ఆంధ్ర ప్రదేశ్

APPSC Group 4 Mains Results: ఏపీపీఎస్సీ గ్రూప్-4 మెయిన్స్‌ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

VNS

670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఏప్రిల్ 4న పరీక్ష జరిగింది. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో మొత్తం 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు.

Andhra Pradesh: ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా భూమిపై రైతుకు పూర్తి హక్కు, 2 లక్షలకుపైగా ఎకరాలకు చెందిన రైతులకు పూర్తిహక్కులు ఇస్తూ సీఎం జగన్ నిర్ణయం

Hazarath Reddy

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతు కుటుంబానికి, రైతులకు.. భూమిమీద ఉండే అనుబంధం తెలిసిన వ్యక్తిని. అందుకే వారికి మేలు చేసేలా మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. హక్కులు కల్పిస్తున్న భూముల మార్కెట్‌ విలువ ఏకంగా రూ.20వేల కోట్లు.

Andhra pradesh: 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు జరిగేలా సీఎం జగన్ నిర్ణయం. 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ రూ. 20,000 కోట్ల విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

Jogi Ramesh on Pawan: చంద్రబాబు పాలేరు పవన్, పదేళ్లుగా జెండాలు మోసిన జనసైనికులు ఆయన తీరుతో ఏడుస్తున్నారని జోగి రమేష్ ఆవేదన

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్‌ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. పాలకుడిని కాదు.. పాలేరునని పవన్‌ ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. పవన్ని నమ్ముకుంటే నట్టేట ముంచారని కార్యకర్తలు బాధ పడుతున్నారని కామెంట్స్‌ చేశారు.

Advertisement

Andhra Pradesh: చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం చూపిన సీఎం జగన్, ఆ భూములపై ఇక నుంచి రైతన్నలకు సంపూర్ణ హక్కులు

Hazarath Reddy

దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెక్‌ పెట్టారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు.

AP Shocker: విజయవాడలో దారుణం, బర్త్ డే పార్టీ అని పిలిచి స్నేహితుడిని చంపేసిన మిగతా స్నేహితులు, కాలిపోయిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం

Hazarath Reddy

విజయవాడ పెద్దపులి పాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బర్త్ డే పార్టీ అని పిలిచి ఓ స్నేహితుడిని మరికొంతమంది స్నేహితులు చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చివేశారు. కాగా కాలిపోయిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమయింది.

AP High Court Suspends G.O. No.1: జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ, జీవో నెంబర్ 1ను కొట్టేసిన ధర్మాసనం, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని వెల్లడి

Hazarath Reddy

జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది.

Four Elephants Dies in AP: ఏపీలో కరెంట్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి, పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదకర ఘటన 

Hazarath Reddy

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పార్వతిపురం మన్యం జిల్లాలో కరెంట్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. జిల్లాలోని భామిని (మ) కాట్రగడ సమీపంలో పొలాల్లో ఉన్న ట్రాన్స్ ఫర్ ను తాకీ విద్యుత్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. మరో రెండు ఏనుగులు తివవ్వా కొండపైకి వెళ్లి నట్టు సమాచారం అందుతోంది.

Advertisement

AP Weather Update: ఓ వైపు వానలు మరోవైపు ఎండలు.. ఏపీలో భిన్న వాతావరణం.. మూడు రోజులపాటు ఇలాగే.. 60 మండలాల్లో నేడు వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు.. ఈ నెల 14న తీరం దాటనున్న ‘మోచా’ తుపాను

Rudra

ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Andhra Pradesh Horror: ప్రియురాలికి తెలియకుండా వేరే యువతితో ప్రియుడి పెళ్ళి, అర్ధరాత్రి ఇంటికెళ్లి ప్రియుడిని నిద్రలేపి మరీ చంపేసిన ప్రియురాలు

Hazarath Reddy

తూర్పు గోదావరి జిల్లాలో ప్రాణంగా ప్రేమించానని నమ్మించి తనను మోసం చేశాడని ఓ యువతి దారుణానికి తెగబడింది. తనను ప్రేమించి మరొకరిని పెండ్లి చేసుకున్నాడనే కక్షతో ప్రియుడ్ని అర్ధరాత్రి ఇంటికి వెళ్లి మరీ హత్య చేసింది

CM Jagan Vizag Tour Highlights: విశాఖలో పర్యటించిన సీఎం జగన్, సీ హ్యారియర్‌ యుద్ధ విమాన మ్యూజియం ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఆర్కే బీచ్‌ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్‌ యుద్ధ విమాన మ్యూజియం ప్రారంభించారు. అక్కడి నుంచి ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో.. ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు సీఎం జగన్‌.

31 People Fell Sick in Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం, కలుషిత నీరు తాగి 31 మందికి వాంతులు, విరేచనాలు, ఒకరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

Hazarath Reddy

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో కలుషిత నీరు తాగి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 31 మంది వాంతులు, విరేచనాలు తదితర కారణాలతో ఆస్పత్రిలో చేరారు.

Advertisement

Ambati Rayudu Meet CM YS Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అంబటి​ రాయుడు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి ముఖ్యమంత్రితో చర్చలు

Hazarath Reddy

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఇవాళ (మే 11) తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్‌తో చర్చించారు

Yarram Venkateswara Reddy Joins YSRCP: సత్తెనపల్లిలో జనసేనకు భారీ షాక్, వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, ఆయన కుమారుడు

Hazarath Reddy

సత్తెనపల్లిలో జనసేనకు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ కీలక నేత యర్రం వెంకటేశ్వరరెడ్డి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. బుధవారం కుమారుడు నితిన్‌ రెడ్డితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరా­రు.

Cyclone Mocha: తెలుగు రాష్ట్రాలు సేఫ్‌, తుఫాన్ ప్రభావం లేదని వాతావరణశాఖ ప్రకటన, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం, ఒడిషా, బెంగాల్‌పై మాత్రం మోచా ఎఫెక్ట్

VNS

బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనంతో మరో తుఫాన్ ముంచుకురాబోతోంది. ఈ అల్పపీడనం (low pressure) బుధవారం తుఫాన్‌ (Cyclone)గా మారే అవకాశం ఉన్నట్లు చెన్నై వాతావరణ పరిశోధనా కేంద్రం (Chennai Meteorological Research Centre) వెల్లడించింది.

Andhra Pradesh: రైతులకు శుభవార్తను అందించిన సీఎం జగన్, అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు సమయంలో ఐదు రోజులకే ధాన్యం డబ్బుల్ని నష్టపోయిన రైతుల ఖాతాలో జమ చేయడం గమనార్హం. అకాల వర్షాలతో పంట దెబ్బ తిన్న రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాలని మొదటి నుంచి సీఎం జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది.

Advertisement

HRA Increase to Govt Employees: కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, హెచ్‌ఆర్‌ఏను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ నిర్ణయం

Hazarath Reddy

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తించనుంది. హెచ్‌ఆర్‌ఏను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

Mudragada Padmanabham: రాజకీయ భవిష్యత్తుపై ప్రజలకు బహిరంగ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం, నన్ను తిహార్ జైలుకు తీసుకువెళ్ళేందుకు హెలికాప్టర్ సిద్దం చేశారని వెల్లడి

Hazarath Reddy

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రజల్లో మార్పు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎప్పుడు రాలేదని తెలిపారు.

Telangana Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టించనున్న భానుడు, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

తెలంగాణలో నేటి నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ నుండి 43 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

MP Vijaya Sai Reddy: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్‌గా ఎంపీ విజయసాయి రెడ్డి నియామకం, బాలినేని స్థానంలో విజయసాయిరెడ్డికి చాన్స్, మూడు జిల్లాల్లో సమస్యలకు చెక్ పెట్టే దిశగా సీఎం జగన్ పావులు..

kanha

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పచెప్పారు. గతంలో ఈ పోస్టుకు బాలినేని శ్రీనివాసరెడ్డి బాధ్యులుగా ఉన్నారు. అయితే తాజాగా బాలినేని పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయగా,మూడు జిల్లాల కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Advertisement
Advertisement