Technology
GitHub Layoffs: ఆగని టెక్ లేఆఫ్స్, భారత్‌లోని ఇంజనీర్ల మొత్తాన్ని తీసేస్తున్న గిట్ హబ్, ఫిబ్రవరిలోనే తీసుకున్నామని వెల్లడి
Hazarath Reddyవెబ్, యాప్ టెక్నాలజీలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్ గిట్ హబ్ ఉద్యోగాల కోతకు రెడీ అయింది. భారత్ లోని తమ ఇంజినీరింగ్ విభాగం మొత్తాన్ని తొలగించాలని గిట్ హబ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గిట్ హబ్ కు అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద డెవలపర్ సెంటర్ భారత్ లోనే ఉంది.
Aadhaar-PAN Linking: గుడ్ న్యూస్, పాన్ కార్డుతో ఆధార్ లింక్ గడువు జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం, త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని సూచన
Hazarath Reddyసెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) శాశ్వత ఖాతా సంఖ్య (PAN)ని ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని జూన్ 30, 2023 వరకు పొడిగించింది. మార్చి 28, 2023న విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో CBDT పేర్కొంది. పన్ను చెల్లింపుదారులకు పాన్ ఆధార్ లింక్ చేసే ప్రక్రియను 30 జూన్ వరకు పొడిగించామని తెలిపింది.
WhatsApp Out of Date: వాట్సాప్ మెసేజింగ్ యాప్ లో సమస్యలు.. యాప్ అప్ డేట్, డౌన్ లోడ్ చేసుకునే సమయంలో సమస్యలు
Rudraమెటాకు చెందిన వాట్సాప్ మెసేజింగ్ యాప్ లో లోపాలు తలెత్తాయి. యాప్ ను అప్ డేట్ చేసుకునే సమయంలో సమస్యలు తలెత్తుతున్నట్టు పలువురు యూజర్లు తెలిపారు. ప్లే స్టోర్ నుంచి యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే సమయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొన్నారు.
Twitter's Value: ఎలాన్ మస్క్‌కు భారీ షాక్, ట్విట్టర్ కంపెనీలో నాలుగు నెలల పాటు డబ్బులు నిల్, కొన్న విలువలో సగానికి పైగా పతనమైన వాల్యూ
Hazarath Reddyబిలియనీర్ ఎలోన్ మస్క్ లీకైన మెమోపై లెక్కల ప్రకారం, ట్విట్టర్ విలువ.. ఆరు నెలల క్రితం దానిని కొనుగోలు చేయడానికి అతను ఖర్చు చేసిన దానిలో సగం కంటే తక్కువ, మస్క్ విలువలో $20 బిలియన్ (£16.4 బిలియన్) కంటే ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొన్నాడు.
UPI Transactions: అధికమవుతున్న యూపీఐ మోసాలు, ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ డబ్బు భద్రంగా ఉంటుంది
Hazarath ReddyUPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) చెల్లింపులు భారతదేశ ఆన్‌లైన్ చెల్లింపుల్లో విప్లవాత్మకంగా మార్చాయి. ఆన్‌లైన్ షాపింగ్, ట్రావెల్ బుకింగ్ నుండి రోడ్‌సైడ్ వెండర్‌ల నుండి కిరాణా లేదా కూరగాయలను కొనుగోలు చేయడం వరకు.. UPI మిమ్మల్ని బ్యాంక్ ఖాతాల మధ్య తక్షణమే నగదు బదిలీ చేయడానికి అనుమతిస్తుంది.
Salesforce COO Layoffs: ఆగని లేఆఫ్స్, అదనపు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సేల్స్‌ఫోర్స్, ఇప్పటికే 8 వేల మందికి ఉద్వాసన పలికిన దిగ్గజం
Hazarath Reddyసేల్స్‌ఫోర్స్ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బ్రియాన్ మిల్‌హామ్, టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం, లాభదాయకతను పెంచడానికి ప్రాధాన్యతనిస్తూ కంపెనీ అదనపు ఉద్యోగ కోతలను కొనసాగించవచ్చని హెచ్చరించినట్లు నివేదించబడింది.
WhatsApp Audio Chats: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ‘ఆడియో చాట్స్’ పేరిట త్వరలో అందుబాటులోకి..
Rudraమెటాకు (Meta) చెందిన వాట్సాప్(WhatsApp) మెసేజింగ్ యాప్ మరో కొత్త ఫీచర్ ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నది. ‘ఆడియో చాట్స్’ (WhatsApp Audio Chats) పేరిట త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ ఫీచర్ ద్వారా రియల్ టైమ్ ఆడియో వీజువలైజేషన్ (Real-Time Audio Visualisation) అనుభవం కలుగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Windows 11 New Update: విండోస్‌ 11లో స్క్రీన్ షాట్ బగ్‌ గుర్తించిన మైక్రోసాఫ్ట్, వ్యక్తిగత డేటా హ్యాకర్ల బారిన పడకుండా కొత్త అప్‌డేట్ ఇచ్చిన కంపెనీ
VNSప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (MicroSoft) సర్వీసుల్లో విండోస్ (Windows 10, Windows 11)లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో స్క్రీన్‌షాట్ సెక్షన్లను రీస్టోర్ చేసేందుకు అనుమతించే లోపాన్ని ఫిక్స్ చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ ఒక కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది.
PF Account Merge: కొత్త ఆఫీసులో చేరారా? అయితే పాత పీఎఫ్‌ అకౌంట్‌లోని డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం మరువొద్దు! ఈ స్టెప్స్ ఫాలో అయితే పీఎఫ్ అకౌంట్లు విలీనం చేయడం చాలా ఈజీ
VNSఉద్యోగం మారినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఉద్యోగి తమ (EPF) అకౌంట్ విలీనం చేయడం మర్చిపోకూడదు. మీ పాత UAN నంబర్ నుంచి కొత్త PF అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు పాత పీఎఫ్ అకౌంట్లోని మొత్తాన్ని కొత్త పీఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
TDS on Online Gaming: ఆన్‌లైన్‌ గేములు ఆడుతున్నారా? ఏప్రిల్ 1 నుంచి మీ జేబుకు చిల్లు ఖాయం, ఇకపై గేమ్‌లో గెలిస్తే టీడీఎస్ కట్టాల్సిందే
VNSఆన్‌లైన్ గేమ్స్‌లో (online gaming) పాల్గొనే వారిపై కేంద్రం కొర‌డా ఝుళిపించింది. వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌లో (online gaming) పాల్గొనే వారు పొందే గెలుచుకునే మొత్తాల‌పై 30 శాతం టీడీఎస్ (TDS) వ‌సూలు చేస్తుంది. ప్ర‌తి రూపాయి రాబ‌డిపైనా టీడీఎస్ వ‌సూలు చేస్తారు.
Gordon Moore Dies: ఇంటెల్ కుటుంబంలో తీవ్ర విషాదం, కంపెనీ సహ వ్యవస్థాపకుడు గోర్డాన్ మూరే కన్నుమూత, నివాళి అర్పించిన ఇంటెల్ కార్పొరేషన్
Hazarath Reddyఅమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్, టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు గోర్డాన్ మూరే (94)కన్నుమూశారు. శనివారం హవాయిలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఇంటెల్ కార్పొరేషన్ తన సహ వ్యవస్థాపకుడికి నివాళులర్పించింది. ఆయన చిరస్మరణీయం.. గొప్ప విజనరీని కోల్పోయమంటూ ట్వీట్‌ చేసింది.
Glassdoor Layoffs: ఆగని లేఆఫ్స్, 140 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పిన ఎంప్లాయర్ రేటింగ్ వెబ్‌సైట్ గ్లాస్‌డోర్
Hazarath Reddyఎంప్లాయర్ రేటింగ్ వెబ్‌సైట్ గ్లాస్‌డోర్ తన శ్రామిక శక్తిని దాదాపు 15 శాతం తగ్గించనుందని, 140 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని దాని సీఈఓ క్రిస్టియన్ సదర్లాండ్-వాంగ్ ప్రకటించారు.ఉద్యోగులకు పంపిన మెమోలో, సదర్లాండ్-వాంగ్ మొదటి నుండి, "మేము తొలగింపులు చివరి ప్రయత్నంగా చెప్పాము" అని చెప్పారు
Hindenburg vs Block: అదాని తర్వాత ట్విట్ట‌ర్ ఫౌండ‌ర్‌ని టార్గెట్ చేసిన హిండెన్‌బ‌ర్గ్‌, జాక్ డోర్సీ పేమెంట్స్ సంస్థ బ్లాక్ అక్రమాలకు పాల్పడిందని నివేదిక
Hazarath Reddyగౌతం అదాని సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన యూఎస్ షార్ట్ షెల్లింగ్ సంస్థ హిండెన్‌బ‌ర్గ్‌ మరో సంచలనానికి తెరలేపింది. ట్విట్ట‌ర్ ఫౌండ‌ర్ జాక్ డోర్సీని ల‌క్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. జాక్ డోర్సీ (Twitter Co-Founder Jack Dorsey) ఆధ్వ‌ర్యంలోని పేమెంట్స్ సంస్థ బ్లాక్ (Block Inc) అక్ర‌మాల‌కు పాల్పడిందని నివేదికను బయటపెట్టింది.
layoffs 2023: మూడు నెలల్లో ఇండియాలో 1,50,000 మంది ఉద్యోగులను తీసేసిన కంపెనీలు, 2023లో భారత్‌లో ఉద్యోగుల తొలగింపులు లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyకంపెనీల ఆర్థికమాంద్య భయాల మధ్య గతేడాది లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.2022లో 1,052 టెక్ కంపెనీలు 1,61,411 మందిని తొలగించాయి. తొలగింపు వేవ్ 2022లో ముగియలేదు కానీ 2023 వరకు కూడా కొనసాగింది. ఈ ఏడాదిలోనే 500కు పైగా టెక్‌ సంస్థలు 1,50,000 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేశాయి.
Meta layoffs: వీసా కోసం అష్టకష్టాలు పడిన తర్వాత.. ఉద్యోగంలో చేరిన 3 రోజులకే పీకేసిన మెటా కంపెనీ, తన అనుభవాలను పంచుకున్న భారత టెకీ
Hazarath Reddyమెటా లేఆఫ్‌లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపాయి. ఒక భారతీయ టెక్కీ షేర్ చేసిన అటువంటి పోస్ట్‌లో చేరిన మూడు రోజుల్లోనే అతనిని ఉద్యోగం నుండి తొలగించినట్లు వెల్లడైంది
Walmart Layoffs: యాక్సెంచర్ తర్వాత ఉద్యోగులకు షాకిచ్చిన వాల్‌మార్ట్, వందలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఈ కామర్స్ దిగ్గజం
Hazarath Reddyఈ కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్ యుఎస్ లో ఐదు ఇ-కామర్స్ కేంద్రాలలో వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తోంది. 90 రోజుల్లో ఉద్యోగాలను వెతుక్కువాలని ఉద్యోగులకు సూచించింది. న్యూజెర్సీలోని పెడ్రిక్‌టౌన్‌లో దాదాపు 200 మంది కార్మికులు, టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో వందలాది మంది కార్మికులు ఈ తొలగింపుల్లో ఉన్నారు. ఈ మేరకు రాయిటర్స్‌ న్యూస్ కథనం ప్రచురించింది.
Roofstock Layoffs: యాక్సెంచర్ తర్వాత లేఆఫ్స్ ప్రకటించిన మరో కంపెనీ, 27% మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన Roofstock
Hazarath ReddyUS-ఆధారిత ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ Roofstock దాని రెండవ రౌండ్ ఉద్యోగాల కోతలో దాదాపు 27% మంది ఉద్యోగులను తొలగించింది. దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణంగా తెలుస్తోంది.
Accenture Layoffs: అతిగా రిక్రూట్ చేసుకోవడం యాక్సెంచర్ కొంపలు ముంచింది, భారీ ఉద్యోగాల కోత వెనుక అసలు నిజం, 19 వేల మందికి ఉద్వాసన పలికిన టెక్ దిగ్గజం
Hazarath Reddyఐర్లాండ్‌కు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) 19,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది.కంపెనీ కంపెనీ ఆదాయ క్షీణత నేపథ్యంలో 19వేల ఉద్యోగాలను తీసివేయనుంది. అయితే ఇందులో ఎంతమంది భారతీయ ఉద్యోగులు ప్రభావితం కానున్నారనేదానిపై స్పష్టత లేదు.
2023 DZ2 Asteroid: భూమికి దగ్గరగా రానున్న గ్రహశకలం, భూమిని ఢీకొడితే భారీ నష్టమే, అయితే భూమిని సురక్షితంగా అది దాటుతుందని నాసా ట్వీట్
Hazarath Reddyచంద్రునికి సగం దూరంలో భూమికి దగ్గరగా అతి పెద్ద గ్రహశకలం శనివారం రానుంది. 2023 DZ2 అని పిలువబడే ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే, అది భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అయితే, ఎర్త్‌స్కీ ప్రకారం, ఇది గంటకు 28,044 కిమీ వేగంతో క్లీన్ పాస్ అయ్యే అవకాశం ఉంది
Accenture Layoffs: టెక్ రంగంలో అతి పెద్ద లేఆఫ్స్, 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న ఐటీ దిగ్గజం యాక్సెంచర్
Hazarath Reddyదాదాపు 19,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ఐటీ దిగ్గజం యాక్సెంచర్ గురువారం ప్రకటించింది. సంస్థ యొక్క శ్రామిక శక్తిలో ఈ సంఖ్య 2.5 శాతంగా ఉంది. ఇంతకుముందు, కంపెనీ ప్రస్తుత త్రైమాసిక ఆదాయాన్ని $16.1 బిలియన్ నుండి $16.7 బిలియన్ల పరిధిలో అంచనా వేసింది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో టెక్ దిగ్గజం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.