ఆంధ్ర ప్రదేశ్

Chittoor Crime: పరాయి మహిళతో శృంగారం చేస్తుంటే, పొరపాటున చూసిన బాలుడి మర్మాంగాలపై కొట్టి కడతేర్చిన సొంత బాబాయి, హత్య కేసు మిస్టరీని ఛేదించిన చిత్తూరు పోలీసులు

Krishna

బాలుడు ఉదయ్‌ కిరణ్‌ తనకు స్వయానా బాబాయి అయిన కె.సహదేవ, వారి సమీప బంధువు అయిన రాజేశ్వరితో ఏకాంతంగా ఉండడాన్ని గమనించాడు. తమ వివాహేతర సంబంధం గురించి పిల్లాడు బయటకు చెప్తాడనే భయంతో ఇద్దరూ కలిసి ఉదయ్‌ కిరణ్‌ మర్మాంగాలపై కొట్టారు. ఆ తర్వాత టవల్‌తో గొంతు బిగించి చంపేశారు.

AP Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు CM Jagan గుడ్‌న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్, పండగ చేసుకుంటున్న నిరుద్యోగులు, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమం..

Krishna

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో గ్రూప్స్ పోస్టుల భర్తీ జరగనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

TDP Twitter Hacked: టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, విచిత్రమైన పోస్టులతో ఇబ్బందులు పెట్టిన హ్యాకర్, తమ పోస్టులు కాదంటూ లోకేష్ ప్రకటన...

Krishna

టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, తిరిగి అకౌంట్ పొందేందుకు ట్విట్టర్‌తో కలిసి పని చేస్తున్నామని అన్నారు.

New Schedule for AP Tenth Exams: ఏపీలో టెన్త్ పరీక్షల కొత్త తేదీలు ఇవే! పదోతరగతి పరీక్షల షెడ్యూల్ మార్చుతూ నిర్ణయం, జేఈఈ మెయిన్స్ పరీక్షల రీషెడ్యూల్ కారణంగా తేదీలను మార్చిన విద్యాశాఖ

Naresh. VNS

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు (Tenth Class) అలర్ట్. టెన్త్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారులు కొత్త షెడ్యూల్ (new schedule) విడుదల చేశారు. పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేశారు. పాఠశాల విద్యాశాఖ కొత్త పరీక్షా తేదీలను వెల్లడించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

MLA Ambati Rambabu: ఏపీలో పెగాసస్‌ స్పైవేర్‌ ప్రకంపనలు, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలు బయటకు వస్తున్నాయని వెల్లడి

Hazarath Reddy

దేశంలోనే టెక్నాలజీకి ఆద్యుడ్ని అని ప్రచారం చేసుకునే చంద్రబాబు దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చారని ఆరోపించారు. పెగసెస్ చంద్రబాబు (Chandrababu Naidu) వాడినట్లు మమత బెనర్జీ చెప్పారు.. ఆమె మా రాజకీయ మిత్రురాలు కాదని అన్నారు.

AP Health Commissioner New Orders: ఇక గంట గంటకూ సెల్ఫీ దిగాల్సిందే! ఏపీలో డాక్టర్లకు కొత్త రూల్, ప్రతీ గంటలకు వెబ్‌ సైట్‌లో సెల్ఫీ అప్ లోడ్ చేయాలంటూ నిబంధన విధించిన హెల్త్ కమిషనర్

Naresh. VNS

కమిషనర్ కంఠమనేనిగారి ఆదేశాలేమంటే..డాక్టర్లు ఆసుపత్రిలోనే ఉన్నట్లుగా ప్రతీ గంటకు ఒకసారి సెల్పీ తీసి సంబంధిత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని..!! దీంతో డాక్టర్లు తెగ హైరానా పడిపోతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న డాక్టర్లు అందరు అటెండెన్స్‌ కోసం బయోమెట్రిక్ (Biometric)కచ్చితంగా వాడాలి. వాళ్లు ఆస్పత్రికి రాగానే ఎంట్రీ అండ్ ఎక్సిట్ (entry and exit)అయ్యే సమయంలో బయోమెట్రిక్ వాడాలి.

Pegasus Spyware: దేశంలో మళ్లీ పెగాసస్ ప్రకంపనలు, చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన దీదీ, ఖండించిన తెలుగుదేశం పార్టీ

Hazarath Reddy

దేశంలో తాజాగా పెగసస్‌ స్పైవేర్‌ ప్రకంపనలు మొదలయ్యాయి. వివాదాస్పద పెగసస్‌ స్పైవేర్‌ను (Pegasus Spyware) నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) వెల్లడించారు.

Mamata Banerjee on Chandrababu: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలతో చంద్రబాబుకు చిక్కులు, పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేశారంటూ ఆరోపణలు..

Krishna

పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Benarjee).. పెగాసస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల క్రితం పెగాసస్ ను కొనుగోలు చేయాల్సిందిగా ఆఫర్ వచ్చిందని తాము నిరాకరించామని చెప్పారు. అంతేకాదు అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కొనుగోలు చేశారంటూ బాంబు పేల్చారు.

Advertisement

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, గుంటూరు డివిజన్‌ మీదుగా రామేశ్వరం వెళ్లేందుకు స్పెషల్ ట్రైన్స్, సికింద్రాబాద్‌–రామేశ్వరం–సికింద్రాబాద్‌ వయా గుంటూరు మీదుగా రాకపోకలు

Hazarath Reddy

ఏపీ నుంచి రామేశ్వరం వెళ్లేవారికి ఇండియన్ రైల్వే శుభవార్త తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని సికింద్రాబాద్‌–రామేశ్వరం–సికింద్రాబాద్‌ వయా గుంటూరు డివిజన్‌ మీదుగా పలు రైళ్లు కేటాయించడం జరిగిందని రైల్వే డివిజన్‌ సీనియర్‌ డీసీఎం నరేంద్రవర్మ గురువారం వెల్లడించారు

Andhra Pradesh: పుల్లుగా మద్యం తాగి కానిస్టేబుల్‌‌ను చితకబాదిన ఇద్దరు యువకులు, ద్విచక్ర వాహనాలు తొలగించమన్నందుకు దాడి, నిందితులను అరెస్ట్ చేసిన శ్రీకాకుళం పోలీసులు

Hazarath Reddy

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో కానిస్టేబుల్ పై ఇద్దరు వ్యక్తులు దాడి (Two youths beats up a constable) చేసిన ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉన్న ద్విచక్ర వాహనాలు తొలగించాలని చెప్పిన హెడ్‌ కానిస్టేబుల్‌పై (constable in Srikakulam) ఇద్దరు యువకులు దాడి చేసిన సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

Visakha Railway Station: విశాఖపట్నం రైల్వే స్టేషన్​‌కు కీలక గుర్తింపు, ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమానికి ఎంపిక, తూర్పు కోస్తా రైల్వే లో మొట్టమొదటి స్టేషన్​గా విశాఖను ఎంపిక చేసిన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి (One Station, One Product) కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్​లో (Visakha Railway Station) ఏటికొప్పాక బొమ్మల స్టాల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 11,594 కరోనా పరీక్షలు నిర్వహించగా, 54 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ రాలేదు. మిగిలిన జిల్లాల్లో ఒకటీ అరా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 57 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement

AP Budget Session 2022: పేదలకు 30.76 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపిన ఏపీ సీఎం జగన్, ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో (AP Budget Session 2022) పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపై స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) మాట్లాడుతూ.. ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

AP Movie Ticket Prices Row: సినిమా టికెట్ల ధరలపై మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన, మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చు, ఆన్‌లైన్‌ టికెట్‌ విధానానికి టెండర్లు ఖరారు

Hazarath Reddy

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమ్యూనేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలకు టికెట్‌ రేట్లు (AP Movie Ticket Prices Row) పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) తెలిపారు.

Weather Forecast: ఏపీలో మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండండి, వడగాలుల తీవ్రతపై హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఏపీలో ఎండలు ఠారెత్తించనున్నాయి. ఇంకా రోహిణి కార్తె రాలేదు అయినా ఎండలు మాత్రం రోళ్లు పగిలేలా (Weather Forecast) మండుతున్నాయి. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఎండ మండిస్తుంటే .. మే నెలలో అగ్గి రాజుకున్నట్లు(Heatwave prevails in 46 mandals of AP) ఉంటుందని ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.

Kuwait Triple Murder Case: కువైట్ జైలులో కడపవాసి ఆత్మహత్య, కన్నీరు మున్నీరవుతున్న భార్య, పిల్లలు, కువైట్‌లో జరిగిన ఫ్యామిలీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మృతుడు

Hazarath Reddy

దేశం కాని దేశంలో బతుకుదెరువుకోసం వెళ్లిన ఓ వ్యక్తి కేసులో ఇరుక్కుని తనువు చాలించాడు. కువైట్‌లో హత్య కేసులో జైలులో ఉన్న ఏపీ వైఎస్సార్‌జిల్లా వాసి వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

AP Budget Session 2022: ఈ రోజు కూడా 11 మంది టీడీపీ సభ్యులపై ఒకరోజు సస్పెన్షన్ వేటు, అసెంబ్లీలో ఫోన్‌లో రికార్డింగ్‌లు చేయకూడదని తెలిపిన స్పీకర్, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,650 కోట్లతో తాగునీటి సరాఫరా ప్రాజెక్ట్

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ఈ రోజు కూడా టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న కొన‌సాగించారు. అసెంబ్లీలో సభ్యుల మొబైళ్లకు అనుమతి లేదని స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. సభా సంప్రదాయాలను పాటించాలని, చ‌ర్చ‌ల‌కు సహకరించి హుందాగా మెలగాలని అన్నారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై రూలింగ్‌ ఇచ్చారు. ఫోన్‌లో రికార్డింగ్‌లు చేయకూడదని తెలిపారు.

Telangana Temperatures: రెండు రోజులు బయటకెళ్తే మాడిపోతారు, తెలంగాణలో వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరిక, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

Naresh. VNS

ఈ రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా మే నెలలో వడగాలులు వీస్తాయని కానీ ఈ సంవత్సరం మార్చిలోనే వీస్తుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.

Corona in AP: ఏపీలో గత 24 గంటల్లో 69 కరోనా కేసులు, అనంతపురం జిల్లాలో అత్యధికంగా 26 కేసులు నమోదు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 69 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకోగా... ఒక్క మరణం కూడా సంభవించలేదు.

AP Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ఏపీ సర్కారు, దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను జమ

Hazarath Reddy

జగనన్న విద్యా దీవెన (AP Jagananna Vidya Deevena Funds) కింద అక్టోబర్‌-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను ( Jagananna Vidya Deevena Installment Funds) బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు.

Advertisement
Advertisement