ఆంధ్ర ప్రదేశ్

Khushbu on Bandaru Comments: వీడియో ఇదిగో, రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు, క్షమాపణ చెప్పేవరకు పోరాడుతామని తెలిపిన నటి ఖుష్బూ

Hazarath Reddy

ఏపీ మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు ఖుష్బూ విమర్శలు గుప్పించారు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఆయన ఒక మనిషిగా కూడా విఫలమయ్యారని చెప్పారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Pawan Kalyan on NDA: జనసేన-టీడీపీ-బీజేపీ కలిసే ఎన్నికలకు వెళ్తాం, వైసీపీ అరాచకాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

ఎన్డీయే నుంచి జనసేన బయటికి వచ్చినట్టు జరుగుతున్న ప్రచారంపై (Pawan Kalyan on NDA) జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో తనకు (Pawan Kalyan) సత్సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

CM Jagan Speech on Left Wing Extremism: వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో విద్య పాత్ర చాలా ముఖ్యం, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

Skill Development Scam Case: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్‌లపై తీర్పు రిజర్వ్, సోమవారం తీర్పు వెలువరిస్తామని తెలిపిన ఏసీబీ కోర్టు జడ్జి

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Advertisement

Kadapa Constable Suicide Case: వీడిన కడప హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ కేసు, వివాహేతర సంబంధంమే నలుగురి ప్రాణాలను తీసిందని నిర్థారణకు వచ్చిన పోలీస్ ఉన్నతాధికారులు

Hazarath Reddy

అక్రమ సంబంధం నేపథ్యంలో కుటుంబంలో కలతలు రేగాయి. వెంకటేశ్వర్‌ బుధవారం రాత్రి విధులు ముగించుకుని 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన కస్టడీలోనే ఉండే పోలీసు అధికారులకు సంబంధించిన ఓ పిస్టల్‌ను ఎవరికి తెలియకుండా వెంట తెచ్చుకున్నాడు.

RBI- Repo Rate: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.50% వద్ద యథాతథంగా రెపో రేటు.. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం

Rudra

రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటులో ఈసారి కూడా ఎలాంటి సవరణలు చేయలేదు. రెపో రేటును 6.50% వద్ద యథాతథంగా ఉంచారు. దీంతో వరుసగా నాలుగోసారి కూడా రెపో రేటు 6.50% వద్దే స్థిరంగా కొనసాగుతున్నట్లయింది.

CM Jagan Delhi Tour: కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం జగన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి చర్చ, రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా హస్తినకు చేరుకున్నారు. ఢిల్లీలో సీఎం జగన్‌కు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భరత్‌, రెడ్డప్పా, అయోధ్య రామిరెడ్డి, బాలశౌరి, గోరంట్ల మాధవ్‌, రంగయ్యలు ఘన స్వాగతం పలికారు.

Skill Development Case: చంద్రబాబు రిమాండ్‌ మరో 14 రోజులు పొడిగించిన ఏసీబీ కోర్టు, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో (Skill Development case) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబరు 19 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్‌ గడువు గురువారంతో ముగిసింది.

Advertisement

Skill Development Case: చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించండి, ఏసీబీ కోర్టులో మెమో దాఖలు దాఖలు చేసిన సీఐడీ

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు రెండోదఫా విధించిన రిమాండ్‌ గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఐడీ మళ్లీ మెమో దాఖలు చేసింది

Andhra Pradesh Shocker: కడపలో దారుణం, భార్యతో సహా ఇద్దరు పిల్లలను తుఫాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, వ్యక్తిగత కారణాలే కారణమని తెలిపిన కడప డీఎస్పీ షరీఫ్‌

Hazarath Reddy

కడపలో కో-ఆపరేటివ్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు (50) అనే హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు

Pawan Kalyan: వీడియో ఇదిగో, 2009 నేను ప్రజా రాజ్యం పార్టీలోనే ఎంపీ అయిపోయే వాడిని, నాకు ఆ సత్తా ఉందని తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..నేను 2009 ప్రజా రాజ్యం పార్టీలోనే ఎంపీ అయిపోయే వాడిని.. నాకు ఆ సత్తా ఉందని తెలిపారు. కాగా గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.

Chandrababu Judicial Remand: చంద్రబాబు బెయిల్‌ పై సర్వత్రా ఉత్కంఠ, నేటితో ముగియనున్న రిమాండ్ గడువు, మళ్లీ పొడిగిస్తారా? లేకపోతే బెయిల్ వస్తుందా?

VNS

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు (Skill Development Case) సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు (Chandrababu) రెండోసారి విధించిన రిమాండ్‌ గడువు ఇవాల్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌లో ఆయనను హాజరుపరిచే అవకాశం ఉంది.

Advertisement

Pawan Kalyan on Jagan Govt: రాబోయేది జనసేన - టీడీపీ ప్రభుత్వమే, జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జగన్‌ మోహన్ రెడ్డిది రూపాయి పావలా ప్రభుత్వమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దుయ్యబట్టారు. సీఎం జగన్‌కు ఒంట్లో పావలా దమ్ము లేదని ధ్వజమెత్తారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేనని.. రాబోయేది జనసేన - టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

CM Jagan Delhi Tour: రేపటి నుండి రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు(గురువారం), ఎల్లుండి(శుక్రవారం) సీఎం జగన్‌ ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు సీఎం జగన్‌ ఢిల్లీ బయలుదేరనున్నారు. శుక్రవారం వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌ హాజరుకానున్నారు

Skill development Scam Case: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా, ఏసీబీ కోర్టులో ఇరువురి వాదనలు ఇవిగో..

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను అక్టోబర్‌ 5కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లభించిన అన్ని ఆధారాలు కోర్టు ఎదుట ఉంచామని, చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన అన్ని వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.

Chandrababu Arrest Row: చంద్రబాబు అరెస్టు, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ఎమ్మెల్యే బాలకృష్ణ రియాక్షన్ ఇదిగో

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

Advertisement

Roja on Bandaru Comments: దమ్ముంటే బ్లూ ఫిలిమ్స్‌లో నేను నటించిన సీడీలు విడుదల చేయండి, దారుణంగా నా వ్యక్తిత్వాన్ని విమర్శిస్తారా అంటూ లైవ్‌లో ఏడ్చేసిన రోజా

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి బండారు సత్య­నా­రా­యణ.. ఏపీ మంత్రి రోజాను ఉద్దేశిస్తూ నీచాతి నీచంగా విమర్శించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో.. తనకు ఎదురైన అవమానంపై మంత్రి రోజా మంగళవారం తిరుపతి మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

APSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, దసరాకు 5000 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ నుండి 2,050, బెంగుళూరు నుండి 440 బస్సులు

Hazarath Reddy

రానున్న పండగల పూట ప్రయాణాలు చేసేవారికి ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈసారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది

Pawan Kalyan Gets Police Notice: రాళ్ల దాడి ప్లాన్ ఆధారాలు చూపించు, పవన్ కళ్యాణ్‌కు నోటీసులు ఇచ్చిన కృష్ణా జిల్లా పోలీసులు

Hazarath Reddy

పవన్‌ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్‌చేశారంటూ పవన్‌ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా? అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు.

Andhra Pradesh: ఏపీకి 13 ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.2,851 కోట్ల పెట్టుబడులు, ఆహార శుద్ధి, ఇథనాల్‌ తయారీ పరిశ్రమలను ప్రారంభించిన సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగాభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. ఏపీలో ఆహార శుద్ధి, ఇథనాల్‌ తయారీ పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

Advertisement
Advertisement