Ponniyin selvan: తారలు దిగివచ్చిన వేళ.. ఒకే వేదికపై ఐశ్వర్య, త్రిష, విక్రమ్, కార్తి, జయం రవి.. వావ్
PS1 (Photo Credits: Twitter)

Hyderabad, September 24: మణిరత్నం దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో 'పొన్నియిన్ సెల్వన్' సినిమా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా, చోళరాజుల పాలనాకాలంలో నడుస్తుంది. అలాంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు .. సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించిన ఐశ్వర్యారాయ్ రెడ్ కలర్ డ్రెస్ లో మెరిశారు. ఆమె మాట్లాడుతూ .. 'పొన్నియిన్ సెల్వన్' సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను." అన్నారు. ఈ వేడుకలో కార్తి మాట్లాడుతూ .. " ఇలాంటి ఒక పెద్ద సినిమా చేసినప్పుడే సినిమా ఎంత గొప్ప మీడియం అనే విషయం గుర్తుకొస్తోంది. మనందరినీ సినిమానే కలిపి ఉంచుతోంది. మణిరత్నం గారి 40 ఏళ్ల కల ఈ సినిమా" అంటూ ముగించారు.

బాయ్‌ఫ్రెండ్‌లో లిప్ కిస్ వీడియో పోస్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో కూతురు, మా ఎంగేజ్‌మెంట్ అంటూ సైక్లింగ్‌ ఈవెంట్లో రచ్చ, మరోసారి వార్తల్లోకెక్కిన అమీర్ ఖాన్ గారాలపట్టి

ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రలో నటించిన విక్రమ్ ఈ వేదికపై మాట్లాడారు. "ఇంతవరకూ నేను చేసిన విభిన్నమైన పాత్రలను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాలో నేను గుర్రంపై వెళ్లే ఒక షాట్  ఉంటుంది. ఆ ఒక్క షాట్ చాలు అనుకున్నాను .. అది అంతబాగా వచ్చింది. ఈ స్టేజ్ పై చూడండి .. అందరూ హీరోలే .. అందరూ హీరోయిన్లే. ఇంతమంది కలిసి చేసిన సినిమా ఈ మధ్యకాలంలో ఇదేనేమో" అంటూ చెప్పుకొచ్చారు. అంతకు ముందు కళాకారులతో కలిసి డప్పు వాయిస్తూ ఆనందింపజేశారు విక్రమ్. నటి త్రిష, జయం రవి తదితరులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.