Technology

UTS Mobile Ticketing App: ఇక క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు, మీ మొబైల్ నుంచి యూటీఎస్ ద్వారా ఫ్లాట్ ఫాం టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్తను అందించింది. మీరు ఇకపై టికెట్ కోసం క్యూ లైన్లో నిల్చుకోకుండా నేరుగా యాప్ ద్వారా బుక్ (Book Platform Ticket) చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. సెకన్ల వ్యవధిలో మీ మొబైల్ ఫోన్‌తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించింది.

Head of Family Update In Aadhar: ఆధార్ అప్‌డేట్‌పై గుడ్ న్యూస్, కుటుంబ పెద్ద సమ్మతితో చిరునామాను అప్‌డేట్ చేసే సదుపాయాన్ని కల్పించిన UIDAI

Hazarath Reddy

కుటుంబ పెద్ద (HoF) సమ్మతితో ఆన్‌లైన్‌లో ఆధార్‌లోని చిరునామాను అప్‌డేట్ చేసే సదుపాయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఏర్పాటు చేసింది.

2023's First Sunrise: ఈ ఏడాది తొలి సూర్యోదయం వీడియో ఇదే, సూర్యుడు మెల్లిగా బయటకు వస్తున్న దృశ్యం నిజంగా అద్భుతమే, కొత్త ఏడాది, తొలి సూర్యోదయం అంటూ ట్వీట్ చేసిన జపాన్ వ్యోమగామి కొయిచీ వటాకా

Hazarath Reddy

కొత్త ఏడాదిలో మొదటి రోజు సూర్యోదయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని జపాన్ వ్యోమగామి కొయిచీ వటాకా చెబుతున్నారు. ఓ ప్రాజెక్టు పనిమీద ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న కొయిచీ.. కొత్త సంవత్సరాన్ని తొలి సూర్యోదయంతో స్వాగతించారు.

UPI Payments:డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో రూ.12.82 లక్షల కోట్లకు చేరుకున్న యూపీఐ చెల్లింపులు, ఇప్పటివరకు రూ. 782 కోట్ల లావాదేవీలు

Hazarath Reddy

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన చెల్లింపులు డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో రూ.12.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2016లో ప్రారంభించబడిన ప్లాట్‌ఫారమ్‌లో వాల్యూమ్ పరంగా రూ. 782 కోట్ల లావాదేవీలు జరిగాయి.

Advertisement

Mark Zuckerberg: మరోసారి తండ్రి కాబోతున్న మార్క్‌ జుకర్‌బర్గ్‌, హ్యాపీ న్యూ ఇయర్‌. ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి 2023లో మా జీవితాల్లోకి రాబోతున్నారంటూ ట్వీట్

Hazarath Reddy

ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కొత్త ఏడాది శుభవార్త చెప్పారు. ఈ ఏడాది తమ జీవితాల్లోకి ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి రాబోతున్నట్లు తెలిపారు. ఈ సంతోషకరమైన వార్తను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ’హ్యాపీ న్యూ ఇయర్‌

UPI DOWN: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ సర్వీసులు, పండుగ బిజీలో షాపింగ్ చేసే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, #UPIDOWN అంటూ వేలాదిగా ట్వీట్లు పెడుతున్న యూజర్లు

VNS

దేశ ప్రజలంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా..యూపీఐ పేమెంట్స్ (UPI Payments) నిలిచిపోయాయి. ప్రజలంతా షాపింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో యూపీఐ సేవలు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో యూపీఐకి ఏమైందంటూ ట్విట్టర్‌ లో గోల మొదలైంది. వేలాది మంది యూజర్లు #UPIDOWN అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే యూపీఐ సర్వీసుల పునరుద్దరణపై ఇంకా అధికారిక సమాచారం మాత్రం లేదు

Paid Promotions in Social Media: సోషల్ మీడియాలో చెప్పకుండా పెయిడ్ ప్రమోషన్ చేస్తే రూ.50 లక్షల జరిమానా, కొత్త నిబంధనలు అమల్లోకి

Hazarath Reddy

యూట్యూబ్ చానళ్లు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, ట్విట్టర్ తదితర వేదికలపై డబ్బులు తీసుకుని వివిధ సంస్థలు, ఉత్పత్తులకు అనుకూల కథనాలను ప్రసారం చేస్తుంటారు. ఇకపై వీరు తాము చేసేది పెయిడ్ ప్రమోషన్ అని ముందే చెప్పి తీరాలి. లేదంటే రూ.50 లక్షల జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

Anant Ambani to marry Radhika Merchant: అంబానీ చిన్న కొడుకు పెళ్లి కొడుకాయెనే, రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్న అనంత్ అంబానీ

Hazarath Reddy

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani)-నీతా అంబానీ (Nita Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్-శైల దంపతుల కుమార్తె రాధిక మర్చంట్‌(Radhika Merchant)తో అనంత్ వివాహం నిశ్చయమైంది.

Advertisement

Amazon Delivery By Drone: డ్రోన్‌ల ద్వారా ఆర్డర్‌లను డెలివరీ చేయనున్న అమెజాన్, ముందుగా కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో ప్రారంభించిన ఈకామర్స్ దిగ్గజం

Hazarath Reddy

E-కామర్స్ దిగ్గజం అమెజాన్.. US రాష్ట్రాలైన కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో డ్రోన్‌ల ద్వారా ఆర్డర్‌లను డెలివరీ చేయడం ప్రారంభించింది, ఒక గంటలోపు కస్టమర్‌ల ఇళ్లకు ప్యాకేజీలను పంపించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది అక్కడ విజయవంతమయితే ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

Twitter Down: మరోసారి మొరాయించిన ట్విట్టర్, లాగిన్ సమస్యలతో ఇబ్బందిపడ్డ వేలాది మంది యూజర్లు, గత రెండు వారాల్లో ఇది రెండో సారి

VNS

ట్విట్టర్‌ మరోసారి డౌన్ (Twitter down) అయింది. లాగిన్ సమస్యతో వేలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఈ మేరకు డౌన్ డిటెక్టర్. కామ్‌ కు(Downdetector.com) వేలాది ఫిర్యాదులు వచ్చాయి. అమెరికా సహా పలు దేశాల్లో వేలాది మంది యూజర్లు ట్విట్టర్ లో లాగిన్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీనిపై ట్విట్టర్ (Twitter down) నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు

5G Scam Alert: 5జీ స్కాం అలర్ట్, వొడాఫోన్ 5జీ సేవలంటూ ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయి జాగ్రత్త, వాట్సాప్‌లో ఇవి క్లిక్ చేశారంటే మీ అకౌంట్లో డబ్బులన్నీ గోవిందా 

Hazarath Reddy

ఓ లింక్ పంపించి, దానిపై క్లిక్ చేయడం ద్వారా 5జీ సేవలను పొందొచ్చనే సమాచారం ఉంటోంది. ఆ లింక్ పై క్లిక్ చేస్తే ఫోన్ లోకి మాల్వేర్ ను జొప్పించి సున్నితమైన సమాచారాన్ని నేరగాళ్లు తస్కరిస్తారు. బ్యాంకు ఖాతా తదితర వివరాలు వారికి చేతికి వెళ్లాయంటే ఉన్నదంతా ఊడ్చేస్తారు.

Indian Railways Data Breach: రైల్వే వినియోగదారులకు షాకింగ్ న్యూస్, 30 మిలియన్లకు పైగా యూజర్ల డేటా హ్యాక్, ఇంకా స్పందించని భారతీయ రైల్వే

Hazarath Reddy

ఈ నెల ప్రారంభంలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో జరిగిన డేటా ఉల్లంఘన తర్వాత, భారతీయ రైల్వే వినియోగదారుల డేటాబేస్‌లో తాజా డేటా ఉల్లంఘనకు సంబంధించిన నివేదికలు వెలువడ్డాయి. ఈ నివేదికల ప్రకారం, 30 మిలియన్లకు పైగా రైల్వే వినియోగదారుల వివరాలను హ్యాకర్ ఫోరమ్‌లో అమ్మకానికి ఉంచారని వార్తలు వస్తున్నాయి.

Advertisement

US House Bans TikTok: అమెరికా కీలక నిర్ణయం, ప్రభుత్వ డివైజ్‌లలో టిక్‌ టాక్‌ను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటన, మార్గదర్శకాల్ని విడుదల చేసిన యూఎస్ హౌస్

Hazarath Reddy

భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వ డివైజ్‌లలో టిక్‌ టాక్‌ను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.అందుకు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది.

BSNL 5G in India: వచ్చే ఏడాది నుంచి BSNL 5జీ సేవలు, దేశవ్యాప్తంగా 80 శాతం మేరకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Hazarath Reddy

వచ్చే ఏడాది నుంచి భారత్ సంచార నిగమ్ లిమిటెడ్-BSNL ద్వారా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అదేవిధంగా రానున్న రెండు నుంచి మూడేళ్లలో దేశవ్యాప్తంగా 80 శాతం మేరకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

Jio Fiber Down: దేశంలో జియో ఫైబర్ సర్వర్లు డౌన్, ట్విట్టర్లో హోరెత్తిన రిలయన్స్ జియో సర్వర్ డౌన్ మెసేజ్‌లు, కాసేపటికే సేవలను పునరుద్ధరించిన రిలయన్స్ జియో యాజమాన్యం

Hazarath Reddy

భారతదేశం అంతటా రిలయన్స్ జియో సర్వర్లు కొద్ది సేపటికే డౌన్ అయ్యాయి. వినియోగదారులు బుధవారం ఉదయం ఇంటర్నెట్ సేవలను యాక్సెస్ చేయలేకపోయారు. ఇంటర్నెట్ సేవల ట్రాకర్ డౌన్‌డెటెక్టర్.. Jio యొక్క బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ సేవలను యాక్సెస్ చేయడంలో సమస్యలను నివేదించిన వినియోగదారుల యొక్క అధిక సందర్భాలను చూపించింది.

Making Pig Livers Humanlike: మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు, అమెరికాలో గత 12 ఏళ్ల నుంచి శరవేగంగా జరుగుతున్న ట్రయల్స్

Hazarath Reddy

అమెరికాలో మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. లివర్ అవయవ కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అమెరికాలో గత కొన్నేండ్లుగా ఈ ప్రయోగాలు చేస్తున్నారు. మనిషి కాలేయంలో ఉండే లక్షణాలను పంది కాలేయంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Ration Card in DigiLocker: రేషన్ కార్డును మీరు ఇక తీసుకువెళ్లనవసరం లేదు, DigiLocker ద్వారా రేషన్ కార్డును జారీ చేస్తున్న ఏపీ ప్రభుత్వం, డిజిలాకర్ యాప్‌ డౌన్ లోడ్ లింక్ ఇదే..

Hazarath Reddy

ఇప్పుడు #రేషన్ కార్డ్ యొక్క ఒరిజినల్ కాపీని మీరు రేషన్ షాపుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు! వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & పౌర సరఫరాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు #DigiLocker ద్వారా రేషన్ కార్డును జారీ చేస్తోంది. యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి ఈ లింక్ ద్వారా..

Fake OTP Delivery Scam: ఆన్‌లైన్‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారా? మీరు ఆర్డర్ చేయకుండానే ఇంటికే పార్శిల్ వచ్చే అవకాశముంది! కొత్త తరహా మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు, ఆర్డర్ కాన్సిల్ చేయాలంటే ఓటీపీ చెప్పాలంటూ మోసాలు

VNS

డెలివరీ లేదా రద్దును ప్రాసెస్ చేయడానికి స్కామర్‌ OTP అడుగుతారు. అక్కడే యూజర్లను మోసగిస్తారు. తెలియని యూజర్లు తమ స్కామర్లకు OTP ఇవ్వడం లేదా ఫోన్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మోసపోతుంటారు. స్కామర్‌లు OTPని స్వీకరించిన తర్వాత వారు ఫోన్‌ను క్లోన్ (Phone Clone) చేస్తారు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను యాక్సెస్ చేసేందుకు హ్యాక్ చేస్తారు.

Google: ఈ సారి గూగుల్ వంతు, 6 శాతం మంది ఉద్యోగులను తొలగించే పనిలో టెక్ దిగ్గజం, వీరంతా పేలవమైన పనితీరు కనబరుస్తున్నట్లుగా గూగుల్‌ సమావేశంలో చర్చలు

Hazarath Reddy

గత వారం గూగుల్‌లో జరిగిన సమావేశంలో ఉద్యోగుల పనితీరుపై చర్చలు జరిగాయి.ఈ సమావేశంలో 6 శాతం మంది ఉద్యోగులు పేలవమైన పనితీరు కనబరుస్తున్నట్లుగా చర్చకు వచ్చింది. ఇది వారిని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Digital Ad Spending in India: భారత్‌లో 2028 నాటికి 21 బిలియన్ల డాలర్లకు చేరుకోనున్న డిజిటల్ ప్రకటనల వ్యయం, సరికొత్త నివేదిక బయటకు

Hazarath Reddy

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగంలో గణనీయమైన పెరుగుదలతో, భారతదేశంలో డిజిటల్ ప్రకటనల వ్యయం 2028 నాటికి $21 బిలియన్లకుఇంటర్నెట్ చేరుకునే అవకాశం ఉందని ఒక నివేదిక చూపించింది.

Advertisement
Advertisement