ఆంధ్ర ప్రదేశ్
Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కేసులు, కొత్తగా 1,540 మందికి కోవిడ్, గత 24 గంటల్లో 2,304 మంది కోలుకుని డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 20,965 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 61,298 మంది నమూనాలు పరీక్షించగా 1,540 కొత్త కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,304 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,965 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
CM YS Jagan VC Highlights: రూ. 20 వేల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ, ఆగస్టు 16న విద్యా కానుక, ఆగస్టు 10న నేతన్న నేస్తం, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyస్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం వైయస్ జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ (CM YS Jagan Mohan Reddy Video Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్‌ చేసుకోవాలని, వీటి సమర్థత మెరుగుపడాలంటే తనిఖీలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS jagan) అధికారులను ఆదేశించారు.
APJ Abdul Kalam Death Anniversary: డాక్టర్‌ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి, కలాం చేసిన కృషి వెలకట్టలేనిది, ఆయన సేవలు చిరస్మరణీయమని ట్వీట్ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyదివంగత రాష్ట్రపతి, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ యావత్‌ భారత్‌ ఘన నివాళులు అర్పిస్తోంది. ఏపీజే అబ్దుల్‌ కలాం 6వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలాంను స్మరించుకున్నారు.
Pedderu River Tragedy: విశాఖలో తీవ్ర విషాదం, పెద్దేరు నదిలో మునిగి నలుగురు చిన్నారులు మృతి, తల్లి దండ్రుల ఆవేదనతో శోక సంద్రమైన జమ్మాదేవిపేట
Hazarath Reddyవిశాఖపట్నం జిల్లాలోని జమ్మాదేవిపేటలో విషాద ఘటన (Pedderu River Tragedy) చోటుచేసుకుంది. వడ్డాది మాడుగుల పెద్దేరు నదిలో మునిగిపోయిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. పెద్దేరు నది దాటుతుండగా ఊభిలో చిక్కుకుపోయిన నలుగురు చిన్నారులు (4 Children died after fell into Pedderu Revu) మరణించారు.
AP Inter Admissions 2021: ఏపీలో ఆన్‌లైన్‌లోనే ఇంటర్ అడ్మిషన్లు, అడ్మిషన్లకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని తెలిపిన ఇంటర్‌ బోర్డు, విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారానే అడ్మిషన్లు పొందాలని విజ్ఞప్తి
Hazarath Reddyఇంటర్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అడ్మిషన్లకు (AP Inter Admission 2021) ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని పేర్కొంది. కొన్ని కాలేజీలు ఆఫ్‌లైన్‌లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆఫ్‌లైన్‌ అడ్మిషన్లను ఇంటర్ బోర్డు (AP Inter Board) పరిగణించదని స్పష్టం చేసింది.
Sajjala Ramakrishna Reddy: అవి చంద్రన్న గుంతలు, సచివాలయ ఉద్యోగుల ఉద్యోగాలు ఎక్కడికీ పోవు, పరీక్ష పాస్ కాకుంటే ప్రొబేషన్‌లోనే ఉంటారు, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకే అప్పులు చేస్తున్నాం, మీడియాతో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
Hazarath Reddyసచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ కోసం పరీక్షను చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నామని..ఉద్యోగులందరికీ ఇలాంటి రూల్‌ ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు.
Corona in AP: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి, కొత్తగా 1,627 కేసులు నమోదు, గడిచిన 24 గంటల్లో 2,017 మంది కోలుకొని డిశ్ఛార్జి, రాష్ట్రంలో ప్రస్తుతం 21,748 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో 57,672 నమూనాలను పరీక్షించగా.. 1,627 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (Corona in AP) అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,56,392కి (Covid in Andhra Pradesh) పెరిగింది. తాజాగా 17 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,273కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు, ప్రతి నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన టీటీడీ, www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని వెల్లడి
Hazarath Reddyతిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు (TTD Darshan Tickets) రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) వర్గాలు తెలిపాయి.
AP High Court: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు, భర్త గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీసీ సెక్షన్‌ 498ఏ కింద విచారించడానికి వీల్లేదని స్పష్టం, భర్త సంబంధీకుల్లోకి గర్ల్‌ఫ్రెండ్‌ రాదని వెల్లడి
Hazarath Reddyఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీసీ సెక్షన్‌ 498ఏ (మహిళను వేధింపులకు గురిచేయడం) కింద విచారించేందుకు వీల్లేదని ఏపీ అత్యున్నత న్యాయస్థానం (AP High Court) తేల్చి చెప్పింది. రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే ఈ సెక్షన్‌ కింద విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది.
Mega Covid Vaccination Drive: నేడు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ మెగా డ్రైవ్‌, కృష్ణా జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌
Hazarath Reddyకృష్ణా జిల్లా వ్యాప్తంగా సోమవారం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ మెగా డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోని గర్భిణులు, బాలింతలు, ఉపాధ్యాయులు, నర్సింగ్, శానిటేషన్‌ సిబ్బంది ఇతర హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్‌ అందిస్తామన్నారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 2,252 మందికి కరోనా, 15 మంది మృతి, 2,440 మంది కోలుకుని డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 22,155 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 84,858 మంది నమూనాలు పరీక్షించగా 2,252 కొత్త కేసులు (Corona in AP) నమోదయ్యాయి. 15 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,440 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,155 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
Eluru Municipal Corporation Election Results: ఏలూరు కార్పోరేషన్ వైసీపీ కైవసం, మేయర్ పీఠం కూడా అధికార పార్టీదే, 47 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ గెలుపు, 3 స్థానాలకు పరిమితమైన టీడీపీ, ఎన్నికలకు ముందే మూడు ఏకగ్రీవం
Hazarath Reddyపశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ పీఠాన్ని వైసీపీ (YSRCP bags Eluru Municipal Corporation) దక్కించుంది. ఏలూరు మేయర్ పీఠం కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 47 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ గెలుపు సాధించింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది.
Mann Ki Baat: ఏపీ కుర్రాడు సాయి ప్రణీత్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు, ఏపీ వెదర్ మ‌న్ పేరుతో రైతులకు సమాచారం అందిస్తూ మంచి పనిచేస్తున్నారని వెల్లడి, మ‌న్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ (Mann ki Baat) ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణవేత్త సాయి ప్రణీత్ బి మరియు ఒడిశా యొక్క ఇంటర్నెట్ సంచలనం ఇసాక్ ముండా యొక్క స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాలను దేశ ప్రజలతో పంచుకున్నారు.
Eluru Municipal Election Results: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ దూకుడు, ఇప్పటికే 17 స్థానాలను కైవసం చేసుకున్న అధికార పార్టీ, ఒక్కస్థానంలో టీడీపీ గెలుపు, ఇంకా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
Hazarath Reddyపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో (Eluru Municipal Election Results) అధికార వైసీపీ తన సత్తా చాటుకుంది. ఇప్పటివరకు వైసీపీ 17 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ మాత్రం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైంది. మరిన్ని డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంది.
Andhra Pradesh: ఏపీలో 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు, ఆగస్టు 3లోగా తమకు పోస్ట్ ఇచ్చిన న్యాయస్ధానాల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం
Hazarath Reddyరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉన్న జడ్జిలను ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది. ఒకేసారి ఇంతమంది జడ్జిలను బదిలీ చేయడం విశేషం.
Andhra Pradesh: రూ. 500 ఇస్తే మహిళల న్యూడ్ కాల్స్, కాల్‌గర్ల్స్‌ కావాలంటే మరో రేటు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన కర్నూలు వన్‌టౌన్‌ పోలీసులు, మీడియాకు వివరాలను తెలిపిన సీఐ కళా వెంకటరమణ
Hazarath Reddyకాల్‌గర్ల్స్, అశ్లీల మహిళల వీడియో కాల్స్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను కర్నూలు వన్‌టౌన్‌ పోలీసులు (Kurnool One Town police) శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్ వివరాలను సీఐ కళా వెంకటరమణ మీడియాకు వివరించారు.
Eluru Corporation Election Results: ఏలూరు కార్పోరేషన్ ఎవరి ఖాతాలోకి, ఇప్పటికే 3 వైసీపీ కైవసం, మిగతా 47 స్థానాల్లో కొనసాగుతున్న కౌంటింగ్, మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితాలు
Hazarath Reddyపశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల (Eluru Municipal Corporation Election Results) కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఏలూరు శివారులోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఇప్పటికే పటిష్ట ఏర్పాట్లు చేశారు. 47 డివిజన్లకు 48 టేబుల్స్‌పై ఒకే రౌండ్‌లో ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Corona in Andhra Pradesh: ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు నమోదు, 2,737 మంది కోలుకుని డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 22,358 యాక్టివ్‌ కేసులు, గత 24 గంటల్లో 18 మంది మృతి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,820 పరీక్షలు నిర్వహించగా.. 2174 కేసులు (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో19,49,618 మంది వైరస్‌ (Coronavirus) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Y. S. Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసులో కీలక మలుపు, జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మెన్‌ రంగన్న, వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పర్యవేక్షకాధికారిణి డీఐజీ సుధాసింగ్‌ బదిలీ
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ హత్య కేసులో (Y. S. Vivekananda Reddy Murder Case) కీలక సాక్షిగా భావిస్తున్న వాచ్‌మెన్‌ రంగన్న (65) వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేయించింది.