రాష్ట్రీయం

Retired MPDO Murder: కిడ్నాపైన రెండు రోజులకు బట్టలు లేకుండా దొరికిన శవం, జనగామలో రిటైర్డ్ ఎంపీడీవో దారుణహత్య, గతంలో పలువురి పట్టాదార్ పాసుబుక్‌లు రద్దు చేసి వివాదంలో ఇరుక్కున్న ఎంపీడీవో

VNS

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణ (Nalla Ramakrishna) దారుణ హత్యకు గురయ్యాడు. ఈనెల 15న కిడ్నాప్ అయిన రామకృష్ణ మృతదేహాన్ని జనగామ మండలంలోని చెంపక్ హిల్స్ వద్ద అటవీ ప్రాంతంలో గుర్తించారు. రామకృష్ణను ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త, మరో సర్పంచ్ సహా బాధితులంతా కిరాయి హంతకులతో డీల్ కుదుర్చుకొని హత్య చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

JEE Advanced 2023 Results: జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

Rudra

జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు... 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

RBI Lost Money: ప్రింట్‌ అయినా ఆర్బీఐకి చేరని 88 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లు.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?

Rudra

దేశ ఆర్థిక వ్యవస్థను, నగదును నియంత్రించే రిజర్వు బ్యాంకే నోట్లను పోగొట్టుకున్నది. ఒకటి రెండు నోట్లు, నోట్ల కట్టలు కాదు.. నోట్ల గుట్టలనే పోగొట్టుకున్నది. వీటి విలువ అక్షరాలా రూ.88,032 కోట్లు.

JEE Advanced 2023 Results: నేడు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

Rudra

జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు... 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement

Special Trains to Puri: పూరీ జగన్నాథ్ రథయాత్రకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. జూన్ 18వ తేదీ నుండి 22 మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుండి రైళ్ల ప్రారంభం

Rudra

దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న పూరీ జగన్నాథ (Puri Jagannadh) రథయాత్రకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో పూరీకి (Puri) వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త (Goodnews) చెప్పింది. ఇక్కడికి ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతోంది.

Ravinder Gupta Arrested: తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ అరెస్ట్, రూ.50వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన రవీందర్ గుప్తా, యూనివర్సిటీలో సంబురాలు

VNS

నిజామబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) వైస్‌ చాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తా (VC Ravinder Gupta)ను ఏసీబీ అధికారులు శ‌నివారం సాయంత్రం అరెస్టు చేశారు. తార్నాక‌లోని ఆయ‌న నివాసంలో దాదాపు 8 గంట‌ల పాటు సోదాలు నిర్వ‌హించిన అనంత‌రం ర‌వీంద‌ర్ గుప్తాను అరెస్టు చేస్తున్న‌ట్లు ఏసీబీ అధికారులు ప్ర‌క‌టించారు.

Telangana Shocker: ములుగు జిల్లా మంగపేటలో రోడ్డు ప్రమాదం వీడియో వైరల్, ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న వీడియో చూస్తే గుండె గుభేల్ మనడం ఖాయం..

kanha

ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Ponguleti Joins Congress: ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జూపల్లి, పొంగులేటి, కూచుకుంట్ల దామోదర్ రెడ్డి..

kanha

ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జూపల్లి, పొంగులేటి, కూచుకుంట్ల..? రాహుల్‌ గాంధీతో జూమ్‌లో మాట్లాడిన పొంగులేటి, రేవంత్.. జూమ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన డీకే శివకుమార్‌..

Advertisement

Andhra Pradesh: పరిశ్రమల నుంచి విద్యుత్ బకాయిలు వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం..

kanha

విద్యుత్ బకాయిలు, ముఖ్యంగా పరిశ్రమల నుంచి బకాయిలు వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఏపీ విద్యుత్ శాఖా శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అధికారులను ఆదేశించారు.

Vande Bharat Passenger Looted: సికింద్రాబాద్ స్టేషన్ లో ఘోరం, వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికురాలిని కొట్టి బంగారం, వజ్రభరణాలు దోచుకెళ్లిన దుండగులు..

kanha

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. ఘటన జరిగినప్పుడు మహిళ తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేరంలో పాత నేరస్తుడి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Prof Haragopal: ప్రొఫెసర్ హరగోపాల్ మీద పెట్టిన UAPA కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీని ఆదేశించిన సీఎం కేసీఆర్

kanha

హైదరాబాద్ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త జి. హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపై UAPA కేసు ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అంజనీకుమార్‌ను ఆదేశించారు.

TTD Seva Tickets: సెప్టెంబరు నెలకు సంబంధించి సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ.. ఈ నెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం.. మరిన్ని వివరాలు ఇవే..

Rudra

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ నెల 19న తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది.

Advertisement

Accident in Konaseema: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాను-కారు ఢీ.. నలుగురి దుర్మరణం.. మరో 9 మందికి గాయాలు

Rudra

కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Rupee Biryani Offer: రూపాయ్‌ నోటుకు బిర్యానీ ఆఫర్‌.. ఎండను సైతం లెక్క చేయకుండా జనాలు బారులు.. బయటకు వచ్చి చూస్తే జరిమానా.. అసలేంటి విషయం..

Rudra

తెలంగాణలోని కరీంనగర్‌లో ఓ రెస్టారెంట్‌ ఓపెనింగ్‌ సందర్భంగా దాని ఓనర్‌ బిర్యానీకి సంబంధించి ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. రూపాయ్‌ నోటుకు బిర్యానీ అంటూ ప్రకటించారు.

Jogu Ramanna: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న.. కాంగ్రెస్ ఓడిపోతే, రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని ఎమ్మెల్యే సవాల్

Rudra

వచ్చే ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. లేదంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు.

Pawan Kalyan’s Varahi Yatra: అన్ని చోట్లకు పవన్ కళ్యాణ్ రావాలంటే ఎలా ? జనసేన నేతలకు క్లాస్, నన్ను ఒకసారి ముఖ్యమంత్రిని చేసి చూడాలని విన్నపం

Hazarath Reddy

ఏపీలో వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నేతలతో భేటీ అయ్యారు. ఇందులో ఇతర పార్టీలకూ, తమ పార్టీకి ఉన్న వ్యత్యాసం, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు.

Advertisement

Pawan Kalyan Meeting: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ పిఠాపురం మీటింగ్‌లో తీవ్ర విషాదం,చెట్టు కొమ్మ విరిగిపడి 20 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు అభిమానులు చెట్టెక్కెడంతో ఆ చెట్టు కొమ్మలు ఒక్కసారిగా విరిగిపోయాయి. దీంతో వారంతా కిందపడ్డారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.. వీడియో ఇదే..

Jagananna Ammavodi: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఈ నెల 28న విద్యార్ధులకు జగనన్న అమ్మ ఒడి, ఇది లేకపోతే అమ్మ ఒడి డబ్బులు పడవు

VNS

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న అమ్మఒడి పథకం అమలు తేదీని ఫిక్స్ చేసింది. ఈ నెల 28న అమ్మఒడి డబ్బులు అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి స్కీమ్ వర్తిస్తుంది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది సర్కార్. బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13వేలు వేయనుంది.

Andhra Pradesh Shocker: గుండెలు పగిలే విషాదకర ఘటన. పాడె మోస్తూ విద్యుత్ షాక్‌తో ముగ్గురి మృతి, కుప్పంలో అంతిమయాత్రకు వచ్చి అనంతలోకాలకు..

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలో అంతిమయాత్రకు వచ్చిన వారిలో ముగ్గురు విద్యుదాఘాతంతో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం.. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని తంబిగాని పల్లెకు చెందిన రాణి (65) అనారోగ్యంతో మృతి చెందింది

President Murmu Hyd Tour: హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, గవర్నర్‌ తమిళిసై

Hazarath Reddy

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, డీజీపీ స్వాగతం పలికారు.

Advertisement
Advertisement