ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: వైసీపీ భూతాన్ని పూర్తిగా భూ స్థాపితం చేస్తేనే రాష్ట్రాభివృద్ధి, వానపల్లి సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, కేంద్రం సాయంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని వెల్లడి

Hazarath Reddy

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు

Andhra Pradesh Factory Explosion:రెడ్‌ బుక్‌ మీద పెట్టిన శ్రద్ధ వీటిపై పెట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదు, అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ మండిపాటు

Hazarath Reddy

అచ్యుతాపురం ప్రమాద ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.

Bail For Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, దేశం విడిచి వెళ్లొద్దని కండీషన్

Arun Charagonda

ఈవీఎంల ధ్వంసం సహా మూడు కేసుల్లో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఎ రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి కండీషన్స్‌తో కూడిన బెయిల్ రాగా పాస్ పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని సూచించింది న్యాయస్థానం. అలాగే ప్రతీ వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని.. అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దు అని తెలిపింది.

EVM Destruction Case: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు, విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్టు అప్పగించాలని ఏపీ హైకోర్టు షరతులు

Hazarath Reddy

మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు, పోలీసులపై దాడి కేసులో అరెస్టయిన పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్‌ జైల్లో ఉన్నారు

Advertisement

Godrej Investment in Andhra Pradesh: ఏపీలొ రూ.2,800 కోట్ల పెట్టుబడులకు గోద్రెజ్‌ ఆసక్తి, సీఎం చంద్రబాబు ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

రాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్‌ సంస్థ ఆసక్తి వ్యక్తంచేసిందని, ఈ మేరకు కీలక చర్చలు జరిగాయని సీఎం చంద్రబాబు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. తొలుత రూ.500 కోట్లు, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా పెట్టుబడిగా పెట్టనుందని CM తెలిపారు

Andhra Pradesh: ప్రేమ వివాహం, భార్యను తల్లిదండ్రులు తీసుకుళ్లారని పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం, వీడియో ఇదిగో

Hazarath Reddy

అన్నమయ్య జిల్లా మదనపల్లి గంగన్న గారి పల్లెకు చెందిన సోమశేఖర్ పది రోజుల క్రితం భవ్యశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి మేజర్ అయినందున పోలీసులు తల్లిదండ్రులతో పంపించారు.. శేఖర్ ప్రశ్నించగా మళ్లీ పది రోజుల్లో ఒకటి చేస్తాం అని చేప్పడంతో వెనుతిరిగాడు.

YS Jagan Visits Anakapalle: అచ్యుతాపురం సెజ్ బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్, బాధితులతో మాట్లాడిన జగన్, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో ఆరా

Arun Charagonda

అనకాపల్లి సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాద బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు మాజీ సీఎం జగన్. బాధితులతో మాట్లాడారు. అక్కడి డాక్టర్లను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుండి అనకాపల్లికి చేరుకున్నారు జగన్.

YS Jagan Gives Shock To Duvvada Srinivas: వైసీపీలో పెను మార్పులు,దువ్వాడకు షాకిచ్చిన జగన్, టెక్కలి ఇంఛార్జీగా పేరాడ తిలక్, కొత్త అనుబంధ సంఘాల అధ్యక్షులు వీరే

Arun Charagonda

ఏపీలో అధికారం కొల్పోవడంతో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు వైసీపీ అధినేత జగన్. కొత్తగా పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు షాకిచ్చారు జగన్‌. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీగా పేరడా తిలక్‌ను నియమించారు.

Advertisement

Anakapally Pharma Accident: అనకాపల్లిలో మరో ప్రమాదం.. పరవాడ సినర్జీస్‌ ఫార్మా లో రసాయనాలు కలుపుతుండగా ఘోరం.. నలుగురికి గాయాలు

Rudra

ఏపీలోని ఫార్మా కంపెనీల్లో వరుస ప్రమాదాలు కలకలం సృష్టిస్తోంది. అనకాపల్లిలో గురువారం అర్థరాత్రి మరో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ సంస్థలో ఘోరం జరిగింది.

Sharmila Slams PM Modi: మోదీ గారూ..మీ ప్రవర్తన చాలా సిగ్గుచేటుగా ఉంది, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల

Hazarath Reddy

ప్రముఖ వ్యాపారవేత్త అదానీని కాపాడేందుకు మోదీ కుటిల యత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.

Jagan Slams CM Chandrababu: మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా ఏపీలో లేవు, చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ జగన్

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని గురువారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఓ సందేశం పోస్ట్‌ చేశారు.

Anakapalle Pharma Company Explosion: అయ్యో..ఒక్కరోజు ఆగినా ప్రాణాలతో బతికేది, సోదరుడికి రాఖీ కట్టి ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలుడులో మృతి చెందిన హారిక

Hazarath Reddy

మరొక రోజు తమతో ఉండాలని వారు కోరినప్పటికీ సెలవు లేదని ఆమె విధులకు అదే రోజు చేరింది. కంపెనీ ల్యాబ్ కు చేరిన కొద్ది గంటల్లోనే రియాక్టర్ పేలిన ఘటనలో హారిక మృత్యువు ఒడికి చేరింది. భవన శిధిలాలలో చిక్కుకొని ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల రోదన అందర్నీ కలిసి వేస్తుంది.

Advertisement

YSRCP Opposing Waqf Bill: వక్ఫ్‌ బిల్లును అంగీకరించేది లేదు, మరోమారు తేల్చి చెప్పిన వైసీపీ అధినేత జగన్, ముస్లిం మైనారిటీలతో భేటీ

Hazarath Reddy

వక్ఫ్‌ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇంకా పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న మా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారు’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

Anakapalle Pharma Company Explosion: అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు, 17 మంది మృతి

Hazarath Reddy

అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

APPSC Group-1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీ ఎప్పుడంటే..

Hazarath Reddy

గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9 వరకు (7వ తేదీ మినహా) పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే అభ్యర్ధుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్‌సీ తెలిపింది.

Mega Fan Extraordinary Gift To Chiranjeevi: చిరంజీవికి ఫ్యాన్ అదిరే గిఫ్ట్...3D పెయింటింగ్‌లో చిరు ఫోటోలో రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్!

Arun Charagonda

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అదిరే గిఫ్ట్ ఇచ్చారు ఓ అభిమాని. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ కనిపించేలా 3D ఫెయింటింగ్ వేశారు. కుప్పంకు చెందిన కళాకారుడు పురుషోత్తం.. చిరంజీవి ఫోటోలో రామ్‌చరణ్, పవన్ కల్యాణ్ కనిపించేలా 3D పెయింటింగ్ వేశారు. ఇది అందరిని ఆకట్టుకుంటోంది.

Advertisement

Nellore Oil Factory Fire: వీడియో ఇదిగో, అనకాపల్లి పేలుడు జరిగిన గంటల వ్యవధిలో నెల్లూరు ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

Hazarath Reddy

అనకాపల్లి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు జరిగిన గంటల వ్యవధిలోనే నెల్లూరు(D) పంటపాలెంలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి

Andhra Pradesh Pharma Company Explosion: అచ్యుతాపురం పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌

Hazarath Reddy

అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్‌ పేలుడు ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Anakapalle Pharma Company Explosion: ఆగస్టు 23న అనకాపల్లిలో రియాక్టర్ పేలిన ప్రమాదస్థలానికి జగన్, బాధితులకు అండగా నిలవాలని స్థానిక వైసీపీ నాయకులకు ఆదేశాలు

Hazarath Reddy

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు ఘటనాస్థలిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి(శుక్రవారం) పరిశీలించనున్నారు. రేపు ప్రమాదస్థలానికి సీఎం వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌ ఎల్లుండి వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

Anakapalle Pharma Company Explosion: అచ్యుతాపురం పేలుడు ఘటనపై ఏపీ గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి, గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎస్ అబ్దుల్ నజీర్

Hazarath Reddy

అనకాపల్లి జిల్లాలోని ఫార్మా కంపెనీ కర్మాగారంలో జరిగిన పేలుడు కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ బుధవారం విచారం వ్యక్తం చేశారు. గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement
Advertisement