World

Mia Khalifa Divorce: భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించిన పోర్న్ స్టార్ మియా ఖలీఫా, రెండేళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డ్, కలిసి ఉండలేమని..స్నేహితులుగా ఉంటామని తెలిపిన మియా

Hazarath Reddy

వరల్డ్ ఫేమస్, పాపులర్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తన భర్త రాబర్ట్ శాండ్‌బర్గ్ నుండి విడిపోతున్నట్లు (Mia Khalifa announces divorce) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. రెండేళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డ్ వేస్తున్నామని, అందుకుగల కారణాలను ట్వీట్ (Mia Khalifa Instagram) ద్వారా వెల్లడించింది.

Covid In Tokyo: టోక్యోలో కరోనా కల్లోలం, అత్యధికంగా ఒక్కరోజే 2,848 కేసులు నమోదు, ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత జపాన్ రాజధానిలో పంజా విప్పిన కోవిడ్, ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్

Hazarath Reddy

టోక్యోలో కరోనా పంజా విసిరింది. అత్యధికంగా నిన్న ఒక్కరోజే 2,848 కేసులు టోక్యోలో (Tokyo Reports Highest Single-Day Spike) నమోదయ్యాయి. ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కాగా జపాన్ రాజధానిలో గత జనవరిలో 2520 కేసులు నమోదు కాగా ఈ సారి ఆ రికార్డును తిరగరాస్తూ నిన్న ఒక్కరోజే 2,848 కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో ఆందోళన మొదలయింది

New COVID-19 Variant B.1.621: వణికిస్తున్న మరో కొత్త వేరియంట్, బ్రిటన్‌లో 16 మందిలో B.1.621 రకం కరోనావైరస్, లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో యూకేలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

Hazarath Reddy

కరోనా వైరస్‌కు చెందిన మరో కొత్త వేరియంట్‌ను బ్రిటన్‌లో గుర్తించారు. తాజాగా 16 మందిలో B.1.621 రకం వైరస్‌ను (New COVID-19 Variant B.1.621) గుర్తించినట్లు బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త రకం వైరస్‌ గురించి విచారణ జరుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. 16 కేసుల్లో పది కేసులను (Found in UK With 16 Confirmed Cases) లండన్‌లోనే గుర్తించినట్లు వెల్లడించారు.

COVID in India: బ్రిటన్‌లో మరో కొత్త రకం వైరస్, 16 మందిలో B.1.621 రకం వైరస్‌ గుర్తింపు, భారత్‌లో తాజాగా 39,361 క‌రోనా కేసులు, ప్రస్తుతం దేశంలో 4,11,189 యాక్టివ్ కేసులు, కేరళలో కొనసాగుతున్న కరోనా కల్లోలం

Hazarath Reddy

దేశంలో నిన్న కొత్తగా 39,361 క‌రోనా కేసులు (New COVID-19 Cases) న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,11,262కు (COVID in India) చేరింది. అలాగే, నిన్న 35,968 మంది కోలుకున్నారు. మరణాల విషయానికొస్తే... నిన్న‌ 416 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Ramappa Temple: కాకతీయ శిల్పా కళావైభవం.. రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం! ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన యునెస్కో, హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్

Vikas Manda

రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించిన సందర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఖ్యాతి లభించినందుకు దేశప్రజలందరికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు....

Pakistan: నా భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా..కోపంతో భార్య లవర్ ముక్కు చెవులు కోసేసిన భర్త, బాధితుని పరిస్థితి విషమం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, పాకిస్తాన్ ముజఫర్‌ఘర్ గ్రామంలో ఘటన

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ముక్కు చెవులను (Husband Chops Off Nose, Ears Of Wife's Lover) భర్త కోసేశాడు.

Tokyo Olympics 2021 Highlights: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ, 49కిలోల విభాగంలో రజతం సాధించిన మీరాబాయి, కరణం మల్లేశ్వరి తర్వాత పతకం సాధించిన మహిళగా రికార్డు

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజతపతకం (Mirabai Chanu Wins India's First Medal) సాధించింది. ఈ ఒలంపిక్స్‌లో 49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో (Tokyo Olympics 2020) రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి (Mirabai Chanu) చరిత్ర సృష్టించింది.

Norovirus: మళ్లీ ఇంకో కొత్త వైరస్, యూకేని వణికిస్తున్న నోరో వైరస్‌, ఐదు వారాల్లోనే 154 కేసులు నమోదు, నోరో వైరస్‌ లక్షణాలు ఏంటి, అది ఎలా వ్యాప్తిస్తుంది, నోరోవైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తాజాగా మరో కొత్త వైరస్ (Norovirus outbreak in UK) కలకలం రేపుతోంది.ఇంగ్లండ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి ‍ప్రభుత్వం ఆంక్షలు సడలించగా కొత్తగా నోరో వైరస్‌ (Norovirus) వెలుగులోకి వచ్చింది.

Advertisement

Pakistan Road Accident: పండుగ సంబరాల వేళ ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది అక్కడికక్కడే మృతి, మరో నలభై మందికి తీవ్ర గాయాలు, పాకిస్తాన్‌లో బస్సును ఢీకొట్టిన ట్రక్, చనిపోయిన వారిలో ఎక్కువ మంది కూలీలే

Hazarath Reddy

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న బస్సును పంజాబ్‌లోని డేరా ఘూజీఖాన్ రహదారిపై ఓ ట్రక్ (Pakistan Road Accident) ఢీకొట్టింది. ఈ ఘటనలో ముఫ్పై మంది దుర్మరణం చెందారు. మరో నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Muhammad Masudin Death: కరోనా రోగి శ్వాసను పీల్చడం ద్వారా కోవిడ్ రాదని తెలిపిన థెరపిస్ట్ ముహమ్మద్ మసుదిన్ మృతి, కడుపు నొప్పితో పాటు జ్వరంతో చికిత్స పొందుతూ మసుదిన్ ఆర్ సయాహిద్ మరణించినట్లు తెలిపిన అధికారులు, కరోనా రోగి శ్వాసను పీల్చుతున్న వీడియో వైరల్

Hazarath Reddy

US Shooting: కాల్పులతో వణుకుతున్న అమెరికా, వాషింగ్టన్ డీసీ కాల్పులు మరచిపోకముందే కాలిఫోర్నియా సాక్రమెంటోలో కాల్పులు, ఇద్దరు మృతి, మరో నలుగురికి గాయాలు

Hazarath Reddy

అమెరికా రాజధాని కాలిఫోర్నియా సాక్రమెంటోలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసు అధికారులు రాత్రి 11.45 గంటలకు ముందు నగరంలోని రివర్ ఫ్రంట్ చారిత్రాత్మక విభాగం అయిన ఓల్డ్ టౌన్ సాక్రమెంటోలో ఈ కాల్పులు జరిగినట్లు నివేదించారు.

US Shooting: అమెరికాలో కాల్పుల కలకలం, నలుగురు మృతి, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌ు, వాషింగ్టన్‌ డీసీలోని బేస్‌బాల్‌ స్టేడియం వెలుపల కాల్పులకు తెగబడిన దుండుగులు

Hazarath Reddy

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ఓ వ్య‌క్తి 12 రౌండ్లు కాల్పులు జ‌రిపి క‌ల‌క‌లం రేపాడు. ఈ ఘట‌న‌లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Monkey B Virus: చైనాలో మరో కొత్త వైరస్, మంకీ బీ వైరస్‌ సోకి పశువుల వైద్యుడు మృతి, మకాక్యూ జాతి కోతుల మృతదేహాలను ముట్టుకోవడంతో ఆయనకు సోకిన వ్యాధి, మంకీ బీ వైరస్‌(బీవీ) లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి

Hazarath Reddy

కరోనాతో ప్రపంచం విలవిలలాడుతున్న నేపథ్యంలో చైనాను మరో కొత్త రకం వైరస్‌ (Monkey B Virus) భయపెడుతున్నది. ఆ దేశంలో మొదటిసారిగా ఓ వ్యక్తికి ‘మంకీ బీ వైరస్‌(బీవీ) (Monkey B Virus (BV)) సోకినట్టు చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ శనివారం తెలిపింది. బాధితుడు 53 ఏండ్ల పశువుల వైద్యుడని పేర్కొంది.

King Cobra Viral Video: పసి బాలుడిని వెంటాడిన నాగుపాము, తృటిలో తప్పించుకున్న బాలుడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, వియ‌త్నాంలో ఘటన

Hazarath Reddy

కింగ్ కోబ్రా ఎంత విషపూరితమో అందరికీ తెలుసు. అది కాటేస్తే ఇక అంతే సంగతులు. అయితే ఇక్కడ ఓ పిల్లోడిని (King Cobra Follows Child) వెంటాడింది. ఆ చిన్న పిల్లవాడి మీద పగబట్టిందో ఏమో కాని ఆ బాలుడు కోసం కాచుకూర్చుని ఉంది.

US President Joe Biden: త‌ప్పుడు స‌మాచారంతో ఫేస్‌బుక్‌.. ప్ర‌జ‌ల్ని చంపేస్తోంది, తీవ్ర వ్యాఖ‍్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, కోవిడ్ టీకాల పంపిణీపై సోష‌ల్ మీడియాలో తప్పుడు స‌మాచారం ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్రహం

Hazarath Reddy

సోషల్‌ మీడియా దిగ్గజాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన వ్యాఖ‍్యలు (US President Joe Biden Hits Out at Facebook) చేశారు. త‌ప్పుడు స‌మాచారంతో ఫేస్‌బుక్‌.. ప్ర‌జ‌ల్ని చంపేస్తోంద‌ని మండిపడ్డారు. సోష‌ల్ మీడియాలో వ్యాక్సినేష‌న్‌పై అన‌వ‌స‌ర‌మైన స‌మాచారం ఎక్కువ‌గా వ్యాపిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

US Surgeon General Murthy: దయచేసి అందరూ వ్యాక్సిన్ వేసుకోండి, నేను కరోనాతో 10 మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయా, కోవిడ్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే సాక్ష్యమని తెలిపిన అమెరికన్‌ సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి

Hazarath Reddy

కరోనావ్యాక్సిన్‌పై నెలకొన్న అనుమానాలను వీడి, అందరూ టీకాలు వేసుకోవాలని భారత సంతతికి చెందిన అమెరికన్‌ సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి (US Surgeon General Murthy) ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దని ఆయన కోరారు. కరోనా మహమ్మారి కారణంగా తాను పది మంది కుటుంబసభ్యులను (Lost 10 Family Members to Covid) కోల్పోయానని చెప్పారు.

Advertisement

COVID in India: వ్యాక్సిన్ వేసుకున్నా ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ ముప్పు, రానున్న 100 రోజులే కరోనాకు అత్యంత కీలకం, హెచ్చరించిన కేంద్ర ఆరోగ్యశాఖ, దేశంలో తాజాగా 38,079 మందికి కోవిడ్, చాలా దేశాల్లో ఇప్పటికే మొదలైన కరోనా థర్డ్ వేవ్

Hazarath Reddy

దేశంలో తాజాగా 19,98,715 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,079 మందికి వైరస్‌ పాజిటివ్‌గా (COVID in India) తేలింది. ముందురోజు కూడా 38వేల కేసులే నమోదయ్యాయి. తాజాగా 560 మంది మహమ్మారికి బలయ్యారు.

Soumya Swaminathan: రెండు కంపెనీల వ్యాక్సిన్లు తీసుకోవద్దు, వ్యాక్సిన్ మిక్సింగ్ చాలా ప్రమాదకరమని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్, పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతుంద‌ని హెచ్చరిక

Hazarath Reddy

వ్యాక్సిన్ మిక్సింగ్ అంశంపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్ (WHO's Chief Scientist Soumya Swaminathan) వార్నింగ్ ఇచ్చారు. వ్యాక్సిన్ మిక్సింగ్ అనేది ప్ర‌మాద‌క‌ర ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌ని తెలిపారు.

Iraq: కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో కాలిపోయిన 20 మంది కోవిడ్ పేషెంట్లు, మరికొందరికి తీవ్ర గాయాలు, ఇరాక్ నస్రీయా నగరంలోని అల్‌ హుస్సేయిన్‌ ఆస్పత్రిలో విషాద ఘటన

Hazarath Reddy

ఇరాక్‌లో ఓ ఆస్పత్రి కొవిడ్‌ వార్డులో ఘోర అగ్నిప్రమాదం (COVID-19 Hospital Fire) చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 20 మంది చనిపోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవాళ్లంతా కరోనా పేషెంట్లేనని అధికారులు ధృవీకరించారు. కాగా, మంటలు, పొగ దట్టంగా అలుముకోవడంతో ప్రమాద తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

COVID-19 Alpha, Beta Variants: కరోనా షాక్..వృద్ధురాలిపై ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్ల దాడి, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన బెల్జియం మహిళా వృద్ధురాలు, రెండు వేరియంట్లు ఎలా సోకాయనే విషయం అంతుచిక్కడం లేదని తెలిపిన నివేదిక

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ మహమ్మారి ఒక్కోవ్యక్తిలో ఒక్కో విధంగా ప్రభావాన్ని చూపుతోంది. కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లు (COVID-19 Alpha, Beta Variants) విస్తృతమైన వ్యాప్తి, ఎక్కువ ప్రభావం కలిగి ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Advertisement
Advertisement