రాష్ట్రీయం

Google Doodle 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్‌ భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ కు గూగుల్ వినూత్న డూడుల్

Rudra

సందర్భానికి తగినట్లు తమ డిస్‌ ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ ని ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.

Swarnandhra Vision 2047: నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం... విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఉదయం 8 గంటల్లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచన

Rudra

విజయవాడలో నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమాన్ని ఏపీ సర్కారు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Telangana Cold Wave: తెలంగాణపై చలిపులి ప్రతాపం.. శనివారం వరకు రాష్ట్రంలో తీవ్ర చలిగాలులు వీస్తాయన్న ఐఎండీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Rudra

తెలంగాణను చలిపులి వణికిస్తోంది. తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిసెంబర్ 14 వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Revanth Reddy Meets Nitin Gadkari: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ, కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సుధీర్ఘ భేటీ, RRR అనుమ‌తులు స‌హా అనేక అంశాల‌పై చ‌ర్చ‌

VNS

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి (159కి.మీ.) అవసరమైన సాంకేతిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అనుమతులు వెంట‌నే ఇవ్వాల‌ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో (Nitin Gadkari) గురువారం రాత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) భేటీ అయ్యారు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, గుంటూరులో వైసీపీ నేత తనను లైంగికంగా వేధిస్తున్నాడని మీడియా ముందుకు మహిళ

Hazarath Reddy

గుంటూరులో వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు తనను లైంగికంగా వేధిస్తున్నాడని స్వరాజ్యలక్ష్మి అనే మహిళ ఆధారాలతో మీడియా ముందుకు వచ్చింది. తన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు

Hyderabad: కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో వ్యభిచారం, 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కూకట్‌పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరిక

Hazarath Reddy

కేపీహెచ్‌బీలో వ్యభిచారం నిర్వహించే 8 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో రాత్రి 8 గంటల నుంచి 10 వరకు 10 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాం.. వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్‌పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరించారు.

Jagga Reddy: ఏఐసీసీ నేతలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్, పార్టీని చంపేయాలని చూస్తున్నారు..అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? అని మండిపాటు

Arun Charagonda

అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? చెప్పాలని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు...ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? చెప్పాలన్నారు. దీపాదాస్ మున్షీ ఉందా? ఆమె కూడా వేరే రాష్ట్రం వెళ్ళిపోయిందా?, కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చేస్తారా? ఫైనల్ అయ్యేవరకు మాకు చెప్పరా? అని మండిపడ్డారు. ఓ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై నిప్పులు చెరిగారు జగ్గారెడ్డి.

Mandakrishna Madiga: కేబినెట్‌లో మాదిగలకు అవకాశం కల్పించాలి, మాదిగలంటే కాంగ్రెస్‌కు చిన్నచూపు తగదన్నమందకృష్ణ మాదిగ,తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్న?

Arun Charagonda

మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ..కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో మాదిగలకు పలుకుబడి లేదు అన్నారు.

Advertisement

MLA Raja Singh on Mohan Babu: జర్నలిస్టు దాడి ఘటనపై మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి, ఇష్యూని ఇలాగే వదిలేస్తే మరింత పెద్దది అవుతుందని తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్

Hazarath Reddy

జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి ఘటనపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పందించారు.మోహన్ బాబు ఫ్యామీలి గొడవల్లో వారి కొడుకు మీడియాను పిలవడం వల్లే హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారని తెలిపారు. మోహన్ బాబు మీ కుటుంబ సమస్య మీ ఇంటివరకే ఉంటే బాగుంటుంది.. అని తెలిపారు.

Telangana: దారుణం, స్కూల్ నుంచి గంట ముందు ఇంటికి వెళ్లిందని విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్, దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఘటన

Hazarath Reddy

స్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టింది ఓ టీచర్. నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Harishrao: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీని నిలదీస్తాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలన్న మాజీ మంత్రి హరీశ్‌ రావు

Arun Charagonda

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలో సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మే శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు...కేసీఆర్‌ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలని మిమ్మల్ని అడిగాడు రేవంత్ రెడ్డి...అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇంకా నెల కాలేదా? చెప్పాలన్నారు.

Grandhi Srinivas Resigns: వైసీపీని వీడిన మరో కీలక నేత, పార్టీతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

Hazarath Reddy

వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన ఘటన మరువక ముందే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.

Advertisement

Delhi to Rajahmundry Flight: రాజమండ్రి నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం, తొలి నాన్‌స్టాప్ విమానానికి వాటర్ కేనన్స్‌తో సిబ్బంది స్వాగతం

Hazarath Reddy

రాజమండ్రి నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేడు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం మధురపూడి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

Varikuntla Subbaiah Funeral: సైనిక లాంచనాలతో ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు, మతాలకతీతంగా భారీ ఎత్తున తరలివచ్చన ప్రజానీకం

Hazarath Reddy

విధి నిర్వహణలో ఎల్‌ఓసీలో అమరుడైన వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పలలో అశేష జనవాహిని మధ్య అంత్యక్రియలు జరిగాయి. మతాలకతీతంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

AP High Court: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, ట్రాఫిక్ ఛలాన్ కట్టకపోతే విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు..పోలీసు అధికారుల తీరుపై ఫైర్

Arun Charagonda

ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించింది.

AP Jitender Reddy: తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి, మాజీ క్రికెటర్ చాముండేశ్వరి నాథ్‌పై గెలుపు

Arun Charagonda

తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి నియమితులయ్యారు. జితేందర్ రెడ్డి , మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరీ నాథ్‌కి మధ్య ఎన్నిక జరగగా.. జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా, చాముండికి 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో జితేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.

Advertisement

Weather Forecast: ఏపీకి తప్పిన ముప్పు, తమిళనాడు వైపుకు కదిలిన అల్పపీడనం, రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌, భారీ వర్షాలతో చెన్నై విలవిల

Hazarath Reddy

నైరుతి బంగాళా­ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయుగుండంగా బలపడిన తర్వాత.. శ్రీలంక, తమిళనాడు తీరాలవైపుగా పయనించి అక్కడే తీరం దాటే సూచనలున్నాయని వెల్ల­డించారు.

Andhra Pradesh Shocker: ఏపీలో సంచలనం.. కూతురిని వేధించాడని కువైట్ నుండి వచ్చి చంపేశాడు, తానే హత్యచేశానని కువైట్ నుండి వీడియో రిలీజ్

Arun Charagonda

ఏపీలో సంచలనం జరిగింది. కూతురుని వేధించాడని కువైట్‌ నుంచి వచ్చి ఓ దివ్యాంగుడిని చంపేశాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో ఘటన జరిగింది. గత శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసుగా భావించి కేసు నమోదు చేశారు పోలీసులు.

Hyderabad: లాల్‌దర్వాజ నల్లపోచమ్మ దేవాలయంలో అద్భుతం, పసుపులో కుడికాలి పాదం..క్యూ కడుతున్న భక్తులు..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్‌ లాల్‌దర్వాజ మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో అద్భుతం జరిగింది. పసుపులో కుడికాలి పాదం గుర్తు దర్శనమివ్వడంతో సాక్షాత్తూ అమ్మవారు వచ్చారనే నమ్మకంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tirumala: తిరుమలలో భారీ వర్షం, అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేత

Arun Charagonda

తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమయ్యారు సిబ్బంది. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు.

Advertisement
Advertisement