టెక్నాలజీ

Redmi 13 5G Launched in India: 108MP కెమెరాతో రెడ్‌మీ 13 5జీ ఫోన్‌ వచ్చేసింది. ధర కేవలం రూ.12,999 మాత్రమే, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి

Vikas M

Redmi 13 5G రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6 GB ర్యామ్‌ + 128 GB స్టోరేజ్‌ ధర రూ.12,999, 8 GB ర్యామ్‌ + 128 GB స్టోరేజ్‌ ధర రూ.14,999. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. కంపెనీ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్‌తో పాటు అమెజాన్‌లో ఈ ఫోన్‌ జులై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులోకి రానుంది.

CMF Phone 1: అదిరిపోయే ఫీచర్లతో సీఎంఎఫ్ ఫోన్1 వచ్చేసింది, 50-ఎంపీ కెమెరాతో పాటుగా ఇతర ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి

Vikas M

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ (CMF) భారత్ మార్కెట్లోకి తన సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1) సోమవారం విడుదల చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ఎస్వోసీతో వస్తు్న్న సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1).. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది.

Samsung Workers Strike: శాంసంగ్ కంపెనీకి భారీ షాక్, మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన కార్మికులు, జీతం పెంపు, సెలవుల సమయంపై విఫలమైన చర్చలు

Hazarath Reddy

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కు కార్మికులు భారీ షాక్ ఇచ్చారు. సౌత్ కొరియాలో అతిపెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ నేటి నుంచి మూడు రోజుల వాకౌట్‌కు వెళ్తోంది. జీతం సెలవుల సమయంపై గత నెలలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు యూనియన్ పిలుపునిచ్చింది.

Airtel Denies Data Breach: డార్క్ వెబ్‌లో 50 వేల డాలర్లకు ఎయిర్‌టెల్ డేటా అమ్మకం, కంపెనీ స్పందన ఏంటంటే..

Hazarath Reddy

డార్క్ వెబ్‌లో 375 మిలియన్ల ఎయిర్‌టెల్ కస్టమర్ల వివరాలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని ధృవీకరించని నివేదికలు సూచించాయి, అయితే ఆ ఆరోపణను కంపెనీ తోసిపుచ్చింది.

Advertisement

Robot ‘Dies by Suicide’: పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న రోబో, ప్రపంచంలో ఇది తొలి కేసు, మెట్లపై నుంచి దూకి సూసైడ్ చేసుకుందని చెబుతున్న దక్షిణ కొరియా అధికారులు

Vikas M

దక్షిణ కొరియాలో రోబో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వార్తను దక్షిణ కొరియా నగర మండలి బుధవారం, జూన్ 26న ధృవీకరించింది. దక్షిణ కొరియా యొక్క గుమి సిటీ కౌన్సిల్, తమ మొదటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రోబోట్ కొన్ని మెట్లపైకి విసిరిన తర్వాత పనికిరాకుండా పోయిందని తెలిపింది

UKG Layoffs: టెక్ రంగంలో మళ్లీ భారీ లేఆప్స్, 2,200 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం యుకెజి

Vikas M

యుఎస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ యుకెజి తన తాజా రౌండ్‌లో వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు నివేదించబడింది. ఒక నివేదిక ప్రకారం, UKG యొక్క సామూహిక తొలగింపు జూలై 4 సెలవుదినానికి ముందే ప్రారంభమైంది, కంపెనీ తన శ్రామికశక్తిలో దాదాపు 14% మందిని విడిచిపెట్టింది.

Microsoft Layoffs Continue: మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత, లింక్డిన్ వేదికగా ఉద్యోగం పోయిన పలువురు ఉద్యోగులు పోస్టులు

Vikas M

ఇంటర్నేషనల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత (Lays Offs)ను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు టీమ్‌లకు చెందిన వారిని తొలగించినట్లు గ్రీన్ వైర్ అనే మీడియా సంస్థ తెలిపింది. అయితే ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించిందో వెల్లడించలేదు

Unacademy Layoffs: ఆగని లేఆప్స్, మరోసారి 250 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ

Vikas M

ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ (Unacademy) మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈ సారి 250 మందిని కంపెనీ నుంచి తీసేసింది. వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంతోపాటు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Advertisement

Koo Shutting Down: ఎలాన్ మస్క్ ఎక్స్ ముందు నిలబడలేకపోయిన స్వదేశీ మైక్రోబ్లాగింగ్ యాప్ కూ, ఆర్థిక నష్టాలతో షట్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటన

Vikas M

ఎక్స్' (ట్విట్ట‌ర్‌)కు ప్రత్యామ్నాయంగా వ‌చ్చిన స్వ‌దేశీ మైక్రోబ్లాగింగ్ 'కూ' మూత‌ప‌డింది. ఆర్థిక ఇబ్బందుల‌తో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ, కోఫౌండ‌ర్ మ‌యాంక్ బిదావ‌త్కా లింక్డ్‌ఇన్‌లో ఒక‌ పోస్ట్ ద్వారా ప్రకటించారు.

Aditya-L1 Mission Update: సూర్యుడిపై ప్ర‌యోగాల్లో మ‌రో కీల‌క ఘ‌ట్టం, కేవ‌లం 178 రోజుల్లోనే క‌క్ష్య‌ను చుట్టేసిన ఆదిత్య ఎల్-1 స్పేస్ క్రాఫ్ట్

VNS

సూర్యుడి అధ్య‌య‌నం కోసం ప్ర‌యోగించిన ఆదిత్య ఎల్‌-1 (Aditya-L1 Mission) స్పేస్‌క్రాఫ్ట్ (Spacecraft) మొట్ట‌మొద‌టి సారి మండ‌ల క‌క్ష్య‌ను పూర్తి చేసుకున్న‌ది. లాగ్రాంగియ‌న్ పాయింట్ ఎల్‌-1 వ‌ద్ద‌కు గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 23వ తేదీన ఆదిత్య ఎల్‌-1ను ప్ర‌యోగించారు. నిర్దేశిత హాలో ఆర్బిట్‌లోకి ఆ స్పేస్‌క్రాఫ్ట్ 2024, జ‌న‌వ‌రి ఆరో తేదీన చేరుకున్న‌ది.

Electricity Bill Payment Update: గుడ్ న్యూస్, ఈ బ్యాంకుల కస్టమర్లు ఫోన్‌ పే, జీపే, పేటీఎం ద్వారా విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు

Vikas M

ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్‌ ప్లాట్‌ఫామ్‌లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్‌ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు.

Electricity Bills Payment: కరెంట్ బిల్లుల చెల్లింపులపై కీలక అప్‌డేట్, ఇకపై మీరు పేమెంట్లు అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో మాత్రమే చెల్లించాలి, జులై 1 నుంచి అన్నిగేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపుల నిలిపివేత

Hazarath Reddy

ఇకపై ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్‌ బిల్లులు చెల్లించడం సాధ్యపడదు. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్‌ ఈ సేవలను నిలిపివేస్తున్నాయి. తాజాగా తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి

Advertisement

Travel to Space for Just Rs 200: విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా రోదసిలోనే షికారు చేయొచ్చు. అది కూడా కేవలం రూ.200కే. మీకు కూడా ఈ అవకాశం ఉంది.. త్వరపడండి మరి!!

Rudra

విమానం ఎక్కి గాలిలో చక్కర్లు కొట్టాలని చాలా మందికి ఉంటుంది. అయితే, వేలల్లో టికెట్లు చెల్లించి ఎక్కడం చాలామందికి ఇబ్బందికరం. అయితే, కేవలం రూ.200 చెల్లించి విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా అంతరిక్షంలోనే షికార్లు కొట్టొచ్చు.

Rs 2000 Notes: రూ.7,755 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఇంకా ప్రజల వద్దే.. వెంటనే ఈ 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ సూచన

Vikas M

రూ.2 వేల నోట్లు (Rs 2,000 Notes) చలామణి నుంచి దాదాపు 97.87 శాతం మేర తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) సోమవారం ప్రకటించింది. ఇంకా రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది.

TRAI New Rules: సిమ్‌ కార్డ్‌ రీప్లేస్‌ మెంట్‌, సిమ్‌ స్వాప్‌ కోసం పది రోజులు వేచిచూడక్కర్లేదు.... రేపటి నుంచి అమల్లోకి ట్రాయ్‌ కొత్త రూల్స్

Rudra

సిమ్‌ స్వాప్‌, రీప్లేస్‌ మెంట్‌ కు సంబంధించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) మొబైల్‌ నెంబర్‌ పోర్టబిలిటీ నిబంధనలకు చేసిన సవరణలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Instagram Down: ఇన్‌స్టాగ్రామ్ మళ్లీ డౌన్, ఎక్స్ వేదికగా ఫిర్యాదులతో హోరెత్తించిన నెటిజన్లు, ఇంకా స్పందించని మెటా

Vikas M

ఇన్‌స్టాగ్రామ్ మళ్లీ డౌన్ అయింది. శనివారం, జూన్ 29, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు మెటా యాజమాన్యంలోని యాప్ సరిగ్గా పనిచేయడం లేదని పేర్కొన్నారు. #InstagramDown on Xని ఉపయోగించి, ఇన్‌స్టా రీల్స్‌ని చూస్తున్నప్పుడు వారు ఎదుర్కొన్న సమస్యలను వారు పంచుకున్నారు.

Advertisement

Vodafone Idea Hikes Mobile Plan Tariffs: టెల్కోల బాదుడు షురూ, మొన్న జియో.. నిన్న ఎయిర్‌టెల్.. నేడు వొడాఫోన్ ఐడియా, ఎంత పెరిగాయంటే..

Vikas M

రిలయన్స్ జియో,ఎయిర్‌టెల్ తమ ఫ్రీపెయిడ్, పోస్టు పెయిడ్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. పెరిగిన ధరలు జులై 3 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని టెల్కోలు రెండూ ప్రకటించాయి. తాజాగా, ఈ జాబితాలో వొడాఫోన్ ఐడియా కూడా చేరింది. వివిధ కేటగిరీల్లో 11 నుంచి 24 శాతం వరకు ధరలు పెంచింది

EPFO Key Decision: ఈపీఎఫ్ వో నిర్ణ‌యంతో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పెరుగ‌నున్న జీతం, ఇకపై గ్రూప్ ఇన్సురెన్స్ డిడ‌క్ష‌న్ ఉండ‌ద‌ని ప్ర‌క‌ట‌న‌

VNS

ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ (EPFO Key Decision) జారీ చేసింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం 2013 సెప్టెంబర్ 1 తర్వాత సర్వీస్‌లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అంతకు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. వీరికి యథావిధిగా గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమౌంట్ డిడక్ట్‌ అవుతుంది.

Airtel New Plan: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్, పెంచిన ధరలు జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటన

Hazarath Reddy

జులై 3 నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించిన ఒక్క రోజులోనే మరో దిగ్గజ సంస్థ భారతి ఎయిర్‌టెల్ కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలు పెంచుతున్నామని ఇవి కూడా జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ఎయిర్‌టెల్ ప్రకటించింది.

Reliance Jio Tariff Hike: రెండున్నరేండ్ల తర్వాత 20 శాతం చార్జీలు పెంచేసిన జియో, కొత్తగా 19 రకాల టారిఫ్ ప్లాన్లు ప్రకటన, పూర్తి వివరాలు ఇవిగో..

Vikas M

రిలయన్స్ జియో కొత్తగా 19 రకాల అన్ లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. వాటిలో 17 ప్రీపెయిడ్ ప్లాన్లు కాగా, రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్లు. ఇక రెండున్నరేండ్ల తర్వాత రిలయన్స్ జియో టారిఫ్ ధరలు పెంచింది. పెరిగిన ఈ కొత్త టారిఫ్ ప్లాన్లు జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. మొత్తంగా ఈ ప్లాన్ మీద 22 శాతం చార్జీలు పెంచేసింది.

Advertisement
Advertisement