World

World's 1st Coronavirus Vaccine: కరోనావైరస్‌ని చంపే తొలి వ్యాక్సిన్ రెడీ, రష్యాలో అన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్న కోవిడ్‌–19 వ్యాక్సిన్‌, త్వరలో మార్కెట్లోకి..

Hazarath Reddy

కోవిడ్-19 గుప్పిట్లో చిక్కుకొని ప్రపంచదేశాలు విలవిలలాడుతున్న వేళలో వ్యాక్సిన్‌పై (COVID-19 Vaccine) జరుగుతున్న ప్రయోగాలు జీవితంపై కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే తొలిసారిగా రష్యాలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం ప్రపంచానికి ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. రష్యాలోని సెచెనోవ్‌ మెడికల్‌ యూనివర్సిటీ చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగం (World's 1st Coronavirus Vaccine) కీలక దశలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసినట్టుగా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌లేషన్‌ మెడిసిన్‌ అండ్‌ బయోటెక్నాలజీ డైరెక్టర్‌ వాదిమ్‌ తారాసోవ్‌ వెల్లడించారు.

India's Coronavirus Updates: భారీగా కోలుకున్న కరోనా బాధితులు, దేశంలో ఇప్పుడు కోవిడ్-19 యాక్టివ్ కేసులు 3,01,609 మాత్రమే, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులు 8,78,254

Hazarath Reddy

దేశంలో గత వారం రోజులుగా 25 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోవదవుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో గత 24 గంటల్లో కొత్తగా 28,701 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,78,254కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 3,01,609 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 5,53,471 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 500 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య (Coronavirus Deaths) 23,174కు పెరిగింది.

New Pneumonia Outbreak: చైనాపై మండిపడిన క‌జికిస్థాన్‌, అంతుచిక్కని వ్యాధి క‌జికిస్థాన్‌ని వణికిస్తుందని చైనా చేసిన ప్రకటన అంతా పుకారని కొట్టి పారేసిన క‌జ‌కిస్థాన్ ప్ర‌భుత్వం

Hazarath Reddy

చైనా సరిహద్దు దేశం క‌జికిస్థాన్‌లో అంతుచిక్క‌ని వ్యాధి విస్త‌రిస్తున్న‌దంటూ చైనా చేసిన ప్ర‌క‌ట‌న‌ను క‌జ‌కిస్థాన్ ప్ర‌భుత్వం (Kazakhstan Govt) కొట్టిపారేసింది. చైనా ప్ర‌క‌ట‌న‌లో నిజం లేద‌ని తేల్చిచెప్పింది. అదంతా ఒట్టి పుకారని తేల్చి చెప్పింది. చైనా ఎంబ‌సీ (Chinese embassy) ప్ర‌క‌ట‌నను ఖండిస్తూ క‌జికిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Kazakhstan Health Ministry) తాజా ప్ర‌క‌ట‌న చేసింది.

India Coronavirus: ఒక్కడు 119 మందికి కరోనాని అంటించాడు, దేశంలో 8 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, కరోనా నుంచి కోలుకున్న 96 ఏళ్ల బామ్మ, 21,604కు చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,506 కరోనా పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,76,685 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వైరస్‌ బారినవారిలో 4,95,513 మంది కోలుకున్నారు. ఈ వైరస్‌ వల్ల గత 24 గంటల్లో 475 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 21,604కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

Advertisement

Global Coronavirus Cases: ఈ దేశాల్లో కరోనా లేనే లేదు, ప్ర‌పంచ వ్యాప్తంగా 12 మిలియ‌న్ల‌కు చేరుకున్న కోవిడ్ కేసులు, కరోనాతో విలవిలలాడుతున్న అమెరికా, రష్యా, బ్రెజిల్, భారత్

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని (Global Coronavirus) రేపుతోంది, ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు (Global Coronavirus Cases) 12 మిలియ‌న్ల‌కు పైగా న‌మోదు కాగా, 5,46,000 మంది (Global Coronavirus Deaths) మ‌ర‌ణించారు. ఈ కేసుల్లో యునైటెడ్ స్టేట్స్, లాటిన్ అమెరికాలో సగానికి పైగా ఉన్నాయి. వైరస్ బారిన పడిన వారిలో సగం మంది కోలుకున్నారు. 3,055,101 కేసులు మరియు 132,309 మరణాలతో, యునైటెడ్ స్టేట్స్ అత్యంత నష్టపోయిన దేశంగా నిలిచింది. 1,713,160 కేసులు మరియు 67,964 మరణాలతో బ్రెజిల్ రెండవ స్థానంలో నిలిచింది.

India Global Week 2020: పెట్టుబడులకు తలుపులు తెరిచాం, భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోంది, ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఇండియా గ్లోబల్ వీక్-2020లో పిలుపునిచ్చిన ప్రధాని మోదీ

Hazarath Reddy

భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఇండియా గ్లోబల్ వీక్-2020 (India Global Week 2020) ఈవెంట్లో ప్రధాని మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చారు. ఇండియా గ్లోబల్‌ వీక్‌-2020 (Global Week India) సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచానికే ఆస్తి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరకు మందులు సమకూర్చుస్తున్న ఘనత భారత్‌దేనని అన్నారు.

Coronavirus in India: భారత్‌లో రోజుకు 2.87లక్షల కొత్తకేసులు నమోదవుతాయంటున్న అధ్యయనం, మహారాష్ట్రలో మొత్తం 5,713 మంది పోలీసులకు కరోనా, దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 24,879 కోవిడ్-19 కేసులు

Hazarath Reddy

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా 24,879 మందికి క‌రోనా వైర‌స్ (Coronavirus in India) సంక్ర‌మించింది. 487 మంది మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల 7,67,296కు చేరుకున్న‌ది. మొత్తం యాక్టివ్ కేసులు 269789 ఉన్నాయి. వైర‌స్ నుంచి 476378 మంది కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ (India Coronavirus) వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 21129గా (coronavirus deaths) ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

Kulbhushan Jadhav Case: మరణశిక్షను పున:పరిశీలించాలనే పిటిషన్‌ను తిరస్కరించిన కుల్భూషణ్ జాదవ్, క్షమాభిక్ష దరఖాస్తు పైనే తదుపరి చర్యలు తీసుకోవాలని కోరిన జాదవ్

Hazarath Reddy

కుల్భూషణ్ జాదవ్ తన మరణశిక్ష మరియు శిక్షను సమీక్షించి, పున పరిశీలించమని పిటిషన్ దాఖలు చేయడానికి నిరాకరించారని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ సమీక్ష కోసం పిటిషన్ దాఖలు చేయడానికి జాదవ్ను (Kulbhushan Jadhav Case) ఆహ్వానించారని, అయితే అతను నిరాకరించాడు మరియు బదులుగా తన పెండింగ్ లో ఉన్న ప్లీతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడని పాక్ (Pakistan) తెలిపింది.

Advertisement

India Coronavirus Report: ఇరవై వేలు దాటిన కరోనా మరణాలు, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 22,752 కోవిడ్-19 కేసులు నమోదు, దేశంలో 7,42,417కి చేరిన మొత్తం కరోనా కేసుల సంఖ్య

Hazarath Reddy

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22,752 తాజా పాజిటివ్‌ కేసులు (India Coronavirus Report) వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,42,417కి ఎగబాకింది. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 482 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 20,642కి పెరిగింది. కరోనా వైరస్‌ నుంచి కోలుకుని 4,56,830 మంది డిశ్చార్జి అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 2,64,944 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. కోవిడ్‌-19 విజృంభణ కొనసాగుతుండటంతో అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేశారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,62,679 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఇప్పటివరకూ దేశంలో 1,04,73,771 కరోనా టెస్టులు నిర్వహించారు

US ICE: విదేశీ విద్యార్థులకు దిమ్మతిరిగే షాకిచ్చిన అమెరికా, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే స్కూళ్లలో ప్రవేశం పొందే విద్యార్థలకు నో వీసా, స్పష్టం చేసిన యుఎస్ ఐసీఈ

Hazarath Reddy

అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు (Students In US) భారీషాక్ లాంటి వార్తే ఇది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు మొగ్గు చూపినట్లయితే విదేశీ విద్యార్థులు అమెరికా (America) విడిచి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదే విధంగా కొత్తగా విద్యార్థి వీసాలు (US Study Visa) జారీ చేయబోమని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరానికి గానూ పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీచేయబోమని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) (US Immigration and Custom Enforcement) స్పష్టం చేసింది.

Draft Expat Quota Bill: ఎడారి దేశంలో భారతీయుల ఘోష, కువైట్‌లో 8 లక్షల మంది ఇండియన్ల పాలిట శాపం కానున్న ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లు, ఆమోదం పొందితే దేశం వదలాల్సిందే

Hazarath Reddy

ఎడారి దేశం కువైట్‌లోని భారతీయులకు (Indians) పెద్ద ముప్పు వచ్చిపడింది. దేశ జనాభాలో పెరిగిపోతున్న విదేశీయులను తగ్గించుకునేందుకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ఓ ముసాయిదా చట్టాన్ని తీసుకువచ్చింది. కువైట్‌లో బయటి దేశాల వ్యక్తుల సంఖ్యలను తగ్గించుకునేందుకు తీసుకొచ్చిన ‘ప్రవాసీ కోటా’ ముసాయిదా బిల్లుకు (Draft Expat Quota Bill) కువైట్‌ జాతీయ శాసనసభ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మన దేశానికి చెందిన దాదాపు 8లక్షల మంది పనులు లేక వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Coronavirus Outbreak: కరోనావైరస్‌పై కొత్త ట్విస్టు, ఈ వైరస్ గాలి ద్వారా సోకుతుందని నిర్ధారించిన సైంటిస్టులు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసిన 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు

Hazarath Reddy

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందనే (Coronavirus Outbrea) వాదనలు వైరస్ పుట్టినప్పటి నుండి వస్తూనే ఉన్నాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ డబ్ల్యూహెచ్‌వో (WHO) ఆ వార్తలను కొట్టిపారేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు కరోనా వైరస్‌ గాలి ద్వారా (Coronavirus can be transmitted through air) ఇతరులకు సోకుతుందనేందుకు ఆధారాలున్నాయని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక లేఖ రాశారు.

Advertisement

India’s Coronavirus: ఆమెను రేప్ చేశాడు, 60 మంది పోలీసులను క్వారంటైన్‌కి పంపాడు, దేశంలో 7 లక్షలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశంలో కోటి దాటిన నిర్థారణ పరీక్షలు

Hazarath Reddy

భార‌త్‌లో కోవిడ్-19 వైర‌స్ పాజిటివ్ కేసుల (India’s Coronavirus) సంఖ్య ఏడు ల‌క్ష‌లు దాటింది. దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 22,252 కేసులు న‌మోదు అయ్యాయి. 24 గంట‌ల్లోనే దేశ‌వ్యాప్తంగా 467 మంది మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య (India's Coronavirus Tally) 7,19,665కి చేరుకున్న‌ది. దీంట్లో 2,59,557 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 4,39,948 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు.

India China Standoff: చైనా భయపడిందా? రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన చైనా బలగాలు, చైనా విదేశాంగ మంత్రితో అజిత్ ధోవ‌ల్ చర్చలు

Hazarath Reddy

భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మక పాయింట్ కు అత్యంత కీలకమైన గల్వాన్‌ లోయ నుంచి చైనా బలగాలు (China Begins De-Escalation) వెనక్కి వెళ్లాయి. గల్వాన్‌ లోయ (Galwan Valley), సహా హాట్‌స్ప్రింగ్స్‌, లద్దాఖ్‌ ప్రాంతాల నుంచి నుంచి చైనా బలగాలు దాదాపు కిలోమీటరున్నర మేర వెనక్కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూడా తొలగిస్తున్నట్ల పేర్కొన్నాయి. ఇందుకు ప్రతిగా భారత బలగాలు కూడా వెనక్కి మళ్లాయని.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ‘బఫర్‌ జోన్‌’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి.

Bubonic Plague: చైనాలో మళ్లీ కొత్తగా బుబోనిక్‌ ప్లేగు, ఈ వైరస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మంగోలియాపై అప్పుడే పంజా విసురుతున్న బుబోనిక్‌ ప్లేగు వైరస్

Hazarath Reddy

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో (China Virus) వరుసగా వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచానికి కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. మొన్న కరోనా వైరస్ కల్లోలం (Coronavirus Pandemic) ఇంకా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఆ కల్లోలంలో ఈ మధ్య కొత్తగా G-4 అనే వైరస్ తమ దేశంలో ఉన్నట్లు చైనా పరిశోధకులు తేల్చి చెప్పారు. ఈ రెండు మరచిపోకముందే మళ్లీ బుబోనిక్‌ ప్లేగు (Bubonic Plague) కేసులు చైనాతో పాటు ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

India Coronavirus Update: ఏడు లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, ర‌ష్యాను వెన‌క్కు నె‌ట్టేసిన‌ భార‌త్‌, కొత్తగా దేశాన్ని కలవరపెడుతున్న రాజస్థాన్, ప్రపంచవ్యాప్తంగా కోటి 15 లక్షలు దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో సుమారు 25 వేల‌ పాజిటివ్‌ కేసులు (India Coronavirus Update) న‌మోద‌వ‌గా 613 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కి చేరింది. అయితే అదేరోజు సాయంత్రం నాటికి మ‌రిన్ని కేసులు వెలుగు చూడ‌టంతో మొత్తం కేసుల సంఖ్య 6.9 ల‌క్ష‌లుగా (India Coronavirus Report) న‌మోదైంది. దీంతో 6.8 ల‌క్ష‌ల కేసులున్న‌ ‌ర‌ష్యాను (Russia) వెన‌క్కునెట్టి ప్ర‌పంచంలో క‌రోనా ప్ర‌భావిత‌ జాబితాలో భార‌త్ (India) మూడో స్థానానికి ఎగ‌బాకింద‌ని అమెరికాలోని (America) జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ వెల్ల‌డించింది.అమెరికా(28 ల‌క్ష‌లు), బ్రెజిల్(15 ల‌క్ష‌లు) త‌ర్వాత స్థానంలో భార‌త్ నిలిచింది.

Advertisement

PM Modi Speech in Ladakh: భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసు, లడఖ్‌ భారత్‌లో అంతర్భాగమే, సైనికులను చూసి దేశం గర్వపడుతోంది, బార్డర్లో సైనికుల్లో ఉత్తేజాన్ని నింపిన ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

భారత్‌-చైనాల మధ్య సరిహద్దు వివాదం (India-China border tensions) నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అనూహ్యంగా లడఖ్‌లో పర్యటించి సైనికుల్లో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ (PM Modi Speech in Ladakh) పరోక్షంగా చైనాపై విరుచుకుపడ్డారు. బ‌ల‌హీనంగా ఉన్నవారెప్పుడూ శాంతిని కాంక్షించ‌ర‌ని, శాంతి కావాలంటే ధైర్యం చాలా ముఖ్య‌మైంద‌ని ప్ర‌ధాని అన్నారు. ప్ర‌పంచ యుద్ధాల స‌మ‌యంలోనైనా, శాంతి స‌మ‌యంలోనైనా (Peace And Humanity), అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న సైనికుల ధైర్యాన్ని ప్ర‌పంచం చూసింద‌ని, శాంతి కోసం కూడా మ‌న సైనికులు ( Indian soldiers) ప‌నిచేశార‌ని మోదీ అన్నారు. ఉత్త‌మ‌మైన మా‌నవ విలువ‌ల కోసం మ‌నం ప‌నిచేశామ‌ని ప్ర‌ధాని తెలిపారు.

COVID-19 in US: అమెరికాలో ఒక్కరోజే 50 వేలకు పైగా కొత్త కేసులు, బ్రెజిల్‌లో 60 వేలు దాటిన కోవిడ్-19 మృతుల సంఖ్య, ప్రపంచవ్యాప్తంగా కోటి దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాకు కరోనా విశ్వరూపం (COVID-19 in US) చూపిస్తోంది. బుధవారం ఒక్కరోజే 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో(గురువారం) రికార్డు స్థాయిలో కొత్తగా 55 వేల కోవిడ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు (coronavirus Cases) ఏ దేశంలో కూడా నమోదు కాలేదని రాయిటర్స్‌ సంస్థ పేర్కొంది. అంతేగాక గత రెండు వారాల నుంచి అమెరికాలో రోజుకు 22 వేల కొత్త కేసులు నమోదవ్వగా 3 రోజుల నుంచి రెట్టింపుతో 40 వేలకుపైగా కొత్త కేసులు రికార్డు అవుతున్నాయి.

COVID-19 Vaccine Update: హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి విరుగుడు మందు, ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి.., భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్ మీద క్లినికల్‌ టెస్టులు వేగవంతం చేసిన ఐసీఎంఆర్‌

Hazarath Reddy

ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న కరోనావైరస్ కు విరుగుడు మందు హైదరాబాద్ ( Hyderabad) నుంచే రానుందా..అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఔషధ కంపెనీలన్నీ వైరస్‌ విరుగుడును కనిపెట్టే ప్రకియలో నిమగ్నమయ్యాయి. అయితే అవేమి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 15 కల్లా వ్యాక్సిన్‌ను (COVID-19 Vaccine Update) విడుదల చేస్తామని చల్లని కబురు చెప్పింది.

PM Narendra Modi in Leh: భారత సైనికుల మధ్య అనూహ్యంగా ప్రధాని మోదీ, సరిహద్దులో ఉద్రిక్తతల సమయంలో లడఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన, ప్రధాని వెంట బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే

Hazarath Reddy

భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడఖ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి లేహ్‌కు (PM Narendra Modi in Leh) చేరుకున్నారు. సైనిక బలగాల నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయనే స్వయంగా లడక్‌లో పర్యటిస్తున్నారు. త్రిదళాధిపతి బిపిన్ రావత్ (CDS General Bipin Rawat), ఆర్మీ చీఫ్ నరవణేతో (Naravane) కలిసి ఆయన లడక్ వెళ్లారు.

Advertisement
Advertisement