ఆంధ్ర ప్రదేశ్
AP Rains: మళ్లీ వాన పిలుపు.. రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
Rudraనైరుతి బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.
Viral Video: బైక్ పై ఆడుకుంటూ కూర్చున్న చిన్నారి ప్రమాదవశాత్తూ రోడ్డుపైకి.. అప్పుడే ట్రక్కు రావడంతో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Rudraరోడ్డుమీదకు చిన్నారులతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తతో వ్యవహరించినా జీవితాంతం బాధ పడాల్సిందే. ఇదీ అలాంటి ఘటనే. ఓ చిన్నారిని బైక్ పై కూర్చోపెట్టి తల్లిదండ్రులు వెళ్లారు.
YS Jagan Hit out AP CM Chandrababu: ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తున్నదెవరు? చంద్రబాబుపై ట్విట్టర్ లో విరుచుకుపడ్డ వైఎస్ జగన్
VNSసామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబు (AP CM Chandrababu) తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్ట విరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైం కాదా?` అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Andhra Pradesh: పశ్చిమ గోదావరిలో మున్నాబాయ్ ఎంబీబీఎస్, డాక్టర్గా మారిన ఆర్ఎంపీ, ఫిర్యాదులు రావడంతో బయటకు వచ్చిన బాగోతం, ఆస్పత్రి సీజ్
Arun Charagondaపశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సోమరాజు చెరువు గ్రామంలో మున్నాబాయ్ ఎంబీబీఎస్ బయటపడ్డాడు. నకిలీ డాక్టర్ RMP ముసుగులో MBBS డాక్టర్ లా చలామణి అవుతూ.. పేషెంట్లకు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఆసుపత్రితో పాటు మెడికల్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో ఆస్పత్రిని, మెడికల్ షాపును తనిఖీ చేశారు అధికారులు. అనంతరం ఆసుపత్రి, మెడికల్ షాప్ సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
Andhra Pradesh Nominated Posts: ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పదవుల రెండో జాబితా రిలీజ్, 59 మందికి దక్కిన ఛాన్స్...పూర్తి జాబితా ఇదే
Arun Charagondaఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే తొలి దశలో పలువురికి అవకాశం కల్పించగా తాజాగా రెండో దశలో 59 మందికి ఛాన్స్ ఇచ్చారు. జనసేన, బీజేపీ నేతలకు ప్రాధాన్యం కల్పించారు.
AP CM Chandrababu: భవిష్యత్ అంతా టూరిజందే, ఏపీకి టూరిజం ఒక వరం..సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ఏపీని నెంబర్ వన్గా నిలుపుతామన్న ముఖ్యమంత్రి
Arun Charagondaఇక భవిష్యత్తులో ఒకటే ఇజం..అదే టూరిజం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ – శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ సర్వీసులను ఏపీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం... సీ ప్లేన్ ప్రయాణం ఒక వినూత్నమైన ప్రయాణం అన్నారు.
Vangalapudi Anitha On Pawan Kalyan: ఏపీలో బాలికపై దారుణం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్కు స్పందించిన హోంమంత్రి అనిత, బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం
Arun Charagondaఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్కు స్పందించారు హోంమంత్రి అనిత. నెల్లూరు వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీలో ఓ మైనర్ బాలిక (13)ను 45 ఏళ్ల మహిళపై అలీ అనే వ్యక్తి లైంగికంగా దాడి చేసి, బెదిరించాడంటూ జనసేన వీర మహిళ విభాగం ట్వీట్ చేసింది.
Borugadda Anil: ఏకంగా పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్కు రాచమర్యాదలు, వైరల్గా మారిన వీడియో
Arun Charagondaఏకంగా పోలీస్ స్టేషన్ లోనే బోరుగడ్డ అనిల్ కు పోలీసుల రాచ మర్యాదలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరులో విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చారు బోరుగడ్డ అనిల్. ఆయనకు పడుకునేందుకు దిండు, దుప్పటి ఇచ్చి రాచ మర్యాదలు చేశారు పోలీసులు.
Nagarjuna Sagar Project: మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం, తెలంగాణ ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్న ఏపీ అధికారులు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ
Arun Charagondaమరోసారి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం నెలకొంది. KRMB ఆదేశాల ప్రకారం.. ప్రతిరోజు కుడి, ఎడమ కాలువలకు సంబంధించి నీటి విడుదల వివరాలు నమోదు చేస్తున్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.
ATMs Shutting Down: 12 నెలల్లో 4 వేల ఏటీఎంలు మూత.. డిజిటల్ లావాదేవీల పెరుగుదలే కారణం
Rudraదేశంలో నగదు చలామణి కొత్త రికార్డులకు చేరుకొంటున్నాయి. అయితే, విచిత్రంగా దేశీయ బ్యాంకులు తమ ఏటీఎం నెట్ వర్క్ లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ఏటీఎంలు మూతపడ్డాయి.
Andhra Pradesh: అనకాపల్లి రైల్వే స్టేషన్లో షాకింగ్ సంఘటన, ఫ్లాట్ ఫామ్ - రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు..వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి రైల్వే స్టేషన్ జన్మభూమి ఎక్స్ప్రెస్కి, ఫ్లాట్ ఫామ్కి మధ్య ఇరుక్కున్నాడు ఓ ప్రయాణికుడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఫ్లాట్ ఫామ్ని తవ్వి ప్రయాణికుడిని రక్షించారు.
Andhra Pradesh: కరెంట్ పోల్ ఎక్కి తమిళనాడు యువకుడి ఆత్మహత్య, అత్తిలి రైల్వే స్టేషన్లో ఘటన...వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్లోని అత్తిలి రైల్వే స్టేషన్లో కరెంట్ పోల్ ఎక్కి తమిళనాడు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరెంట్ పోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్టేషన్ మాస్టర్. ఈ క్రమంలో కరెంట్ తీగలను తాకి కింద పడి చనిపోయాడు యువకుడు.
Lady Aghori at Mahanandi Temple: మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. తాజాగా ఆమె యాగంటి క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.
Road Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. బాధితులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు.. పూర్తి వివరాలు ఇవిగో.. (వీడియోతో)
Rudraకర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం వద్ద ఓ బొలేరో వాహనం మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.
Secunderabad-Shalimar Superfast Express Derailed: పట్టాలు తప్పిన షాలిమార్-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.. పట్టాలు తప్పిన నాలుగు బోగీలు (వీడియో)
Rudraపశ్చిమ బెంగాల్ లోని నల్పూర్ స్టేషన్ వద్ద షాలిమార్-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు పేర్కొన్నారు.
Andhra Pradesh: అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదం, అక్రమ ఇసుక తవ్వకాల కోసం వెళ్లి నలుగురు గల్లంతు, వాగులో నుండి ఇసుక తీస్తుండగా లోతు తెలియక ఇసుక గోతిలో కూరుకుపోయిన కూలీలు
Hazarath Reddyఅల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని అడ్డతీగల మండలంతిమ్మాపురం లో విషాదంకర ఘటన చోటు చేసుకుంది. అక్రమ ఇసుక తవ్వకాల కోసం వెళ్లి వాగులోకి దిగి నలుగురు గల్లంతు అయ్యారు. వాగులో నుండి ఇసుక తీస్తుండగా ఒక్కసారిగా లోతు తెలియక ఆ ఇసుక గోతిలో కూరుకుపోయారు నలుగురు యువకులు
Seaplane: వీడియో ఇదిగో, ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ ట్రయిల్ రన్ సక్సెస్, రేపు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
Hazarath Reddyవిజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్’ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
Andhra Pradesh: అసెంబ్లీకి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాల్సిందే, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyవైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లేది లేదని నిర్ణయం తీసుకోవడంపై స్పందించారు. అసెంబ్లీకి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. అది జగన్ మోహన్ రెడ్డి అయినా... వైసిపి ఎంఎల్ఏ లు అయినా..ఎవరైనా రాజీనామా చేయాలి. అసెంబ్లీ వెళ్ళే ధైర్యం లేకపోతే పదవులు ఎందుకు అని అన్నారు.
Rain Alert for AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీ ప్రజలకు నాలుగు రోజుల పాటు రెయిన్ అలర్ట్, తమిళనాడుకు ముంచెత్తనున్న భారీ వర్షాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వానలు వీడడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దైన సంగతి విదితమే. మళ్లీ రాష్ట్రానికి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
kethireddy venkatrami Reddy: చెరువు కబ్జా నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందన్న కేతిరెడ్డి, ఈ అంశంపై కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం
Arun Charagondaధర్మవరం చెరువు కబ్జా, అధికారుల నోటీసులపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఈ నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. గతంలోనే ఈ అంశంపై కోర్టుకు వెళ్లానని..ఈ అంశం కోర్టులో ఉండగానే నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయంలో కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తానని..తన భూముల విషయంలో చాలా క్లియర్గా ఉన్నానని వెల్లడించారు.