తెలంగాణ

Weather Forecast: ఎండలు బాబోయ్ ఎండలు, తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వడగాడ్పులు, తెలంగాణలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేసవి ఆరంభంలోనే వడగాడ్పులు రంగప్రవేశం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎండలు (Heat Wave) పెరుగుతున్నాయి. క్రమేపి పగటి ఉష్ణోగ్రతలలో మార్పు కనిపిస్తోంది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 30 మందికి క‌రోనా, ప్ర‌స్తుతం రాష్ట్రంలో 492 క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు

Hazarath Reddy

కరోనా వైర‌స్ బులిటెన్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ బులిటెన్ ప్ర‌కారం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 17,806 కరోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్షల‌లో రాష్ట్ర 30 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది.

Hyderabad: వాట్సప్ కాల్ ఎత్తగానే మొబైల్‌లోకి నగ్న వీడియోలు, ఇతరులకు పంపించకుండా ఉండాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని బెదిరింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

Hazarath Reddy

హైదరాబాద్‌లో 30 ఏళ్ల వ్యక్తి ఓ అనామక నంబర్‌ (anonymous number) నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్‌ రావడం.. అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి రూ.55 వేలు (Video call costs Hyderabad man Rs 55,000) ఇవ్వాలని అడగడం జరిగింది.

TS EAMCET 2022: టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్ విడుదల, ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు

Hazarath Reddy

టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్‌ను ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను (TS EAMCET 2022) స్వీక‌రిస్తారమని కన్వీనర్ పేర్కొన్నారు.

Advertisement

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, ఉద్యోగం పేరుతో యువతిని లాడ్జీకి తీసకెళ్లి రేప్ చేసిన మృగాడు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన యువతి...

Krishna

ఉద్యోగం పేరుతో ఓ మృగాడు యువతిపై అత్యాచారం చేశాడు. దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో యువతి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

CM KCR Yadadri Tour: యాదాద్రిలో పల్లకి మోసిన కేసీఆర్, విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం జ‌లాభిషేకం, కొనసాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటన

Hazarath Reddy

యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొద‌ల‌య్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో సీఎం కేసీఆర్ (Telangana Chief Minister K Chandrashekar Rao), ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌భుత్వ అధికారులు, అర్చ‌కులు, వేద పండితులు పాల్గొన్నారు.

Telangana: వేకువ జామునే కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు-కారు ఢీ, ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత, ఆస్పత్రిలో చావు బతుకుల్లో మరో చిన్నారి

Hazarath Reddy

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో ( 5 People Killed in Bus-Car Collision) ఐదుగురు మృత్యువాత పడ్డడారు. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌లో సోమవారం వేకువ జామునే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 41 మందికి కరోనా, రాష్ట్రంలో ప్రస్తుతం 514 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

రాష్ట్రంలో ఆదివారం 13,158 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 41 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరింది. తాజాగా మరో 63 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 7.86 లక్షల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.

Advertisement

CM KCR Yadadri Tour: యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్, మహాపూర్ణాహుతితో మొదలైన సంప్రోక్షణ ఉత్సవాలు, ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ

Hazarath Reddy

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ దంపతులతో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వడ అజయ్ కుమార్, విప్ గొంగిడి సునీత తదితరులు యాదాద్రికి చేరుకున్నారు.

Sai Dharam Tej New Film: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి వీడియో రిలీజ్ చేసిన సాయిధరమ్ తేజ్, కొత్త మూవీ అనౌన్స్ చేసిన తేజు, తనను కాపాడిన వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ వీడియో విడుదల

Naresh. VNS

తేజుకు ఇంటి వద్దే చికిత్స ఇప్పిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ హీరో తాను కోలుకున్నట్లు తన అభిమానులకు తెలిపేందుకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, తన కుటుంబ సభ్యులకు, తన మేనమామలు చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్‌లకు (Pawan Kalyan) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 36 మందికి కరోనా, సగానికి పైగా కేసులు హైదరాబాదులోనే

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,427 శాంపిల్స్ పరీక్షించగా, 36 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అందులో సగానికి పైగా కేసులు హైదరాబాదులోనే వెలుగు చూశాయి. నగరంలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 75 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Hyderabad: ట్రాన్స్‌జెండర్ల కోసం హైదరాబాద్‌లో జాబ్ మేళా నిర్వహించిన సిటీ పోలీసులు, 600కి పైగా ఖాళీలను ప్రకటించిన 100 కంపెనీలు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నగర పోలీసులు నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ట్రాన్స్‌జెండర్ ఉద్యోగావకాశాల కోసం చాలామంది వచ్చారు. దాదాపు 100 కంపెనీలు వచ్చి 600కి పైగా ఖాళీలను ప్రకటించాయి. ఈ ప్లాట్‌ఫారమ్ ఉద్యోగార్ధులు మరియు యజమానులను కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుందని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ CV ఆనంద్ తెలిపారు.

Advertisement

TS TET Notification:టీచర్ జాబ్ కోసం చూస్తున్నారా? గుడ్ న్యూస్, తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల, మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు అప్లై చేసుకోండి! జూన్ 12న టెట్ ఎగ్జామ్

Naresh. VNS

: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల (Teacher Jobs) కోసం ఎదురుచూసే లక్షలాది మంది అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉపాధ్యాయుల నియామకానికి (Teacher recruitment) ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)కు సంబంధించి తెలంగాణ సర్కారు (Telangana Govt.) గురువారం రోజున నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

AP Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి, మరో 10 మందికి గాయాలు

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రగొండపాలెం మండలం కొత్తపల్లి దగ్గర ఆటోను కారు (AP Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఎర్రగొండపాలెం ఆస్పత్రికి తరలించారు. మృతులు మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా (Four persons killed on the spot) గుర్తించారు.

Telangana Government Jobs: తెలంగాణ కొలువుల జాతరలో కీలక ఘట్టం, 30వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్ధికశాఖ అనుమతులు, శాఖల వారీగా వివరాలు ఇవే! ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారో తెలుసా?

Naresh. VNS

కేసీఆర్ ప్రకటనతో భర్తీ ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనుమతులు ఇవ్వాలని సీఎం శాసన సభలో ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ఆయా శాఖల అధికారులతో పలు దఫాలుగా చర్చించారు. మొత్తం 80,039 పోస్టులకు గాను తొలి విడుత 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇవాళ అనుమతులు జారీ చేసింది.

TRS Agitations on Fuel Prices: ఇక సమరమే! పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుపై టీఆర్‌ఎస్ ఆందోళనలు, పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్, భారీ నిరసనలకు ప్లాన్ చేసిన టీఆర్ఎస్ శ్రేణులు

Naresh. VNS

ధరల పెరుగుదలపై టీఆర్ఎస్ భగ్గుమంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో జ‌ర‌గ‌నున్న ఈ నిర‌స‌న‌ల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్య‌లో పాలుపంచుకోనున్నాయి.

Advertisement

Minor Rape In Hyderabad: హైదరాబాద్ లో దారుణం, సులభ్ కాంప్లెక్స్ లో 10 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం, కన్నతల్లి కళ్లముందే షాకింగ్ ఘటన, నిందితుడిని చితకబాదిన స్థానికులు

Krishna

Rangareddy District మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బడంగ్ పేట్ లో స్థానికంగా ఉండే పండ్ల వ్యాపారి కూతురిపై పక్కనే ఉండే Sulabh Complex లో పనిచేసే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 72 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 35 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, తొలివిడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ, గ్రూప్‌-1లో 503 పోస్టుల భర్తీకి అనుమతి..

Krishna

సీఎం కేసీఆర్ ప్రకటించిన మొత్తం 80,039 ఉద్యోగాలకు గాను తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ బుధవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తదుపరి ప్రక్రియకు సంబంధించి నియామక సంస్థలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

KCR Letter to Modi: జాతీయ ధాన్యం సేకరణ విధానం తీసుకురండి! ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ, మొత్తం ధాన్యం కొనకపోతే కనీస మద్దతు ధరకు అర్ధం ఏముంది?

Naresh. VNS

ప్రధాని మోదీకి (Modi) తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) లేఖ (Letter) రాశారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు పంటల సేకరణ పాలసీ (Procurement Policy) లేదని చెప్పారు. పంజాబ్ (Punjab), హర్యానాలో (Haryana) వందశాతం ధాన్యాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. పంజాబ్, హర్యానా తరహాలో తెలంగాణలో (Telangana) ధాన్యం సేకరణ జరగడం లేదన్నారు.

Advertisement
Advertisement