తెలంగాణ
Jogulamba Gadwal: వరుస దొంగతనాలు, షెట్టర్ పగులగొట్టి మరి దొంగతనాలు, హడలెత్తుతున్న షాప్ యజమానులు
Arun Charagondaజోగులంబా గద్వాల జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. జులకల్ స్టేజ్ లో అర్ధరాత్రి షెట్టర్ పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించి సీసీ టీవీలో వీడియో రికార్డు కాగా వరుస దొంగతనాలతో షాప్ యజమానులు హడలెత్తుతున్నారు
Stray Dogs Attack: ములుగులో పిచ్చి కుక్కల స్వైరవిహారం, ఏడుగురు యువకులతో పాటు రెండు మేకలపై దాడి,భయాందోళనలో స్థానికులు
Arun Charagondaములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. వెంకటాపురం మం. నూగురు గ్రామంలో ఏడుగురిపై పిచ్చికుక్క దాడి చేసింది. హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. రెండు మేకలను సైతం కరిచాయి పిచ్చికుక్కలు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
P Susheela Unwell: ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
Rudraప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.
Jagtial: రన్నింగ్ లో ఉండగానే ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్, ప్రమాద సమయంలో 150 మంది ప్రయాణికులు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు
VNSజగిత్యాల నుంచి నిర్మల్కు పల్లె బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో బస్సు జగిత్యాల శివారు మొరపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే వెనుకాల రెండు చక్రాలు ఊడిపోయి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సుని నిలుపడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకుండా బయటపడ్డారు. వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కళకళలాడుతున్నా
Telangana Police: హైదరాబాద్లో భారీగా హాష్ ఆయిల్ పట్టివేత, నలుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు
Arun Charagondaహైదరాబాద్లో భారీగా హాష్ ఆయిల్ను పట్టుకున్నారు పోలీసులు. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ డ్రగ్స్ బ్యూరో, బాలానగర్ పోలీసులు హాష్ ఆయిల్ విక్రేతని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.10.30 లక్షల విలువ చేసే 1.292 ఎంఎల్ హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నలుగురు యువకులను అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు.
KCR Is Back: రంగంలోకి దిగనున్న కేసీఆర్, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, త్వరలో కీలక నేతలతో పలు రాష్ట్రాల టూర్!
Arun Charagondaతెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా రుణమాఫీ విషయంతో పాటు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ టార్గెట్గా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనికి అంతే ధీటుగా బీఆర్ఎస్ సైతం స్పందిస్తోంది. ఏకంగా హరీశ్ రావు కార్యాలయంపై దాడుల వరకు రాజకీయాలు వెళ్లగా మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించడం లేదు.
Hyderabad: బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ, జాబ్ ఇప్పిస్తామంటూ 600 మందికి టోకరా, ఒక్కొక్కరి దగ్గరి నుండి లక్ష వసూలు, పోలీసులకు ఫిర్యాదు
Arun Charagondaహైదరాబాద్ మాదాపూర్లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులకు వల వేసిన కేటుగాళ్లు కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులు దులుపుకున్నారు. దాదాపు 600 మందికి పైగా నిరుద్యోగుల నుంచి 1లక్ష ,50,000 వేల రూపాయల చొప్పున వసూలు చేశారు. మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. బెంగళూరు, విజయవాడలో సైతం ఈ కన్సల్టెన్సీ ఆఫీస్లు ఉన్నట్లు తెలుస్తోంది
Harish Rao On Rythu Runa Mafi: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పాలకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పాపాలు చేస్తున్నారని హరీశ్ రావు ఫైర్, రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్
Arun Charagondaరైతు రుణమాఫీ అంశం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. రుణమాఫీ చేసి దేశంలో ఏ సీఎం చేయని విధంగా సాహసం చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటూ కేవలం 54 శాతం రైతులకు రుణమాఫీ చేసిన పాపపు ప్రభుత్వం కాంగ్రెస్ది అని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు హరీశ్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ రచ్చ చేస్తుంటే పాలకుడిగా రేవంత్ పాపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Tulsi Reddy: 'మౌంట్ ఎల్బ్రస్'పై తెలంగాణ వాసి, 5642 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన తులసిరెడ్డి
Arun Charagondaమౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు తెలంగాణ వాసి. ఈనెల 15న యూరప్ ఖండంలోని 5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు తులసిరెడ్డి. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ 4 రోజుల్లో పర్వతాన్ని అధిరోహించారు తులసిరెడ్డి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట్ తులసిరెడ్డి స్వస్థలం.
Medak Rains: మెదక్లో దంచికొట్టిన వాన, వర్షంలో కొట్టుకు పోయిన బైకులు, బైకుల కోసం పరుగెత్తిన వాహనదారులు..వీడియో వైరల్
Arun Charagondaఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. మెదక్ పట్టణంలో గంటన్నర పాటు ఏకధాటిగా కురిసింది వర్షం. దీంతో మెదక్ పట్టణంలో ప్రధాన రహదారిపై భారీగా నిలిచింది వర్షపు నీరు. వర్షంలో బైకులు కొట్టుకుపోగా బైకుల కోసం పరిగెత్తారు వాహనదారులు. మెదక్ లో అత్యధికంగా 12.6 సెం. మీ, పాతురులో 8.6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లాలో 9 సెం. మీ, సంగారెడ్డి జిల్లాలో 6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది.
Telangana: వివాహేతర సంబంధం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఇద్దరికి దేహశుద్ది చేసిన బంధువులు, వీడియో వైరల్
Arun Charagondaరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం ముచ్చర్ల గ్రామంలో వివాహేతర సంబంధం బయటపడింది. గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ముచ్చర్ల గ్రామానికి చెందిన వివాహితతో గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇది గ్రహించిన బంధువులు గంభీరావుపేటలో వివాహిత, శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Telangana Congress: టార్గెట్ కేటీఆర్ - హరీష్ రావు, కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?, కాంగ్రెస్ కేడర్కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గీతోపదేశం ఏంటీ?
Arun Charagondaతెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలేనా?, కురుక్షేత్రంలో కృష్ణార్జునులుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?, ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి సాధించేది ఏంటీ?, ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Hyderabad Shocker: భార్యపై అనుమానం.. కత్తితో దాడి చేసిన భర్త, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక
Arun Charagondaఅనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం.. కత్తితో దాడి చేశాడు ఓ శాడిస్టు భర్త. హైదరాబాద్ ఆసిఫ్నగర్లోని హుడా కాలనీలో భార్య జ్యోతి(30)ను కత్తితో పొడిచాడు భర్త. తీవ్ర గాయాలతో బాధితురాలు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Feathers in Chicken Curry: కోడి ఈకలు పీకకుండానే చికెన్ కర్రీ.. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నవాబ్ హోటల్ లో బయటపడిన నిర్లక్ష్యం (వీడియో)
Rudraఫుడ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేసి, జరిమానాలు వేసినా, హోటల్స్ లైసెన్స్ రద్దు చేసినా మిగతా హోటల్స్ నిర్వాహకుల తీరు మారట్లేదు.
Accident in Nirmal: ఆటోని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పసిపాప సహా ముగ్గురికి తీవ్ర గాయాలు.. భైంసా పట్టణంలో ఘటన (వీడియో)
Rudraనిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న సంతోషి మాత ఆలయం వద్ద ఇవాళ ఉదయం భైంసా నుంచి నిర్మల్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ఆటోని ఢీకొట్టింది.
Inhumanity in Siddipet: సిద్దిపేటలో అమానుషం.. 20 వేల వడ్డీ కోసం అన్నావదినను చెట్టుకు కట్టేసిన తమ్ముడు.. వైరల్ వీడియో
Rudraమానవ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని ఎవరో అన్నట్టు.. డబ్బుల కోసం మనుషులు క్రూరత్వానికి తెగబడుతున్నారు. కేవలం రూ.20 వేల వడ్డీ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు.
Attack on Harish Rao Office: సిద్ధిపేటలో అర్ధరాత్రి హైడ్రామా.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.. వీడియో వైరల్
Rudraమాజీమంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ముదిరిన రుణమాఫీ సవాళ్లు ఫ్లెక్సీలను దాటి దాడుల వరకూ చేరుకున్నది.
Hanumakonda: అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతి, గుండెపోటుతో మరణించిన హన్మకొండ వ్యక్తి, కొద్దిరోజుల క్రితమే తండ్రి...ఇప్పుడు కొడుకు మరణంతో విషాదం
VNSఅమెరికాలో మరో తెలుగు యువకుడు (Young Man Died) మృతిచెందాడు. గుండెపోటుతో హనుమకొండ జిల్లాకు చెందిన ఏరుకొండ రాజేశ్(32) మరణించాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేశ్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే రాజేశ్ ఉద్యోగం చేస్తున్నాడు
Telangana LRS Scheme 2024: రుణమాఫీ తరహాలోనే ఎల్ఆర్ఎస్, వారికే వర్తింపు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, హెల్ప్లైన్లను సంప్రదించి మీ దరఖాస్తు స్టేటస్ చెక్చేసుకోండి
Arun Charagondaలేఔట్ రిజిస్ట్రేషన్ స్కీమ్(LRS)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేయగా తాజాగా ఎల్ఆర్ఎస్పై ఉత్తర్వులు వెలువరించింది ప్రభుత్వం. 2020 ఆగస్ట్ 26కు ముందు రిజిస్టర్ చేసిన లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని తెలిపింది. 2020 అక్టోబర్ 15 వరకు స్వీకరించిన దరఖాస్తులనూ మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఇందుకు సంబంధించి 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గైడ్లైన్స్ సిద్ధం చేసింది.
Hyderabad Rains: హైదరాబాద్లో కుండపోత వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక, మరో 5 రోజులు వర్షాలు, విపత్తు సంభవిస్తే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచన
Arun Charagondaగ్రేటర్ హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. బోయిన్పల్లి, అల్వాల్, సికింద్రాబాద్, పటాన్చెరు, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, అమీన్ పూర్, అమీర్పేట్, హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లో నాన్స్టాప్గా కురుస్తోంది. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు...విపత్తు సంభవిస్తే టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు అధికారులు.