తాజా వార్తలు
Reliance Foundation Donation: తెలంగాణ సీఎంఆర్ఎఫ్కి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం, రూ.20 కోట్లు సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు
Arun Charagondaముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. సీఎం సహాయనిధికి రూ.20 కోట్లు విరాళం అందజేశారు రిలయన్స్ ఫౌండేషన్. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరపున చెక్ ను అందజేశారు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు.
Jagan Tirumala Visit Update: జగన్ తిరుమల పర్యటన, వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్, తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 అమల్లోకి, ఐదేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకుంటారా అంటూ భూమన ఆగ్రహం
Hazarath Reddyమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతల హౌస్ అరెస్ట్ జరిగింది. తిరుపతికి ఎవరూ రావద్దంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు
Tirupati Laddu Row: తిరుమల లడ్డూ వివాదం.. సిట్ ఏర్పాటుపై జీవో విడుదల, సిట్కు సహకరించాలని హోంశాఖ-దేవాదాయ శాఖ-టీటీడీ ఈవోకు ఆదేశాలు
Arun Charagondaఏపీలో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో సిట్ ఏర్పాటు పై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సిట్ సభ్యులుగా గోపీనాథ్ శెట్టి,హర్షవర్ధన్రాజు, వెంకట్రావు, సీతారామరాజు, శివ నారాయణ స్వామి, సత్యనారాయణ, సూర్య నారాయణ, ఉమామహేశ్వర్లును నియమించింది.
Parliamentary Standing Committee: పార్లమెంటరీ కమిటీల్లో వైసీపీ ఎంపీలకు చోటు, రవాణా టూరిజం సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి
Hazarath Reddyఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైవీ. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి.. విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి, రవాణా టూరిజం సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డిలకు చోటు దక్కింది.
Road Accident At Narsapur: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఢీ కొన్న రెండు బస్సులు, డ్రైవర్ మృతి..కాలేజీ విద్యార్థులకు తప్పిన ప్రమాదం..వీడియో
Arun Charagondaమెదక్ నర్సాపూర్ పట్టణంలోని ఆనంద్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వస్తూ ఢీ కొనగా ఒక డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఒక డ్రైవర్ మృతి చెందారు. బస్సులో ఉన్న కాలేజీ విద్యార్థులకు ప్రమాదం తప్పింది.
Road Accident: జర్నీ సినిమాను తలపించేలా యాక్సిడెంట్.. మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కాలేజీ బస్సులకు ప్రమాదం.. డ్రైవర్ మృతి.. పలువురు విద్యార్థులకు గాయాలు
Rudraజర్నీ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యాక్సిడెంట్ సీక్వెన్స్ ను తలపించేలా రెండు కాలేజీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
Telangana Shocker: మహబూబాబాద్లో దారుణం, మంత్రాలు చేస్తున్నాడనే నేపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన మరో వ్యక్తి..వీడియో ఇదిగో
Arun Charagondaమహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో మల్లం యాకయ్య(66) అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి రాజు అనే యువకుడు దారుణంగా కొట్టి చంపాడు. స్థానికులు వెంటనే రాజును తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Jr NTR Fan: కడపలో విషాదం, దేవర సినిమా చూస్తూ అభిమాని మృతి..సినిమా చూస్తూ కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన అభిమాని
Arun Charagondaకడప నగరంలోని అప్సర థియేటర్లో విషాదం చోటు చేసుకుంది. సినిమా చూస్తూ కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు ఓ అభిమాని. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు డాక్టర్లు.
Tirupati Laddu Row- Ram Mandir's Big Move: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం.. బయటి సంస్థలు తయారుచేసిన ప్రసాదాలపై ఆలయంలో నిషేధం
Rudraతిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Notices To YCP Leaders: తిరుమలకు వైఎస్ జగన్, వైసీపీ నాయకులకు పోలీస్ నోటీసులు, అవాంఛనీయ సంఘటనలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaతిరుమలలో వైయస్ జగన్ పర్యటన సందర్బంగా కడప జిల్లా నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు నోటీసులు జారీ చేశారు పోలీసులు.
Dasara Navaratri Celebrations in Vijayawada: బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. అక్టోబర్ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు షురూ.. అమ్మవారు ఏ రోజున ఎలా దర్శనం ఇస్తారంటే?
Rudraదసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు బెజవాడలోని ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
MLA Balu Naik: కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్కు నిరసన సెగ, బాలు నాయక్ని అడ్డుకున్న కుర్మెడ్ గ్రామస్తులు..తమ గ్రామంలోకి రావొద్దని నిరసన..వీడియో ఇదిగో
Arun Charagondaనల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ను తమ గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం కుర్మెడ్ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బాలు నాయక్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. తమ గ్రామంలో రావద్దు అంటూ నిరసన తెలియజేశారు గ్రామస్తులు.
ED Raids in Minister Ponguleti Srinivasreddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు.. భారీగా పోలీసు బందోబస్తు
Rudraతెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నాయి.
Food Poison at Jangaon: జనగామలోని ఏబీవీ కాలేజ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. 15 మంది ఇంటర్ విద్యార్థులకు అస్వస్థత (వీడియో)
Rudraజనగామలోని ఏబీవీ కాలేజ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తున్నది. ఈ ఘటనలో 15 మంది ఇంటర్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
YS Jagan Tirumala Tour: నేడు తిరుమలకు జగన్.. తిరుపతిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు.. పోలీస్ యాక్ట్ 30 అమలు
Rudraతిరుమల లడ్డూ వివాదంపై ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది.
Clash at Devara Movie: 'దేవర' సినిమా ప్రదర్శనలో ఘర్షణ.. కడప రాజా థియేటర్ లో యువకుల వీరంగం.. సిబ్బందిని చితకబాదుతూ గలాటా (వీడియోతో)
Rudraకడపలోని రాజా ధియేటర్ లో 'దేవర' మూవీ ప్రదర్శన సమయంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టికెట్స్ లేకుండానే కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్లోకి దూసుకొచ్చిన క్రమంలో వాగ్వాదం జరిగింది.
Devara: విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొట్టిన దేవర, ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఒక్కరోజే ఏకంగా 42 షోలు, 500 పైగా థియేటర్లలో మిడ్ నైట్ స్పెషల్ షోలు
Vikas Mఆరేండ్లుగా ఆకలితో ఉన్న తారక్ అభిమానులకు దేవర రుచి చూపించబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాను మిడ్ నైట్ 1 గంటలకు స్పెషల్ షో వేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడయిపోయాయి. అయితే 1 గంటల షోల పరంగా ఈ సినిమా అరుదైన రికార్డును అందుకోనుంది.
David Miller Reacts SKY Catch: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్పై స్పందించిన డేవిడ్ మిల్లర్, అవుట్ అయినా సరే మైదానం వీడలేక..
Vikas Mబార్బడోస్ వేదికగా జూన్ 29న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు.ఐసీసీ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరి.. మొదటి ట్రోఫీని ముద్దాడకుండానే ఇంటిదారి పట్టిన ఆ రోజును డేవిడ్ మిల్లర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాజాగా మిల్లర్ ఆ ఫైనల్ ఓవర్ను గుర్తు చేసుకున్నాడు.
Petrol, Diesel Price Cut: వాహనదారులకు గుడ్ న్యూస్, పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గే అవకాశం
Vikas Mఅంతర్జాతీయ మార్కెట్లో గత కొన్ని వారాలుగా ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ 'ఇక్రా' అభిప్రాయపడింది. ప్రభుత్వరంగ సంస్థలు ఇంధనంపై రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గించే అవకాశముందని వెల్లడించింది.
Nara Lokesh on Red Book: ఏపీలో రెడ్ బుక్ పాలన మొదలైంది! ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
VNSఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్బుక్ (AP Red Book) అమలు ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించిన ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.