రాష్ట్రీయం

Tirumala Viral Video: తిరుమల కొండపై ఎలుగుబంటి సంచారం, వీడియో వైరల్

kanha

తిరుమలలో ఎలుగు బంటి సంచారం. స్థానిక బాలాజీ నగర్ బాల గంగమ్మ ఆలయం వద్ద సంచరించిన ఎలుగు బంటి.

TTD New Chairman: టీటీడీ నూతన చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి నియామకం..

kanha

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం వారం రోజుల్లో ముగియనుండడంతో TTD చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు.

Hyderabada Shocker: హైదరాబాద్ రాజేంద్రనగర్లో దారుణం..అత్తాపూర్ ప్రైవేటు స్కూల్లో 8 తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్..చితకబాదిన తల్లిదండ్రులు వీడియో వైరల్

kanha

అత్తాపూర్ SR Digi స్కూల్లో 8 తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచకుడు PET విష్ణు. విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టిన PET. విషయం తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థిని. స్కూల్లో ఫర్నీచర్, కంప్యూటర్ రూంను పగలగొట్టిన తల్లిదండ్రులు, బంధువులు.

Governor Tamilisai Approved TSRTC Bill: ఎట్టకేలకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై.

kanha

ఎట్టకేలకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిలిసై. ప్రభుత్వం ఇచ్చిన వివరణకు సానుకూలంగా స్పందించిన గవర్నర్. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చిన గవర్నర్.

Advertisement

Bandi Sanjay on TSRTC: కేసీఆర్‌కు నిజంగా ఆర్టీసీని విలీనం చేసే ఉద్దేశం ఉందా లేదా తెలుసుకోవడానికే బిల్లును గవర్నర్ ఆపింది - బండి సంజయ్

kanha

కేసీఆర్‌కు నిజంగా ఆర్టీసీని విలీనం చేసే ఉద్దేశం ఉందా లేదా తెలుసుకోవడానికే బిల్లును గవర్నర్ ఆపింది - బండి సంజయ్.. గవర్నర్ గారికి ఆర్టీసీ బిల్లు ఆమోదించడానికి 2 రోజులు మాత్రమే సమయం ఇస్తే ఎలా సరిపోతుంది.

Tirupati Shocker: తిరుపతి - ఉంగుటూరులో దారుణం ఘటన ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య

kanha

ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య, తిరుపతి - ఉంగుటూరు మండలం నారాయణపురంలో చంద్రశేఖర్ అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. చంద్రశేఖర్ కొన్నేళ్లుగా టైల్స్ పరిశ్రమలో సూపర్వైజర్ పని చేస్తూ ఇక్కడే నివాసముంటున్నారు. ప్రియుడి మోజులో భువనేశ్వరి భర్తను చంపింది.

Telangana Governor On TSRTC: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం గురించి గవర్నర్ అడిగిన వివరణల పై రిప్లై ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

kanha

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం గురించి గవర్నర్ అడిగిన వివరణల పై రిప్లై ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

TSRTC Strike: ముగిసిన ఆర్టీసీ కార్మికుల నిరసన.. రెండు గంటల విరామం అనంతరం మళ్లీ ప్రారంభమైన బస్సు సర్వీసులు.. ఉదయం 11.00 గంటలకు రాజ్‌భవన్ ఎదుట మరోమారు నిరసన కార్యక్రమం

Rudra

టీఎస్ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం ముగిసింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Onion Price: టమాటా తర్వాత ఇక ఉల్లివంతు.. వచ్చే నెలలో రూ. 70కి చేరుకోనున్న ధర.. ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ నివేదిక.. సరఫరా-డిమాండ్ మధ్య తేడానే కారణం

Rudra

పెరిగిన టమాటా, ఇతర కూరగాయల ధరలతో భయపడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలేలా ఉంది. ఈ నెలాఖరుకు ఉల్లి ధర కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ పేర్కొంది.

Viral Video: ఈ స్నేహం ఎంతో మధురం.. పాము, ఆవు మధ్య మైత్రి.. వీడియో సూపర్

Rudra

స్నేహానికి ఎల్లలు లేవంటారు. అటవీశాఖ అధికారి సుశాంత నంద తాజాగా షేర్ చేసిన వీడియో అలాంటిదే. ఈ వీడియోలో ఆవు, పాము స్నేహంగా మసలుకోవడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో పాము, ఆవు పక్కపక్కనే ఉన్నాయి.

TSRTC Employees Calls For Dharana: రెండు గంటల పాటూ నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామన్న ఉద్యోగులు, డిపోల ముందు ధర్నాలకు పిలుపు

VNS

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్‌ సైరన్‌ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్‌ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివేయాలని కార్మికులు నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడ డిపోల ముందు ధర్నాలు చేయనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని అడ్డుకునేలా ఉన్న బీజేపీ వైఖరిపై మండిపడుతున్నారు.

Ruckus in Chandrababu Punganur Tour: పథకం ప్రకారమే పోలీసులపై దాడి, పుంగనూరు ఉద్రికత్తలపై స్పందించిన చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు టూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారు.

Advertisement

Chandrababu's Punganur Tour: రణరంగంగా మారిన చంద్రబాబు పుంగనూరు పర్యటన, వైసీపీ టీడీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి, మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు సవాల్

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు టూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

APCOB Diamond Jubilee Celebrations: ఆప్కాబ్‌ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం జగన్, ఆప్కాబ్‌తోనే రైతులకు బ్యాంకింగ్‌ వ్యవస్థ చేరువైందని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నగరంలోని ‘ఏ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌(ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘ఆప్కాబ్‌ నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉందన్నారు.

Telangana Govt on VRA Posts: వీఆర్‌ఏల సర్దుబాటుకు కొత్తగా 14,954 పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)ల సర్దుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు మంజూరు చేసింది. వీఆర్ఏల స‌ర్దుబాటు కోసం ప్రభుత్వ విభాగాల్లోని వివిధ శాఖల్లో వీఆర్‌ఏల సర్దుబాటు కోసం 14,954 పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చింది.

Yuva Galam Padayatra: పాదయాత్రలో కాలు జారి పడిపోయిన నారా లోకేష్, తృటిలో తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. అయితే పాదయాత్రలో పొలం దగ్గర కిందకు దిగుతుండగా నారా లోకేష్ కాలు జారి పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ అతన్ని గట్టిగా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

Advertisement

Telangana Assembly Session: జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాల్పుల్లో మరణించిన హైదరాబాదికి బీఆర్ఎస్ పార్టీ భరోసా, మృతుడి కూతుర్లకు ఒక్కొకరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం

Hazarath Reddy

జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాల్పుల్లో మరణించిన హైదరాబాద్‌ వ్యక్తి సైఫుద్దిన్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ భరోసా ఇచ్చింది. మృతుడి భార్యకు ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తాం, మృతుడి కూతుర్లకు ఒక్కొకరికి 2 లక్షల చొప్పున పార్టీ నుండి ఆర్థిక సాయం చేస్తాం - మంత్రి కేటీఆర్

Telangana Assembly Session: ఉప్పల్ ఫ్లైఓవర్ మేము కడతాం అంటే కేంద్రం అడ్డుపడింది, కేసీఆర్ ప్రభుత్వ సమర్ధతకు మేము పూర్తి చేసిన 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులే నిదర్శనం, అసెంబ్లీలో మంత్రి కేటీఆర్

Hazarath Reddy

ఉప్పల్ ఫ్లైఓవర్ మేము కడతాం అంటే జాతీయ రహదారి కాబట్టి మేమే కడతామని కేంద్రం అన్నది. కేసీఆర్ ప్రభుత్వ సమర్ధతకు మేము పూర్తి చేసిన 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులే నిదర్శనం.. మోడీ ప్రభుత్వ చేతకానితనానికి, అసమర్ధతకు నిదర్శనం ఉప్పల్ ఫ్లైఓవర్, అంబర్ పేట ఫ్లైఓవర్ పూర్తి చేయలేకపోవడం - కేటీఆర్

Telangana Assembly Session: ప్రజలు అన్నీ చూస్తున్నారు, మూడు గంటల కరెంట్ ఎవరు ఇస్తామన్నారో.. 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తున్నారో వారికి తెలుసన్న మంత్రి కేటీఆర్

Hazarath Reddy

3 గంటల కరెంట్ ఎవరు ఇస్తామన్నారో.. 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తున్నారో రైతులు అన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమెరికా పోగానే 3 గంటల కరెంట్ చాలు అంటూ మనసులో బైట పెట్టిండు. రెండు సార్లు రుణ మాఫీ చేసి, 73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్. 5 లక్షలు రైతు భీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు తెలంగాణలో - మంత్రి కేటీఆర్

Telangana Assembly Session: 24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బీఆర్ఎస్‌కి ఓటు వేస్తారు, వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు

Hazarath Reddy

24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బీఆర్ఎస్‌కి ఓటు వేస్తారు.. 24 గంటల కరెంట్ వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు 24 గంటల కరెంట్ వద్దు అంటున్నాడు, కాంగ్రెస్ ఉప నాయకుడేమో చెక్ డ్యాంలు వద్దు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అంటున్నాడు, ధరణి రద్దు చేయాలని ఇంకో కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు - మంత్రి హరీష్ రావు

Advertisement
Advertisement