తెలంగాణ

Telangana Rains: భద్రాచలంలో తగ్గిన గోదావరి నీటి మట్టం, సహాయచర్యలు ముమ్మరం, ఇంకా ముంపులోనే కొత్తగూడెం జిల్లాలోని పలు గ్రామాలు,

Krishna

ఆలయ పట్టణం భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం శుక్రవారం రికార్డు స్థాయిలో 70 అడుగులకు చేరుకుంది, ఇది మూడవ హెచ్చరిక స్థాయి కంటే ఎక్కువగా ఉంది, దీని వలన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో అనేక చోట్ల వరదలు వచ్చాయి. అయితే ప్రస్తుతం శనివారం ఈ నీటి మట్టం 70 అడుగుల దిగువకు చేరుకుంది.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, భార్య ప్రైవేట్ భాగాలపై కత్తితో పొడిచి హత్య చేసిన కసాయి భర్త, అడ్డువచ్చిన బంధువుపై కూడా దాడి, పరారీలో నిందితుడు

Hazarath Reddy

భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతొ భర్త ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. జియోగూడలో కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన (Hyderabad Shocker) జరిగింది.

MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌‌పై ఎర్ధండి గ్రామస్తులు దాడి, కర్రలు రాళ్లతో దాడి చేయడంతో పగిలిన కాన్వాయ్‌లోని వాహనాల అద్ధాలు

Hazarath Reddy

ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు నిరసన సెగ తగిలింది. ఎంపీ కాన్వాయ్‌పై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దాడికి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Telangana Rains: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన వర్షాలు, నేడు రేపు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి దంచికొడుతున్న వానలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు (Monsoon Rains) నమోదుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 3.95 సెంటీమీటర్లుగా నమోదైంది

Advertisement

Telangana Floods: అంతా రామయ్యపైనే భారం, గోదావరి ఉగ్రరూపంతో డేంజర్ జోన్లో భద్రాచలం, సాయంత్రం నుంచి రాకపోకలు బంద్, 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు

Hazarath Reddy

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పెరుగుతున్న. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నానికి నదిలో నీటి మట్టం 60. 30 అడుగులకు చేరుకోవడంతో సమీపంలోని లోతట్టు కాలనీలను వరద (Telangana Floods) ముంచెత్తింది.

Man Married 11 Women: ఒకరా...ఇద్దరా.. ఏకంగా 11 మందిని పెళ్లాడిన రసికుడు, పైగా పక్క పక్క ఇళ్లల్లోనే కాపురం పెట్టాడు, గుట్టురట్టు కావడంతో పరార్, మీడియా ముందుకు వచ్చిన బాధితురాళ్లు

Hazarath Reddy

తెలంగాణలో ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 11 మందిని ఓ ఘనడు పెళ్లాడాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని ఇలా మొత్తం 11 మందిని పెళ్లిచేసుకున్న అతగాడి (Man Married 11 Women) బాగోతాన్ని ఇద్దరు భార్యలు ఆధారాలతో సహా బయటపెట్టారు.

Telangana Floods: వైరల్ వీడియో... రియల్ బాహుబలి సీన్ చూశారా, భుజాల వరకు ఉన్న నీటిలో 3 నెలల పసికందును బుట్టలో పెట్టుకుని నడిచిన తల్లిదండ్రులు, నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Hazarath Reddy

మర్రివాడకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో మూడు నెలల పసికందును కుటుంబ సభ్యులు బుట్టలో పెట్టుకొని తరలించారు. భుజాల వరకు వచ్చిన నీటిలో చిన్నారిని ఉంచిన బుట్టను తల్లిదండ్రులు తమ తలపై ఉంచుకుని అడుగులో అడుడేస్తూ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. మంథని పట్టణంలో వరద పరిస్థితి తీవ్రతను ఈ దృశ్యాలు కల్లకు కడుతున్నాయి.

Hyderabad: వరుస అత్యాచారాల దెబ్బ, 69 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేసిన సిటీ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, పలు విభాగాల్లో మూడేండ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీలు

Hazarath Reddy

సుదీర్ఘ కాలం తర్వాత నగరంలో ఒకేసారి భారీ స్థాయిలో ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 69 మందికి స్థాన చలనం కల్పిస్తూ కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గడిచిన కొన్నేళ్లుగా నగరంలో బదిలీలు ( 69 Inspectors in city transferred) జరుగుతున్నప్పటికీ గరిష్టంగా ఐదు స్థానాలకే పరిమితం అవుతున్నాయి.

Advertisement

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, ఈ నెల 17 వరకు పలు రైళ్లు రద్దు, 34 ఎంఎంటీఎస్‌ రైళ్లు, 15 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశామని తెలిపిన దక్షిణ మధ్య రైల్వే

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి 17వ తేదీ పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే (SCR) రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలిపింది.

Telangana Rains: శాంతించని వరుణుడు, నేడు రేపు తెలంగాణలో భారీ వర్షాలు, 12 జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని తెలిపిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని.. రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు (Telangana Rains) కురుస్తాయని హెచ్చరించింది.

Aara Poll Survey: తెలంగాణలో టీఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయం, ఆసక్తిరేపుతున్న ఆరా సర్వే, రెండోస్థానంలో బీజేపీ, మూడో ప్లేస్‌లో కాంగ్రెస్, ఏయే ప్రాంతాల్లో పోటీ ఎలా ఉందో తేల్చిన సర్వే

Naresh. VNS

‘ఆరా పోల్ స్ట్రాట‌జీ ప్రైవేట్ లిమిటెడ్’ (Aara poll stratugy pvt.Ltd) సంస్థ ప‌లు విష‌యాలు తెలిపింది. ‘ఆరా తెలంగాణ‌ స‌ర్వే’(Aara telengana Survey) పేరిట చేసిన‌ ఓ స‌ర్వే వివ‌రాలను విడుద‌ల చేసింది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే టీఆర్ఎస్ గెలుస్తుంద‌ని తేల్చింది.

Telangana Rains: తెలంగాణలో మరో మూడో రోజుల పాటు భారీ వర్షాలు, 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

గత అయిదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు మళ్లీ ఇంకో వార్త కంటి మీద కునుకులేకుండా చేసేందుకు రెడీ అయింది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు (Telangana Rains) పడనున్నట్లు వాతావారణ విభాగం తెలిపింది. దాంతోపాటు ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

Advertisement

Telangana Floods: జగిత్యాలలో విషాదం, న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన ఎన్టీవీ జర్నలిస్ట్ గల్లంతు, గాలింపు చర్యలు ముమ్మరం చేసిన అధికారులు

Hazarath Reddy

గిరిజన కూలీలు వరదలో చిక్కుకున్న న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టు ప్రమాదంలో చిక్కుకున్నారు. రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన 9 మంది కూలీలు కుర్రులో పత్తి ఏరేందుకు వెళ్లి జలదిగ్బంధంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Telangana Rains: తగ్గని భారీ వర్షాలు, తెలంగాణలో మరో 3 రోజులు స్కూళ్లకు సెలవులు పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడగిస్తున్నట్టు (TS Govt extened of holidays) బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరిగి బడులు సోమవారం తెరుచుకోనున్నాయి.

Telangana: ఎత్తు కొలుస్తానంటూ యువతిపై పోలీస్ అధికారి లైంగిక వేధింపులు, రెబ్బెన ఎస్సై భవానీసేన్‌‌పై వేటు ఉన్నతాధికారులు, అవమానం తట్టుకోలేక ఎస్సై భార్య ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఇటీవల హైదరాబాద్‌లో ఓ సీఐ, మరో ఎస్సై మహిళలపై లైంగికదాడుల ఘటనలు మరువక ముందే కుమురంభీం జిల్లా రెబ్బెన ఎస్సైపైనా ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో యువతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెబ్బెన ఎస్సైపై వేటు పడింది.

TS EAMCET 2022 Postponed: తెలంగాణ ఎంసెట్ పరీక్షలు వాయిదా, తదుపరి తేదీ పూర్తి వివరాలు ఇవే, ఇప్పటికే OU, KU పరిధిలో పలు పరీక్షలు వాయిదా

Hazarath Reddy

తెలంగాణలో కుండపోత వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలను వాయిదా (TS EAMCET 2022 Postponed) వేస్తున్నట్టు ప్రకటించింది

Advertisement

Telangana: ఇదేమి విడ్డూరం సామి.. జోరువానలో మొక్కలకు నీళ్లు పడుతున్న జీహెఎంసీ సిబ్బంది, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా నాలుగైదు రోజుల నుంచి ముసురు కమ్ముకుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ ఎంసీ సిబ్బంది మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించారు. జోరు వానలో ఓ ఫ్లై ఓవర్ పక్కన ఉన్న చెట్లూ, మొక్కలకు నీళ్లు పోస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Telangana: గోదావరి నదిలో గల్లంతైన 9 మంది సేఫ్, రెండు బోట్లలో బాధితులను క్షేమంగా ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

Hazarath Reddy

జగిత్యాలలో గోదావరి నదిలో గల్లంతైన తొమ్మిది మంది రైతు కూలీలు సురక్షితంగా (Nine farm labourers Safe) బయటపడ్డారు.

Upper Manair Dam: తెలంగాణ జలదృశ్యం వీడియో, పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు డ్యామ్, భారీ వర్షాలకు నిండుకుండలా మారిన జలాశయాలు

Hazarath Reddy

ఎగువ మానేరు డ్యామ్ తెలంగాణ రాష్ట్రం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట్ మండలం నర్మల గ్రామంలో మానేరు నదిపై నిర్మించబడిన జలాశయం. ఇది 1,62,000 హెక్టార్లకు సాగు నీటిని అందించడమేకాకుండా, మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

Tragedy Video: చూస్తుండగానే ఇద్దరిని మింగేసిన అలలు, విషాదకర వీడియో షేర్ చేసిన సజ్జనార్, సముద్రాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

Hazarath Reddy

ఆయన షేర్ చేసిన వీడియోలో సముద్రం దగ్గర కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒక్కసారిగా అలలు ఎగసి వారి మీద పడ్డాయి. ఈ అలలకు అక్కడ ఉన్న ఇద్దరు కొట్టుకువెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలుస్తోంది. వీడియో ఇదే..

Advertisement
Advertisement