తెలంగాణ
Nalgonda Accident: పెళ్లైన వారం రోజులకే విషాదం, రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ ఎస్‌ఐ మృతి, ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తండ్రి సహా ఎస్‌ఐ మృతి
Naresh. VNSనల్లగొండలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన వారం రోజులకే వికారాబాద్ వన్ టౌన్ ఎస్‌ఐ రోడ్డు (Sub-inspector) ప్రమాదంలో మృతి చెందారు. ఈఘటనలో ఎస్‌ఐ(Sub-inspector)తో పాటు ఆయన తండ్రి కూడా మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Liquor Sales in Telangana: మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌, న్యూఇయర్‌ నాడు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలెన్ని అంటే! ఏపీలోనూ రికార్డుస్థాయిలో లిక్కర్ సేల్
Naresh. VNSసంవత్సరం చివరి రోజు (Year End)తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో లిక్కర్‌ అమ్మకాలు(Highest Liquor sale) జరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ(Excise) తెలిపింది. డిసెంబర్‌(December) నెలలోనే తెలంగాణలో అత్యధిక విక్రయాలు(Telangana Liquor sale highest) నమోదయ్యాయి.
Telangana: తెలిసిన వాళ్లే దారుణంగా రేప్ చేస్తున్నారు, తెలంగాణలో 23 శాతానికి పైగా పెరిగిన అత్యాచార కేసులు, రాష్ట్రంలో మొత్తం నేరాలు 4.65 శాతం పెరిగాయని తెలిపిన పోలీస్ అధికారులు
Hazarath Reddyఈ కేసులను స్టడీ చేయగా ఎక్కువ భాగం అత్యాచార బాధితులకు నేరస్థులు తెలిసిన వారేనని పోలీసులు తెలిపారు. కాగా 2020లో 1,934 అత్యాచార కేసులు నమోదయ్యాయి. కేవలం 26 కేసుల్లో మాత్రమే గుర్తుతెలియని నిందితులు అత్యాచారాలకు పాల్పడ్డారని తేలింది
Telangana High Court: తెలంగాణలో ఒమిక్రాన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు, కేంద్ర గైడ్‌లెన్స్‌ను తప్పకుండా పాటించాలని కేసీఆర్ ప్రభుత్వానికి సూచన, న్యూఇయర్ వేడుకలపై జోక్యం చేసుకోలేమని తెలిపిన కోర్టు
Hazarath Reddyహైకోర్టు ఒమిక్రాన్‌పై కీలక ఆదేశాలు ( immediately implement the guidelines) జారీ చేసింది. ఈ నెల 21, 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లెన్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
Vijaya Dairy: తెలంగాణలో పాల వినియోగదారులకు షాక్, విజయ డైయిరీ పాల ధరలు పెంపు, లీటరు టోన్డ్ మిల్క్ పై రూ. 2, హోల్ మిల్క్ పై రూ. 4 పెంపు
Hazarath Reddyతెలంగాణలో విజయ డైయిరీ పాల ధరలు పెరిగాయి. లీటరు టోన్డ్ మిల్క్ పై రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది. దీంతో పాటుగా హోల్ మిల్క్ ధర ధర కూడా రూ.4 పెంచింది. ఈ పెంచిన ధరలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
Hyderabad: మాయమాటలతో పొదల్లోకి తీసుకువెళ్లి బాలికపై దారుణంగా అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు, నల్గొండ జిల్లాలో భూమి తన పేర రాయలేదని భార్య మరో దారుణం
Hazarath Reddyభాగ్య నగరంలోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడింది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఓ యువకుడు మాయమాటలు చెప్పి మోటార్‌ సైకిల్‌పై హిమాయత్‌సాగర్‌ వైపు తీసుకెళ్లాడు.
Goreti Venkanna: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, వల్లంకి తాళం సాహిత్యానికి అవార్డు, హర్షం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్, అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
Hazarath Reddyకేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులను గురువారం ప్రకటించింది. కవి, రచయిత ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు (Telangana MLC Goreti Venkanna) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి గాను గోరటి వెంకన్నను తెలుగులో సాహిత్యంలో ఎంపికచేశారు.
Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో అడుగడుగునా తనిఖీలు, నూతన సంవత్సరం సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి..
Hazarath Reddyనూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions in Hyderabad) ప్రకటించారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 2 గంటల వరకు ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు పరిసరాల్లో వాహనాల రాకపోకలను అనుమతించబోమని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ (Hyderabad Commissioner of Police Anjani Kumar) తెలిపారు.
Omicron in TS: జనవరి 2 వరకు తెలంగాణలో ఆంక్షలు, ర్యాలీలు, సభలను నిషేధిస్తున్నామని తెలిపిన డీజీపీ మహేందర్ రెడ్డి, అందరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు (Omicron in TS) అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణలో ఆంక్షలు (Restrictions in Telangana) విధించారు. జనవరి 2వ తేదీ వరకు ర్యాలీలు, సభలను నిషేధిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి (DGP mahender-reddy) ఉత్వర్వులు జారీ చేశారు.
Omicron in Telangana: కరోనా థర్డ్‌వేవ్‌ దూసుకొస్తోంది, తెలంగాణలో వచ్చే 2,3 వారాలు చాలా కీలకమని తెలిపిన రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచన
Hazarath Reddyతెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఎటువంటి ప్రయాణ చరిత్ర, ఎలాంటి కాంటాక్ట్‌ లేకపోయినా ఒమిక్రాన్‌ వేరియంట్ (Omicron in Telangana) చాపకింద నీరులా వ్యాప్తిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులపై రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Corona in TS: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 235 మందికి కోవిడ్, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 121 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,023 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 235 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 121 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
December 31 Restrictions: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు మార్గదర్శకాలివే! నిబంధనలు విడుదల చేసిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు, 2డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికే అనుమతి
Naresh. VNSతెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు(New Year celebrations in Telangana) అనుమతిచ్చిన ప్రభుత్వం...పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలకండి. కానీ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకల(Hyderabad New year) సందర్భంగా సీపీ సీవీ ఆనంద్‌ (CV Anand)మార్గదర్శకాలు జారీ చేశారు.
CM KCR Review Meeting: ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష, నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో సమావేశం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష (CM KCR Review Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో పోడు భూముల అంశంతో పాటు దళిత బంధు పథకం అమలు, మెడికల్ కాలేజీ నిర్మాణంపై సీఎం చర్చించారు.
COVID Vaccination in Telangana: తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి, లక్ష్యం పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపిన మంత్రి హరీష్ రావు
Hazarath Reddyతెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వందశాతం లక్ష్యం పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ (COVID Vaccination in Telangana) అని, వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి వల్లే లక్ష్యం పూర్తి చేయగలిగామన్నారు. వ్యాక్సినేషన్ పై (COVID Vaccination) మొదట్నుంచీ సీఎం ప్రత్యేక దృష్టి సారించి, స్వయంగా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారని మంత్రి (Harish Rao) తెలిపారు.
KTR Tweet on CorbeVax Vaccine: తెలంగాణ నుంచి మరో కోవిడ్ టీకా, కార్బివాక్స్ కరోనా టీకాపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, ఇప్పటికే భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా విడుదల
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రం నుంచి మరో కోవిడ్ టీకా మార్కెట్లోకి రావడంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ (Minister KTR Tweet) చేశారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను విడుదల చేయగా , తాజాగా తెలంగాణకు చెందిన బయోలాజికల్ ఈ కంపెనీ కార్బివాక్స్ అనే కోవిడ్ టీకాను మార్కెట్లోకి త్వరలో విడుదల చేయనుంది.
Omicron in Telangana: తెలంగాణలో జనవరి 3 నుంచి పిల్లలకు కోవిడ్ టీకాలు, కొత్తగా మరో 7 ఒమిక్రాన్ కేసులు నమోదు, 62కు చేరిన మొత్తం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య
Hazarath Reddyకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కలవరం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ వేరియంట్ కేసులు (Omicron in Telangana) పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు (state tally reaches to 62) చేరింది. రాష్ట్రంలోని 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది వ్యాక్సిన్ తీసుకోలేదని మంత్రి హరీష్ రావు అన్నారు.
Telangana: తెలంగాణలో మందుబాబులకు పుల్ జోష్, డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, ఈవెంట్స్, టూరిజం హోటల్స్‌‌లో మందు విక్రయాలకు ప్రభుత్వం అనుమతి
Hazarath Reddyకొత్త సంవత్సరం సమీపిస్తున్న మద్యం బాబులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాల సమయాన్ని పొడిగిస్తున్నట్లు (Bars, liquor shops timings extended ) వెల్లడించింది. 2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం టీఎస్ సర్కార్ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది.
Power Bills in TS: తెలంగాణలో పెరగనున్న కరెంట్ ఛార్జీలు, యూనిట్‌కు నేరుగా 50 పైసలు, ఇతర కనెక్షన్ల వారి నుంచి యూనిట్‌కు రూపాయి అదనంగా వసూలు, 2022 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..
Hazarath Reddyచ్చే ఆర్థిక సంవత్సరం.. 2022 ఏప్రిల్‌ 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. ప్రతి ఇంటిలో వాడే కరెంటుపై యూనిట్‌కు నేరుగా 50 పైసలు, ఇతర కనెక్షన్ల వారి నుంచి యూనిట్‌కు రూపాయి చొప్పున అదనంగా ఛార్జీ వసూలు..
Hyderabad: పాతబస్తీ నుంచి ఎల్బీనగర్‌ వైపు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే, ఒవైసీ- మిధాని కూడళ్లలో ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, రూ.80 కోట్లు వెచ్చించి మూడు వరుసల రహదారిని 1.3కిలోమీటర్ల నిర్మించిన జీహెచ్‌ఎంసీ
Hazarath Reddyభాగ్యనగరంలో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. ఒవైసీ- మిధాని కూడళ్లలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. రూ.80 కోట్లు వెచ్చించి మూడు వరుసల రహదారిని 1.3కిలోమీటర్ల మేర ఈ పైఓవర్‌ను నిర్మించారు.
CP Ravindra Press Meet: హీరో సాయి ధరమ్‌తేజ్‌‌పై త్వరలో ఛార్జ్‌షీట్‌, 91 CRPC కింద నోటీసులు ఇస్తే ఇంకా వివరణ ఇవ్వలేదని తెలిపిన సైబరాబాద్‌ సీపీ రవీంద్ర
Hazarath Reddyసినీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ గత సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌ కావడంతో ప్రమాదానికి ( sai dharam tej bike accident) గురయిన సంగతి విదితమే. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.