Cricket

Fan Touches Virat Kohli's Feet: వీడియో ఇదిగో, ఫ్యాన్స్‌పై విరాట్ కోహ్లీ మంచి మనసు, గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కాళ్లు మొక్కిన అభిమానిపై కోహ్లీ రియాక్షన్ ఇదే..

Hazarath Reddy

ఐపీఎల్‌-2024లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు తలపడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ సంద‌ర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు.విరాట్ కోహ్లి వ‌ద్ద‌కు వెళ్లి కాళ్లకు మొక్కి తన అభిమానాన్ని ప్రదర్శించాడు

Virat Kohli Viral Video: గెలిచిన ఆనందంలో భార్యా పిల్లలకు ముద్దులు ఇస్తూ కెమెరాకు చిక్కిన విరాట్ కోహ్లీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

విరాట్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌కు ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అనంతరం విరాట్‌ లండన్‌లో ఉంటున్న తన కుటుంబంతో వీడియో కాల్‌ మాట్లాడాడు.తన కుటుంబంపై ముద్దుల వర్షం కురిపిస్తూ కనిపించాడు.

Virat Kohli: ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుల్లో ధోనీ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ, టాప్‌లో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్‌ మాజీ సారధి రోహిత్‌ శర్మ

Hazarath Reddy

ఈ మ్యాచ్‌లో "ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌"గా నిలిచిన ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండిన సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ ఎం​ఎస్‌ ధోని రికార్డును కోహ్లి సమం చేశాడు.

Virat Kohli Most Catches Record: సురేష్ రైనా రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు

Hazarath Reddy

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బెయిర్ స్టో క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి ఇప్పటివ‌ర‌కు టీ20ల్లో 173 క్యాచ్‌లు అందుకున్నాడు.

Advertisement

Virat Kohli New Record: టీ20ల్లో 100 సార్లు 50 ప్ల‌స్ ర‌న్స్, తొలి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, తొలి స్ధానంలో కొనసాగుతున్న క్రిస్ గేల్‌

Hazarath Reddy

చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించి ఐపీఎల్‌-2024లో బోణీ కొట్టింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది.ఈ మ్యాచ్‌లో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ను ఆడిన కోహ్లి.. ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

Jasprit Bumrah Yorker Video: జస్ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ యార్కర్ వీడియో ఇదిగో, బిత్తరపోయిన అలాగే చూస్తుండి పోయిన వృద్ధిమాన్ సాహా

Hazarath Reddy

ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన యార్కర్‌ వీడియో వైరల్ అవుతోంది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తొలుత గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు​ అహ్హనించాడు.

IPL 2024: గుజరాత్-ముంబై మ్యాచులో తన్నుకున్న అభిమానులు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్న వీడియో వైరల్

Hazarath Reddy

నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్-ముంబై మ్యాచులో ఘర్షణ జరిగింది. గ్యాలరీలో ఉన్న ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.ముంబై, గుజరాత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగినట్లుగా సమాచారం.

Rohit Sharma Vs Hardik: ముంబై తో మ్యాచ్ లో పాండ్యాకు చుక్కలు చూపించిన రోహిత్ ఫాన్స్, మ్యాచ్ జరుగుతున్నంతసేపూ రోహిత్ నామస్మరణే

VNS

మైదానంలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తొలుత రోహిత్ శర్మ స్లిప్ లో ఫీల్డింగ్ కు వెళ్లాడు. కానీ, హార్దిక్ ఫీల్డింగ్ పొజిషన్ ను మార్చాలని సూచించడంతో.. రోహిత్ మరో స్థానానికి వెళ్లాడు

Advertisement

IPL 2024, KKR vs SRH: అయ్యో హైదరాబాద్..క్లాసెన్ కష్టం మొత్తం బూడిదపాలు..ఉత్కంఠభరిత మ్యాచులో సన్ రైజర్స్ పై 4 పరుగుల తేడాతో విజయం సాధించిన కోల్ కత నైట్ రైడర్స్

sajaya

IPL 2024 మూడో మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPL 2024, Punjab Kings vs Delhi Capitals: ఐపీఎల్ 2024లో విజయంతో బోణీ కొట్టిన పంజాబ్ కింగ్స్..ఓటమి పాలైన ఢిల్లీ కాపిటల్స్..

sajaya

ఐపీఎల్ 2024 రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో పంజాబ్ జట్టు ముల్లన్‌పూర్‌లోని మహారాజా యద్వేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో విజయంతో శుభారంభం చేసింది.

IPL 2024, Viral Video: రెండేళ్ల తర్వాత స్టేడియంలోకి రిషబ్ పంత్ ఎంట్రీ..వీడియో చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం..

sajaya

453 రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చిన డీసీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఘన స్వాగతం లభించింది. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడుతూ రిషబ్ పంత్ తొలి పరుగు వేశాడు. అయితే, అతని ఇన్నింగ్స్ ఎక్కువసేపు కొనసాగలేదు మరియు అతను 13 బంతుల్లో 18 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

IPL 2024 CSK vs RCB: ఐపీఎల్ 2024 సీజన్ విజయంతో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్... తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో RCBని ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్

sajaya

IPL 2024 తొలి మ్యాచ్‌లో CSK 6 వికెట్ల తేడాతో RCBని ఓడించింది. చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించడంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి విఫలమైంది. 2008లో తొలిసారిగా, చివరిసారిగా బెంగళూరు తమ సొంతగడ్డపై చెన్నైని ఓడించింది.

Advertisement

Virat Kohli: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డు, మరో ఆరు పరుగులు చేస్తే టీ20ల్లో 12000 పరుగుల చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి..

Hazarath Reddy

ఐపీఎల్‌ 2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. కింగ్‌ మరో ఆరు పరుగులు చేస్తే టీ20ల్లో 12000 పరుగుల మైలురాయిని తాకిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.

Rishabh Pant Re-Entry: 16 నెలల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్, నేను సజీవంగా ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ భావోద్వేగం

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 2022 డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఈ ఐపీఎల్ (IPL) సీజన్‌తో క్రికెట్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు

Saeed Ahmed Dies: పాకి​స్తాన్‌ క్రికెట్‌ జట్టులో తీవ్ర విషాదం, అనారోగ్యంతో మాజీ కెప్టెన్‌ సయీద్‌ అహ్మద్‌ మృతి

Hazarath Reddy

దాయాది దేశం పాకి​స్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సయీద్‌ అహ్మద్‌ (86) అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. డాషింగ్‌ బ్యాటర్‌గా పేరున్న అహ్మద్‌ పాక్‌ తరఫున 41 టెస్ట్‌లు ఆడి ఐదు సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీల సాయంతో 2991 పరుగులు చేశాడు. రైట్‌ ఆర్మ్ ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన అహ్మద్‌ పాక్‌ తరఫున 22 వికెట్లు పడగొట్టాడు.

MS Dhoni Record As Captain in IPL: అభిమానుల గుండెల్ని ముక్కలు చేస్తూ ముగిసిన ధోనీ స్వర్ణయుగం, రెండోసారి చెన్నై పగ్గాలను వదిలేశాడు, కొత్త కెప్టెన్‌గా రుతరాజ్ గైక్వాడ్, జార్ఖండ్‌ డైనమైట్‌ ఐపీఎల్ రికార్డు ఇదిగో..

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో కీలక మార్పు చోటు చేసుకున్నది. ఆ జట్టు కెపెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్‌ ధోనీ తప్పుకున్నాడు. మహి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ధోనీ ఐపీఎల్‌ ప్రారంభమైన 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతూ వస్తున్నాడు.

Advertisement

CSK New Captain: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌, ధోనీ సాధారణ ఆటగాడిగా అయినా కొనసాగుతాడా లేదా అనే దానిపై నడుస్తున్న చర్చలు

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌ ప్రారంభానికి ముందు రోజు ఢిపెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ధోని స్థానంలో కొత్త కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసింది

Rashid Khan Six Video: బంతి వైపు చూడకుండానే సిక్సర్‌ బాదిన రషీద్‌ ఖాన్‌, కళ్లు చెదిరే వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ఐర్లాండ్‌తో నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ కొట్టిన సిక్సర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 18వ ఓవర్‌ ఆఖరి బంతికి రషీద్‌ బాదిన సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. బ్యారీ మెక్‌కార్తీ బౌలింగ్‌లో రషీద్‌ బంతిని చూడకుండానే సిక్సర్‌గా మలిచాడు

ICC New Rules: T20 టీ 20 ప్రపంచ కప్‌లో ఐసీసీ కొత్త రూల్, ఓవర్ టూ ఓవర్ 60 సెకన్లు దాటితే 5 పరుగులు పెనాల్టీ, స్టాప్ క్లాక్ రూల్ తీసుకువస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐసీసీ భారీ నిబంధనలు మార్చేందుకు సిద్ధమైంది.అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో ఓవర్ రేట్ పెద్ద సమస్యగా ఉంది మరియు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జట్లను వారి కాలిపై ఉంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. టెస్టుల్లో, WTC పాయింట్లు ఇప్పటికే తీసివేయబడుతున్నాయి. వైట్-బాల్ క్రికెట్ కూడా ఇప్పుడు కీలకమైన మార్పును చూస్తుంది.

Ranji Trophy: 42వ సారి రంజీ ట్రోఫీని ఎగరేసుకుపోయిన ముంబై, విదర్భపై 169 పరుగుల తేడాతో ఘన విజయం

Hazarath Reddy

గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఐదో రోజు విదర్భపై 169 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఐదో రోజు విదర్భపై 169 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది .

Advertisement
Advertisement