ఆంధ్ర ప్రదేశ్

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్‌పై ఎలాంటి భయాలు అక్కర్లేదు, దేనికైనా యంత్రాంగం సిద్ధంగా ఉందన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ; రాష్ట్రంలో కొత్తగా 70 కోవిడ్ కేసులు నమోదు

Team Latestly

3 టి - (ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్) స్ట్రాటజీని రాష్ట్రంలో కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఏపి ఆరోగ్యశాఖ సమర్థవంతగా కోవిడ్ మహమ్మారిపై పోరాడి విజయం సాధించింది. ఈ క్రమంలో కోవిడ్‌ యొక్క సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కోవటానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ...

AP Cabinet Meeting Highlights: ఈబీసీ మహిళలకు మూడేళ్లకు రూ. 45 వేల ఆర్థిక సాయం, అమరావతికి సంబంధించి కీలక నిర్ణయం, ఈ ఏడాది నవరత్నాల పథకాలకు మంత్రి వర్గ ఆమోదం, కేబినెట్‌ భేటీలో ఏపీ సీఎం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో మంగళవారం కొనసాగిన కేబినెట్‌ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు (AP Cabinet Meeting Highlights) కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Durga Temple Employees Suspended: కనకదుర్గమ్మ గుడిలో అవినీతి కొండలు, 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన దేవాదాయశాఖ, అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఏసీబీ

Hazarath Reddy

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గుడిలో అవినీతికి పాల్పడిన 13 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇంద్రకీలాద్రిపై (Kanaka Durgamma Temple) అక్రమాల నిధి ఇంటి దొంగల పనే అని ఏసీబీ నివేదిక తేల్చింది.

AP Municipal Polls: మార్చి 10వ తేదీ అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించండి, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, గవర్నర్‌ను కలిసిన ఏపీ ఎన్నికల కమిషనర్, మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు

Hazarath Reddy

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసి మునిసిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు (AP Municipal Polls) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కీలక ఆదేశాలను జారీ చేశారు.

Advertisement

AP Cabinet Meet: కీలక అంశాలే ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ, వచ్చే నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, విశాఖ ఉక్కు, రాష్ట్ర విభజన హామీలు, ఉద్యోగుల పంపకం మొదలగు అంశాలతో అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meet) కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు ప్రధాన ఎజెండాగా కేబినెట్‌లో చర్చిస్తారని తెలుస్తోంది.

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో 60 శాతానికి పైగా పూర్తైన రెండో డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొత్తగా 41 కరోనా 50 కేసులు నమోదు, 590కి చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

మరో 71 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,81,582 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 590 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ...

CM YS Jagan Review Meeting: పనితీరు కనబర్చిన వాలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర పేర్లతో సత్కారాలు, ఉగాది రోజున కార్యక్రమం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉగాది రోజున గ్రామ సచివాలయ వాలంటీర్‌లను సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని పేర్కొన్నారు. సేవారత్న, సేవామిత్ర.. పేరుతో ఇలా మంచి సేవలను అందించిన వాలంటీర్లను సత్కరించాలన్నారు.

AP Local Body Polls: రాజకీయాలు వదిలి పొలం బాట, గుర్తు పట్టలేని కొత్త లుక్‌తో కనిపించిన మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, గంగులవారి పాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్న రఘువీరా దంపతులు

Hazarath Reddy

ఈ ఫోటోలో ఉన్న నాయకుడిని గుర్తుపట్టారా.. ఒకప్పుడు మంత్రి. అలాగే ఏపీసీసీకి అధ్యక్షుడు..కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్నప్పుడు ఎప్పుడూ సెక్యూరిటీ గార్డులు గన్ మెన్లతో తిరిగే మంత్రి నేడు ఇలా చిన్న మోపెడ్ ండి మీద ోటు కేంద్రానికి వచ్చారు. ఇంతకీ ఈయనెవరొ చెప్పనే లేదు కదా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి (Ex APCC President N.Raghuveera Reddy).

Advertisement

AP Local Body Polls: 10,890 మంది సర్పంచ్ లు నేరుగా ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపిన ఎస్ఈసీ, పోలీసుల పని భేష్, ఇదే ఉత్సాహంతో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అందించిన సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతం అయ్యాయని ఆయన (SEC Nimmagadda Ramesh Kumar) తెలిపారు.

AP Local Body Polls: 4వ దశలో కూడా వైసీపీ మద్దతుదారులదే హవా, నాలుగు దశలు కలిపి 81.78 శాతం పోలింగ్ నమోదు, ఈ ఎన్నికల్లో 2.26 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపిన కమిషనర్ గిరిజాశంకర్

Hazarath Reddy

పీలో నాలుగో విడత ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగో విడతలో మొత్తం 82.85 శాతం పోలింగ్ (AP Local Body Polls) నమోదు కాగా నాలుగు దశలు కలిపి 81.78 శాతం నమోదు అయింది.

AP Panchayat Elections 2021: ముగిసిన నాలుగో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్, ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగిన పోలింగ్

Hazarath Reddy

ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మధ్యాహ్నం ఓటింగ్‌ ముగిసే సమయానికి (AP Panchayat Elections 2021) శ్రీకాకుళం 78.81, విజయనగరం 85.60, విశాఖ 84.07, తూ.గో. 74.99, ప.గో. 79.03, కృష్ణా 79.29, గుంటూరు 76.74, ప్రకాశం 78.77, నెల్లూరు 73.20, చిత్తూరు 75.68, కర్నూలు 76.52, అనంతపురం 82.26, వైఎస్‌ఆర్‌ జిల్లాలో 80.68 శాతం పోలింగ్‌ నమోదైంది.

Polavaram Update: చివరి దశకు చేరుకున్న పోలవరం పనులు, స్పిల్‌వే గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి, 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ, 2022 కల్లా ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని తెలిపిన పోలవరం డ్యామ్‌ డిజైన్ రివ్యూ క‌మిటీ చైర్మ‌న్ ఏబీ పాండ్యా

Hazarath Reddy

ఏపీ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం పనులు శర వేగంగా ముందుకు (Polavaram Update) సాగుతున్నాయి. ఈ రోజు పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. స్పిల్‌వే గడ్డర్ల మొత్తం ఏర్పాటు ప్రక్రియ (Polavaram Spillway pillers) పూర్తయ్యింది. కేవలం 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై మేఘా ఇంజినీరింగ్ సంస్థ అమర్చింది. షట్టరింగ్‌, స్లాబ్ నిర్మాణంపై నిపుణులు దృష్టి పెట్టారు. గడ్డర్ తయారీకి 10 టన్నుల స్టీల్‌, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు.

Advertisement

AP Local Body Polls: ఏపీలో కొనసాగుతున్న నాలుగో దశ పోలింగ్, మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్, సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు, 3,299 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాల్లో 554 మంది ఏకగ్రీవం

Hazarath Reddy

ఏపీలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నాలుగో దశలో 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్‌ (AP Local Body Polls) కొనసాగుతోంది. మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను వెల్లడిస్తారు

NITI Aayog Meeting: సీఎం జగన్ విజన్‌ను అభినందించిన నీతి ఆయోగ్ పాలక మండలి, సీఎం జగన్ వ్యాఖ్యలను ట్వీట్ చేసిన నీతి ఆయోగ్, భారత్ నెట్ ప్రాజెక్టు పేరిట ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన ఏపీ సీఎం

Hazarath Reddy

జగన్ విజన్ కు నీతి ఆయోగ్ పాలక మండలి సంతృప్తి వ్యక్తం చేసింది. పల్లెపల్లెకు ఇంటర్నెట్ ను తీసుకెళ్లాలన్న జగన్ ఆకాంక్షను అభినందించింది. భారత్ నెట్ ప్రాజెక్టు పేరిట ప్రతిగ్రామంలో ప్రతి వ్యక్తికి ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలన్న జగన్ సంకల్పాన్ని ప్రశంసించింది. ఈ క్రమంలో ఏపీ సీఎం చేసిన వ్యాఖ్యలను నీతి ఆయోగ్ ట్వీట్ చేసింది.

MPTC & ZPTC Elections in AP: ఆ ఏకగ్రీవాలపై మీరు ఎలాంటి జోక్యం చేసుకోరాదు, ఎసీఈసీకి ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా

Hazarath Reddy

గతేడాది అర్ధాంతరంగా ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా SEC ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు జోక్యం చేసుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఈ నెల 18న జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.

AP Panchayat Poll 2021: ఏపిలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు అదనపు మార్గదర్శకాలు జారీ, బ్యాలెట్ కౌంటింగ్ కూడా వీడియో రికార్డింగ్ చేయాలని అధికారులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం

Team Latestly

ఇతరులను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించవద్దని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అంతేకాకుండా, విజేతను ప్రకటించే సమయంలో పది ఓట్ల కంటే తక్కువ తేడా ఉంటే రీకౌంట్ చేయాలని నూతన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.....

Advertisement

Vizag Steel Plant Privatization: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం, స్పష్టం చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కృషి చేస్తానని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్లాంట్‌ ప్రైవేటీకరణపై (Vizag Steel Plant Privatization) ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు.

AP Panchayat Elections: మూడో దశలోనూ వైసీపీ మద్దతుదారులదే హవా, తొగరాం సర్పంచ్‌గా విజయం సాధించిన ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ, రాష్ట్రవ్యాప్తంగా 80.64 శాతం పోలింగ్‌ నమోదు

Hazarath Reddy

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఒకట్రెండ్లు చోట్ల చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్‌ ప్రశాంతంగా (AP Panchayat Elections) జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 80.64 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం నమోదుకాగా.. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 69.20 శాతం నమోదైంది.

AP Local Body Polls: ముగిసిన మూడో దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొదలైన ఓట్ల లెక్కింపు, ఓటువేసేందుకు వెళ్తున్న జీపు బోల్తా, పలువురికి గాయాలు

Hazarath Reddy

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌లో (AP Local Body Polls) పాల్గొన్నారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది. చివరి గంటలో క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

Andhra Shocker: క‌ట్ట‌ల కొద్దీ డ‌బ్బు చెదలపాలు, లబోదిబోమంటున్న బాధితుడు, మైలవరంలో మాసం దుకాణం యజమాని ట్రంకు పెట్టెలో దాచిన రూ. 5 లక్షల డబ్బును తినేసిన చెదలు

Hazarath Reddy

ల్లు కట్టుకుందామని పైసాపైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము చెదలపాలైంది. అది చూసి తట్టుకోలేని ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా మైలవరంలో జరిగింది.

Advertisement
Advertisement