Balakrishna Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి బాలకృష్ణ, బసవతారకం ఆస్పత్రి పనుల నిమిత్తమే! రేవంత్ తో వరుసగా ప్రముఖుల భేటీ
రేవంత్ రెడ్డిని (Revanth Reddy) టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ (Nandamuri Balakrishna) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా బాలకృష్ణతోనే ఉన్నారు. అనంతరం రేవంత్ రెడ్డితో పలు అంశాలపై బాలకృష్ణ మాట్లాడారు.
Hyderabad, DEC 30: హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy) టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ (Nandamuri Balakrishna) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా బాలకృష్ణతోనే ఉన్నారు. అనంతరం రేవంత్ రెడ్డితో పలు అంశాలపై బాలకృష్ణ మాట్లాడారు.
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కుమారి @Pvsindhu1. pic.twitter.com/wywCoNKMhr
— Telangana CMO (@TelanganaCMO) December 30, 2023
మరోవైపు, రేవంత్ రెడ్డిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ డీఎస్పీ నళిని (Nalini) కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.
మాజీ డీఎస్పీ శ్రీమతి నళిని ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన… pic.twitter.com/wjOxp91ltN
— Telangana CMO (@TelanganaCMO) December 30, 2023
నటుడు నాగార్జున తన సతీమణి అమలతో పాటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అటు పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలతో పాటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పుదుచ్ఛేరి మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నారాయణస్వామి, శ్రీ వైద్యలింగం, తదితరులు.
Former CMs of Puducherry Sri V. Narayanaswamy, Sri V. Vaithilingam and others met Hon'ble CM Sri @Revanth_Anumula at… pic.twitter.com/WA7IX8VNoM
— Telangana CMO (@TelanganaCMO) December 30, 2023
వీరితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిశారు. పలు అంశాలపై రేవంత్ రెడ్డితో వారు మాట్లాడారు.
(The above story first appeared on LatestLY on Dec 30, 2023 07:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

