తెలంగాణ

COVID19 in TS: వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా డెల్టా వేరియంట్ కరోనా సోకుతుంది; తెలంగాణలో కొత్తగా 354 కోవిడ్19 కేసులు నమోదు, 427 మంది రికవరీ, 6,308కి తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

కరోనావైరస్ యొక్క డెల్టా వేరియంట్ రకం వ్యాక్సిన్ పొందిన వారికి కూడా సోకుతుందని జాతీయ జన్యు ప్రయోగశాలల కన్సార్టియం పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా డెల్టా వేరియంట్ పాజిటివ్ కేసులు గుర్తించబడుతున్నట్లు తెలిపింది...

Dalit Bandhu Scheme: దళిత బంధు కింద హుజురాబాద్‌కు మరో రూ.500 కోట్ల నిధులు, ఈ వారంలో మరో రూ.వెయ్యి కోట్లు విడుదల, ఈ పథకం కోసం పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రూ.2వేల కోట్లు విడుదల చేయాలని గతంలో కేసీఆర్ ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణలో దళిత కుటుంబాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని (Dalit Bandhu Scheme) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజురాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా హుజురాబాద్‌లో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది.

Telangana Shocker: కొడుకా లేక కిరాతకుడా, భార్యతో కలిసి కన్నతల్లిపై కొడవలి, రాడ్డుతో దారుణంగా దాడి, భూవివాదాలే కారణం, బాధితురాలి కూతురు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నల్గొండ నిడమనూరు పోలీసులు

Hazarath Reddy

నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిన్నకూతురు పేర అదనంగా భూమి రిజిస్ట్రేషన్‌ చేసిందనే అక్కసుతో తన తల్లిపై కుమారుడు, కోడలు దాడి (Son and Daughter-in-law Attacked on Woman) చేసి గాయపరిచారు. జిల్లాలోని నిడమనూరు మండలంలోని పార్వతీపురంలో ఆదివారం చోటుచేసుకుంది.

Telangana: కనీస అర్హత మార్కులు అవసరం లేదు, వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశానికి పాస్‌ మార్కులు వస్తే చాలు, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ

Hazarath Reddy

కరోనావైరస్ నేపథ్యంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలో తెలంగాణ విద్యాశాఖ (TS Education Department) కీలక నిర్ణయం తీసుకున్నది. కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగించింది. పాస్‌ మార్కులు వస్తే చాలు.. ప్రవేశాలు పొందే వీలు కల్పించింది.

Advertisement

Hyderabad Shocker: మద్యం మత్తులో చనిపోతున్నానంటూ ఫేస్‌బుక్‌లో లైవ్, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ విఫలం కారణంగా లాడ్జిలో ఉరి వేసుకున్న యువకుడు, హైదరాబాద్ నగరంలో విషాద ఘటన

Hazarath Reddy

ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ విఫలం కారణంగా వివాహమైన ఓ యువకుడు లాడ్జిలో ఆత్మహత్యకు (Man commits suicide) పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 359 మందికి కోవిడ్, గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 74 కొత్త కేసులు, తాజాగా 494 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ 

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 73,899 కరోనా పరీక్షలు నిర్వహించగా, 359 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 74 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండు రోజుల పాటు నిలిచిపోనున్న టికెట్ రిజర్వేషన్ సేవలు, ఆగష్టు 21 నుంచి కొన్ని సమయాల్లో రైల్వే టికెటింగ్ సేవల్లో అంతరాయం, వివరాలు ఇలా ఉన్నాయి

Team Latestly

ఈ వేళల్లో ప్రారంభమయ్యే అన్ని రైళ్ల మెయిన్‌ చార్టులు, కరెంట్‌ బుకింగ్‌ చార్టులు ముందుగానే సిద్ధం చేయనున్నారు. PRS విచారణ ప్రస్తుత బుకింగ్/PRS కౌంటర్లలో మాన్యువల్‌గా నిర్వహించబడుతుంది. ఈమేరకు ప్రయాణికులు...

Rain Forecast: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన, రాబోయే 48 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనావేసిన వాతావరణ శాఖ, తెలంగాణలో వరదలకు ఆస్కారం ఉందని హెచ్చరిక

Team Latestly

వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది....

Advertisement

Jan Ashirwad Yatra: ఏపిలో కేంద్ర పథకాలు మినహా అభివృద్ధి లేదు, నీటి సమస్యలను ఏపి- టీఎస్ రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి, 'జన్ ఆశీర్వాద యాత్ర' పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Team Latestly

కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని తెలిపారు. కేంద్ర పథకాల అమలు మినహా ఏపిలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని అన్నారు. ఏపికి కేంద్రం అనేక విద్యాసంస్థలను మంజూరు చేసింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు...

Second Wave in TS: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని తెలిపిన స్టేట్ హెల్త్ డైరెక్టర్; రాష్ట్రంలో కొత్తగా 424 పాజిటివ్ కేసులు నమోదు, 449 మంది రికవరీ, 6912కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

హైదరాబాద్, ఖమ్మం మరియు కొత్తగూడెంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు, రాష్ట్రవ్యాప్తంగా 1,200 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి, 13 జిల్లాల్లో డెంగ్యూతో పాటు మలేరియా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 20 జిల్లాలలో ప్రభుత్వ డయాగ్నస్టిక్స్ సెంటర్లు...

TS ECET Results 2021: తెలంగాణ ఈసెట్‌-2021 ఫలితాలు విడుదల, ప్రవేశ పరీక్షలో 95.16 శాతం విద్యార్థులు అర్హత, ఈ నెల 24 నుంచి ఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌, ర్యాంకు కార్డులను https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ ఈసెట్‌-2021 ఫలితాలను (TS ECET 2021 Results Released) ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి (chairman Papi Reddy) విడుదలచేశారు. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 95.16 శాతం విద్యార్థులు అర్హత సాధించారు.

Telangana: పెళ్లి కాలేదని యువకుడు, పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య, తెలంగాణ రాష్ట్రంలో విషాద ఘటనలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

భాగ్యనగరంలోపెళ్లి కావడం లేదని జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన కాచిగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగార్జున్‌రెడ్డి వివరాల ప్రకారం.. నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్న మైనుద్దీన్‌ కుమారుడు సయ్యద్‌ మోహినుద్దీన్‌ టెక్నీíÙయన్‌గా పని చేస్తున్నాడు.

Advertisement

COVID19 in TS: తెలంగాణలో 79 శాతం కోవిడ్19 పేషెంట్లకు లక్షణాలేమి లేవు; రాష్ట్రంలో కొత్తగా 417 పాజిటివ్ కేసులు నమోదు, 569 మంది రికవరీ, 7 వేల దిగువకు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

సాయంత్రం వరకు మరో 569 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,42,416 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,939 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు...

Hyderabad Gang Rape Case: గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాధితురాలి సోదరి కోసం పోలీస్ బృందాలు గాలింపు, బాధితురాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుదని తెలిపిన రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి

Hazarath Reddy

గాంధీ ఆస్పత్రిలో అక్కా చెల్లెళ్లపై జరిగిన అత్యాచార ఘటనకు (Hyderabad Gang Rape Case) సంబంధించి నలుగురిని చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‌తో పాటు మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని విచారిస్తున్నారు.

Sisters Gang Rape in HYD: అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్,మత్తు మందు ఇచ్చి వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం,ఇంకా కనిపించని అక్క అచూకి, గాంధీ ఆస్పత్రిలో దారుణ ఘటన, కేసును దర్యాప్తు చేస్తున్న గోపాలపురం పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని భాగ్య నగరంలో దారుణం చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి సహాయకులుగా ఉండేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్లను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్‌, అతడి స్నేహితులు గదిలో నిర్బంధించి, మత్తుమందిచ్చి వారంరోజులు సామూహిక అత్యాచారం (Gang Rape in Hyderabad) చేశారు.

TS COVID Report: తెలంగాణలో కొత్తగా 405 కోవిడ్ కేసులు మరియు 3 మరణాలు నమోదు, గడిచిన ఒక్కరోజులో 577 మంది రికవరీ, ప్రస్తుతం 7,093కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

సాయంత్రం వరకు మరో 577 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,41,847 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,093 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...

Advertisement

CM KCR Huzurabad Tour: దళిత ప్రభుత్వ ఉద్యోగులకు దళిత బంధు వర్తింపు, దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని తెలిపిన సీఎం కేసీఆర్, హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

భవిష్యత్‌లో భారత్‌లో జరగబోయే దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ (CM KCR Launches Dalit Bhandu Scheme) నిర్వహించారు.

BJP vsTRS: నువ్వెంత నీ బతుకెంత..బండి సంజయ్‌పై విరుచుకుపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపాటి, మల్కాజ్ గిరి బంద్‌కు బీజేపీ పిలుపు, పలువురు అరెస్ట్, మైనంపల్లి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు

Hazarath Reddy

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద పరిస్థితి (BJP workers attack TRS MLA Mynampally Hanumantha Rao house ) ఉద్రిక్తంగా ఉంది. బీజేపీ కార్పొరేటర్ పై నిన్న దాడి జరిగిన సంగతి సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ శ్రేణులు జరిపిన ఈ దాడుల్లో కార్పొరేటర్ తీవ్రంగా గాయపడ్డారు

Corona in TS: తెలంగాణలో కొత్తగా 245 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 52 కేసులు, రీంనగర్ జిల్లాలో 30 కొత్త కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 7,268 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

Awards for Telangana Cops: సత్తా చాటిన తెలంగాణ పోలీసులు, జాతీయ స్థాయి పోలీస్‌ పతకాలకు 27 మంది ఎంపిక, దేశవ్యాప్తంగా మొత్తం 1,380 మంది పోలీస్‌ సిబ్బందికి పతకాలను అందజేసిన హోం శాఖ

Hazarath Reddy

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ స్థాయి పోలీస్‌ పతకాలకు తెలంగాణ నుంచి 27 మంది (Awards for Telangana Cops) ఎంపికయ్యారు. వీరితోపాటు జైళ్లశాఖలో ముగ్గురికి, అగ్నిమాపకశాఖలో ఇద్దరికి పతకాలు (national level police medals ) లభించాయి. పోలీస్‌శాఖ (TS Police) నుంచి ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాలు, 14 మందికి పోలీస్‌ శౌర్యపతకాలు, 11 మందికి విశిష్ట పోలీస్‌ సేవా పతకాలు దక్కాయి.

Advertisement
Advertisement