World
Beirut Blast Tragedy: లెబనాన్ కన్నీటి ఘోష, బీరూట్ పేలుళ్లలో 100 మందికి పైగా మరణం, శిథిలాల కింద మరికొందరు.., 3 బిలియన్ డాలర్లకు పైగా నష్టం, సహాయం చేయాలని మిత్రదేశాలను కోరిన ప్రధాని
Hazarath Reddyలెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్లు రాజధానిని తీవ్ర విషాదంలోకి (Beirut Blast Tragedy) నెట్టి వేశాయి. భారీ భూకంపం సంభవిస్తే ఏస్థాయిలో విధ్వంసం ఉంటుందో అంతకన్నా ఎక్కువ స్థాయిలో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. పేలుళ్ల ఘటనలో 100 మందికి పైగా మరణించారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. భారీ పేలుళ్ల ధాటికి (Beirut Blasts) పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి. బీరుట్ గవర్నర్ మార్వాన్ అబౌద్ (Governor Marwan Abboud) ప్రకారం పేలుడు వల్ల 3 బిలియన్ డాలర్లకు పైగా నష్టం (Cost of Damage Tops $3 Billion) వాటిల్లింది.పేలుడు కారణంగా సుమారు 3 లక్షల మంది (3 Lakh Left Homeless) నిరాశ్రయులయ్యారు.
Beirut Blasts: పేలుడు అంతా క్షణాల్లోనే..నెత్తురోడిన బీరూట్, 78 మంది మృతి, 4 వేల మందికి పైగా గాయాలు, తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోదీ, ట్రంప్, బీరూట్‌ని శ్మశాన దిబ్బగా మార్చివేసిన అమోనియం నైట్రేట్‌
Hazarath Reddyలెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడుతో (Beirut Explosion) నెత్తురోడింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ పేలుళ్లలో 70 మందికి పైగా చనిపోగా.. నాలుగు వేలమందికి పైగా గాయపడినట్లు లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ తెలిపారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో (Beirut Blasts) జనం వణికిపోయారు. వీధుల వెంట పరుగులు తీశారు. బీరూట్‌లో జ‌రిగిన అమోనియం నైట్రేట్ పేలుడుకు (Ammonium Nitrate Exploded) అక్క‌డి ఓడ‌రేవు మొత్తం ధ్వంస‌మైంది. పేలుడు తీవ్రత ఎంత ఉందంటే.. రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న షాపింగ్ మాల్‌లోనూ గాజు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
COVID-19 in India: కరోనావైరస్ జన్యువు వీక్ అవుతోంది, శుభవార్తను చెప్పిన ఇటలీ శాస్త్రవేత్తలు, దేశంలో కొత్తగా 52,509 మందికి కోవిడ్-19, భారత్‌లో 19 లక్షలు దాటిన కరోనా కేసులు
Hazarath Reddyకరోనా వైర్‌స్లో జన్యుమార్పులు తగ్గుముఖం పట్టాయని ఇటలీలోని బోలోగ్నా వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వివిధ దేశాల నుంచి సేకరించిన 48,635 వైరస్‌ జన్యువుల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు తెలిపారు. గత అధ్యయనాల్లో కరోనా వైర్‌సలో ఆరు జన్యుమార్పులు జరిగాయని గుర్తించగా, తాజాగా ఆ సంఖ్య అతిస్వల్పంగా పెరిగి ఏడుకు చేరినట్లు గుర్తించారు.
Ayodhya Ram Mandir: రఘురాముడు నడయాడిన అయోధ్య వైపే అందరి చూపు, నేడు మధ్యాహ్నం రామ మందిర్ భూమిపూజ కార్యక్రమం, అద్భుత ఘట్టం మొత్తం ప్రత్యక్ష ప్రసారం
Hazarath Reddyదేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టానికి (Ram Mandir Bhumi Pujan) కొద్ది గంటల్లో పునాది రాయి పడనుంది. రఘురాముడి జన్మస్థలమైన అయోధ్యలో (Lord Rama Birth Place) రామాలయ నిర్మాణానికి నేడు మధ్యాహ్నం భూమిపూజ జరుగనుంది. ప్రధాని మోదీ (PM Modi) స్వయంగా హాజరై.. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకతో ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్లదాకా.. అంటే 32 సెకన్లలోపు భూమి పూజ కార్యక్రమం పూర్తి కానుంది. ఇప్పటికే శంకుస్థాపనకు సన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారమే మొదలైన పూజలు.. భూమిపూజతో బుధవారం మధ్యాహ్నం పూర్తి కానున్నాయి.
WHO on COVID19 Vaccines: కరోనాకు మందేమి లేదు..ఎప్పటికీ రాకపోవచ్చు కూడా, కీలక వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌
Hazarath Reddyప్రపంచ దేశాలను కరోనావైరస్ ముప్పతిప్పలు పెడుతోంది. ఇంతరవకు దానికి సరి అయిన వ్యాక్సిన్ (COVID19 Vaccines) అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్-10కు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. కరోనా వైరస్‌ (Coronavirus) టీకా రూపకల్పనకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ సులభమైన పరిష్కారం ఏదీ ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వ్యాఖ్యానించింది.
Covid 19 in india: సిద్ధరామయ్యకు కరోనా, స్వీయ నిర్భంధంలోకి త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ డెబ్, దేశంలో తాజాగా 52,050 కేసులు నమోదు, 18,55,745కు పెరిగిన కోవిడ్-19 కేసుల సంఖ్య
Hazarath Reddyభారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (Covid 19 in india) 18 లక్షల 50 వేలు దాటాయి. గడచిన 24 గంటలలో అత్యధికంగా 52,050 కరోనా పాజిటివ్ కేసులు (India Coronavirus) నమోదయ్యాయి. 24 గంటల్లో దేశంలో కరోనా (COVID-19) కారణంగా మొత్తం 803 మంది మృతిచెందారు. దేశ వ్యాప్తంగా 44,306 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇదిలావుండగా దేశంలో ఇప్పటివరకు 18,55,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం కరోనా వైరస్‌కు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.
COVID-19 Vaccine Update: కరోనా వ్యాక్సిన్‌పై శుభవార్త, కోవిషీల్డ్‌పై ఫేజ్ 2,ఫేజ్ 3 ప్రయోగాలకు డీసీజీఐ అనుమతులు, త్వరలో ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో వ్యాక్సిన మీద ఆశలు (COVID-19 Vaccine Update) రేకెత్తుతున్నాయి. తాజాగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford Univesity), ఆస్ట్రాజెనెకా (Astra Zeneca) అభివృద్ధి చేసిన కోవిడ్ -19 వాక్సిన్‌పై (COVID-19 Vaccine) మనదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.
India Coronavirus Update: బీజేపీ అగ్రనేతల్లో కరోనా కలవరం, బి.ఎస్.యడ్యూరప్పకు కరోనా పాజిటివ్, దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు, హోమంత్రి అమిత్ షాకు కోవిడ్-19 పాజిటివ్
Hazarath Reddyదేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త అంత‌కంత‌కూ (India Coronavirus Update) పెరుగుతోంది. తాజాగా నిన్న ఒక్క‌రోజే కొత్త‌గా మ‌రో 52,972 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 18,03,695గా న‌మోదైంది. ఇక మ‌ర‌ణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గ‌డిచిన 24గంట‌ల్లో మ‌రో 771 మంది కొవిడ్ రోగులు (Coronavirus India Deaths) మృత్యువాత‌ప‌డ్డారు. దీంతో దేశంలో కొవిడ్ మ‌ర‌ణాల సంఖ్య 38,135కు చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమశాఖ వెల్ల‌డించింది. క‌రోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్ప‌టికే 11ల‌క్ష‌ల 86వేల మంది కోలుకోగా మ‌రో 5ల‌క్ష‌ల 79వేల క్రియాశీల కేసులు ఉన్న‌ట్లు తెలిపింది.
COVID19 in India: భారత్‌లో 17 లక్షల 50 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీగా 54,735 కేసులు నమోదు, 37 వేలు దాటిన కరోనా మరణాలు
Team Latestlyగత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 51,256 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 11,45,630 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 5,67,730 ఆక్టివ్ కేసులు ఉన్నాయని...
'Tik Tok Ban in US': అమెరికాలోనూ టిక్ టాక్‌పై నిషేధాన్ని పరిశీలిస్తున్నామన్న డొనాల్డ్ ట్రంప్, తమ వద్ద మరికొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వెల్లడి, మెక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తుందని ఊహాగానాలు
Team Latestlyటిక్‌టాక్‌ను అమెరికా కంపెనీలకు విక్రయించాల్సిందిగా దాని సంస్థ బైట్‌డాన్స్‌ను ఆదేశించేందుకు డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గం సిద్ధమవుతోందని ప్రముఖ మీడియా సంస్థలు న్యూయార్క్ టైమ్స్ మరియు ఫాక్స్ బిజినెస్ కథనాలు వెలువరించాయి. చైనీస్ యాజమాన్య హక్కులు ఉపసంహరించుకునేలా బైట్‌డాన్స్‌ను ఆదేశించే నిర్ణయాన్ని ట్రంప్ పరిపాలన విభాగం త్వరలో ప్రకటించవచ్చని....
COVID-19 in India: వ్యాక్సిన్ వచ్చే దాకా పోరాడాల్సిందే, దేశంలో 16 లక్షలు దాటిన కరోనా వైరస్ కేసుల సంఖ్య, ఒక్కరోజు 6,42,588 కరోనా పరీక్షలు నిర్వహణ
Hazarath Reddyభారత్‌లో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలు (Coronavirus Cases in India) దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా అత్యధికంగా 55,079 కేసులు వెలుగు చూశాయి. గురువారం 779 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,38,871కు చేరింది. మొత్తం 35,747 మంది కరోనాతో (India’s COVID-19) పోరాడి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 5,45,318 మంది చికిత్స పొందుతుండగా, 10,57,806 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్కరోజు 6,42,588 కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం గురువారం నాటికి 1,88,32,970 కరోనా టెస్టులు పూర్తి చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) ప్రకటించింది.
Coronavirus Cases in India: 105 ఏళ్ల బామ్మ కరోనాని జయించింది, దేశంలో 24 గంటల్లో 52,123 మందికి కోవిడ్-19 పాజిటివ్, ప్రపంచవ్యాప్తంగా 1.69 కోట్లు దాటిన కరోనావైరస్ కేసులు
Hazarath Reddyభారత్‌లో గడచిన 24 గంటల్లో 52,123 మందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus Cases in India) నిర్ధారణ అయిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలోనే 775 మంది చనిపోయారు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15,83,792కు చేరింది. ప్రస్తుతం 5,28,242 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 10,20,582 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 34,968కు (Coronavirus Deaths in India) పెరిగింది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఉద్ధృతి స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా ఈనెల 29 వరకు 1,81,90,382 కోవిడ్‌-19 శాంపిల్స్‌ టెస్టు చేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది. నిన్న ఒక్కరోజే 4,46,642 నమూనాలు పరీక్షించినట్లు వెల్లడించింది.
Rafale Fighters Land in India: భారత్‌కు చేరుకున్న రాఫెల్ యుధ్ధ విమానాలు, ఫ్రాన్స్ నుండి 7,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్న ఫైటర్స్
Hazarath Reddyయావధ్భారతం ఉత్కంతతో ఎదురుచూస్తున్న రాఫెల్ యుధ్ధ విమానాలు ఎట్టకేలకు బుధవారం భారతదేశానికి (Rafale Fighter Jets Land in India) చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుండి 7,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని కవర్ చేసిన తరువాత హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరానికి (Ambala Airbase) రాఫెల్ జెట్ ఫైటర్స్ చేరుకున్నాయి. ఈ ప్రయాణంలో యుఎఇలో మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్ మరియు రాత్రిపూట పిట్ స్టాప్ వంటివి ఉన్నాయి సింగిల్ సీట్ కలిగిన జెట్స్ మూడు.. రెండు జంట-సీట్ల ఓమ్ని-రోల్ ఫైటర్స్ రెండు ఫైటర్స్ ఇండియాలో అడుగుపెట్టాయి. కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ హర్కిరాత్ సింగ్ నేతృత్వంలోని ఏడుగురు IAF పైలట్లు ఈ విమానాలను (Five new Rafale jets land in India) ఇండియాకు తీసుకువచ్చారు.
Rafale Jets Entry Video: అదుర్స్ అనిపించేలా రాఫెల్ జెట్స్ ఎంట్రీ వీడియో, సుఖోయ్ ఫైటర్స్‌ని తోడు తీసుకుని వస్తున్నరాఫెల్ యుద్ధ విమానాలు
Hazarath Reddyఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఐదు రాఫెల్‌ యుద్ధ విమానాలు మరికాసేపట్లో హర్యానాలోని అంబాలా వాయుసేన బేస్‌లో దిగనున్నాయి. దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇవి భారత్ చేరుకున్నాయి. ఇందులో రెండు శిక్షణ విమానాలు, మూడు యుద్ధ విమానాలు ఉన్నాయి. మార్గమధ్యలో యూఏఈలో అల్‌దఫ్రా ఎయిర్‌బేస్‌లో ఇవి ఇంధనం నింపుకున్నాయి. ఆకాశంలో చక్కర్లు కొడుతున్న రాఫెల్ జెట్ల వీడియోను Defence Minister’s office (RMO) షేర్ చేసింది.
COVID-19 Cases in India: ఇండియాలో 15 లక్షలు దాటిన కరోనావైరస్ కేసులు, భయపెడుతున్న మురికివాడలు, పెరుగుతున్న రికవరీ రేటు, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Hazarath Reddyభారత్‌లో కరోనా వైరస్ (CoronaVirus) పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 49,292 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించగా, ఏకంగా 768 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం కరోనా మరణాల సంఖ్య 34,193కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నేటి ఉదయం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 48,513 మంది కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య (COVID-19 Cases in India) 15,31,670కి చేరాయి. ఇందులో 5,09,447 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 9,88,029 మంది కోలుకున్నారు.
Antitrust Hearing: సోషల్ మీడియాలో హింస, విచారణకు హాజరుకానున్న టెక్‌ దిగ్గజాలు, సమాచార గోప్యత నుంచి డేటా దుర్వినియోగం వరకూ ప్రశ్నలను సంధించనున్న యుఎస్ జ్యుడిషియరీ కమిటీ
Hazarath Reddyసోషల్ మీడియా ద్వారా విద్వేషం, హింస పెరిగిపోతున్నదనే ఆరోపణల నేపథ్యంలో టెక్‌ దిగ్గజాలు విచారణ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. అమెరికన్‌ సెనేట్‌లో బుధవారం జరిగే విచారణ సందర్బంగా ఫేస్‌బుక్‌ చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg), అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos), యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ (Tim Cook) , గూగుల్‌ దాని మాతృసంస్థ అల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌లు (Sundar Pichai) విచారణకు (Antitrust Hearing) హాజరుకానున్నారు.
Rafale Deal: రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చేశాయి, 2021లోపు భారత్‌కు రానున్న 36 విమానాలు, గాలిలో ఇంధనాన్ని నింపుకుని 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం
Hazarath Reddyమొత్తం ఐదు రాఫెల్ విమానాలు (Rafale aircrafts) యుఎఇలోని అల్ ధఫ్రా ఎయిర్‌బేస్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయని భారత వైమానిక దళం (Indian Air Force) తెలిపింది. ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు (Rafale fighter aircrafts) బుధవారం అంబాలాలోని భారత వైమానిక దళంలో చేరడానికి ఫ్రాన్స్‌లోని ఒక ఎయిర్‌బేస్ నుండి భారతదేశానికి బయలుదేరాయి. ఫ్రాన్స్‌ నుంచి దాదాపు 7000 కిలోమీటర్ల ప్రయాణించనున్న ఈ విమానాలు మార్గమధ్యంలో యూఏఈలోని ఫ్రాన్స్‌ ఎయిర్‌బేస్‌లో ఆగాయి.
Coronavirus in India: డాక్టర్‌పై ఉమ్మేసిన కరోనా పేషెంట్లు, త్రిపురలో అమానుష ఘటన, దేశంలో 24 గంటల్లో 47,704 కోవిడ్-19 కేసులు నమోదు, 15 లక్షలకు చేరువలో కరోనా కేసులు
Hazarath Reddyభారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 47,704 పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 654 మంది కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,83,157కు చేరింది. ఇప్పటి వరకు 33,425 మంది మృత్యువాత (Coronavirus Deaths) పడగా.. 9,52,744 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 4,96,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం మొత్తం 5,28,082 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
North Korea Coronavirus: ఉత్తర కొరియాలో కరోనా కలకలం, తొలి కేసు నమోదుతో ఉత్త‌ర కొరియా అధికారులు అప్ర‌మ‌త్త‌ం, కెసోంగ్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌
Hazarath Reddyఇప్పటి వరకు అధికారికంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ఉత్త‌ర కొరియాలో క‌రోనా క‌ల‌క‌లం (North Korea Coronavirus) నెల‌కొన్న‌ది. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. ఆదివారం రాత్రి లక్షణాలున్న ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా (COVID-19 Case) నిర్ధారణ అయ్యింది. ఆ దేశం అధికారికంగా ప్రకటించిన తొలి కేసు ఇదేకావడం గమనార్హం. మరోవైపు వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేసాంగ్ నగరంలో లాక్‌డౌన్ (Kaesong Lockdown) విధించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong-un) నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
India Coronavirus: గుజరాత్‌లో మిస్టరీగా మారిన కరోనా మరణాలు, దేశంలో 14 లక్షలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, మరోసారి రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
Hazarath Reddyభారత్‌లో కరోనావైరస్ కేసులు (India Coronavirus Pandemic), మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 49,931 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 708 మంది కరోనా కారణంగా ప్రాణాలు (COVID-19 Deaths) కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య (Coronavirus Cases) ఇప్పటివరకు మొత్తం 14,35,453కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 32,771కి పెరిగింది.