Final: భార‌త్- ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు, టాస్ ఆలస్యం, మ్యాచ్ రద్దయితే భారత్ ఫైనల్‌కు..

Vikas M

అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ భార‌త్ (India), ఇంగ్లండ్ (England) మ్యాచ్ ఆల‌స్యం కానుంది. వ‌ర్షం కార‌ణంగా గయానాలోని ప్రొడిడెన్స్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్ త‌డిగా మారింది. దాంతో, అంపైర్లు షెడ్యూల్ ప్ర‌కారం రాత్రి 8 గంట‌ల‌కు వేయాల్సిన టాస్‌ను వాయిదా వేశారు. గురువారం ఉదయం నుంచే గ‌యానాలో వాన దంచ‌డం మొద‌లెట్టింది

T20 World Cup: టీ-20 ఫైన‌ల్ లోకి అడుగు పెట్టిన సౌతాఫ్రికా, చారిత్ర‌క విజ‌యంతో ఫైన‌ల్స్ లో అడుగు పెట్టిన స‌ఫారీలు

VNS

టాస్ గెలిచి అఫ్గానిస్తాన్ (Afghanistan) మొద‌ట బ్యాటింగ్ చేసింది. అయితే.. స‌ఫారీ బౌల‌ర్ల ధాటికి 11.5 ఓవ‌ర్ల‌లో 56 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (10) మిన‌హా మిగిలిన వారు ఎవ‌రు కూడా రెండు అంకెల స్కోరు చేయ‌లేదు. ముగ్గురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు.

T20 World Cup 2024 Semifinals : వర్షం వల్ల సెమీఫైనల్స్ రద్దయితే..సౌతాఫ్రికా- భారత్ మధ్యనే ఫైనల్, వర్షం పడి మ్యాచ్‌లు రద్దయితే ఏం జరుగుతుందంటే..

Vikas M

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టోర్నమెంట్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశ, సూపర్-8 ముగించుకొని.. సెమీ ఫైనల్స్‌కు వచ్చేసింది.

Advertisement
Advertisement