ఆంధ్ర ప్రదేశ్

Rishabh Pant in Tirumala Temple: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, ఫొటోలు దిగేందుకు ఎగబడిన జనాలు

Hazarath Reddy

టీమిండియా క్రికెటర్లు రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్‌లతో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు

AP Cabinet Key Decisions: కులగణనకు ఏపీ కేబినెట్‌ ఆమోదం, ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం, ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌ కేబినెట్‌ సమావేశ మందిరంలో ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

YS Jagan Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసు, సీబీఐకి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసులో ఎంపీ రఘురామకు సంబంధం ఏమిటని సూటి ప్రశ్న

Hazarath Reddy

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై రెబల్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.కేసు విచారణలో జాప్యం జరుగుతోందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Skill Development Scam Case: చంద్రబాబు మద్యంతర బెయిల్‌పై ఏపీ హైకోర్టు తాజా తీర్పు, డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరణ, గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగింపు

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. స్కిల్‌ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

Goodnews for US Visa: యూఎస్ వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌ న్యూస్.. భారీగా తగ్గిన వెయిటింగ్ టైమ్.. 2.5 లక్షల నాన్‌ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌ మెంట్లు ఓపెన్

Rudra

అగ్రరాజ్యం అమెరికా వీసా ఇంటర్వ్యూ కోసం సాధారణంగా చాలా ఎక్కువ సమయం నిరీక్షించాల్సి ఉంటుంది. అయితే అలా ఎదురుచూస్తున్న భారతీయులకు అమెరికా రాయబార కార్యాలయం గుడ్‌ న్యూస్ చెప్పింది.

Sajjala Ramakrishna Reddy: వీడియో ఇదిగో, తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తామంటున్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బార్డర్‌లో ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రదేశ్‌లో కలుస్తామంటున్నారని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఎన్నికల సర్వేలో పోలవరం ముంపు మండలాలతో పాటుగా సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు మేము మళ్లీ ఏపీకి వస్తామని తెలిపినట్లు సజ్జల తెలిపారు.

Chandrababu Health Update: ఏఐజీ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు, టీడీపీ అధినేతకు వైద్య పరీక్షలు పూర్తి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల కోసం గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఆయన బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏఐజీ వైద్యుల బృందం చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది.

Sand Irregularities Scam: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు, చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ, మొత్తం నలుగురి టీడీపీ నేతలపై కేసు నమోదు

Hazarath Reddy

చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఏపీఎమ్‌డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు.

Advertisement

Telangana Assembly Elections 2023: చంద్రబాబు ర్యాలీ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు షాక్, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కేసు నమోదు

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నంబర్‌ 531\2023 కేసు నమోదైంది.

25th ICID Congress Plenary: కరువును తరిమి కొట్టడానికి ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం, నీటి పారుదల రంగంపై సదస్సులో సీఎం జగన్, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

విశాఖలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్‌ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

Group 1 & 2 Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్-1లో 100 పోస్టులు, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీకి ఈ నెల చివరలో నోటిఫికేషన్‌

Hazarath Reddy

ఏపీలో ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ -2 నోటిఫికేషన్‌లు ఇస్తామని, గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Telangana Elections 2023: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్ రోడ్లపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, డబల్ రోడ్ వస్తే తెలంగాణ.. సింగల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ సెటైర్

Hazarath Reddy

డబుల్ రోడ్ వస్తే తెలంగాణ.. సింగల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రోడ్లపై సెటైర్ వేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టుకొని తెలంగాణ విడిపోతే కటిక చీకటి అవుద్ది అన్నాడు. ఇప్పుడు మన దగ్గర వెలుగు జిలుగులు ఉన్నాయి.. మనల్ని శపించినోళ్లు చీకట్లో ఉన్నారు అంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

YSR Awards 2023: విజయవాడలో ఘనంగా YSR అవార్డుల ప్రదానోత్సవం, 27 మందికి వైఎస్సార్ అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్’ అవార్డులు అందజేసింది. నేడు(నవంబర్‌1) ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌ చేతుల మీదుగా వివిధ రంగాలకు 27 మంది ఒక్కొక్కరిగా అవార్డులు స్వీకరించారు.

Andhra Pradesh Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 22 మందికి గాయాలు, అదుపు తప్పి గోడను ఢీకొట్టిన బస్సు

Hazarath Reddy

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం గొల్లమడుగు మలపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి బోల్తాపడింది

AP Formation Day Wishes: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఫొటో మెసేజెస్ మీ బంధుమిత్రులకు వాట్సప్, ఫేస్ బుక్ స్టేటస్ ద్వారా శుభాకంక్షలు చెప్పేయండి

ahana

నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు.

Skill Development Scam: సీఐడీ అధికారుల కాల్‌డేటా ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు, పిటిషన్ కు విచారణ అర్హత లేదని తీర్పులో వెల్లడి

Hazarath Reddy

స్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టు సమయంలో అక్కడున్న సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డు కావాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది

Advertisement

YSRCP MLAs vs Chandrababu: ఇన్ని రోగాలున్న చంద్రబాబు ఏపీకి అవసరమా? కంటి చికిత్స తరువాత మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందే,న్యాయం గెలిచిందనే టీడీపీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్

Hazarath Reddy

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) రాజమహేంద్రవరం జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు

Chandrababu: మనవడు దేవాన్ష్‌ను చూసి భావోద్వేగానికి గురైన చంద్రబాబు, దగ్గరకు తీసుకుని బుగ్గలు చిదుముతూ ముద్దు పెట్టిన ఫోటోలు వైరల్

Hazarath Reddy

భారీ జనసందోహం నడుమ నడుచుకుంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను చూసి పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనలో వాత్సల్యం కట్టలు తెంచుకుంది. దేవాన్ష్ ను ఎంతో ఆపేక్షతో దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. మనవడి బుగ్గలు చిదుముతూ ముద్దు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

Chandrababu Speech After Released Jail: 45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు, మీరు చూపిన అభిమానం మరువలేనని తెలిపిన చంద్రబాబు

Hazarath Reddy

నా కష్టకాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని TDP అధినేత చంద్రబాబు (chandrababu) అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీశ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.‘‘తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు.. అభినందనలు.

Skill Development Scam: ఐదు షరతులతో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఏపీ హైకోర్టులో సీఐడీ తాజా పిటిషన్, కేవలం వైద్యం కోసమే బెయిల్‌ను ఉపయోగించాలని పిటిషన్

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) మధ్యంతర బెయిల్‌పై ఆంక్షలు విధించాలంటూ సీఐడీ (CID) తాజాగా ఏపీ హైకోర్టులో (AP High Court) పిటీషిన్ దాఖలు చేసింది. ఇద్దరు సీఐడీ డీఎస్‌పీలను నిరంతరం టీడీపీ అధినేతను అనుసరించే విధంగా చూడాలని పిటిషన్‌లో పేర్కొంది.

Advertisement
Advertisement