ఆంధ్ర ప్రదేశ్

AP Legislative Council Cancellation: ఏపీ శాసనమండలి రద్దుకు ఏకగ్రీవ తీర్మానం, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ క్యాబినెట్, అసెంబ్లీకి రానున్న ఏపీ శాసనమండలి రద్దు బిల్లు, తరువాత ప్రాసెస్ ఏంటీ ?

Hazarath Reddy

ఏపీ క్యాబినెట్ (AP Cabinet) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలిని రద్దు (AP Legislative Council Cancellation) చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిది పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు (CRDA Cancellation) బిల్లులను శాసనమండలి వ్యతిరేకించి సెలక్ట్ కమిటీకి (Selection committee) పంపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

AP Cabinet Meeting: ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం, శాససమండలి ఉంటుందా..ఊడుతుందా..? మరికొద్ది సేపట్లో తేలిపోనున్న శాసనమండలి భవితవ్యం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం (AP Cabinet) కొద్ది సేపటి క్రితమే సమావేశమైంది. శాసనమండలి రద్దుపై (AP Legislative Council Cancellation) ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మండలి భవితవ్యంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్‌ నిర్ణయం తర్వాత అసెంబ్లీలో దీనిపై చర్చించి, ఆ తర్వాత ఈ అంశంపై తీర‍్మానం చేయనుంది.

Biswabhusan Harichandan: మూడు రాజధానులపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు, అభివృద్ది, అధికార వికేంద్రీకరణతోనే అన్నీ సాధ్యమన్న బిశ్వభూషణ్ హరిచందన్, జాతీయజెండాను ఆవిష్కరించిన ఏపీ గవర్నర్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (India Republic Day 2020) ఘనంగా జరిగాయి. విజయవాడ (Vijayawada)ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు అంబరాన్ని తాకాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, (Biswabhusan Harichandan) ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.

Earthquake In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, అర్థరాత్రి ఉలిక్కిపడిన ప్రజలు, రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.7గా నమోదు, భయపడవద్దని భరోసా ఇస్తున్న అధికారులు

Hazarath Reddy

ఆదివారం తెల్లవారుజామున తెలుగు రాష్ట్రాల్లో ( Telugu States) పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఏపీలోని కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అర్థరాత్రి వేళ భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదైనట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో (Earth Quake In Telugu States) భూమి ఆరు సెకెన్ల పాటు కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Human Trafficking Victims: కువైట్‌లో అమ్మకానికి 200 మంది ఆంధ్ర అమ్మాయిలు, సంచలనం రేపుతున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్, రక్షించాలంటూ కేంద్ర మంత్రికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి

Hazarath Reddy

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి (YSRCP MP Vijayasai Reddy V) ట్విట్టర్ (Twitter) ద్వారా ఎప్పుడూ ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ మధ్య ఓ సంచలన ట్వీట్ చేశారు. కువైట్ లో 200మంది ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయిలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లుగా మహిళలు చెబుతున్న వీడియోను పోస్టు (Video) చేసిన విజయసాయి రెడ్డి, కువైట్ లో (Kuwait) చిక్కుకున్న ఏపీ అమ్మాయిల్ని రక్షించాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌ని కోరుతూ ట్వీట్ చేశారు.

AP Capital Fight: టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఫైట్, దిష్టి బొమ్మల దహనంతో మండిపోతున్న ఏపీ, అమరావతే రాజధాని అంటున్న టీడీపీ శ్రేణులు, మూడు రాజధానులు కావాల్సిందే అంటున్న వైసీపీ శ్రేణులు

Hazarath Reddy

ఏపీలో ఇప్పుడు రాజధాని మార్పు అంశం వేడిని రేకెత్తిస్తోంది. ఏపీ రాజధాని అంశం కాస్తా వైసీపీ టీడీపీ శ్రేణులు వార్ గా (YCRCP vs TDP)మారింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లు, ( There Capitals) సీఆర్డీఏ బిల్లును (CRDA Bill) శాసనమండలిలో టీడీపీ (TDP) అడ్డుకోవడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Mood Of The Nation Survey: దేశంలో 4 వ బెస్ట్ సీఎంగా ఏపీ సీఎం వైయస్ జగన్, మొదటి వరసలో యోగి ఆదిత్యానాథ్, పాపులర్ నాయకుల్లో ప్రధాని మోడీదే అగ్రస్థానం, ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్స్‌ సర్వేలో వెల్లడి

Hazarath Reddy

దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో (best performing chief ministers) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) టాప్ టెన్ లిస్టులో చోటు సంపాదించారు. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ (Mood Of The Nation 2019) పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్‌ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 4 వ స్థానం దక్కింది.

AP Won Best State Award: 2019 ఎన్నికలకు గానూ బెస్ట్ స్టేట్ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ, బెస్ట్ సీఈఓగా గోపాలకృష్ణ ద్వివేది, ఉత్తమ భద్రతా అధికారిగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, తెలుగు రాష్ట్రాలకు మూడు అవార్డులు

Hazarath Reddy

2019 సార్వత్రిక ఎన్నికలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల అవార్డులను (ECI National Awards 2019) ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ( 2019 Assembly Elections) ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్ అవార్డు ను కైవసం చేసుకుంది.

Advertisement

AP Cabinet: శాసన మండలి ఉంటుందా..ఊడుతుందా ?, జనవరి 27 న ఏపీ కేబినెట్‌ భేటీ, బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపలేదన్న శాసనమండలి స్పీకర్, టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని వెల్లడి

Hazarath Reddy

ఏపీ శాసనమండలి (AP Legislative Council) రద్దు చేయాలనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ (AP Government) నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఈ వార్తలకు తెరదించేందుకు దీనిపై ఓ స్పష్టత ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి (AP Cabinet) జనవరి 27 న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కేబినెట్‌ భేటీ జరగనుంది.

Three Capital Petitions: బిల్లులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని వెల్లడి, తదుపరి విచారణ ఫిబ్రవరి 26 కి వాయిదా

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం (AP Government) తీసుకువచ్చిన పాలనా వికేంద్రీకరణ (Three Capitals) , సీఆర్డీఏ (CRDA) ఉపసంహరణ బిల్లులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు (AP High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత దశలో వాటిని విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

AP Legislative Council: ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి..?,దేశంలో ఏయే రాష్ట్రాల్లో ఉంది, ఎన్ని చోట్ల రద్దైంది..?,ఏపీ శాసనమండలి ఎప్పుడు ప్రారంభమైది,దాని చరిత్ర ఏమిటీ..? ఆంధ్రప్రదేశ్ శాసనమండలిపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వికేంద్రీకరణ బిల్లు, అలాగే ఇతర బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినా ఏపీ శాసనమండలిలో అవి ఆమోదం పొందలేదు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీ‌ఏ బిల్లును ఏపీ శాసనమండలి వ్యతిరేకించడమే కాకుండా దాన్ని సెలక్ట్ కమిటీకి పంపాల్సిందిగా శాసన మండలి ఛైర్మెన్ ఎంఎ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్న విశేష అధికారాలతోనే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి సిఫార్స్ చేశానని ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ అన్నారు.

AP Assembly Session: ఏపి శాసనమండలి రద్దు వైపు ప్రభుత్వం అడుగులు, మండలి పరిణామాలు బాధించాయని పేర్కొన్న సీఎం జగన్, రద్దు చేయాలని ప్రతిపాదించిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్

Vikas Manda

రాష్ట్రానికి కౌన్సిల్ యొక్క అవసరాన్ని సీఎం ప్రశ్నించారు, ఇది సంవత్సరానికి 60 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తుంది. దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయని చెప్పారు. మండలి కొనసాగింపుపై సోమవారం చర్చించాలని జగన్...

Advertisement

Andhra Pradesh: వైఎస్ జగన్ వ్యూహాత్మక తప్పిదం, అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ, సెలెక్ట్ కమిటీకి 'రాజధాని' బిల్లులు, ఇక ముందు జరగబోయేదేమిటి? విశ్లేషణాత్మక కథనం

Vikas Manda

ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులు అసెంబ్లీలో ఉంటారు కాబట్టి, అసెంబ్లీ రెండో సారి ఏదైనా బిల్లును ఆమోదిస్తే, మండలి సభ్యులతో సంబంధం లేకుండా, మండలి కూడా ఆ బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణించబడుతుంది. మండలి యొక్క అధికారాలు చాలా పరిమితం.....

AP Assembly Session: 'శుక్రవారం' అంటూ సీఎం జగన్‌ను రెచ్చగొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు, వీధిరౌడీలను ఏరివేస్తే గానీ వ్యవస్థ మారదంటూ తీవ్రంగా రియాక్టయిన ముఖ్యమంత్రి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ

Vikas Manda

వైసీపీ ఎమ్మెల్యేలు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారు, సీఎం జగనే స్వయంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. స్పీకర్ కూడా ఏం చేయడం లేదంటూ టీడీపీ సభ్యులు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు...

Jayadev Galla: గల్లా జయదేవ్‌పై నాన్ బెయిలబుల్ కేసులు, గుంటూరు సబ్ జైలుకు తరలింపు, బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి కోర్టు, అమరావతి కోసం తన పోరాటం కొనసాగుతుందన్న టీడీపీ ఎంపీ

Hazarath Reddy

వైసీపీ ప్రభుత్వం (YCP Govt) మూడు రాజధానుల (3 Capitals) నిర్ణయానికి నిరసనగా చేపట్టిన అసెంబ్లీ ( AP Assembly)ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో రైతులకు (Farmers)మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై(TDP MP Galla Jayadev) కూడా పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేసారు.

Dokka Manikya Vara Prasad: టీడీపీకి భారీ షాక్, 3 రాజధానుల బిల్లు చర్చకు ముందే ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా, మంత్రి మండలికి హాజరు కాని మరో టీడీపీ ఎమ్మెల్సీ, రూల్ 71 అస్త్రం టీడీపీకి పనిచేస్తుందా...?

Hazarath Reddy

మండలిలో (AP Legislative Council ) వికేంద్రీకరణ బిల్లుపై చర్చ నేపథ్యంలో టీడీపీకి (TDP)షాక్‌ తగలింది. ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్‌(Dokka Manikya Varaprasad) రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు.

Advertisement

AP Assembly Special Sessions Day 2: సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని, ఎస్టీ సంక్షేమ బిల్లును ప్రవేశపెట్టిన సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్, నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలు, వైయస్‌లా చనిపోవాలని ఉందన్న కొడాలి నాని

Hazarath Reddy

Amaravati Farmers Bandh: రాజధాని గ్రామాల్లో బంద్, అమరావతి పరిధిలోని 29 గ్రామాలు బంద్‌లోకి.., అసెంబ్లీలో 3 రాజ‌ధానుల బిల్లు ఆమోదం, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటున్న రైతులు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులకు(Three Capitals) నిరసనగా నేడు ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలోని గ్రామాలు బంద్‌ కు పిలుపు నిచ్చాయి. దీంతో పాటుగా రైతులపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా అమరావతి జేఏసీ (Amaravathi JAC) బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాజధానిలోని 29 గ్రామాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.

AP Assembly Special Session Day 1: అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్, చేతులెత్తి మొక్కుతున్నానంటూ చంద్రబాబు ఆవేదన, 3 రాజధానులపై అసెంబ్లీలో వాడి వాడీ చర్చ, ఎవరేమన్నారో వారి మాటల్లో..

Hazarath Reddy

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు (AP Assembly Session)మూడు రోజులు, శాసనమండలి సమావేశాలు రెండు రోజులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Special Session day 1) కాక పుట్టించాయి. సభలోకి స్పీకర్ తమ్మినేని (AP Speaker) ప్రవేశించిన వెంటనే 'బ్యాడ్ మార్నింగ్ సార్' అని టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAs) అన్నారు.

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్, 3 రాజధానుల బిల్లు అమోదం, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన ఏపీ సీఎం వైయస్ జగన్, 17 మంది సభ్యులపై స్పీకర్ ఒక రోజు సస్పెన్షన్ వేటు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను(TDP MLSs) సస్పెండ్ చేసిన తర్వాత.. మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు తీసుకొచ్చారు. దీంతో అసెంబ్లీ గేటు ( Assembly Gate) దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపగా అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) కూడా మద్దతిచ్చారు.

Advertisement
Advertisement