World

PM Modi Quits Weibo: చైనా ట్విట్టర్‌ను మూసేసిన ప్రధాని మోదీ, వీబోలో పాత పోస్టులను డిలీట్ చేస్తున్న అధికారులు, అకౌంట్‌ డీయాక్టివేట్‌ కావడానికి సమయం పట్టే అవకాశం

Hazarath Reddy

చెనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించి కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేపట్టిన∙నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా సామాజిక మాధ్యమమైన వీబోని వీడాలని (PM Modi Quits Weibo) నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ బుధవారం మొదలైంది. చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌ వీబో (chinese social media website weibo) లో పీఎం మోడీ 2015 నుంచి కొనసాగుతున్నారు. అయితే చైనా ట్విట్టర్‌గా పిలిచే వీబోలో ఉండే వీఐపీలు అకౌంట్‌ మూసివేయడానికి జరిగే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది.

Myanmar Jade Mine Tragedy: మ‌ట్టిచ‌రియ‌లు విరిగిపడి 50 మందికి పైగా సజీవ సమాధి, మయాన్మార్‌ రత్నాల గనిలో విషాద ఘటన, రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది

Hazarath Reddy

మయాన్మార్‌ దేశంలోని పచ్చ రత్నాల గనిలో ఘోరం ప్రమాదం (Myanmar Jade Mine Tragedy) జరిగింది. మ‌య‌న్మార్‌లో మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో గనిలోకి ఒక్కసారిగా భారీగా బురద, రాళ్లు వచ్చి చేరడంతో కార్మికులు అక్కడే 50 మందికి పైగా సజీవ సమాధి(Myanmar Jade Mine Landslide) అయిపోయారు. కచీన్ రాష్ట్రంలోని పకాంత్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.

COVID-19 in India: వంద రోజులు, ఆరు లక్షలకు పైగా కేసులు, దేశంలో గత 24 గంటల్లో 17834 కోవిడ్-19 కేసులు, 434 మరణాలు, కరోనా కేసుల్లో రష్యాకు చేరువలో నిలిచిన భారత్

Hazarath Reddy

దేశంలో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి లాక్‌డౌన్‌ ( India Lockdown) విధించి నేటితో వంద రోజులు పూర్తయ్యింది. దేశంలో ఇప్పుడు కోవిడ్-19 కేసులు (COVID-19 in India) ఆరు లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 19,148 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 434 మంది మరణించారు, దీంతో దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 6,04,641కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 17834కు (Coronavirus Deaths) పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడినవారిలో 3,59,860 మంది బాధితులు కోలుకోగా, 2,26,947 మంది చికిత్స పొందుతున్నారు.

Coronavirus in India: కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు

Hazarath Reddy

కరోనావైరస్‌ విజృంభణ దేశంలో (Coronavirus in India) నానాటికీ పెరుగుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు (India Coronavirus) నమోదవుతుండగా మరణాల సంఖ్య కూడా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,653 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ బారినపడి 507 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. దేశంలో కోవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో మరణాలు సంభంవించడం ఇదే తొలిసారి.

Advertisement

India Coronavirus: పెళ్లయిన 2 రోజులకే వరుడిని కరోనా కాటేసింది, బీహార్‌లో పెళ్లికి వచ్చిన వారిలో 95 మందికి కోవిడ్-19, దేశంలో తాజాగా 18,522 పాజిటివ్ కేసులు నమోదు

Hazarath Reddy

ఇండియాలో ఇవాళ అత్య‌ధికంగా క‌రోనా వైర‌స్ (Coronavirus) కేసులు పెరిగాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 18522 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. ఒక్క రోజులోనే దేశంలో 418 మంది వైర‌స్ ( Coronavirus Deaths) బారిన‌ప‌డి మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 5,668,40గా ఉన్న‌ది. దీంట్లో 2,15,125 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 3,34,822 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 16,893గా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది.

Ban on Chinese Apps: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం, టిక్‌టాక్ సహా మొత్తం 59 చైనీస్ యాప్‌లపై నిషేధం, రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

Team Latestly

భారత్ లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుని, మంచి మార్కెట్ ను ఏర్పర్చుకున్న టిక్‌టాక్, వీచాట్, యూసి బ్రౌజర్‌లతో సహా 59 చైనీస్ యాప్స్ ను కేంద్రం బ్యాన్ చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

Pakistan Stock Exchange Attack: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై గ్రేనేడ్ దాడి, ఇద్ద‌రు మృతి, ముగ్గురికి గాయాలు, నలుగురు ఉగ్రవాదులు హతం, మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం

Hazarath Reddy

పాకిస్తాన్‌లో ఉగ్రమూకలు (Terror attack) మరోసారి రెచ్చిపోయాయి. దాయాది దేశంలోని క‌రాచీలో ఉన్న స్టాక్ మార్కెట్ బిల్డింగ్ వ‌ద్ద ఈ రోజు గ్రేనేడ్ దాడి (Pakistan Stock Exchange Attack) జరిగింది. ఇవాళ ఉదయం నలుగురు ఉగ్రవాదులు కరాచీలోని స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు (Terror attack in Karachi) జరిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతిచెంద‌గా మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. కాల్పులకు తెగబడిన అనంతరం ఉగ్రవాదులు పాకిస్తాన్ స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలోనే నక్కారు.

COVID19 Update: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో సుమారు 20 వేల పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 5,28,859కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా సోకిన వైరస్

Team Latestly

ఇక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య గత రాత్రే కోటి దాటిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. గత ఏడాది డిసెంబర్‌లో చైనా దేశంలోని వుహాన్‌ నగరంలో పుట్టిన ఈ భయంకర వైరస్, సుమారు ఏడు నెలల్లోనే ప్రపంచమంతా విస్తరించి ఎవరూ ఊహించని భయంకరమైన మైలురాయిని చేరుకుంది...

Advertisement

COVID19 in India: భారత్‌లో 5 లక్షలు దాటిన కోవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో అత్యధికంగా 18,552 కేసులు నమోదు, ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి చేరువైన కోవిడ్ బాధితుల సంఖ్య

Team Latestly

ప్రపంచవ్యాప్తంగా 9.9 మిలియన్లకు పైగా కరోనా బారిన పడ్డారు. మరొక్కరోజులోనే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య ఒక కోటికి చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ సోకిన వారిలో 5.3 మిలియన్లకు పైగా కోలుకున్నారని, 496,800 మందికి పైగా మరణించారని...

International Flights Suspended: అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరోసారి నిషేధం, జూలై 15 అర్ధరాత్రి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన డీజీసీఏ

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరోసారి నిషేధాన్ని (International Flights Suspended) పొడిగించింది. జూలై 15 అర్ధరాత్రి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను ( International Commercial Passenger Services) రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌( DGCA) ప్రకటించింది. ఈ మేరకు డీజీసీఏ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కార్గో సర్వీసులు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని డీజీసీఏ స్పష్టం చేసింది. ప్యాసింజర్ సర్వీసులు రద్దవుతాయని తెలిపింది.

COVID-19 in India: కరోనా కల్లోలానికి తిరునల్వేలి హల్వా యజమాని ఆత్మహత్య, దేశంలో రికార్డు స్థాయిలో 17,296 కేసులు నమోదు, 5 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య (COVID-19 in India) అంతకంతకూ పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటలలో అత్యధికంగా 17,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 407 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల (Coronavirus Pandemic) సంఖ్య 4,90,401కు చేరుకోగా, మొత్తం 15,301 మంది (Coronavirus Death Toll) మరణించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,89,463గా ఉంది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,85,636 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

India Coronavirus: ఒక్కరోజే రికార్డు స్థాయిలో 16,922 కేసులు, దేశంలో 4,73,105కు చేరిన కోవిడ్-19 కేసులు సంఖ్య, నెల రోజుల్లోనే మూడు లక్షల యాభైవేల కేసులు నమోదు

Hazarath Reddy

భారత్‌లో కరోనా కేసులు (Coronavirus) రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా.. 418 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,07,871 మందికి పరీక్షలు చేశామని, అందులో 16922 మంది కరోనా పాజిటివ్‌లుగా (COVID-19 Cases) నిర్ధారణ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఒక్కరోజులోనే దాదాపు 17వేలకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

Advertisement

India's Coronavirus Report: ఉగ్రరూపం దాల్చిన కరోనా, దేశంలో ఒక్కరోజే 465 మంది మృతి, ఇండియాలో నాలుగు లక్షల యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసులు

Hazarath Reddy

దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ ( Coronavirus Outbreak) ఉగ్రరూపం దాల్చుతోంది. ఇండియాలో రోజురోజుకూ భారీగా పాజిటివ్‌ కేసులు (India's Coronavirus Report), మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు (New Cases in India) నమోదయ్యాయి. బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 15968 పాజిటివ్‌ కేసులు నిర్దారణ కాగా.. 465 మంది మృత్యువాతపడ్డారు.

Haj 2020 Update: ఈ సారి హ‌జ్ యాత్ర‌కు అనుమతి లేదు, వారి డ‌బ్బును తిరిగి చెల్లించ‌నున్న‌ట్లు తెలిపిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్(Global Coronavirus) కల్లోలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో (India Coronavirus) అయితే ఇది విశ్వరూపం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భార‌త్ నుంచి హ‌జ్ యాత్ర‌కు (Haj 2020 Update) వెళ్లే వారికి అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ తెలిపారు.

US Suspends H1B&US Work Visas: అమెరికా కీలక నిర్ణయం, విదేశీ వ‌ర్క‌ర్ల‌కు ఇచ్చే వీసాల‌ు రద్దు, అమెరికా ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌ 1బీ వీసాను (H1B Visa) తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించారు. విదేశీ వ‌ర్క‌ర్ల‌కు ఇచ్చే వీసాల‌ను అమెరికా ప్ర‌భుత్వం (US Govt) ర‌ద్దు చేయడంతో ఈ వీసాల ర‌ద్దు ప్ర‌భావం సుమారు 5,25000 మందిపై ప‌డ‌నున్న‌ది. వీసాలు కోల్పోతున్న‌వారిలో ఎక్కువ‌ శాతం హై స్కిల్డ్ టెక్నిక‌ల్ వ‌ర్క‌ర్లు, నాన్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ సీజ‌న‌ల్ హెల్ప‌ర్లు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు.

India Coronavirus: దేశంలో రికార్డు స్థాయిలో 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు నమోదు, దేశ వ్యాప్తంగా 4,40,215కి చేరిన కేసులు సంఖ్య, ప్రపంచ వ్యాప్తంగా 91 లక్షలు దాటిన కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల (India Coronavirus) సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు (coronavirus cases) నమోదు కాగా.. వైరస్‌ బారినపడి 312 మంది మృతి చెందారు. దేశంలో కరోనా వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,215కి చేరింది. మరణాల సంఖ్య 14 వేలు దాటింది.

Advertisement

Maharashtra Police: మహారాష్ట్రలో 4,103 మంది పోలీసులకు కరోనా, 24 గంటల్లో 55 మంది పోలీసులకు కోవిడ్-19 పాజిటివ్, మొత్తం 48 మంది కరోనాతో మృతి

Hazarath Reddy

మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు(2020 Coronavirus Pandemic in India) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ అక్కడ పోలీసుల్ని (Maharashtra Police) హడలెత్తిస్తోంది. గడిచిని 24 గంటల్లో 55 మందికి (New COVID-19 Cases) కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో కొవిడ్‌-19తో బాధపడుతున్న పోలీసుల సంఖ్య 4,103కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 48 మంది పోలీసులు చనిపోయారు.

Coronavirus in Goa: గోవాలో తొలి కరోనా మరణం నమోదు, రాష్ట్రంలో 818కి చేరిన మొత్లం కోవిడ్-19 కేసుల సంఖ్య, జలపాతాలకు వెళ్లే మార్గాలను మూసివేసిన అధికారులు

Hazarath Reddy

గోవాలొ కరోనా (Coronavirus in Goa) చాపకింద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. తాజాగా గోవాలో తొలి కరోనా మరణం (Goa Records First Covid-19 Death) నమోదైంది. మోర్లెమ్‌కు చెందిన 85 ఏండ్ల మహిళకు కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం చనిపోయినట్లు (85-Year-Old Woman Passes Away) గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు. రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా, కరోనావైరస్ రహితంగా పేర్కొన్న గోవాలో గత నెల నుంచి వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

India-China Tensions: చైనాకు మరో భారీ షాక్, రూ.5,000 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను రద్దు చేసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు(India-China Tensions) పాల్పడుతున్న సంగతి విదితమే. బార్డర్లో అనుక్షణం ఘర్షణలకు కేంద్రబిందువుగా మారి మన జవాన్లను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం డ్రాగన్ కంట్రీకి (China) భారీ షాక్‌ ఇచ్చింది. రూ.5,000 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను (3 Chinese Projects) నిలిపివేసింది. సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఘర్షణ నేపథ్యంలో చైనా వస్తువులను, ఆ దేశ కాంట్రాక్టులను బహిష్కరించాలన్న డిమాండ్‌ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

COVIFOR Injection: కరోనా పని ఖతం అయినట్లేనా, కోవిఫర్ ఇంజక్షన్‌కు డిసిజిఐ అనుమతి, 100 మిల్లీగ్రాముల ఇంజెక్ష‌న్‌ ఖరీదు రూ.5000 నుంచి రూ.6000 మధ్య ఉండే అవకాశం

Hazarath Reddy

కరోనా వైరస్‌కు డ్రగ్ (Coronavirus Drug) కనిపెట్టామని హైదరాబాద్ హెటిరో యాజమాన్యం (hetero pharma) తెలిపింది. ‘కోవిఫర్’ (COVIFOR) పేరుతో జనరిక్ మందు అమ్మకానికి డిసిజిఐ అనుమతి (DCGI Approval) ఇచ్చిందని హెటిరో వెల్లడించింది. వెంటనే ‘కోవిఫర్’ మెడిసన్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కోవిడ్ అనుమానితులు, పాజిటివ్ రోగులు గుర్తించ‌బ‌డిన చిన్నారులు, యువత కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రి పాలైన వారి కోసం కోవిఫ‌ర్ అనే మెడిసిన్ సిద్ధమైందని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ డాక్ట‌ర్ బి.పార్థ‌సార‌థి రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement