తెలంగాణ

Medarama Jathara: జంపన్నవాగులో ఈతకు వెళ్లి యువకుడు మృతి, అడవిలోకి వాహనాలు వెళ్లలేకపోవడంతో మృతదేహాన్ని భుజాలపై మోసుకు వచ్చిన పోలీసులు

Hazarath Reddy

జంపన్నవాగులో ములుగు పోలీసులు 2 గంటలపాటు వెతికిన తర్వాత హైదరాబాద్‌ నుంచి సమ్మక్కసారలమ్మ జాతరకు మేడారం వెళ్లి ఈత కొడుతూ నీటిలో మునిగి మృతి చెందిన రోహిత్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని భుజాలపై మోసుకుని అడవిలోకి వెళ్లారు.

Radisson Blu Hotel Drug Case:: రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు, 10 మంది వీఐపీలపై కేసు నమోదు, వివరాలను వెల్లడించిన సైబరాబాద్‌ సీపీ అవినాష్ మహంతి

Hazarath Reddy

రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది.వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్‌, అబ్బాస్‌, కేదార్‌, సందీప్‌లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.

Telangana: తెలంగాణ రైతుబంధులో రూ. 2 కోట్ల గోల్ మాల్, రైతులు చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి సొమ్మును కాజేసిన వ్యవసాయ అధికారి

Hazarath Reddy

నకిలీ గుర్తింపులను ఉపయోగించి, రైతుబంధు & Rythu Bima డబ్బును రూ 2 కోట్లను అక్రమ మార్గంలోకి (Rythu Bandhu Scam) మళ్లించినందుకు వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

V. Hanumantha Rao: నాకేమి తక్కువైందని పక్కనబెట్టారు, వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ హనుమంతరావు

Hazarath Reddy

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నానని... ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని తెలిపారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ అడుగుతున్నారన్నారు.

Advertisement

Bandi Sanjay Slams Congress: రాముడు గురించి అడుగుతున్నారు, మీరు మీ అమ్మకే పుట్టారని గ్యారంటీ ఏంటి, కాంగ్రెస్ నేతలపై ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ నుంచి రెండో విడత ప్రజాహిత యాత్రలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్‌లకు పొద్దున లేస్తే నన్ను తిట్టుడే పని’’ అంటూ ఎంపీ బండి సంజయ్ (MP Bandi Sanjay) తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Layout Regularisation Scheme: మధ్య తరగతి ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్, లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం గడువు మార్చి 31 వరకు పెంపు

Hazarath Reddy

తెలంగాణలో లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులపై రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 లోగా దరఖాస్తులకు లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.

TS Inter Exams 2024: ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్‌లోకి నో ఎంట్రీ, ఈ నెల 28 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

Hazarath Reddy

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుతుందని శృతి తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామని తెలిపారు.

Telangana Couple Electrocuted: ఇనుప తీగకు బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్, కుప్పకూలి మృతి చెందిన భార్యాభర్తలు

Hazarath Reddy

బోయిన లక్ష్మణ్ (48), అతని భార్య లక్ష్మి (42) ఇంటి ముందు ఉన్న ఇనుప తీగకు బట్టలు ఆరేస్తుండగా.. వీధిలోని విద్యుత్ లైన్‌కు తీగ తగలడంతో విషాదం చోటుచేసుకుంది.

Advertisement

YS Sharmila: శ్రీరెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తుందంటూ కంప్లైంట్

Rudra

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో నటి శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తున్నదంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.

Kavitha Letter To CBI: విచారణకు రాలేను! సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత, ఎన్నికల షెడ్యూల్ లో బిజీగా ఉన్నానంటూ సమాధానం

VNS

సీఆర్పీసీ సెక్షన్‌ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలని లేదంటే ఉపసంహరించుకోవాలని సీబీఐని నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం సీబీఐకి (Letter To CBI) లేఖ రాశారు. ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటానన్నారు

BJP MP Candidates List Telangana 2024: తెలంగాణలో 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ.. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్..

sajaya

BJP MP Candidates List Telangana 2024: తెలంగాణలో బీజేపీ తరఫున పోటీకి దిగే 6గురు ఎంపీ అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. వీరిలో కరీంనగర్-బండి సంజయ్, నిజామాబాద్-అర్వింద్, సికింద్రాబాద్-కిషన్ రెడ్డి, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్, ఖమ్మం-డాక్టర్ వెంకటేశ్వర్ రావు ఉన్నారు. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ లభించింది.

Shanmukh Case: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..అందుకే గంజాయి సేవించా: బయటపడ్డ షణ్ముఖ్ సంచలన వీడియో

sajaya

షణ్ముఖ్ జస్వంత్ తాను డిప్రెషన్‌లో ఉన్నానని, తన పరిస్థితి బాగోలేదని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అందుకే గంజాయి తాగానని తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Two More Guarantees: ఈ నెల 27 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అమలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Rudra

ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మరో రెండో హామీల అమలుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళవారం (ఈ నెల 27) నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

Telangana Shocker: బిక్షం అడిగాడని యాచకుడిని కాలితో తన్నిన డిప్యూటీ ఎమ్మార్వో, వెనక వస్తున్న టిప్పర్ కింద పడి యాచకుడు మృతి, షాకింగ్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

భిక్షం అడిగినందుకు డిప్యూటీ ఎమ్మార్వో యాచకుడిపై దారుణంగా ప్రవర్తించాడు. బిక్షం అడిగాడని ఆగ్రహంతో యాచకుడుని తన్నడంతో అతను టిప్పర్‌ కింద పడి దుర్మణం చెందాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఫుటేజీలో ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

Medaram Jathara Last Day 2024: తిరిగి వనంలోకి దేవతలు ముగిసిన మేడారం జాతర వేడుకలు..2 కోట్ల మంది భక్తులు తరలి వచ్చినట్లు అంచనా..

sajaya

గత నాలుగు రోజుల పాటు అంగరంగ వైభంగా జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర నేటితో ముగిసింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరగా పేరొందిన నాలుగు రోజుల సమ్మక్క-సారలమ్మ జాతర శనివారంతో ముగిసిపోయింది.

Medaram Jathara Ends Today: మ‌హా జాత‌ర‌లో ఇవాళ చివ‌రి అంకం, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకుంటున్న ల‌క్ష‌లాది మంది భ‌క్తులు, నేటితో ముగియ‌నున్న మేడారం జాత‌ర‌, వ‌న ప్ర‌వేశం చేయ‌నున్న స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌

VNS

సమ్మక, సారలమ్మ నామస్మరణతో మేడారం (Medaram) ఉప్పొంగిపోతున్నది. దేశంలో అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర (Medaram Jathara) తుది అంకానికి చేరింది. జనదేవతలు నేడు వనప్రవేశం చేయనున్నారు. భక్తకోటిని దీవించి, ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తుంది. సారలమ్మ కన్నెపల్లికి వెళ్లిపోతుంది.

Advertisement

AP, Telangana Weather: తెలుగు రాష్ట్రాల‌కు చ‌ల్ల‌ని క‌బురు, రాబోయే మూడు రోజుల పాటూ ప‌లు జిల్లాలో మోస్త‌రు వ‌ర్షాలు, ఏపీలోని ఈ జిల్లాల‌కు వ‌ర్ష‌సూచ‌న‌

VNS

గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు (Weather Alert) పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి దాటకముందే భానుడి భగభగలు పెరిగిపోయాయి. ఎండవేడిమితో (Summer) ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. ఈనెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Traffic Jam Near Medaram: మేడారం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్, ఏకంగా 15 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు, నరకం చూస్తున్న భక్తులు

VNS

స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ గ‌ద్దెల‌పైకి చేర‌డంతో జాత‌ర‌కు నిండుద‌నం వ‌చ్చింది. దారుల‌న్నీ మేడారానికి అన్న‌ట్టుగా.. వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో మేడారం – తాడ్వాయి (Heavy Traffic Jam Near Medaram) మ‌ధ్య సుమారు 15 కిలోమీట‌ర్ల మేర‌, ప‌స్రా నుంచి గోవింద‌రావుపేట వ‌ర‌కు ఐదు కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్‌జామ్ అయింది.

Etela Rajender: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కేంద్రంలో రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజకీయాల నుండి తప్పకుంటానని ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు.

Telangana: రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఈ నెల 27న ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా ప్రారంభం, సమ్మక్క- సారలమ్మను దర్మించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, అనంతరం ఏమన్నారంటే..

Hazarath Reddy

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండు స్కీంల అమలుకు ముహూర్తం ఖరారైంది. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా (Priyanka Gandhi To Launch Two Schemes) ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు

Advertisement
Advertisement