తెలంగాణ

KTR Fires on BJP: ఢిల్లీ బీజేపీ- సిల్లీ బీజేపీ రైతుల్ని ఆగం చేస్తున్నాయ్, ధాన్యం కొనేవరకు కేంద్రాన్ని వదిలేది లేదని మంత్రి కేటీఆర్ ప్రకటన, వరుస నిరసనలపై కార్యాచరణ ప్రకటించిన కేటీఆర్

Naresh. VNS

యాసంగి ధాన్యం (Yasangi Rice) కొనుగోలుపై కేంద్రంతో యుద్ధం కొనసాగించేందుకు టీఆర్‌ఎస్ రెడీ అయింది. ఈ మేరకు వరుస నిరసనలపై కార్యాచరణ ప్రకటించారు మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). లక్షలాది మంది రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెబుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Warangal: ఎంజీఎంలో ఎలుకలు కొరికిన పేషెంట్‌ మృతి, నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించిన శ్రీనివాస్, అవయవాలు పనిచేయకపోవడం వల్లనే చనిపోయాడంటున్న డాక్టర్లు

Naresh. VNS

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో (MGM) ఎలుకలదాడిలో గాయపడిన బాధితుడు శ్రీనివాస్ మృతి (Srinivas Died) చెందాడు. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. నిన్న అతడి పరిస్థితి విషమించడంతో.. వరంగల్ ఎంజీఎం నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. అయితే శ్రీనివాస్ కిడ్నీ సమస్యతో (Kidney Failure)కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు.

Telangana Governor Comments on KCR: సీఎం కేసీఆర్ లేకుండానే రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు, పండుగపూట మరోసారి బయటపడ్డ విభేదాలు, ఫ్లెక్సీలో కేసీఆర్ ఫోటో ముద్రించని రాజ్‌భవన్ వర్గాలు,ఇద్దరి మధ్య మరింత ముదురుతున్న కోల్డ్ వార్

Naresh. VNS

రాజ్ భవన్ లో ఉగాది వేడుకులకు (Rajbhavan Ugaadi Celebrations) సీఎం కేసీఆర్ గైర్హాజరు కావడం చర్చకు దారితీసింది. దీనిపై గవర్నర్ తమిళిసై పరోక్షంగా స్పందించారు. నా ఆహ్వానాన్ని గౌరవించనందుకు నేను బాధపడడం లేదన్నారు గవర్నర్ తమిళిసై (Tamilisai). 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించానని, కొందరు వచ్చారని, రాని వారి గురుంచి నేను చెప్పేదేమీ లేదన్నారామె.

Telangana: సిక్కీంలో జరిగిన పారాగ్లైడింగ్‌లో తెలంగాణ యువతి మృతి, ఆమె గైడ్ సందీప్ గురుంగ్ కూడా మృతి, వేగంగా వచ్చిన గాలులతో ఒకదానికొకటి ఢీకొన్న పారాచూట్​లు

Hazarath Reddy

నార్త్ సిక్కింలో జరిగిన పారాగ్లైడింగ్ ప్రమాదంలో హైదరాబాద్​కు చెందిన యువతి ప్రాణాలు కోల్పోయింది. బాధితురాల్ని ఖమ్మంకు చెందిన రామ్​కుమార్​ రెడ్డి కుమార్తె ఈశా రెడ్డి సంకెపల్లి(23)గా అధికారులు గుర్తించారు. సిక్కిం పర్యాటకానికి వెళ్లిన ఈశా.. శుక్రవారం ఉదయం లాఛుంగ్​ వ్యూ పాయింట్​ నుంచి పారాగ్లైండింగ్​లో పాల్గొంది.

Advertisement

Hyderabad: డ్రగ్స్ అడ్డాగా హైదరాబాద్‌, తొలి డ్రగ్ మరణం నమోదు, ఐదు గ్రాముల హష్‌ ఆయిల్‌ రూ.3 వేలు, పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ షాకింగ్ విషయాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. మోతాదుకు మించి మాదకద్రవ్యాలు తీసుకున్న ఓ 23 ఏళ్ల ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ (BTech graduate Dies) ప్రాణాలు కోల్పోయాడు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి నుంచి డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది

Corona in TS: తెలంగాణలో కొత్తగా 31 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 23 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

Telangana: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం, ఐసీయూలోని పేషెంట్‌పై ఎలుకలు దాడి, పేషంట్ పరిస్థితి విషమం, ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

Hazarath Reddy

ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో (Warangal MGM hospital) ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్‌పై ఎలుకలు దాడి (Rodents bite patient) చేశాయి. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భీమారంకు చెందిన పేషంట్ శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేసి ఐదు చోట్ల కొరికాయి.

Mahesh Bank Hacking Case: మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, మహేష్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే హ్యాకింగ్ జరిగిందని తెలిపిన సీపీ సీవీ ఆనంద్

Hazarath Reddy

హైదరాబాద్‌లో మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసును నగర పోలీసులు ఛేదించారు. దాదాపు 2 నెలలపాటు, 100 మంది పోలీసు అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. ప్రధాన హ్యాకర్ దేశంలో లేడని తెలిపారు. మొత్తం 23 మంది నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు.

Advertisement

Ruckus at Srisailam: మంచినీళ్లు అడిగినందుకు గొడ్డలితో దాడి, శ్రీశైలంలో కన్నడ భక్తుల భీభత్సం, పలు వాహనాలకు నిప్పు, కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడి చేసిన టీ షాపు యజమాని

Naresh. VNS

ఓ కన్నడ భక్తుడు చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. దుకాణ యజమానిని తాగడానికి నీళ్లు అడిగాడు. అయితే లేవని చెప్పడంతో ఆ భక్తుడు అతనితో గొడవకు దిగాడు. అది కాస్తా తీవ్రం కావడంతో టీ షాపు యజమాని కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

Telangana Reduces School Timings: తెలంగాణలో ఇకపై 11.30 వరకే స్కూల్స్, ఎండల తీవ్రతతో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇవాల్టి నుంచే అమల్లోకి కొత్త టైమింగ్స్

Naresh. VNS

స్కూల్ విద్యార్దులు వడదెబ్బ భారిన పడకుండా స్కూల్ టైమింగ్స్ కుదించింది (Reduce School Timings) ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణలో ఒంటిపూట (Half Day schools)బడులు నడుస్తున్నాయి. తాజాగా ఎండల తీవ్రతతో సమయాల్లో మార్పులు చేసింది. బుధవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు పెరిగాయి.

Discount on Pending Traffic Challans Extended:వాహనదారులకు గుడ్ న్యూస్, పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ తేదీ పొడిగింపు, ఏప్రిల్ 14 వరకు ఛాన్స్, కీలక ప్రకటన చేసిన పోలీసులు

Naresh. VNS

ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన డిస్కౌంట్ తేదీని 15 రోజుల పాటూ పొడిగించారు (Date Extended). ఈ మేరకు ప్రకటన చేశారు. పాత నిబంధ‌న‌ల ప్ర‌కారం మార్చి 1 నుంచి 31 వ తేదీ వ‌ర‌కూ ఈ రాయితీ వ‌ర్తిస్తుంది. అయితే.. ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న విశేష స్పంద‌న‌ను చూసి, ప్ర‌జ‌ల‌కు మ‌రింత సౌల‌భ్యాన్ని క‌ల్పించ‌డం కోసం ఈ రాయితీ (Discount )గడువును ప్ర‌భుత్వం మ‌రో 15 రోజుల పాటు పొడిగించింది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 40 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 21 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 19,052 కరోనా పరీక్షలు నిర్వహించగా, 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 21 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 35 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు

Advertisement

TS ICET 2022: టీఎస్ ఐసెట్-2022 నోటిఫికేష‌న్‌ విడుదల, ఏప్రిల్ 6 నుంచి జూన్ 27వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు, జులై 27, 28 తేదీల్లో ఐసెట్ ప‌రీక్ష

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా టీఎస్ ఐసెట్-2022 నోటిఫికేష‌న్‌ను కాక‌తీయ విశ్వవిద్యాల‌యం బుధ‌వారం విడుద‌ల (TS ICET 2022) చేసింది. ఏప్రిల్ 6 నుంచి జూన్ 27వ తేదీ వ‌ర‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

Weather Forecast: తెలంగాణలో ఏప్రిల్ 2 వరకు ఎండలే ఎండలు, బయట తిరగవద్దని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటన, 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

Hazarath Reddy

తెలంగాణలో ఏప్రిల్ 2 వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. ఈసారి ‘అంతకు మించి’ అన్నట్టుగా సూర్యుడి ప్రతాపం (Weather Forecast) ఉండబోతోందని.. ముఖ్యంగా రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ( Heatwave warning) నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

CM KCR Writes PM Modi: ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ లేఖ, ఉక్రెయిన్‌ నుంచి తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వాలని వినతి

Hazarath Reddy

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి అర్ధాంతరంగా తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం లేఖ రాశారు

Covid in TS: తెలంగాణలో కొత్తగా 32 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 17 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 18,246 కరోనా పరీక్షలు నిర్వహించగా, 32 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 67 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.

Advertisement

IPS Umesh Chandra: దివంగ‌త ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రకు నివాళి అర్పించిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Hazarath Reddy

దివంగ‌త ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రకు (IPS Umesh Chandra) తెలంగాణ కేడ‌ర్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ మంగ‌ళ‌వారం నివాళి అర్పించారు. మార్చి 29న ఉమేశ్ చంద్ర జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఉమేశ్ చంద్ర నిలువెత్తు చిత్ర ప‌టం ముందు స‌జ్జ‌నార్ నివాళి అర్పించారు

Hyderabad Shocker: దారుణం.. బ్యాంక్ లాకర్ గదిలోనే రాత్రంతా వృద్ధుడు, జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్వాకం,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

Hazarath Reddy

జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాలమీదకు వచ్చింది. లాకర్ గదిలోనే వృద్ధుడు కృష్ణారెడ్డిని ఉంచి బ్యాంకుకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం లాకర్ రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడిని సిబ్బంది గమనించారు.

Siddipet Shocker: వీళ్లు మనుషులేనా, సిద్ధిపేటలో దారుణం, 100 వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపేశారు, పాడుబడిన బావిలో మృతజీవాలను పూడ్చేసిన ఘటన...జాతీయ స్థాయిలో కలకలం..

Krishna

గ్రామస్తుడొకరు తన పెంపుడు కుక్క చనిపోవడంతో హైదరాబాదులోని స్ట్రే యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు తెలిపారు. సంస్థ సభ్యులు ఆదివారం రాత్రి గ్రామానికి వచ్చి విచారించగా అసలు విషయం వెల్లడైంది.

Telangana: తెలంగాణలో మరో ఘోర ప్రమాదం, బర్రెను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, తొమ్మిది మందికి గాయాలు, మరో ఘటనలో జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ హుండ్యాయ్‌ క్రేటా కారు బీభత్సం

Hazarath Reddy

మహబూబాబాద్ మండలం కంబాల పల్లి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. కామారెడ్డి నుంచి భద్రాచలంకు వెళుతున్న ఎక్స్ ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న బర్రెను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ (TSRTC Bus Hits Tree) కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా 9మందికి గాయాలయ్యాయి.

Advertisement
Advertisement