రాష్ట్రీయం

Beware Of Cyber Criminals: బ్యాంకు అధికారుల పేరుతో బెదిరింపులు..సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి...వీసీ సజ్జనార్ ట్వీట్

Arun Charagonda

సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేశారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. RBI/బ్యాంకులు/ప్రభుత్వ ఏజెన్సీలు/కొరియర్ కంపెనీల అధికారులుగా నటిస్తూ సైబర్ నేరగాళ్లు చేసే ఆడియో/వీడియో కాల్‌లు చట్టపరమైన చర్యలతో బెదిరించడం లేదా మీ బ్యాంక్ ఖాతాలు లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్‌లను స్తంభింపజేయడం లేదా బ్లాక్ చేయడం లేదా తక్షణమే డబ్బు బదిలీ చేయమని అడగడం పట్ల జాగ్రత్త వహించండని తెలిపారు.

Andhra Pradesh: రేషన్ కార్డులపై జగన్ ఫోటోలను, వైసీపీ రంగులను తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం, వాటి స్థానంలో పసుపు రంగులో కొత్త కార్డులు ఇచ్చే దిశగా అడుగులు..

Hazarath Reddy

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోలను ముద్రించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పార్టీ రంగులతో రేషన్ కార్డులను నింపేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కార్డులను తొలగించాలని నిర్ణయించింది.

New Liquor Policy in AP: ఏపీ మద్యం పాలసీ, ప్రభుత్వానికి ఏకంగా రూ.1,312.58 కోట్ల ఆదాయం, కొన్ని జిల్లాల్లో దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు

Hazarath Reddy

ఏపీలో ఈ నెల 16 నుంచి కొత్త‌ మద్యం పాలసీ అమలు కానుండగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ద‌రఖాస్తుల స్వీక‌ర‌ణ కొన‌సాగుతోంది. ద‌ర‌ఖాస్తుకు నేడే ఆఖ‌రి గ‌డువు. ఇక‌ గురువారం రాత్రి 8 గంటల వరకు 65,629 దరఖాస్తులు వ‌చ్చిన‌ట్లు ఎక్సైజ్ అధికారులు వెల్ల‌డించారు.

Vijayawada: ఇంద్ర‌కీలాద్రిపై పోలీస్ అధికారి అత్యుత్సాహం, చినరాజ గోపురం వద్ద బూట్లతో ఎస్సై అత్యుత్సాహం...భక్తుల ఆందోళన

Arun Charagonda

ఇంద్ర‌కీలాద్రిపై పోలీస్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. చినరాజ గోపురం వద్ద బూట్లతో హల్‌చల్ చేశారు ఎస్సై రాజారెడ్డి. త‌న‌ వారికి అమ్మ‌వారి దర్శనం చేయించేందుకు ఆలయంలోకి వచ్చారు ఎస్సై. ఆలయ పవిత్రతను దెబ్బతీశారంటూ ఆవేద‌న చెందుతున్నారు భ‌క్తులు.

Advertisement

Ratan Tata: రతన్ టాటాకు అక్షరాలతో చిత్ర నివాళి, తెలుగు అక్షరాలతో రతన్ టాటాకు ఘన నివాళి..వీడియో ఇదిగో

Arun Charagonda

రతన్ టాటాకు నంద్యాల కు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ ఆయనకు చిత్ర నివాళిని అర్పించారు. పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం దేశానికే తీరని లోటని చింతలపల్లి కోటేష్ అన్నారు. కోటేష్ ఆయనను స్మరించుకుంటూ ఏ3 డ్రాయింగ్ షీట్ పై ఎటువంటి గీతలు లేకుండా ఆయన జీవిత చరిత్రను తెలుగు అక్షరాలతో రతన్ టాటా చిత్రాన్ని మైక్రో పెన్నుతో మూడు గంటల పాటు శ్రమించి చిత్ర నివాళి అర్పించారు. అలాగే ఈ చిత్రంలో ఆయన స్థాపించిన ఎన్నో పరిశ్రమలను చూపించారు.

Telangana: మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం.. వారం రోజులుగా అదే నీటిని సరఫరా చేస్తున్న అధికారులు..వీడియో ఇదిగో

Arun Charagonda

నిర్మల్ - కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లో కోతి కళేబరం దొరికింది. నీరు వాసన రావడంతో అనుమానం వచ్చి ట్యాంక్లో చూడగా కోతి కళేబరాన్ని చూసి గ్రామస్థులు కంగుతిన్నారు. వారం రోజులుగా అదే నీటిని అధికారులు సరఫరా చేయడంతో.. కలుషిత నీటిని సరఫరా చేసిన అధికారులపై గ్రామస్థులు మండిపడుతున్నారు.

Viral Video: బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం.. విద్యుత్ లైట్లు తగిలి వ్యక్తి మృతి.. వరంగల్ లో ఘోరం (వీడియో)

Rudra

బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి చీకటి యాకయ్య (45) అనే వ్యక్తి మృతి చెందాడు.

Vijayawada: విజ‌య‌వాడలో లోకో పైల‌ట్ దారుణ హ‌త్య‌, విధుల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌స్తుండ‌గా చంపేసిన దుండగుడు..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

విజ‌య‌వాడలో లోకో పైల‌ట్ హ‌త్య‌ దారుణ హత్యకు గురయ్యాడు. లోకో పైలట్‌గా పనిచేస్తున్న డి.ఎబినేజర్‌ను నైజాం గేట్ స‌మీపంలో రైల్వే రోడ్‌నంబ‌ర్ 11లో ఇనుప‌క‌డ్డీతో దాడి చేశాడు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన‌ హంత‌కుడు న‌డిచివెళ్ళున్న దృశ్యాలు రికార్డు కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Nampally Exhibition Ground: నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ దగ్గర ఉద్రిక్తత, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేశారు గుర్తుతెలియని దుండగులు. మొదట కరెంట్ కటచేసి, సీసీ కెమెరాలు విరగగొట్టి అమ్మవారి విగ్రహం ద్వంసం చేశారు దుండగులు. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు బేగంబజార్ పోలీసులు.

Cooking Oil At Low Prices: రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ .. నేటి నుండి తక్కువ ధరకే వంట నూనెలు

Rudra

పండుగపూట పెరిగిన ధరలతో కుదేలైన పేద, మధ్యతరగతిదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో శుక్రవారం నుండి నెలాఖరు వరకూ పామోలిన్ లీటర్ రూ110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు.

Devi Idol Vandalized: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. కరెంట్ కట్ చేసి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దుండగుల దుశ్చర్య.. (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో దారుణం జరిగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మ‌వారి విగ్ర‌హాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

Heavy Traffic at Panthangi Toll Plaza: దసరా ఎఫెక్ట్‌.. పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు (వీడియో)

Rudra

దసరా, సంక్రాంతి పండుగలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతిముఖ్యమైనవి. ఎక్కడ ఉన్నా ఈ రెండు పండుగలకు అందరూ తమ ఇళ్లకు చేరుకోవాల్సిందే.

Advertisement

Rain Alert to AP: ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

Rudra

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారి అనంతరం అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Saddula Bathukamma Celebrations: తెలంగాణ‌లో వాడ‌వాడ‌లా స‌ద్దుల బ‌తుక‌మ్మ కోలాహ‌లం, ట్యాంక్ బండ్ పై 10వేల మందితో ఉత్స‌వాలు, ఆక‌ట్టుకున్న క్రాక‌ర్ షో

VNS

ఈ నెల 2న ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబురాలు (saddula Bathukamma Celebration).. సద్దులతో ముగిశాయి. పూలనే పూజించే పండుగలో రాష్ట్రంలోని ఆడపడుచులు.. చిన్నా పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. గునుగు, తంగేడు, తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను సాయంత్రం గ్రామ, వార్డు కూడళ్లలోకి తీసుకొచ్చి ఉయ్యాల పాటలు పాడారు. పాటకు తగ్గట్లుగా చప్పట్లు చరుస్తూ ఆటలాడారు

Revanth Reddy Photo On Bathukamma: బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం వచ్చేలా పూలను పేర్చి ముఖ్యమంత్రిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు

Notices To Konda Surekha: కొండా సురేఖకు షాక్..నోటీసులు జారీ చేసిన నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు, నాగార్జున దాఖలు చేసిన కేసులో నోటీసులు

Arun Charagonda

మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు. నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగగా కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ 23కు వాయిదా వేసింది కోర్టు.

Advertisement

Andhra Pradesh: 100 కోట్ల స్కాం,చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో సీఐడీ తనిఖీలు, బ్యాంకు వద్ద కట్టుదిట్టమైన భద్రత

Arun Charagonda

రూ.100 కోట్ల స్కాంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆదినారాయణ నేతృత్వంలో చిల‌క‌లూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో తనిఖీలు చేశారు పోలీసులు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు సంబంధించి 100 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని బాధితుల ఫిర్యాదు నేపథ్యంలో సీఐడీతో దర్యాప్తు చేయించి, న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు .ఈ నేపథ్యంలో సీఐడీ తనిఖీలు చేపట్టింది.

Vikarabad: మద్యం మత్తులో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల వీరంగం..ఇంటికి వెళ్లి చితకబాదిన మందుబాబులు

Arun Charagonda

వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ బెల్ట్ షాపు వద్ద మందుబాబులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులనే రక్తం వచ్చేలా కొట్టారు. ఓ బెల్ట్ షాప్ వద్ద తాగుతున్న వారిని నివారించేదెందుకు అబ్కారీ కానిస్టేబుల్స్ రాజేందర్, కృష్ణ వెళ్ళగా వారితో వాగ్వాదం జరిగింది. అనంతరం అబ్కారీ కానిస్టేబుల్స్ ఇంటికి వెళ్లిపోగా వారి ఇంటికి వెళ్లి పోకిరీలు వారి ఇంటికి వెళ్లి రక్తం వచ్చేలా దాడి చేశారు.

Telangana: షాపు మూయలేదని దారుణం, కొబ్బరికాయలు అమ్మేకునే వ్యక్తి చెంప చెల్లుమనిపించిన గోదావరిఖని సీఐ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వీధి వ్యాపారులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఘటనలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. తాజాగా కొబ్బరికాయలు అమ్మేకునే వ్యక్తి పై గోదావరిఖని సీఐ జులుం ప్రదర్శించిన వీడియో వెలుగులోకి వచ్చింది. షాప్ ఎందుకు మూసివేయలేదు అంటూ రెచ్చిపోయి వ్యాపారి చెంప చెళ్లమనిపించాడు గోదావరిఖని వన్ టౌన్ సీఐ

Kodangal: తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగం, ఆ తండ్రి ఆనందం వర్ణించలేం..

Arun Charagonda

కొడంగల్ మండలం హుస్నాబాద్ కు శ్రీశైలం గౌడ్ డీఎస్సీ నిరంతరం సాధించేందుకు శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్యలు డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు. సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్‌లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్‌జీటీగా ఎంపికైంది.

Advertisement
Advertisement