రాష్ట్రీయం
LPG Price Hike: మరోసారి గ్యాస్‌ మంట.. కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 వాత.. ఢిల్లీలో రూ. 1,780కి చేరిన ఎల్పీజీ
Rudraమరోసారి గ్యాస్‌ మంట భగ్గుమన్నది. ఎల్పీజీ ధరలను ఆయిల్ కంపెనీలు మళ్లీ పెంచాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో జనం అల్లాడిపోతుండగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 పెంచాయి.
Sri Lankan REP Met CM Jagan: శ్రీలంకలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించండి, సీఎం జగన్‌ను కోరిన శ్రీలంక ప్రతినిధులు
Hazarath Reddyతాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శ్రీలంక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీలంక ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ సెంథిల్‌ తొండమాన్‌, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ డి.వెంకటేశ్వరన్‌, ఇతర అధికారులు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా తమ దేశంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని శ్రీలంక ప్రతినిధులు కోరారు.
Hyderabad Shocker: తార్నాకలో కామాంధుడు, లిఫ్ట్ పేరుతో యువతికి లైంగిక వేధింపులు. బైక్ మీద నుంచి దూకడంతో యువతికి తీవ్రగాయాలు
Hazarath Reddyహైదరాబాద్‌ నగరంలో తార్నాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్‌ ఇచ్చే వంకతో ఓ కామాంధుడు.. ఓ యువతిపై నడిరోడ్డుపై అదీ బైక్‌ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది.
Anam Jayakumar Reddy Joins YSRCP: నెల్లూరులో టీడీపీకి షాక్, వైసీపీ కండువా కప్పుకున్న ఆనం జయకుమార్‌రెడ్డి,సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక
Hazarath Reddyనెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆనం జయకుమార్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరడం గమనార్హం. సోమవారం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లిన ఆనం జయకుమార్‌రెడ్డి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Vande Bharat Express: ఏపీకి మరో వందేభారత్ రైలు, విజయవాడ-చెన్నై మీదుగా రాకపోకలు సాగించనున్న ట్రైన్, ఈ నెల 7న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Hazarath Reddyఏపీలో మరో వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈనెల 7 నుంచి మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అయిదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.
Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటెల రాజేందర్..కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం
kanhaTelangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటెల రాజేందర్..
Telangana: వికారాబాద్ జిల్లాలో ఘోర విషాదం, రైలు ఢీకొని అరవై మేకలు మృతి, రైలు పట్టాలు దాటుతుండగా ఢీ కొట్టిన ట్రైన్
Hazarath Reddyతెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సుమారు అరవై మేకలు రైలు ఢీకొని మృతి చెందినట్లు అధికారులు సోమవారం తెలిపారు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం దోర్నాల్ గ్రామంలో మేకలు రైలు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
AP Weather Forecast: ఏపీలో మూడు రోజులు అలర్ట్, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyదక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం మధ్య భాగాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంపైకి వాయవ్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ తెలిపారు.
146 New Ambulances in AP: 146 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్, 108 సేవల కోసం ఏటా రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
Hazarath Reddyవైద్యరంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు మరో దిశగా ముందడుగు వేసింది. 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌­లను కొనుగోలు చేసింది
MLA Raghunandan Rao: వీడియో ఇదిగో, నాకు నచ్చితే ఉంటా, లేకపోతే వెళ్లిపోతా, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyనన్ను గౌరవించని చోట నేను పనిచేయాలేను. నాకు నచ్చినన్ని రోజులే పనిచేస్తాను, నాకు నచ్చకపోతే ఎవరూ నన్ను బలవంతం చేయలేరు - దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
TS Weather Forecast: తెలంగాణకు గుడ్ న్యూస్, ఈ నెలంతా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలంగాణలో ఈ నెలంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. నైరుతి రుతుపవనాల సీజన్‌ జూన్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు పరిగణిస్తారు.
Weather Forecast: దేశంలో పలు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లో ఈవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐంఎడీ
Hazarath Reddyఈరోజు దేశంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. IMD ప్రకారం, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, రాయలసీమ, బీహార్‌లోని ఘాట్ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Fire Accident: శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాపులో మంటలు.. వీడియోతో
Rudraహైదరాబాద్ శంషాబాద్‌లోని ఓ ఆటోమొబైల్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న దుకాణంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ.. ఘటన సమయంలో దుకాణం మూసివేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
PM Modi House: ప్రధాని మోదీ నివాసం మీదుగా డ్రోన్.. దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు
Rudraఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో ప్రధాని నివాసంపై డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు.
YS Sharmila: త్వరలోనే కాంగ్రెస్‌ లోకి షర్మిల.. తనకు సమాచారం ఉందన్న కేవీపీ.. కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామన్న కేవీపీ
Rudraవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు స్పందించారు.
Tadipatri Horror: తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం.. పని ఒత్తిడే ప్రాణం తీసిందన్న ఆయన కుమార్తె భవ్య.. వీడియోతో
Rudraఅనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.
Tirumala Update: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. సర్వదర్శనానికి 24 గంటల సమయం.. పూర్తిగా నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల శ్రీవారు స్వయంగా కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వారాంతం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నుంచి ఇక్కడ భారీ రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
Trains Cancelled: నేటి నుంచి 24 రైళ్లు రద్దు.. మరో 22 ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా.. 9వ తేదీ వరకు.. ఆపేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటన.. ట్రాక్ మెయింటనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం
Rudraహైదరాబాద్ (Hyderabad), సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్ల పరిధిలో ట్రాక్ మెయింటనెన్స్ పనుల కారణంగా పలు రైళ్లను (Trains) తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) అధికారులు పేర్కొన్నారు.
Harish Rao Fire on Rahul: దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ ది, మీ పార్టీ పేరు స్కాంగ్రెస్‌ అంటూ రాహుల్‌పై హరీష్‌ రావు ఫైర్, ఖమ్మం సభలో రాహుల్‌ స్పీచ్‌కు హరీష్ ఘాటు కౌంటర్
VNSతెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ (KCR) ప్రభుత్వం ధ్వంసం చేసింది. పేదల కలలను కేసీఆర్ నాశనం చేశారు. భూములను దోచుకోవడానికే ధరణిని తెచ్చారు. కాళేశ్వరంలో (Kaleshwaram Project) రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారు అంటూ ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.
Ponguleti Joined in Congress: కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ సర్కారును బంగాళాఖాతంలో కలుపుతామన్న భట్టి విక్రమార్క
VNSఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభలో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో ఆ పార్టీలో చేరారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, పలువురు నేతలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ.సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనను రాహుల్ సత్కరించారు.