ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Horror: కడప జిల్లాలో దారుణం, మహిళను చంపి ఆమె తలను రాళ్లతో చిధ్రం చేసిన దుండగులు, ఒంటిపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే అనుమానాలు

Hazarath Reddy

మహిళ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాళ్లతో తలను ఛిద్రం చేశారు. మహిళపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Andhra Pradesh Assembly Session: పీఏసీ చైర్మన్‌ పదవికి నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నామినేషన్ టైంలో అసెంబ్లీలో హైడ్రామా

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పీఏసీ చైర్మన్‌ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే నామినేషన్‌ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామా నడిచింది.

YSRCP: జగన్ అధ్యక్షతన ముగిసిన వైసీపీ పార్లమెంటరీ సమావేశం, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం

Hazarath Reddy

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్ సభ, రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

Andhra Pradesh: షాకింగ్..50 కేజీల కారంతో శివస్వామి బాబాకు అభిషేకం, గత మూడు ఏళ్లుగా ఇదే తంతు..శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో ఘటన

Arun Charagonda

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో 50 కేజీల కారంతో అభిషేకం చేయించుకున్నారు ఓ బాబా. శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో 50 కేజీల కారంతో అభిషేకం చేయించుకున్నారు శివస్వామి బాబా. ప్రత్యంగిరా దేవికి ఇష్టమైన కారంతో శివస్వామి బాబాకు అభిషేకం చేశారు. గత మూడేళ్లుగా స్వస్తిశ్రీ చాంద్రమానేన బహుళ పంచమి తిథి రోజే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు శివస్వామి బాబా.

Advertisement

CM Chandrababu: ప్రధానమంత్రి మోదీ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు, సంక్రాంతి నుండి 'మన్ కీ బాత్'..ప్రజలతో మమేకం కానున్న టీడీపీ అధినేత

Arun Charagonda

సంక్రాంతి నుంచి ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' తరహాలోనే ప్రజలతో మమేకం కానున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆడియో లేదా వీడియో విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 1995-2004 మధ్య 'డయల్ యువర్ సీఎం' నిర్వహించిన సంగతి తెలిసిందే.

AP Cabinet key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం, ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Anil Kumar Yadav: మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం, వైసీపీ నేతల అరెస్టులపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్, పార్టీ మారుతున్నారనే వార్తలు కొట్టివేత

Hazarath Reddy

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

YS Jagan on Sharmila: వీడియో ఇదిగో.. బాలకృష్ణ ఇంటి నుంచి షర్మిలపై తప్పుడు ప్రచారం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీలో జరుగుతున్న తాజా పరిస్థితులపై వైఎస్ జగన్ మాట్లాడారు. తనపై, తన తల్లిపై, తన చెల్లిపై అసభ్య పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.

Advertisement

YS Jagan on Illegal Arrests: పదేళ్లు చంద్రబాబు సీఎం అంటూ పవన్ వ్యాఖ్యలపై స్పందించిన జగన్, మంచి పనులు చేసినవారిని ప్రజలు ఆశీర్వదిస్తారని వెల్లడి

Hazarath Reddy

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీలో జరుగుతున్న తాజా పరిస్థితులపై వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని... ఆయనలో ఎప్పటికీ మార్పు రాదని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు

YS Jagan Slams Chandrababu: వీడియో ఇదిగో, ఏపీ అప్పుపై జగన్ సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబు తప్పుడు ప్రచారం ఇదేనంటూ లెక్కలతో వివరణ ఇచ్చిన మాజీ సీఎం

Hazarath Reddy

ఎన్నికల టైమ్‌లో ఏపీ అప్పుల గురించి రూ.11 లక్షలు.. 12.5 లక్షలు.. 14 లక్షల కోట్లు అని చంద్రబాబు అన్నారు. మరి బడ్జెట్‌లో రూ.6.46 లక్షల కోట్లు అంటూ చూపించారు. అంటే ఇన్నాళ్లు నువ్వు చేసింది తప్పుడు ప్రచారమేగా? కొంచెం కూడా నీకు సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబూ? అని జగన్ మండిపడ్డారు.

YS Jagan on Varma: రామ్ గోపాల్ వర్మకు అండగా నిలిచిన వైఎస్ జగన్, మీకు అనుకూలంగా సినిమాలు తీయకుంటే కేసులు పెడతారా అంటూ సూటి ప్రశ్న

Hazarath Reddy

వర్మ చేసిన సినిమాకి సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. రామ్ గోపాల్ వర్మను అక్రమంగా అరెస్ట్ చేయాలని మీరు ప్రయత్నించడం లేదా ? మీకు అనుకూలంగా సినిమాలు తీస్తే ఒకే. అదే వ్యతిరేకంగా సినిమాలు తీస్తే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారని మండిపడ్డారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ధర్మవరం వీఆర్వో అరాచ‌కం, మహిళా రైతు పొలం ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి రూ. 3 లక్షలు డిమాండ్

Hazarath Reddy

ధర్మవరం తహసీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో అరాచ‌కంగా మారాడు. త‌న పొలానికి చెందిన ఒరిజిన‌ల్ డాక్యుమెంట్లు తీసుకుని, తిరిగి ఇవ్వ‌మంటే రూ.3 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తున్నాడ‌ని పోతుకుంటకు చెందిన‌ శ్రీలలిత అనే మహిళా రైతు వాపోయింది. ఎదురు తిరిగిన రైతుల‌ను దుర్భాష‌లాడుతున్న వీఆర్వో. వీఆర్వోపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్న ప్ర‌జ‌లు.

Advertisement

Pawan Kalyan on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు ఐదేళ్లు కాదు వచ్చే పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్రమ కేసులతో జైలులో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

Andhra Pradesh: పసివాడిని తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పోసి భిక్షాటన, బాలుడిని వెంటనే కాపాడాలని అధికారులకు నారా లోకేష్ ఆదేశాలు, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

స్థానికుడు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాలుడిని కాపాడాలని నారాలోకేష్‌ని కోరటంతో ఆయన రెస్పాన్స్ అయి బాబుని వెంటనే ఎక్కడ ఉన్నాడో కనుక్కుని సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, నందిగామలో నడిరోడ్డుపై తన్నుకున్న టీడీపీ - వైసీపీ నాయకులు, నలుగురికి గాయాలు, వైసీపీ ఎంపీపీ మాలిక్ బషీర్‌తో పాటు 15 మందిపై హత్యాయత్నం కేసు నమోదు

Hazarath Reddy

ఏపీలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ,వైసీపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో వ్యక్తిగత గొడవల కారణంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నడిరోడ్డుపై రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.

Weather Update: ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి వచ్చే మూడు రోజుల పాటు వర్ష సూచన, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం

Hazarath Reddy

ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదిలే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Andhra Pradesh: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని తేల్చిచెప్పిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, లేని బిడ్డకు పేరు ఎలా పెడతాం అని వైసీపీ సభ్యులకు ఎదురు ప్రశ్న..వీడియో ఇదిగో

Arun Charagonda

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని తేల్చిచెప్పారు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి..వాలంటీర్ వ్యవస్థ లేని బిడ్డ లాంటిది..అసలు ఆ వ్యవస్థే లేదని చెప్పారు మంత్రి. లేని బిడ్డకు పేరు పెట్టడం ఎలా సాధ్యం? అని ఎదురు ప్రశ్న వేశారు. ఎన్నికల్లో కొనసాగిస్తాం అని హామీ ఇచ్చారు కదా అన్న ప్రశ్నకు.. అన్నాం.. కానీ మీరు కూడా సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి చేయలేదు కదా అంటూ డైవర్ట్ చేశారు మంత్రి.

Ram Gopal Varma: ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వర్మ, నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో వెల్లడి

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. ఇప్పటికే క్వాష్‌ పిటిషన్‌ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Video: నన్ను కువైట్‌లో చంపేసేలా ఉన్నారు, కాపాడాలంటూ వీడియో విడుదల చేసిన కాకినాడ మహిళ, నన్ను ఎలాగైనా నా పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటిపర్యంతం

Hazarath Reddy

కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది. ఈ ఘటం నియోజకవర్గంలో కలకలం రేపుతుంది..నాకు సరిగా తిండిపెట్టడంలేదు, చంపేసేలా ఉన్నారు.నన్న కాపాడి, పిల్లల వద్దకు చేర్చాలంటూ' కన్నీటి పర్యంతమవుతోంది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయిన వృద్ధురాలిని కాపాడిన పోలీసులు, శభాష్ పోలీసన్న అంటూ నెటిజన్ల ప్రశంసలు

Hazarath Reddy

ఏపీలోని నంద్యాల జిల్లా ముష్టపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. నీరు తెచ్చుకునేందుకు బావి వద్దకు వెళ్లిన ఓ వృద్దురాలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. రక్షించాలని ఆమె కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి వెంటనే ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు

Advertisement
Advertisement