ఆంధ్ర ప్రదేశ్

Dasara Navaratri Celebrations in Vijayawada: బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. అక్టోబర్‌ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు షురూ.. అమ్మవారు ఏ రోజున ఎలా దర్శనం ఇస్తారంటే?

Rudra

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు బెజవాడలోని ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

YS Jagan Tirumala Tour: నేడు తిరుమలకు జగన్‌.. తిరుపతిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు.. పోలీస్ యాక్ట్ 30 అమలు

Rudra

తిరుమల లడ్డూ వివాదంపై ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది.

Clash at Devara Movie: 'దేవర' సినిమా ప్రదర్శనలో ఘర్షణ.. కడప రాజా థియేటర్ లో యువకుల వీరంగం.. సిబ్బందిని చితకబాదుతూ గలాటా (వీడియోతో)

Rudra

కడపలోని రాజా ధియేటర్ లో 'దేవర' మూవీ ప్రదర్శన సమయంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టికెట్స్ లేకుండానే కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్లోకి దూసుకొచ్చిన క్రమంలో వాగ్వాదం జరిగింది.

Nara Lokesh on Red Book: ఏపీలో రెడ్ బుక్ పాల‌న మొద‌లైంది! ఏపీ మంత్రి నారా లోకేశ్ కీల‌క వ్యాఖ్య‌లు

VNS

ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్‌బుక్‌ (AP Red Book) అమలు ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించిన ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

AP Government Ordinance: మ‌ద్యం షాపుల‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం, అన్నీ ర‌ద్దు చేస్తూ ఆర్డినెన్స్

VNS

ప్రభుత్వం రిటైల్‌ లిక్కర్‌ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త లిక్కర్‌ పాలసీ రాబోతుంది. ఇటీవల కొత్త లిక్కర్‌ పాలసీకి క్యాబినేట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ హయాంలో 2014-19 వరకు ఉన్న మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరపనున్నారు.

Ayudha Pooja Song: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూన‌కాలే! ఎన్నోరోజులుగా వెయిట్ చేస్తున్న ఆయుధ పూజ సాంగ్ వ‌చ్చేసింది (వీడియో ఇదుగో)

VNS

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం దేవ‌ర‌ (Devara). నంద‌మూరి అభిమానుల‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండ‌గా.. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ‘ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి

YSRCP New District Psresidents: పార్టీని ప్రక్షాళన చేస్తున్న జగన్, పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులు, కొత్తగా నియమితులైనది వీరే..

Hazarath Reddy

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Perni Nani on Pawan Kalyan: ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా? పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన పేర్ని నాని

Hazarath Reddy

డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి నీచ రాజకీయాలేంటి? అంటూ పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎండగడితే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు

Advertisement

Andhra Pradesh: జనసేనలో చేరిన బాలినేని,సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో... బాలినేనికి అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి, జనసేనలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఇటీవలే బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh: వీడియో ఇదిగో, కాకినాడలో పది అడుగుల భారీ కొండచిలువను చంపిన యువకులు

Hazarath Reddy

కాకినాడ జిల్లా రామచంద్రపురం గ్రామంలో ఏటిగట్టు వద్ద మొక్కలకు రక్షణగా వేసిన వలలో చిక్కుకున్న కొండచిలువ. గమనించిన గ్రామస్తులు ప్రాణ భయంతో కర్రలతో కొట్టి దానిని హతమార్చారు. ఏలూరు కాల్వకు వరద నీరు భారీగా చేరడంతో కొండచిలువలు వస్తున్నాయని గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

KA Paul on Tirumala: తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కేఏ పాల్ డిమాండ్, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోర్టులో పిల్ వేసినట్లు తెలిపిన ప్రజాశాంతి పార్టీ అధినేత వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుమల లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని, తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని తాను కోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు.

Janasena Protests: మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు జనసేన నేతల ఆందోళన, పవన్‌ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

Arun Charagonda

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద జనసైనికులు ఆందోళన చేపట్టారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, తక్షణమే పవన్ కళ్యాణ్ కి పేర్ని నాని క్షమాపణలు చెప్పాలంటూ జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Advertisement

Vijayasai Reddy Slams Atchannaidu: దేహం పెరిగినట్టుగా బుద్ధి పెరగలేదు నీకు, నీ కుల పార్టీలోకి నేను రావడమా అంటూ అచ్చెన్నాయుడిపై సెటైర్ వేసిన విజయసాయిరెడ్డి

Hazarath Reddy

టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... "అచ్చెన్నాయుడూ! దేముడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె!

Prakash Raj vs Pawan Kalyan: గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం, పవన్ కల్యాణ్‌పై మరో కౌంటర్ వదిలిన ప్రకాష్ రాజ్

Hazarath Reddy

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా, ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టారు. "గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌?" అని ఎక్స్ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు.

Andhra Pradesh: వీడియోలు ఇవిగో, పవన్‌కి పాలాభిషేకం చేసిన వృద్ధురాలు, ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించారని ఆనందం వ్యక్తం చేసిన మహిళ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఓ వృద్దురాలు పాలాభిషేకం చేసింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వృద్ధురాలు పవన్ ఫోటోకి పాలాభిషేకం చేసింది.ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించినందుకు ఆమె హర్షాతిరేకం వ్యక్తం చేసింది.

Tirupati Laddu Row: వీడియో ఇదిగో, వందేభారత్ రైలులో భజనలు చేస్తూ తిరుపతికి మాధవీలత, నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్న బీజేపీ మహిళా నేత

Hazarath Reddy

వందేభారత్ రైలులో బీజేపీ మహిళా నేత హైదరాబాద్ నుంచి తిరుమలకు పయనమయ్యారు. వేంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని బీజేపీ నేత దర్శించుకోనున్నారు.

Advertisement

Vangaveeti Radhakrishna Health Update: వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటు, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో టీడీపీ నేత

Hazarath Reddy

టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు.

Tirupati Laddu Row: రేపు తిరుమలలో ప్రత్యేక పూజల్లో పాల్గొననున్న వైఎస్‌ జగన్‌, డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్, అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలకు వైసీపీ పిలుపు

Hazarath Reddy

తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాప ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.

Food Poison At Hostel: ఏపీలో ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత, చికెన్ తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులు..వీడియో

Arun Charagonda

ఏపీలో ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం హాస్టల్లో చికెన్ తిని 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Harsha Sai: హర్షసాయి కోసం పోలీసుల ముమ్మర గాలింపు, విజయవాడలో ఉన్నట్లు అనుమానం, బంధువులను ఆరా తీసిన పోలీసులు!

Arun Charagonda

యూట్యూబర్ హర్షసాయి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు పోలీసులు. ఇంకా పరారీలోనే యూట్యూబర్ హర్షసాయి ఉన్నారు. నిన్న వైజాగ్ లో వెతికిన సైబరాబాద్ పోలీసులు...విజయవాడలో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement