తెలంగాణ
HYD CP Anjani Kumar: మొత్తం సోదా చేయడం మా విధుల్లో భాగం, వాహనాదరుల వాట్సాప్ చెకింగ్ చేయడంపై హైదరాబాద్ సీపీ క్లారిటి, మనమంతా వాట్సాప్‌ యూనివర్సిటీలో విద్యార్థులమయ్యామని వ్యంగ్యం విసిరిన అంజనీ కుమార్
Hazarath Reddyతెలంగాణలో ఓవాహనదారుడిని తనిఖీ చేస్తున్న పోలీసులు అతడి ఫోన్‌లోని వాట్సాప్‌ను కూడా పరిశీలిస్తున్న వీడియో రెండు రోజులుగా వైరల్‌గా మారిన సంగతి విదితమే. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భగ్నమంటూ సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో కామెంట్లు వచ్చాయి. దీనిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ (HYD CP Anjani Kumar) గురువారం స్పందించారు.
Anthrax Disease: కొత్తగా ఆంత్రాక్స్ కలకలం, ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆంత్రాక్స్ ఎన్ని సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉంటుంది, Anthraxపై ప్రత్యేక కథనం
Hazarath Reddyఆంత్రాక్స్ గొర్రెల నుంచి మనుషులకు సోకితే ప్రాణహానీ జరిగే అవకాశం వుంది. దీంతో గొర్రెల మందను గ్రామానికి దూరంగా వుంచాలని అధికారులు ఆయా గొర్రెల మందల యజమానులకు సూచించారు. కాగా ఈ ఆంత్రాక్స్ వ్యాధి పశువుల నుంచి పశువులకే కాకుండా పశువుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది.
Corona in TS: తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, ఇద్దరిలో ఏవై.4.2(AY.4.2) వేరియంట్, కొత్తగా 171 మందికి కోవిడ్ పాజిటివ్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 58 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో ఇద్దరిలో ఏవై.4.2(AY.4.2) వేరియంట్ గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని జీఐఎస్ఏఐడీ తెలిపింది. గత నెలలో తెలంగాణలో నమోదైన కేసులకు చెందిన 274 మంది రక్త నమూనాలను హైదరాబాదులోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబొరేటరీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా.. వీటిలో రెండు ఏవై4.2 రకం కేసులు ఉన్నట్టు తేలిందని వెల్లడించింది.
Telangana: ఘోర విషాదాలు, ముగ్గురు యువతుల ఆత్మహత్య, ధర్మపురం చెరువులో ఇద్దరి మృతదేహాలు లభ్యం, మరో మృతదేహం కోసం గాలింపు, కర్నూలులో ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి
Hazarath Reddyధర్మపురం చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలు ( two young women dead bodies) లభించాయి. ఉప్పరిపేటకు చెందిన ముగ్గురు యువతులు బుధవారం నుంచి కనిపించడం లేదు. వారికోసం కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.
Hyderabad Police: బీ అలర్ట్.. ప్రయాణికుల వాట్సాప్ చెక్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులు, అందులో గంజాయి ఛాటింగ్ ఉందని తేలితే వెంటనే అరెస్ట్
Hazarath Reddyహనాల నుంచి వచ్చే ప్రయాణికులు మొబైల్స్ (Randomly Checking People's Mobile Phone) చెక్ చేస్తున్నారు. అందులో గంజాయికి సంబంధించి ఏమైనా ఛాట్ చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటున్నారా..కాగా తెలంగాణన గంజాయి లేని రాష్ట్రంగా తయారుచేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.
Telangana: మిస్ తెలంగాణ 2018 యువతి ఆత్మహత్యాయత్నం, చనిపోతున్నానంటూ ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో, యువతిని రక్షించిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్యకు (hasini attempt suicide) యత్నించిన యువతిని పోలీసులు కాపాడారు. హిమాయత్‌నగర్‌లో ఓ యువతి తన ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, తప్ప తాగి అర్థరాత్రి యువతి గదిలోకి దూరి..ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించిన యువకుడు, యువకుడిని పట్టుకుని చితకబాదిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyభాగ్య నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ఓ యువకుడు అర్థరాత్రి యువతి ఇంట్లోకి దూరి కత్తితో (Hyderabad man stabs woman) యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు.యువతి అరవడంతో తల్లిదండ్రులు, బంధువులు నిందితుడిని (Hyderabad Shocker) పట్టుకుని చితకబాదారు.
Telangana High Court: ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం, దళిత బంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు, ఈ నెల 30 హుజూరాబాద్ ఉప ఎన్నిక
Hazarath Reddyతెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పును వెలువరించింది. దళిత బంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎలక్షన్‌ కమిషన్‌ (Election Commission)ఉత్తర్వులను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 65 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,392 కరోనా పరీక్షలు నిర్వహించగా, 186 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 65 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 16, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.
Corona in TS: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు, తాజాగా 190 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి కోవిడ్
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,388 కరోనా పరీక్షలు నిర్వహించగా, 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి.
AP Weather Report: 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు
Hazarath Reddyదక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం (Low-pressure area likely to form over Bay of Bengal) ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Krishna Water Dispute: సాగర్ ఎడమకాలువను ఏపీ ఇష్టారాజ్యంగా పెంచుకుంటూపోతోంది, కేఆర్ఎంబీ చైర్మన్‌కు రెండు లేఖలు రాసిన తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్
Hazarath Reddyకృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కి తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ (Telangana ENC Chief) రెండు లేఖలు రాశారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలను తుంగలో తొక్కి నాగార్జున సాగర్ ఎడమకాలువను ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోయారని లేఖలో ఆరోపించారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 179 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు, ఇంకా 4,023 మందికి కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,588 కరోనా పరీక్షలు నిర్వహించగా 179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు గుర్తించారు.
Road Accident in HYD: కీసర దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం, హైదరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ కుటుంబ సభ్యులు ముగ్గురు మృతి, చీరాలలో వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కీస‌ర మండ‌లం యాదగిరిపల్లి వ‌ద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ( Hyderabad’s Outer Ring Road) సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in HYD) చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన షిఫ్ట్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.
TRS Plenary Meeting Highlights: ఏపీలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు వేల విజ్ఞాప‌న‌లు, ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, 9వ సారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఏకగ్రీవంగా (CM KCR Unanimously Elected As TRS Party President ) ఎన్నికయ్యారు. పార్టీ ప్లీనరీ ఆయనను 9వ సారి అధ్యక్షుడిగా ఎన్నుకుంది. కేసీఆర్ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ కీలక నేత కేకే అధికారికంగా ప్రకటించారు.
TRS Party Plenary 2021: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, 21వ వసంతంలోకి అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, గులాబిమయమైన హైదరాబాద్, మరోసారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్ బాధ్యతలు
Hazarath Reddyటీఆర్‌ఎస్‌ 20వ సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా ప్లీనరీ పండుగకు (TRS Party Plenary 2021) గ్రేటర్‌ సిద్ధమైంది. రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని (20 Years of TRS Party) పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధుల సభ (ప్లీనరీ) సోమవారం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనుంది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 135 మందికి కరోనా, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,842 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 135 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు గుర్తించారు.
TS Inter 1st Year Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ఆపలేమని స్పష్టం చేసిన హైకోర్టు, ఈ నెల 25 నుంచి యథావిధిగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఎగ్జామ్స్, గురుకులాలు ఓపెన్ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Hazarath Reddyతెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ఆపలేమని హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు (TS Inter 1st Year Exams) ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
#PoliceFlagDay: అమరుడైన హోం గార్డు లింగయ్య త‌ల్లికి పాదాభివంద‌నం చేసిన రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్, వీడియోని ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన క‌మిష‌న‌రేట్
Hazarath Reddyరాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ ఓ హోం గార్డు త‌ల్లికి పాదాభివంద‌నం చేసిన దృశ్యాల‌కు సంబంధించ‌ని వీడియోను ఆ క‌మిష‌న‌రేట్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా వారి కుటుంబాల‌ను మ‌హేశ్ భ‌గ‌వ‌త్ స‌త్క‌రించారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 183 పాజిటివ్ కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 59 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,363 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 183 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 59 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 13, ఖమ్మం జిల్లాలో 12 కేసులు గుర్తించారు. నారాయణపేట, ములుగు, మహబూబ్ నగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.