ఆంధ్ర ప్రదేశ్

YS Vijayamma Charitable Trust: వైయస్ విజయమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ వైయస్సార్ ఫ్యామిలీది కాదు, క్లారిటీ ఇచ్చిన ట్రస్ట్ యాజమాన్యం, వైయస్ విజయమ్మ నడుపుతున్నదంటూ సోషల్ మీడియాలో పుకార్లు

Hazarath Reddy

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. వైయస్సార్ ఫ్యామిలీకి చెందిన వైఎస్‌ విజయమ్మ చారిటబుల్‌ ట్రస్టు(YS Vijayamma Charitable Trust)ను కేంద్రం బ్యాన్ చేసిందని..అయితే ఇందులో నిజమెంతో తెలియకుండానే సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఏపీ (Andhra pradesh) ప్రభుత్వానికి ఇది పెద్ద షాక్ అంటూ వార్తలు వడ్డించారు.

YSR Navasakam: 20 నుంచి వైయస్‌ఆర్ నవశకం, ప్రతి ఇంటి గడపకు పాలనే లక్ష్యంగా వైఎస్‌ఆర్ నవశకం, ఐదు రకాల కార్డుల జారీ, కాపు నేస్తం పథకం అర్హతల గురించి తెలుసుకోండి

Hazarath Reddy

నవరత్నాల అమలు(government’s Navaratnalu programme)లో భాగంగా డిసెంబర్ 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ నవశకం (YSR Navasakam) సర్వే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం (AP Government) శ్రీకారం చుట్టింది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో అదే రోజు గ్రామ సభలు నిర్వహిస్తారని పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం విజయవాడ నుంచి గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక కార్యదర్శి కన్నబాబు (KannaBabu)తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Vizag Man Arrested In Pakistan: ప్రేమ విఫలం, పాకిస్థాన్‌లో ప్రత్యక్షం. ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేసిన పాకిస్థాన్ పోలీసులు, అందులో ఒకరు విశాఖ వాసిగా గుర్తింపు

Vikas Manda

బాబూరావు కుటుంబం 5 ఏళ్ల క్రితం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆయన కుమారుడు ప్రశాంత్ కూడా మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే వాడు. అయితే రెండేళ్ల క్రితం ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. దీనిపై ఏప్రిల్ 29, 2017న బాబూరావు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు....

Andhra Pradesh: వైసీపీని గెలిపించినందుకు రాష్ట్రంలో దుష్ట పాలన సాగుతోంది, జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్తుంది, వైఎస్ జగన్‌పై కేంద్రంలోని పెద్దలకు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు?

Vikas Manda

చంద్రబాబు హయాంలో చేపట్టిన రాజధాని నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు నేడు పూర్తిగా నిలిచిపోయాయని రాష్ట్రానికి వచ్చిన కంపెనీలన్నీ ఏపీని విడిచి వెళ్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో.....

Advertisement

Devineni Avinash: టీడీపీకి దేవినేని అవినాష్ రాజీనామా, ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి, గత ఎన్నికల్లో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని చేతిలో ఓటమి

Hazarath Reddy

టీడీపీ యువనేత దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి రాజీనామా లేఖను పంపారు. వెంటనే వైసీపీ జాయిన్ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో దేవీనేని అవినాష్ వైసీపీ కండువా కప్పుకున్నారు.

Chandrababu Hunger Strike: ఏపీలో ఇసుక రాజకీయం, ఓ వైపు వారోత్సవాలు, మరోవైపు దీక్షలు, ఇసుక కొరతగా నిరసనగా చంద్రబాబు దీక్ష, ఇసుక దోపిడీ జరిగింది మీ పాలనలోనే అన్న ఏపీ సర్కారు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఇసుక (AP Sand Crisis Politics) చుట్టూ తిరుగుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వం ఇసుక వారోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంటే మరో వైపు ఇసుక కొరతకు నిరసనగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు (TDP chief Chandrababu) దీక్షకు దిగారు. టీడీపీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ వద్ద 12గంటల నిరసన దీక్షకు దిగారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.

AP GOVT Sensational Decision: ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2లక్షలు జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష, ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం, ఇసుక వారోత్సవాలపై పలు సూచనలు, ఈ నెల14 నుంచి ఇసుక వారోత్సవాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఈ మధ్య రాజకీయాస్త్రంగా మారిన ఇసుక కొరతపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయంతో అన్ని వార్తలకు ఒకేసారి చెక్ పెట్టారు. ఇసుక కొరతకు కారణమవుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే రూ. 2లక్షలు జరిమానా, 2ఏళ్ల జైలు అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Actor Rajasekhar Car Crash: మూడు పల్టీలు కొట్టిన కారు, నటుడు రాజశేఖర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల నిర్ధారణ, కారులో లభ్యమైన మద్యం బాటిళ్లు స్వాధీనం

Vikas Manda

హైదరాబాద్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు, అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారణకు వచ్చారు. రాజశేఖర్ కారుపై పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు....

Advertisement

George Reddy: పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా తీయాలనుకున్నాను.., ముఖ్యమంత్రి అయ్యేవాడు! పవన్ కళ్యాణ్‌ను జార్జ్ రెడ్డితో పోల్చిన నాగబాబు, సినిమా కథపై ప్రశసంలు

Vikas Manda

జార్జ్ రెడ్డి కథ వినా, ఆయన గురించి మాట్లాడినా ఎంతో ప్రేరణ, ఉత్తేజం, స్పూర్థి కలుగుతాయి. అతణ్ని చూస్తే నాకు తమ్ముడు పవన్ కళ్యాణే గుర్తుకు వస్తాడని నాగబాబు అన్నారు. జార్జ్ రెడ్డి వ్యక్తిత్వం, అతడి పోరాడే తత్వం, అతడి ఎమోషన్స్ అన్నీ పవన్ కళ్యాణ్....

Nara Lokesh Slams YCP: ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా, ఇదొక ఆబోతు ప్రభుత్వమంటున్న నారా లోకేష్, ఇసుకను పందికొక్కుల్లా తింటున్నారంటూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు

Hazarath Reddy

ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీడీపీ యువనేత,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( TDP general secretary Nara Lokesh) అధికార పార్టీ వైసీపీ (YSR Congress Party)పై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక కొరతను పట్టించుకోని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను ఎగతాళి చేసేలా జగన్‌ ప్రభుత్వం (Jagan Mohan Reddy government) వ్యవహరిస్తోందని లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఇదో ఆబోతు ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు.

Pawan Kalyan VS YS Jagan: పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ సెటైర్, కౌంటర్ వేసిన జనసేనాధినేత అభిమానులు, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై కొనసాగుతున్న రాజకీయాలు

Hazarath Reddy

AP Sand Online Booking Process: ఇకపై ఇసుక కొరత తీరినట్లే, ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో భారీగా నిల్వ, బుకింగ్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక కొరత తీరినట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం( AP GOVT) పలు చోట్ల ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో ఇసుక నిల్వను ఉంచింది. విశాఖ శివారు అగనంపూడిలో 8,076 టన్నులు.. ముడసర్లోవలో 14,227 టన్నులు.. నక్కపల్లిలో650 టన్నులు.. నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా 23 వేల టన్నులకు పైగా ఇసుక ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో నిల్వ ఉంది.

Advertisement

Beach Picnic Turns Tragic: శ్రీకాకుళంలో విషాదం, కళింగపట్నం బీచ్‌లో స్నానాలకు వెళ్లిన ఆరుగురు యువకులు గల్లంతు, గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు, వీరంతా చైతన్య కాలేజి విద్యార్థులు

Hazarath Reddy

శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రం చూసొద్దామని వెళ్లిన యువకులు అలల ధాటికి గల్లంతయ్యారు. సముద్రంలో దిగిన ఆరుగురు ఇంటర్ విద్యార్థులు గల్లంతవడంతో బీచ్‌లో భయాందోళన నెలకొంది. గార మండలం కళింగపట్నం బీచ్‌లో స్నానాలకు వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు.

Chandrababu Naidu: అబ్దుల్ కలాం నా దగ్గరే విజన్ నేర్చుకున్నారు, విజన్-2020 పత్రాలతోనే దేశ ఆర్థిక విజన్‌పై పుస్తకాన్ని విడుదల చేశారు, చిత్తూరు మీటింగ్‌లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

చిత్తురూ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్రపతి, అపర మేధావి దివంగత అబ్దుల్ కలాం(Former President Abdul Kalam) తనవద్దే విజన్ నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు విజన్‌–2020తో ముందుకెళ్లానన్నారు.

Polavaram Reimbursement Funds: పోలవరం నిధులను విడుదల చేసిన కేంద్రం, రూ. 1850 కోట్లు నాబార్డు నుంచి ఏపీ ఖాతాలోకి, జగన్ సీఎం అయిన తరువాత కేంద్రం నుంచి వచ్చిన తొలి నిధులు ఇవే

Hazarath Reddy

ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం(Central Government) నుంచి మరో ముందడుగు పడింది. పోలవరం ప్రాజెక్టు రీఎంబర్స్‌మెంట్ నిధుల్లో (Polavaram Reimbursement Funds) 1850 కోట్ల రూపాయల విడుదలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.

ICICI Opens 57 Branches In AP,TG: తెలుగు రాష్ట్రాలకు ఐసీఐసీఐ శుభవార్త, కొత్తగా 57 బ్రాంచీల ఏర్పాటు, ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు, తెలుగు రాష్ట్రాల్లో 402కి చేరుకున్న మొత్తం బ్రాంచీల సంఖ్య

Hazarath Reddy

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ దిగ్గజం ఐసీఐసీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా 57 బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్రాంచీలతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 402కి చేరుతుందని, వీటిల్లో ఏపీలో 179, తెలంగాణలో 223 శాఖలు ఉండనున్నాయి. వీటికి తోడు మొత్తం 1,580 ఏటీఎంలను ఐసీఐసీఐ నిర్వహిస్తోంది.

Advertisement

Cannabis Seized In Visakhapatnam: విశాఖపట్నంలో గంజాయి కలకలం, భారీగా గంజాయి స్మగ్లింగ్, కారులో తరలిస్తుండగా పట్టుకున్న ఎక్సైజ్‌శాఖ అధికారులు, అదుపులో ముగ్గురు వ్యక్తులు

Hazarath Reddy

విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం జంక్షన్‌ వద్ద శుక్రవారం 46 కేజీల గంజాయి(Cannabis)ని పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. అక్కడి పోలీసులు కథనం ప్రకారం... చింతపల్లి ఏజెన్సీ నుండి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో వారు తాళ్లపాలెం జంక్షన్‌ వద్ద తనిఖీలు చేపట్టారు.

Cyclone Bulbul Update: మొన్న క్యార్, నిన్న మహా, నేడు బుల్‌బుల్, తీవ్ర తుఫానుగా మారనున్న బుల్‌బుల్, ఈ నెల 10వ తేదీన తీరం దాటే అవకాశం, కొన్ని రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తుఫానులు వరుసగా విరుచుకుపడుతున్నాయి. మొన్న క్యార్, నిన్న మహా, నేడు బుల్‌బుల్... బంగాళాఖాతంలో ‘బుల్‌‌బుల్‌‌’ తుఫాను (Cyclone Bulbul) కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం ఉదయం11.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్(ఒడిశా)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ., సాగర్ దీవులు(పశ్చిమ బెంగాల్)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 740 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

AgriGold Chit Funds Scam: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏపీ సీఎం జగన్, అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతగా రూ.10 వేలు డిపాజిట్‌, మలి విడతలో రూ.20 వేలు, మీ అన్నగా తోడుంటానంటున్న జగన్ హైలెట్ స్పీచ్‌పై ఓ లుక్కేయండి

Hazarath Reddy

గతంలో ఏపీ రాష్ట్రాన్ని అగ్రిగోల్డ్‌ స్కామ్ ఓ ఊపు ఊపిన సంగతి అందరికీ తెలిసిందే. అగ్రిగోల్డ్‌ కంపెనీ చేసిన మోసంతో దాదాపు 3.70 లక్షల మంది రోడ్డున పడ్డారు. ఈ వ్యవహారంపై కోర్టులో ఇంకా కేసు నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో జగన్ కీలక నిర్ణయం తీసుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపారు.

Ayodhya Verdict: దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, అయోధ్య కేసులో సుప్రీంకోర్ట్ తీర్పు తర్వాత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హోంశాఖ నుంచి అడ్వైజరీ జారీ

Vikas Manda

ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం రోజువారీ ప్రాతిపదికన 40 రోజుల పాటు విచారించింది. అక్టోబర్ 16న విచారణ పూర్తయినట్లు ప్రకటించిన సుప్రీంకోర్ట్ తన తీర్పును నెల రోజుల పాటు రిజర్వు చేసింది....

Advertisement
Advertisement