రాష్ట్రీయం

Times Now ETG Survey: ఎవరికెన్ని సీట్లు, టైమ్స్‌ నౌ సర్వే పూర్తి వివరాలు ఇవిగో, మళ్లీ అధికారం మోదీ సర్కారుదే, ఏపీలో జగన్ సర్కారుకు, తెలంగాణలో కేసీఆర్‌కే మళ్లీ పట్టం

Hazarath Reddy

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మోదీ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్‌ నౌ’సర్వే (Times Now ETG Survey) తేల్చి చెప్పింది.

Times Now ETG Survey: సర్వే మళ్లీ జగన్ వైపే, 2024లో టీడీపీ, జనసేన గల్లంతేనంటున్న టైమ్స్ నౌ సర్వే, 23 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో జగన్ సర్కారు గెలుస్తుందని సర్వేలో వెల్లడి

Hazarath Reddy

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టైమ్స్‌ నౌ సర్వే బయటకు వచ్చింది. తాజా సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయభేరి మోగిస్తుందని తెలిపింది.

Video: వీడియో ఇదిగో, సెల్ ఫోన్లో టార్చ్ లైట్ టెక్నాలజీ నేనే పరిచయం చేశాను, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

చంద్రబాబు నాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలా కనిపెట్టానని తెలిపిన టీడీపీ అధినేత తాజాగా సెల్ ఫోన్లో టార్చ్ లైట్ టెక్నాలజీ కూడా నేను పరిచయం చేసిందేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో..

Vande Bharat Express Cancelled: వందేభారత్ ట్రైన్‌ రద్దు, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ సర్వీస్, ప్రత్యామ్నాయంగా మరో రైలు నడిపిస్తున్న అధికారులు

VNS

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం (Visakhapatnam) నుంచి బయల్దేరాల్సి ఉంది.

Advertisement

Leopard Trapped In Tirumala: బోనులో చిక్కిన మరో చిరుత, తిరుమల మెట్లమార్గంలో చిరుతను బంధించిన అటవీ సిబ్బంది, ఇంతకీ తిరుమలలో ఎన్ని పులులున్నాయంటే?

VNS

తిరుమలలో (Tirumala) మరో చిరుతపులి (Leopard) చిక్కింది. తిరుమల నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 14న తెల్లవారుజామున అదే ప్రాంతంలో ఓ చిరుత చిక్కిన విషయం తెలిసిందే.

Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ పూర్తి సారాంశం ఇదిగో, ఈ ఐదు కీలక అంశాలతో భారత్ నంబర్ వన్ అవుతుందని తెలిపిన టీడీపీ అధినేత

Hazarath Reddy

విశాఖ వేదికగా చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరించారు. ఇందులో అయిదు కీలక అంశాలను ఆయన ప్రజెంట్ చేశారు. భారతదేశం 2047 నాటికి ప్రపంచ నెంబర్ వన్‌ ఆర్థిక శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రాఫ్ట్ విజన్ ను ప్రజల ముందుకు తెస్తున్నాననీ దీనిపై మేథావులు, నిపుణులు స్పందించి సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు.

CM KCR's Medak Visit Postponed: భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్, సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లా పర్యటన వాయిదా, 23వ తేదీన మెదక్‌ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా పర్యటన వాయిదా పడింది. అయితే, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌.. పర్యటనను వాయిదా వేసినట్టు సమాచారం. కాగా, సీఎం కేసీఆర్‌ ఈనెల 19వ తేదీన మెదక్‌ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. వాతావరణ శాఖ అధికారుల సూచనతో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 19కి బదులుగా 23వ తేదీన మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నట్టు తెలిపారు.

Andhra Pradesh: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త, జీతాలను 37 శాతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, మూడు చోట్ల ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు రెడీ

Hazarath Reddy

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌.

Tellam Venkatarao: పొంగులేటికి ఝలక్‌ ఇచ్చి బీఆర్ఎస్‌లోకి జంప్ అవుతున్న తెల్లం వెంకట్రావ్, భద్రాచలం టికెట్ ఒకే అయినట్లుగా వార్తలు

Hazarath Reddy

ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ తిరిగి బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించాడు.భద్రాచలం టికెట్ తెల్లం వెంకట్రావుకు ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Andhra Pradesh: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త, ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయనున్న జగన్ సర్కారు, కొద్దిరోజుల్లో ఉత్తర్వులు జారీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది! కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేందుకు ఐదేళ్ల సర్వీసు నిబంధనను సడలిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2014 జూన్ 2కు ముందు నియమించబడి ఇప్పటి వరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారు.

Pawan Kalyan: వీడియో ఇదిగో, ఓ అభిమాని తన బిడ్డను చేతుల్లోకి తీసుకోమని ఇస్తుంటే అతడిని నెట్టేసిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జనసేనాధి నేత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎయిర్ పోర్టు లోపల నుంచి వస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఓ అభిమాని తన బిడ్డను పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకువచ్చాడు.

Advertisement

Tension in Srinidhi College: శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీ దగ్గర ఉద్రిక్తత, వసూలు చేసిన డబ్బు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్‌, విద్యార్థి ఆత్మహత్యా యత్నం

Hazarath Reddy

మేడ్చల్‌ జిల్లాలోని ఘట్‌కేసర్‌ శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలేజీ ఫర్నిచర్‌, అద్ధాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. వర్శిటీ గుర్తింపు వస్తుందంటూ వసూలు చేసిన డబ్బు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ స్టూడెంట్‌ కాలేజీ బిల్డింగ్‌ పైకి ఎక్కడంతో కలకలం రేగింది.

Hyderabad Bikes Stunt Videos: హైదరాబాద్‌లో బైక్స్ స్టంట్‌లతో విధ్వంసం సృష్టించిన యువకులు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

హైదరాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌ శివారులో యువకులు కారు, బైక్‌ రేసింగ్‌లు, విన్యాసాలతో హల్‌చల్‌ సృష్టించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం సెలవు దినం కావడంతో, ఈ బృందం అటవీ ప్రాంతంలో డ్రాగ్ రేసింగ్‌లో మునిగిపోయింది,

Hyderabad: షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన ప్లేయర్, ఆస్పత్రికి తరలించే లోపే తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

వరుస గుండెపోటు మరణాలు భయాందోళన కల్గిస్తున్నాయి. ఈరోజు ఉప్పల్ పరిధి రామంతాపూర్లోని ఎండోమెంట్ కాలనీలో షెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి (46) గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు, స్థానికులు అతన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్దారించారు.

Vangaveeti Radha's Wedding: వచ్చే నెల 6వ తేదీన వంగవీటి రాధాతో పుష్ప వల్లీ పెళ్లి, ఈనెల 19వ తేదీన నిశ్చితార్థం

Hazarath Reddy

వంగవీటి రాధ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈనెల 19వ తేదీన వంగవీటి రాధాకు జక్కం పుష్ప వల్లీకి ఎంగేజ్మెంట్ జరగనుంది. వచ్చే నెల 6వ తేదీన వంగవీటి రాధా పెళ్లి జరగనుంది. నరసాపురం మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జిల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీని వంగవీటి రాధా మనువాడబోతున్నారు.

Advertisement

Yellow Alert for Telangana: తెలంగాణకు ఎల్లో అలర్ట్‌, ఈ నెల 18, 19 తేదీల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు, ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్

Hazarath Reddy

ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.

Warangal Accident: వరంగల్‌ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం, ఐదుగురు స్పాట్‌లోనే మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం, బాధితులంతా తేనె అమ్ముకునే వ్యక్తులే!

VNS

వరంగల్ జిల్లాలో (Warangal) విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వర్ధన్నపేట మండలం (Wardhannapet) ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ (Lorry Hits Auto) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.

Techie Dies by Suicide: విశాఖలో ప్రేమ విఫలం కావడంతో టెకీ ఉరివేసుకుని ఆత్మహత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

విశాఖలో ప్రేమ విఫలమయిందనే బాధతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పి.రాంప్రసాద్ (30) అనే వ్యక్తి కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందినవాడు. విశాఖలోని శంకరమఠంలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

Telangana: ప్రాణాలకు తెగించి వరదలో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సమస్య సరిచేసిన జూనియర్ లైన్‌మెన్‌, స్వాతంత్ర్య దినోత్సవం రోజున సత్కరించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనగాం జిల్లా దేవరుప్పుల మండలం చింతల తండా, ధర్మాపురం, పడమటి తండా గ్రామాలకు విద్యుత్ ఇవ్వడం కోసం ప్రాణాలకు తెగించి వరదలో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సమస్య సరిచేసిన జూనియర్ లైన్‌మెన్‌ ఎండీ రహమాన్‌ను ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున సత్కరించిన సీఎం కేసీఆర్.

Advertisement
Advertisement